Followers

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

సంతబొమ్మాలి, పెన్ పవర్

మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువకులు, వీధుల్లో , మురికి కాలువలలో బ్లీచింగ్ వెదజల్లారు. పరిసరాల పరిశుభ్రత తో ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు. సంతబొమ్మాలి లో  సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి ప్రతినిధి కళింగపట్నం అప్పారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.వీరితో పాటుగా అంగన్వాడి ఆశా కార్యకర్తలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే దండుగోపాలపురం పంచాయతీలో సర్పంచ్ మార్పు అశోక చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శులు పీ రామకృష్ణ , సిద్ధార్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది అన్ని వీధుల్లోను బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ మార్పు నాగభూషణ్,  గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...