Followers

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్.

 ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైకిళ్ళు

 ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు  నష్టం.

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

ఒకే పార్టీ నాయకుల మధ్య తలెత్తిన వర్గపోరు ప్రభుత్వ లక్ష్యాన్ని సైతం నీరుగార్చింది. పేద వికలాంగులకు ఉపయోగపడే మూడు చక్రాల సైకిలు అందించాలని ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి వీల్చైర్ లను సమకూరిస్తే ఆదిపత్య పోరుతో  అవి కాస్త పంపిణీకి నోచుకోలేదు. పది నెలలుగా ఎండలో ఎండి వానలో తడవడం వల్ల మూడు చక్రాల సైకిళ్ళు తుప్పు పట్టి పోయాయి. వాటిని వికలాంగులకు అందించిన వాటిని స్క్రాప్ కింద  కిలోల లెక్కన అమ్ముకోవాల్సిందే.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు ను  2020 ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా  మండల పరిషత్ కార్యాలయాలకు చేరాయి. అధికారులు వాటిని స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ జరగాల్సి ఉంది. కానీ జిల్లాలో పాయకరావుపేట  నియోజకవర్గం  ఎస్ రాయవరం మండలం లో వికలాంగులు సైకిళ్ళు   పంపిణీ జరగలేదు. ప్రభుత్వం ఉచితంగా మూడు చక్రాల సైకిలు  ఇస్తుందని  వికలాంగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పది నెలలు అవుతున్న వీల్చైర్ ల పంపిణీ కి  నోచుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే  అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీల మధ్య తలెత్తినా వర్గ వివాదం  సంక్షేమ పథకాలను మూలకు చేరుతున్నాయి. మండలంలో గుర్తించిన వికలాంగులకు అవసరమైన  80  వికలాంగు సైకిళ్లను ఆగస్టులో పరికరాలు తెచ్చి బిగించారు. నేతల మధ్య పోరు మూడు చక్రాల సైకిల్ పంపిణీకి గ్రహణం పట్టింది.

వాటిని పంపిణీ చేయడానికి  స్థానిక ఎంపిడిఓ  చొరవ చూపకపోవడంతో  మూడు చక్రాల సైకిలు మూలకు చేరాయి. వాటిని మండల కేంద్రంలో రెల్లి వీధి ఆర్ బి కె   వద్ద పడేశారు. ఆగస్టు తర్వాత కురిసిన వర్షాలు  ఆతర్వాత ఎండలకు వికలాంగులు సైకిల్ లు పూర్తిగా పాడైపోయాయి. వాటిని చూస్తే  కాలం చెల్లిన మూడు చక్రాల సైకిలు  అనుకోక తప్పదు. తుప్పు పట్టి పోయి సీట్లు  కూలిపోయి గుట్టలుగా పడి ఉన్న స్క్రాప్ ల  దర్శనమిస్తుంది. వికలాంగుల కోసం  ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తే  ఇరువురు నేతల వర్గ పోరు తో  అవి కాస్త బూడిదలో పోసిన పన్నీరు అయింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలు పేదలకు చేరుతున్నాయి అని ఆశిస్తున్నారు. కానీ అక్కడ అక్కడ పార్టీ నాయకుల్లో  తలెత్తిన అవాంతరాల కారణంగా  పధకాలు పేదలకు చేరడం లేదన్న నగ్నసత్యం  పెరుమాళ్ళకెరుక. మూడు చక్రాల సైకిల్ నష్టాన్ని ఎవరు పూడుస్తారు. ఈ నాయకులా? లేక సంబంధిత అధికారులా?..

జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్ష

జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్ష

 అభివృద్ధిలో పచ్చదనానికి ప్రాధాన్యత 

రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్

విజయనగరం, పెన్ పవర్

అభివృద్ధి కార్యక్రమాల్లో పచ్చదనానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, భూ సేకరణ, ఇతర అంశాలపై శుక్రవారం తన చాంబర్లో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నం-రాయపూర్ జాతీయ రహదారి, విజయనగరం బైపాస్ రోడ్డు, సాలూరు బైపాస్, మానాపురం ఆర్వోబి, పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని 12 రోడ్ల నిర్మాణం, వాటి ప్రస్తుత స్థితి పై ఆరాతీశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,  రహదారుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారి నిర్మాణంలో మొక్కలు వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు.  విజయనగరం బైపాస్ రోడ్డులో మొక్కలు నాటే పనులను వెంటనే ప్రారంభించలన్నారు. ఈ నెలాఖరు నాటికి డివైడర్ లో మట్టిని నింపి, ఇరువైపులా మొక్కలను నాటేందుకు గోతులు సిద్ధం చేయాలన్నారు. జూన్1 నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ ఎక్కువై, కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. దీనిని అరికట్టాలంటే  మొక్కలను నాటడమే ఏకైక మార్గమన్నారు. అందువల్ల ఒకవైపు రహదారిని పూర్తి చేస్తూనే, మరోవైపు మొక్కలు నాటడం మొదలు పెట్టాలని సూచించారు. రోడ్డు పూర్తి అయ్యేటప్పటికి, మొక్కలుకుడా బాగా పెరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్డీసి హెచ్వి జయరాం, ట్రాన్స్ కో  ఎస్ఈ వై.విష్ణు, ఆర్అండ్బి ఎస్ఈ విజయశ్రీ, పిఆర్ ఎస్సీ గుప్త,. ఉద్యానశాఖ డిడి శ్రీనివాస్, నేషనల్ హైవేస్ ఏఇ ఈ సురేష్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం

 గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం


లాక్డౌన్ కి మద్దతు ఇచ్చిన వర్తకులకు కృతజ్ఞతలు

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలి

సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్రావు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం పడింది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ విధించింది.మధ్యాన్నం 12 నుండి ఉదయం 6గంటల వరకు పోలీసులు సహకారంతో ప్రభుత్వం కర్ఫ్యూ నిర్వహిస్తుంది. అయినప్పటికీ పంచాయతీ పరిధిలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్న తరుణంలో గ్రామ సర్పంచ్ గౌరీశంకర్రావు పిలుపు మేరకు వ్యాపార వర్గాలు శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ చేయడానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చాయి. కరోనా వ్యాప్తిని అరికట్టాలనే మంచి ఉద్దేశంతో వ్యాపార సముదాయాలను మూసివేయడానికి ముందుకు వచ్చిన వర్తకులకు సర్పంచ్ గౌరీశంకర్రావు కృతజ్ఞతలు తెలియచేసారు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

సంతబొమ్మాలి, పెన్ పవర్

మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువకులు, వీధుల్లో , మురికి కాలువలలో బ్లీచింగ్ వెదజల్లారు. పరిసరాల పరిశుభ్రత తో ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు. సంతబొమ్మాలి లో  సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి ప్రతినిధి కళింగపట్నం అప్పారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.వీరితో పాటుగా అంగన్వాడి ఆశా కార్యకర్తలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే దండుగోపాలపురం పంచాయతీలో సర్పంచ్ మార్పు అశోక చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శులు పీ రామకృష్ణ , సిద్ధార్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది అన్ని వీధుల్లోను బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ మార్పు నాగభూషణ్,  గ్రామస్తులు పాల్గొన్నారు.

మే 15 తర్వాత మొదటి డోస్ టీకా

 మే 15 తర్వాత మొదటి డోస్ టీకా 

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శృతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మే 15  తేదీ వరకు మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి డోసు టీకా వేసుకున్న వారు చాలామంది ఉన్నారని వారికి  మే 15వ తేదీ లోపు రెండో డోసు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతము మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రెండవ డోసు పూర్తి చేసిన తరువాత మే15 తరువాత మరల మొదటి డోసు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడతామని ఆమె తెలిపారు.ఈవిషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రస్తుతము మొదటి డోసు టీకా  వేసుకున్న వారిని గుర్తిస్తున్నాం అని అన్నారు. వారికి పూర్తి కాగానే మొదటి డోసు టీకా మళ్లీ వేస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ వి పద్మలత, సూపర్వైజర్  వెంకటాద్రి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్ఎంలు జయశీల, లతా, పార్వతి, ఆశా కార్యకర్తలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

 అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

సంతబొమ్మాళి, పెన్ పవర్. 

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ కరోనా మొదటి మరియు రెండో డోస్ వ్యాక్సిన్ వేస్తున్నామని సంతబొమ్మాళి మండలం నౌపడ ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ కోదండ రావు తెలియజేశారు. గురువారం 176 మందికి మరియు  శుక్రవారం 69 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. గురువారం మొదటి డోస్ వేయించుకోవడానికి వచ్చిన వై ఎస్ ఆర్ సి పి జెడ్పిటిసి అభ్యర్థి పాల వసంత రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం రెండో విడత కరోనా వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన విలేఖర్ల బృందానికి వేశారు. ఈ సందర్భంగా వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 1800 వ్యాక్సిన్ కేంద్రానికి రాగా వచ్చిన వ్యాక్సిన్ పూర్తిగా వెయడం జరిగిందని ఆయన తెలిపారు. ఫీవర్ సర్వే విస్తృతస్థాయిలో డోర్ టు డోర్ చేయిస్తున్నామని  ఇప్పటి వరకు జరిగిన కరోనా టెస్టుల్లో 51 మంది హాంఐసోలేషన్ లో ఉండగా 36 మంది పూర్తిగా కోలుకున్నారని తెలుపుతూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయపడకుండా ముందుకు వస్తున్నారని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ పూర్తిచేసి వ్యాక్సినేషన్ వేస్తున్నామని  ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపిన వరకు టీకా వేస్తున్నామని, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్లు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి శానిటేషన్ వినియోగిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఇంటి వద్ద ఉండి భద్రతా చర్యలు చేపట్టినట్లు అయితే కరోనాను  పూర్తిగా జయించొచ్చు అని, బలమైన ఆహారం తీసుకొని, అవసరం ఉన్నంత వరకు విశ్రాంతి తీసుకుంటూ, పలు ఆరోగ్య సూత్రాలను పాటించటం వలన కరోనా దరిచేరదని ప్రజలు భయపడవద్దని ఆయన తెలిపారు.

గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

 గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

ముంచంగిపుట్టు ,పెన్ పవర్

కరోనా  బారిన పడకుండా ఉపాధి కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని  భౌతిక దూరం పాటించాలని  ఎన్ఆర్ఈజీఎస్  వి ఆర్ పి వెంగడ  చంద్ర  అన్నారు.శుక్రవారం సుజన కోట పంచాయితీ గొడ్డి పుట్టు గ్రామంలో ఉపాధి కూలీలకు మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రెండవ దశ కరోనా విలయ తాండవం ఆడుతుందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. మొదటి విడత కరోనా మాదిరి నిర్లక్ష్యం చేయవద్దని  ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఉపాధి కూలీలు పనులు చేసే సమయంలో  మాస్కులు  ధరించాలి అని  గుంపులు గుంపులుగా  ఉండకుండా  భౌతిక దూరం పాటించక తప్పదు అన్నారు. పనులు పూర్తి అయ్యాక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలన్మారు. గ్రామం విడిచి వెళ్లవద్దని ఇల్ల కే పరిమితం కావాలని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఆశ కార్యకర్త ఏఎన్ఎం లను సంప్రదించాలని సూచించారు. నిత్యం ఉపాధి పనులు చేసే కూలీలు  మాస్కులు భౌతిక దూరం  తప్పనిసరిగా ఆచరించాలని వీ ఆర్ పి చంద్ర కోరారు. అతని వెంట టి ఏ కూడా పాల్గొన్నారు.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

చింతపల్లి, ముంచింగ్ పుట్ లో కోవిడ్ సెంటర్ ప్రారంభించాలి

గిరిజన సంఘం డిమాండ్‌

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తో రోగులు పెరుగుతుంటే సమర్థవంతంగా వైద్యం అందించేందుకు సమన్వయం చేసే ఐ. టి.డి.ఏ పిఓ ను కె.జి.హెచ్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా ప్రభుత్వం జారీ చేసిన నియామక ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స శుక్రవారం  డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాడేరు ఐ.టి.డి.ఏ పరిధిలో సుమారు ఆరున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారని, గిరిజన ప్రాంతాల్లో  రోజు రోజుకు కోవిడ్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందిందని,భౌగోళికంగా విస్తారంగా ఎక్కువ గ్రామాలు, రహదారి నిర్మాణం కూడ సక్రమంగా లేని,అంబులెన్స్ వేళ్ళని గ్రామాలు ఉన్నాయన్నారు.సీజనల్ జ్వరాలకే మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు.పాడేరు జిల్లా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసిన నేటికి మెరుగైన వైద్యం కోసం రోగులను విశాఖపట్నం తరలిస్తున్నరన్నారు.కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోగులకు వైద్యం కోసం పాడేరు జిల్లా ఆసుపత్రి లో వెంటిలేటర్ ఆపరేటర్ లేక రోజులు తరబడి నిరుపయోగంగా ఉందన్నారు.అధికారుల అసమర్థత వల్ల10 వెంటిలేటర్ ను విశాఖపట్నం తరలించారన్నారు. పాడేరు,అరకులోయ కోవిడ్ క్వారెంట్ సెంటర్ల ఏర్పాటు చేసిన మౌలిక వసతులు సమకూర్చాలని వారు డిమాండ్ చేశారు. చింతపల్లి, ముంచంగిపుట్టు ఏరియాల్లో కోవిడ్ విస్తరించిన నేటికి కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు చేయలేదన్నారు.అరకొరగా ఉన్న వైద్య సేవలు, ఆసుపత్రిలో,క్వారంటైన్ సెంటర్ల కొరవాడిన మౌలిక వసతులు, విస్తరిస్తున్న కోవిడ్ నుండి గిరిజనుల ప్రాణాలు కాపడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మరణాల పెరుగుతుంన్నా కోవిడ్ టెస్టు రిపోర్ట్ రాక రోగులు అయోమయంలో  ఉన్నారన్నారు.పాడేరు కేంద్రగా ల్యాబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇన్ని సమస్యలు ఉంటే గిరిజన ప్రాంతాల  కోసం ప్రత్యేకంగా నియమించిన అధికారి పిఓను కె.జి.హెచ్  కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించి  గిరిజన ప్రాంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.గిరిజన ప్రాంతాల్లో ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత, నిర్లక్ష్యం తగదన్నారు.

గడువు దాటినా అందని వ్యాక్సిన్,,,, అందేనా !?

గడువు దాటినా అందని వ్యాక్సిన్,,,, అందేనా !?

ఆరిలోవ, పెన్ పవర్

కో వ్యాక్సిన్. టీకాల పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. తొలివిడత వ్యాక్సిన్ దేవుడెరుగు రెండోవిడత వ్యాక్సిన్ పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వార్డు కార్పొరేటర్, సచివాలయం సిబ్బంది గాని పి హెచ్ సి సిబ్బంది ఈ విషయంపై ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోతున్నారు ప్రజలు అడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. తొలి విడత  వ్యాక్సిన్ వేయించుకున్న ప్రజలు రెండో దఫా వ్యాక్సిన్ వేయించుకోవడం లో ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  విమ్స్ ఆసుపత్రి పూర్తిగా కోవిద్ ఆసుపత్రి గా ఉంచడం వలన  వ్యాక్సిన్ విషయంలో ఆరిలోవ హెల్త్ సెంటర్ పై భారం పడింది   హాస్పిటల్ లో సిబ్బంది కొరత,  వేతనాలు జాప్యం వెరసి ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని భారం పెరగడంతో వ్యాక్సిన్ కోసం వచ్చేవారిని నియంత్రించడం పై పూర్తిగా చేతులెత్తేసారు. సిబ్బంది వారి ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజలు సహకరించకపోవడంతో  చేతులెత్తేసారు.

నగరంలో పలు ప్రాంతాల నుండి కరోనా వ్యాక్సిన్ కొరకు ఆరిలోవ హెల్త్ సెంటర్ కు రావడంతో స్థానికులకు వ్యాక్సిన్ దొరకటం లేదని మరియు అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి హాస్పిటల్ కి తరలిరావడంతో వారిద్వారా కరోనా మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని స్థానికప్రజలు భయపడుతున్నారు. వార్డు కార్పొరేటర్ ఆధ్వర్యనా  సచివాలయంలో వాక్సీన్ అందజేసే చర్యలు చేపట్టక పోవడం వలన ప్రజలు  ఇబ్బందులు  పడుచున్నారు. ఆరిలోవ హెల్త్ సెంటర్ లో కొంతమంది చోటా నాయకులు తమవారికి వ్యాక్సిన్ అందజేసే విషయంలో తమ హవా కొనసాగిస్తూన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన వ్యాక్సిన్ విషయంలో సచివాలయాల ద్వారా స్థానిక ప్రజలకు వ్యాక్సిన్అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఫార్మా కంపెనీలు పరవాడలో ఆక్సిజన్ తో కూడిన కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయండి

 ఫార్మా కంపెనీలు పరవాడలో ఆక్సిజన్ తో కూడిన కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయండి

 

పరవాడ, పెన్ పవర్

ప్రస్తుత పరిసితుల్లో మడలంలో కరోనా విలయ తాండవం చేస్తున్న కారణంగా    జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ(జె.ఎన్.పి.సి) లో గల ఫార్మా కంపెనీ యాజమాన్యాలను పరవాడ మండల ప్రజల ప్రాణ రక్షణ కొరకు కనీసం 50 ఆక్సిజన్ సదుపాయం కలిగి బెడ్ల తో కూడిన కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి అని వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి పి ఎస్. రాజు  విన్నపం చేశారు. గత సంవత్సరం కరోనా కాలంలో ఫార్మా కంపెనీలు రాస్ట్ర ప్రజలకు,సమీప నిర్వాసిత గ్రామ ప్రజలకు మీరు చేసిన సహాయములు,సేవలు,మరువలేనివి అని యాజమాన్యాలకు ధన్యవాదములు తెలియ జేశారు.ఇప్పుడున్న పరిస్తితులలో ఘతం లో కంటే అధిక జనాభా కరోనా తో ప్రతిఘటిస్తున్నారు అని కొందరు ఆక్సిజన్ అందక మృత్యు వాత పడుతున్న కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి సహృదంతో సత్వరమే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని యజమాన్యాను శుక్రవారంనాడు పత్రికా ముఖంగా వినయపూర్వక అభ్యర్దన చేస్తున్నాను అని రాజు తెలియజేసారు.మీరు చేసే ఈ సేవ ద్వారా సమీప నిర్వాసిత గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా,కంపెనీలలో పనిచేసే కార్మికులకు,మీరు చాలా మేలు చేసిన వారు కాగలరని పి ఎస్.రాజు ఫార్మా యజమాన్యాను అభ్యర్ధించారు.

సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్

 సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ దక్షిణ నియోజకవర్గం,33వ వార్డు, అమ్మవారివీధి, అల్లిపురం, బొర్రా వేలంకిణి కి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు వి.ఎమ్.ఆర్.డి.ఏ, ఛైర్మన్గా ఉన్న సమయంలో చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన తదనంతరం వారి కుమారుడు వైఎస్సార్సీపీ యువనాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్  ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో మాట్లాడి తనవంతు కృషి చేసి దక్షిణ నియోజకవర్గం లో కొన్ని  సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను విడుదల చేయించగా ఇందులో భాగంగా ముఖ్యమంత్రివర్యులు వై.యెస్ జగన్మోహనరెడ్డి తన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి(సి.ఎమ్.ఆర్.ఎఫ్) రూ 60,000/-(అరవై వేల రూపాయలు) మంజూరు చేసిన సి.ఎం,రిలీఫ్ ఫండ్ చెక్కును ద్రోణంరాజు శ్రీనివాసరావు తనయుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్ చేతుల మీదుగా వేలంకిని కి అందచేయడం జరిగింది.చెక్కును అందుకున్న వారు ఇలాంటి కష్ట కాలంలో డబ్బులు అందించడం అనేది చాలా సంతోషంగా ఉందని  తండ్రి లాగానే మీరు కూడా అతి తక్కువ సమయంలోనే ప్రజలందరికి సూపరిచితులు ఐయ్యారని తండ్రి ద్రోణంరాజు శ్రీనివాసరావు లాగనే ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సుశీల, పచ్చరపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

విక్టోరియా హాస్పిటల్ నందు బిజెపి ఓబీసీ మోర్చా సహాయ కార్యక్రమాలు

 విక్టోరియా హాస్పిటల్ నందు బిజెపి ఓబీసీ మోర్చా

 సహాయ కార్యక్రమాలు

మహారాణి పేట, పెన్ పవర్

బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర.వెంకట శ్రీమన్నారాయణ పిలుపు మేరకు మరియు భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి సూచన మేరకు శుక్రవారం విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు వాటర్ బాటిల్స మరియు  క్రీమ్ బన్,పండ్లు 300 మందికి పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కంటిబుక్త శ్రీనివాస్ రావు రాష్ట్ర కోశాధికారి మరియు బిజెపి ఓబిసి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు, జె.శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి ఈ ముగ్గురి ఆర్థిక సాయం తో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎడ్ల రమణ రాజు జిల్లా కార్యదర్శి,చిత్రాడ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి జిల్లా, ఓ.బి.సి కమిటీ, బీసీ నాయకులు మరియు మున్నా  36 వ వార్డు అధ్యక్షులు,సౌత్ కోఆర్డినేటర్ కొప్పుల రామ్ కుమార్ బిజెపి ఓబీసీ పార్లమెంట్ కమిటీ నాయకులు  పాల్గొన్నారు.

అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం సి.ఐ.టి.యు

 అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం 

 సి.ఐ.టి.యు

మహారాణి పేట, పెన్ పవర్

వై.రాజు నగర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ అల్లూరి స్పూర్తితో ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునే వరకు పోరాడుతాం. ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని సందర్భంగా దీక్ష శిబిరం వద్ద ఆయన ఫోటో కి పూలమాలవేసి దీక్షను ప్రారంభించారు అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలందరినీ చైతన్యం చేసి మన దేశానికి స్వతంత్రం కోసం ఆనాటి అదే స్ఫూర్తితో దేశ భక్తి ముసుగులో దేశాన్ని విదేశీలకు తాకట్టు పెట్టె విదంగా మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నా విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం. భారతదేశం అభివృద్ధి రావడానికి కారణం లేదా విశాఖపట్నం అభివృద్ధి అవ్వడానికి కారణం ప్రభుత్వ సంస్థలే. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంటే మోడీకి ఎప్పటికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బుద్ధి చెప్పారు అయినా మోడీకి బీజేపీకి సిగ్గు రావట్లేదు. మనకు కరోన ఇబ్బంది పెడుతున్న సరే  సరే మన పోరాటం కొనసాగుతుంది ఇదే మన విజయానికి నిదర్శనం. దీక్ష శిబిరంలో అనేక తరగతులకు సంబంధించిన ప్రజలు పాల్గొంటు, ఉద్యమం రోజురోజుకు ఉద్భతం అవుతున్నదన్నారు. స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ రోజు సి. ఐ.టి.యు,నగర కార్యదర్శలు యమ్.సుబ్బారావు, బి.జగన్, డిఅప్పలరాజు చంద్రమౌళి, నర్సింగరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరావు  78 వ వార్డు కార్పొరేటర్  డాక్టర్ బి గంగారావు జగదాంబ జోన్  నాయకులు, ఎం.జగ్గునాయుడు కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో అన్నదానం

 ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో అన్నదానం


మహారాణి పేట, పెన్ పవర్

అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  గౌరవ చైర్మన్ ఆదేశాల మేరకు  శుక్రవారం 7 మే ఉదయం  కరోనా తో చనిపోయిన వ్యక్తుల ఆత్మ శాంతి చేకూరాలని మన విశాఖ జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు ఉన్న నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షురాలైన పిల్ల సత్యవతి  సహయ సహకారాలతో నిర్వహించడినది. ఈ కార్యక్రమానికి గౌరవ చైర్మన్ షేక్ సిరాజుద్దిన్,నేషనల్ జనరల్ సెక్రెటరీ బి కేశవ రావు,రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్, రాష్ట్ర మైనార్టీ సెల్ మహిళా విభాగం అధ్యక్షురాలు షేక్ మున్నీ, రాష్ట్ర మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు సిహెచ్ ఆదిలక్ష్మి,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కే.శ్రీలత,జిల్లా యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌస్, జిల్లా సెక్రెటరీ కే శ్రీకమల్, జిల్లా కమిటీ మెంబర్ దనేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని తక్షణమే ప్రకటించాలి.పాచిపెంట శాంతకుమారి

 ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని తక్షణమే ప్రకటించాలి.పాచిపెంట శాంతకుమారి 

   

అరకు, పెన్ పవర్               

ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కరోనా బారినపడిన ప్రతి ఒక్కరిప్రాణాన్ని కాపాడాలని ఏపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ అరకు పార్లమెంట్ నియోజకవర్గం డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.ఈరోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 97 వ వర్ధంతి సందర్భంగా కరోనా కారణంగా బయటకు రాకుండా తమ ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించి ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి యుద్దప్రాతిపదికన అన్ని ప్రైవేట్ హాస్పటల్స్ ను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని కరోనా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు,మందులు మరియు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించే విధంగా  చర్యలు చేపట్టాలని అధికార పార్టీ నాయకులే కరోనాతో  చనిపోయిన  శవాల దహన సంస్కారాలకు కూడా ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైందని చర్చించుకోవడం వారి వైఫల్యాలకు నిదర్శనమని ప్రైవేట్ హాస్పటల్స్ లో కరోనా వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రభుత్వ హాస్పటల్స్ లో ఆక్సిజన్ తో కూడిన బెడ్లు దొరకక నిరుపేదలు చనిపోతున్నారని ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన కరోనా రోగుల వైద్యంపై దృష్ఠి సారించి వైద్యం అందేవిధంగా కృషిచేయాలని 104 నెంబర్ కు ఫోన్ చేసిన మూడుగంటలలో కరోనా రోగికి బెడ్ అందించాలని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి మాటలను కూడా లెక్కచేయకుండా మూడు రోజులకు కూడా బెడ్ అందించలేకపోతున్నారని,ప్రైవేట్ హాస్పటల్స్ లో అత్యధిక ఫీజుల వసూళ్ళను అధికారులు తనిఖీలు చేపట్టి నియంత్రించాలని, కరోనా రోగితో పాటుగా సహాయకులకు కూడా హాస్పటల్స్ లో భోజన సదుపాయం కల్పించాలని లేని పక్షంలో కరోనా రోగులకు సహాయకులుగా ఉండే వారంతా వివిధ హోటల్స్ కు రావడం వలన కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని కరోనా నివారణ వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి ఇవ్వాలని కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న క్రమంలో అందరూ వ్యాక్సిన్ల కోసం ఒకచోట గుమిగూడటం వలన కూడా కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమవుతుందని అన్ని కోవిడ్ హాస్పటల్స్ కు సరిపడా ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందేవిధంగా చర్యలు చేపట్టాలని వ్యాక్సిన్లు,ఇంజెక్షన్ల కొరత లేకుండా చూడాలని చనిపోయిన కరోనా బాధిత కుటుంబానికి రెండు లక్షల నష్టపరిహారాన్ని అందించి దహన సంస్కారాలు ఉచితంగా జరిపేవిధంగా చర్యలు చేపట్టాలని కోవిడ్ వారియర్ గా సేవలందిస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్య, పారిశుద్ధ్య మీడియా, పోలీస్, సిబ్బందిలో కోవిడ్ బాధితులకు ఉచిత వైద్యం, మరణించిన వారి కుటుంబానికి 5లక్షల ప్రమాద భీమాను అందించే విధంగా కృషిచేయాలని పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విమ్స్ హాస్పిటల్ కు ఇంజెక్షన్ల వితరణ

 విమ్స్ హాస్పిటల్ కు ఇంజెక్షన్ల వితరణ

విశాఖపట్నం,పెన్ పవర్

మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు, బిజెపి విశాఖపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర విమ్స్ డైరెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసారు, అక్కడ కరోణా రోగులకు అందించే చికిత్స గురించి వాకబు చేశారు, కరోణా రోగులకు అవసరమైన ఇంజెక్షన్స్ ఫోండా ఫ్లో,మెప్రేస్సో ఇంజెక్షన్ లను అందజేశారు.ఈ కష్టకాలంలో ముందు ముందు కూడా స్నేహితుల సహకారంతో సహాయం అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేశారు.

రంగులుమీద ఉండే శ్రద్ధ ప్రజారోగ్యం మీద ఉండదా..!గంటా నూకరాజు

 రంగులుమీద ఉండే శ్రద్ధ  ప్రజారోగ్యం మీద ఉండదా..!గంటా నూకరాజు


భీమిలి, పెన్ పవర్

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీశం చీమకుట్టినట్లు కూడా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,  భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు అన్నారు.రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు బెంబేలెత్తుతుంటే  రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని గంటా నూకరాజు అన్నారు. వ్యాక్సిన్స్ వేసుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారని,దానికి తగ్గట్టుగా దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు  ఆర్ధిక వ్యవస్థను పక్కనపెట్టి ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్షిన్స్ కొనుగోలు చేసి ప్రజలందరికీ వేయించే పనిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని గంటా నూకరాజు అన్నారు.   కార్యాలయాలకు,కరెంటు  స్థంబాలకు,గోడలకు పార్టీ రంగులు వేసేందుకు,తీసేందుకు  వందల కోట్లు ఖర్చు పెట్టేoదుకు డబ్బులు ఉంటాయి గాని ప్రజారోగ్యం కోసం ఉపయోగపడే వ్యాక్సిన్స్ కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు.రోజుకు 20వేలకు పైగా కేసులు రాష్ట్రంలో వస్తున్నా ,మరణాలు రేట్లు విపరీతంగా పెరుగుతున్న ముఖ్యమంత్రి మాత్రం మంగళగిరి కార్యాలయం వదలి రారని అన్నారు.   రాష్ట్రమంతా కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ లేక రోగులు మరనిస్తుంటే ఏ జిల్లాకు ముఖ్యమంత్రి వెళ్లి ఏమి జరుగుతుందో చూడరని,ప్రజలు ఇంతలా భయాందోళనకు గురవుతున్నప్పటికి  రాజకీయాలమీదే జ్యాస తప్ప ప్రజారోగ్యం మీద లేదని అన్నారు.104కి ఫోన్ చేస్తే 3గంటల్లో కోవిడ్ రోగికి బెడ్ ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి చెబుతారు.. ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో 50శాతం బెడ్లు కోవిడ్ బెడ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి చెబుతారు.. ఆక్సిజన్ లేక ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ శనిపోలేదని సాక్ష్యాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కే తప్పుడు నివేదికలు ఇస్తారు.. మీరు చెప్పేది ఏదీ నిజం ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నాను.చెప్పే వాటికి ఆచరణలో జరిగేవాటికి సంబంధం లేకుండా చేయడంలో మీరు ఉద్దండులని అన్నారు. పిట్టల్లా జనాలు రాలిపోతుంటే కనీశం చలనం లేకుండా ఉన్న ముఖ్యమంత్రి మీరు తప్ప ఈ దేశంలో ఎవరూ ఉండరని గంటా నూకరాజు అన్నారు.   ఇళ్ల నిర్మాణం అంటారు,బడులకు సెలవులు ఇచ్చి  విద్యాదీవెన అని అంటారు.కరోనా విలయతాండవం చేస్తుంటే పరీక్షలు పెడతామంటారు కానీ ప్రజారోగ్యం పట్టదా అని గంటా నూకరాజు నిలదీశారు.

ప్ర‌తీఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలి

 ప్ర‌తీఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్

హోం ఐసోలేష‌న్లో ఉన్న‌వారికి కోవిడ్ కిట్లు పంపిణీ

విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్

కోవిడ్ వ‌చ్చిన‌వారితోపాటు, వ్యాధి రాని వారు కూడా వ‌చ్చిన‌ట్టుగానే భావించి, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ .లాల్ కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌తీఒక్క‌రూ ఎంతో అప్రమ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఇద‌ని అన్నారు. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌న‌స‌రిగా మాస్కును ధ‌రించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాల‌ని సూచించారు.  కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన మెడిక‌ల్ కిట్ల‌ను స్థానిక జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌యం వ‌ద్ద బుధ‌వారం ఎఎన్ఎంల‌కు అంద‌జేశారు.ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు విధాలుగా కోవిడ్ చికిత్స‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉండీ కోవిడ్ సోకిన‌వారికి, ఆక్సీజ‌న్ ప‌రిమాణం త‌క్కువ‌గా ఉన్న‌వారికి, ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌వారికి ఆసుప‌త్రుల్లో ఉంచి చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. దీనికోసం 14 ప్ర‌భుత్వ‌, 16 ప్ర‌యివేటు ఆసుప్ర‌తుల‌ను సిద్దం చేశామ‌ని, ప్ర‌స్తుతం 997 మంది వ‌ర‌కూ కోవిడ్ పేషెంట్లు ఆసుప‌త్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపారు.వ్యాధి ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారినీ, ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ, హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌టానికి అవ‌కాశం లేనివారినీ ఉంచేందుకు జిల్లాలో ఏడు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. వీటిలో మొత్తం 3,600 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, 24 గంట‌లూ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోపాటు, అవ‌స‌ర‌మైతే వినియోగించేందుకు ఆక్సీజ‌న్‌, మందులు, అంబులెన్సుల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ఆహారాన్ని అందించ‌డంతోపాటు, పారిశుధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌న్నారు. ప్ర‌స్తుతం 100 మంది వ‌ర‌కూ కేర్ సెంట‌ర్ల‌లో ఉన్నార‌ని క‌లెక్ట‌ర్‌ చెప్పారు.

 హోం ఐసోలేష‌న్‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నామ‌ని, వ్యాధి ల‌క్ష‌ణాలు తీవ్రంగా లేనివారికి ఇళ్ల‌లోనే ఉంచి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఇలా ప్ర‌స్తుతం సుమారు 5వేల మంది వ‌ర‌కూ హోం ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. వీరంద‌రికీ కోవిడ్ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా వీరికి కోవిడ్ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. దీనికోసం జిల్లాకు సుమారు 75 వేల కోవిడ్ కిట్లు వ‌చ్చాయ‌ని, వీటిలో 45 వేల కిట్ల‌ను ఇప్ప‌టికే పిహెచ్‌సిల‌కు పంపించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఇవి కాకుండా స‌బ్ సెంట‌ర్ల ప‌రిధిలోని ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా నేరుగా పంపిణీ చేసేందుకు, వారికి సుమారు 22వేల‌ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎంత త్వ‌ర‌గా కిట్ల‌ను పంపిణీ చేస్తే, రోగులు అంత త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటార‌ని అన్నారు. అందువ‌ల్ల‌, ఈ కిట్లు పంపిణీని కంట్రోల్ రూముద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్నారు. జింకు, విట‌మిన్లు, సిట్రిజ‌న్‌, యాంటీ బ‌యాటిక్ టేబ్‌లెట్లు, వాటిని వాడే విధానాన్ని కూడా కిట్ల‌లో పొందుప‌ర్చ‌డం జ‌రిగింద‌న్నారు. వ్యాధి సోకిన‌ప్ప‌టికీ, అధైర్య ప‌డ‌కుండా ధైర్యంగా ఎదుర్కోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ చామంతి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.


ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

 ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న ప్ర‌క‌ట‌న‌


విజ‌య‌న‌గ‌రం,  పెన్ పవర్

కోవిడ్ నియంత్ర‌ణంలో భాగంగా విధించిన క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలో భూ క్ర‌య‌, విక్ర‌య రిజిస్ట్రేష‌న్ స‌మ‌యాల్లో మార్పు చేసిన‌ట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 7.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు పని చేస్తాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కు జిల్లాలోని రిజిస్ట్రార్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.


జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

 జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ     

   

విజయనగరం, పెన్ పవర్


స్థానిక 42వ డివిజన్ పరిధిలో  ఉన్న అయ్యన్నపేట జంక్షన్ మరియు జంక్షన్ వద్దనున్న ఎస్సి కొలనీలో  జనసేన పార్టీ సీనియర్ నాయకులు,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణరావు(బాలు) ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇంటిఇంటికీ మాస్కులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్యవేదిక అధ్యక్షులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ రెండో వేవ్ కరోనా తీవ్రతదృష్ట్యా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని బాలు చేపట్టారని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని,ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లోపింటి కళ్యాణ్, చిన్న,కృష్ణ, పాల్గొన్నారు.   


కర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

 కర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ఎస్.ఐ.ఫకృద్ధీన్,

సాలూరు, పెన్ పవర్

ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్ణయించిన కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని సాలూరు పట్టణ ఎస్.ఐ.ఫకృద్ధీన్ సూచించారు. పట్టణంలో గురువారం పట్టణ ఎస్.ఐ కర్ఫ్యూ నిబంధనలు తెలియజేస్తూ దగ్గర ఉండి షాపులను మూయించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ఫ్యూని పాటిద్దాం కరోనాని తరిమిద్దాం, మాస్కు ధరించు భౌతిక దూరం పాటించు శుభ్రత వహించు, నిర్లక్ష్యంగా ఉండకు కరోన బారిన పడకు, అనవసరంగా బయటకు రాకు కరోనాని ఆహ్వానించకు, మీ రక్షణ కోసం మేము రోడ్లుపై ఉన్నాము, మనందరి కోసం బయటకు రావాద్దు అంటూ పట్టణంలో మెయిన్ రోడ్డు గుండా ప్లేకార్డులుతో తమ సిబ్బందితో కలసి ప్రదర్శన చేశారు. సాలూరు సి.ఐ.అప్పలనాయుడు మరియు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ లో కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ 12 గంటలకే షాపులన్నింటిని మూసివేయించడం జరిగింది అని ఎస్.ఐ ఫకృద్దీన్ తెలిపారు. అలాగే స్థానిక స్టేట్ బ్యాంకు లో భౌతిక దూరం పాటించాలని అక్కడ ఉన్న బ్యాంకు వినియోగదారులకు సూచించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఎం.రవీంద్ర

 తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఎం.రవీంద్ర

విశాఖపట్నం, పెన్ పవర్

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాక్సినేషన్ లో భాగంగా ఇచ్చే రెండవ డోసు కు  కోవాక్సిన్ డోసులు తగినన్ని అందుబాటులో లేక కోవాక్సిన్ మొదటి డోసు వేసుకొని రెండవ డోసు కొరకు చాలామంది నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా వాక్సినేషన్ ప్రక్రియను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలోనే చేపట్టడంతో అధిక శాతం ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూ లైన్ లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, కావున ప్రైవేటు ఆసుపత్రులలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచితే డబ్బులు వెచ్చించి వ్యాక్సిన్ వేయించుకునేవారైనా కొవిడ్ బారినుండి రక్షింపబడతారని,కరోనా బారిన పడి ఆక్సిజెన్ అందక ఇబ్బంది పడుతున్న రోగులకు సరిపడా ఆక్సిజెన్ సరఫరా చేయకపోవడంతో, ఆక్సిజెన్ అందక చాలామంది కరోనా రోగులు ఆసుపత్రుల బయటనే చనిపోతున్నారని, ఆక్సిజెన్ సరఫరాను కూడా పెంచాలని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకూ కరోనా సోకినట్లైతే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని,వారికి సరైన అవగాహన కల్పించి తగిన చికిత్సను అందజేయాలని, కరోనా టెస్టులు చేయించుకున్న తరువాత ఐదు రోజుల నుండి వారం రోజుల వరకు గానీ ఆ టెస్టు రిపోర్టులు రానటువంటి పరిస్థితి ఏర్పడటం వలన,ఈలోపు టెస్టు చేయించుకున్న వ్యక్తికీ గానీ కరోనా ఉన్నట్లయితే మరికొంతమందికి వ్యాపించే అవకాశం ఉన్నదనిి, కరోనా టెస్టుల ఫలితాలు వీలైనంత త్వరగా వెల్లడించి రోగులు తగు జాగ్రత్తలు తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే టెస్టు రిపోర్టులు వచ్చేవరకు ఆగకుండా వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టి కరోనా బారిన పడిన వారి ప్రాణాలను కాపాడాలని  భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అగనంపూడి సి.హెచ్.సి.సెంటర్ ను సందర్శించిన తిప్పల

అగనంపూడి సి.హెచ్.సి.సెంటర్ ను  సందర్శించిన తిప్పల 

గాజువాక, పెన్ పవర్

విశాఖపట్నం అగనంపూడి సి.హెచ్.సి.సెంటర్ సందర్శించిన గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అక్కడ ఉన్న సమస్యల్ని వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో పర్యవేక్షించి మరియు అక్కడున్న పరిసర ప్రాంతాన్ని తరచుగా శానిటైజర్ చేయమని ఆదేశించారు. హాస్పిటల్ లో ఉన్నటువంటి ఇబ్బందులను సమస్యలను సూపరిండెంట్ ద్వారా తెలుసుకుని మరియు ఈ హాస్పిటల్ కోవిడ్ సెంటర్ గా మారిస్తే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ప్రెగ్నెంట్ లేడీస్ తరచుగా డాక్టర్ చెకప్ వస్తూ ఉంటారు. 

 చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మరి దీన్ని కోవిడ్ హాస్పిటల్ గా మారిస్తే వాళ్లందరికీ కూడా ఇబ్బందులు ఉంటాయని దేవన్ రెడ్డి  సూపర్డెంట్ తెలియపరిచారు. మరి దీనికి స్పందిస్తూ దేవన్ రెడ్డి ఈ విషయాన్ని పై స్థాయి అధికారులకు తెలియపరుస్తాను అని హామీ ఇచ్చారు అలాగే కరోనా టెస్ట్స్ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు.రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ ని వంద పడకల హాస్పిటల్ గా 16 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సి.ఏం,జగన్ కు మనం ఎప్పుడూ కూడా విధేయులుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 66 వార్డ్ కార్పొరేటర్ ఇమ్రాన్  తదితరులు పాల్గొన్నారు.

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

మహారాణి పేట, పెన్ పవర్

అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  గౌరవ చైర్మన్ ఆదేశాల మేరకు కరోనాతో చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చెకూరాలని గురువారం 6 మే ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మన జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు 50 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షురాలైన షేక్  మున్ని  సహయ సహకారాలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నేషనల్ జనరల్ సెక్రటరీ కేశవరావు  స్టేట్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షురాలు పిల్ల సత్యవతి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి.హెచ్. ఆదిలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లాయువజన విభాగం వైస్  ప్రెసిడెంట్ షేక్ గౌస్ లజం  తదితరులు పాల్గొన్నారు.


చేతులెత్తి మొక్కుతున్న వార్డ్ ప్రజలు ఇంట్లోనే వుండండి

 చేతులెత్తి మొక్కుతున్న వార్డ్ ప్రజలు ఇంట్లోనే వుండండి

గాజువాక, పెన్ పవర్

చేతులెత్తి మొక్కుతున్నాను దయచేసి మీరు అంత ఇంట్లోనే వుండండి అని గాజువాక జనసేన మహిళ నాయకురాలు రెయ్యి రత్న కోరారు.ఉదయం లేస్తే ఏమి వినాల్సివస్తుందో అని ఏ ఆత్మీయులని .కోల్పోవాల్సివస్తుంది ఏమో అని బాధ దయచేసి ప్రస్తుతం బయట పరిస్థితి భిన్నంగా ఉన్నాయి డబ్బు పలుకుబడి ఏవి కూడా పనిచేసే పరిస్థితి లేదు కోవిడ్ బారిన పడి ఎవరిని కోల్పోవాల్సివస్తుందో అని మనసు కలిచి వేస్తుంది. దయచేసి స్వచ్చందంగా మీకు మీరుగా భౌతిక దూరం స్వీయ నియంత్రణ మస్కలు ధరించడం శానిటేషన్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు దయచేసి మీకు మీరుగా ఇంట్లో వుండండి అత్యావరమైతే తప్ప బయటకి రాకండి ప్రాణము కన్న విలువ అయినది ఏది లేదు అని తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.


నైతిక విలువలు కోల్పోతున్న ఆకుల

నైతిక విలువలు కోల్పోతున్న ఆకుల

ఛీ... నోరుమూయ్ అంటూ మహిళ పై విరుచుకుపడ్డ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ
నాలాగ ఏ పేషెంట్ బాధితులు ఎవరూ ఇబ్బంది పడకూడదని మహిళ ఆవేదన...

రాజమహేంద్రవరం, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక దానవాయిపేటలో ఉన్న శ్రీ ఆదిత్య ఆసుపత్రిలో ఆకస్మికంగా పేషెంట్ ని వేరే హాస్పిటల్ కి ఎక్కడైనా తరలించుకోవాలని ముందుగానే చెప్తున్నాను అని ఆక్సిజన్ రావడం లేట్ అవ్వచ్చు ముందుగానే చెప్పడం మా బాధ్యత అంటున్న డాక్టర్లు మీకు టైం ఇస్తాం అవకాశం ఉంటే వేరే హాస్పటల్  తీసుకెళ్లొచ్చు అని చెప్పడం జరిగింది. దీనిమీద ఆకుల సత్యనారాయణహాస్పిటల్ వద్దకు చేరుకుని డబ్బులు శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, ప్రాణం శాశ్వతం కాదు, డబ్బులు కట్టడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ లో అటువంటి మాటలు మాట్లాడకూడదు అంటూ, ప్రభుత్వ హస్పిటల్ తీసుకెళ్లి పొండి అని సలహాలు ఇస్తూ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడి మానసికంగా మహిళని ఇబ్బందులకు గురి చేశారు.ఈ ఆమె బాధపడుతూ మాట్లాడుతూ ఈ విషయం మీద మాకు వైద్యం కొనసాగించాలి అని లక్షలు లక్షలు డబ్భులు కట్టే జాయిన్ చేసుకున్నారు అని మాకు న్యాయం చేయాలని, ఒక రాజకీయ  నాయకుడు అయ్యుండి, అసభ్యంగా మాట్లాడి మమ్ములను 12 మంది పేషేంట్స్  వారు బందువులపై అసభ్యంగా మాట్లాడి,ఆయన కారును దురుసుగా డ్రై చేస్తూ మమ్ములను భయభ్రాంతులను చేశారు ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.


ఉత్తమ రైతుకు కోవిడ్ వ్యాక్సిన్

 ఉత్తమ రైతుకు కోవిడ్ వ్యాక్సిన్

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండల రావూరుపాడు గ్రామ కాపు సంఘం ప్రెసిడెంట్, ఉత్తమ రైతు, జనసేన నాయకులు పుప్పాల సత్యనారాయణ గురువారం మలకపల్లి పిహెచ్సిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ రావూరుపాడు గ్రామ ప్రజలంతా కోవిడ్ నియంత్రణ నిబంధనలు పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకూడదని, బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చేతులను ఎల్లప్పుడూ శానిటైజేషన్ చేసుకోవాలని తెలియజేశారు. ప్రతీ ఒక్కరూ కరోన నియంత్రణ నిబంధనలు పాటించినపుడే కరోనాను తరిమికొట్టగలమని అన్నారు.


నాటుసారాకు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

 నాటుసారాకు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

గోపాలపురం, పెన్ పవర్

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు, ఏఎస్పీ మరియు ఏసి వారి అదేశాలమేరకు పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు తమ సిబ్బంది బుధవారం తనిఖీల్లో భాగంగా గోపాలపురం మండలం కొవ్వాడ ప్రోజెక్టు ఏరియా బుచ్చియ్యపాలెం గ్రామంలో నాటుసారా కు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట పట్టుబడింది. ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టుబడిన బెల్లం ఊటను తమ సిబ్బంది సహాయంతో ధ్వంసం చేసినట్లు తెలిపారు.

భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలి

భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలి

 


రాజమహేంద్రవరం,పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలని టీఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు కోరారు.గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారిపోతుందని, గత రెండేళ్ళుగా కార్మికులకు వరుస కష్టాలు వచ్చాయన్నారు. ముఖ్యంగా ఇసుక కొరత ఒక పక్క వేధిస్తుంటే మరో పక్కకరోనా లాక్ డౌన్ తో లక్షలాదిమంది కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ప్రస్తుతం ఏదో విధంగా పని కల్పించుకుని పని చేసుకుంటుంటే కరోనా సెకండ్ వేవ్ అంటూ మళ్ళీ పాక్షిక కర్ఫ్యూ విధించారన్నారు. దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది భవన నిర్మాణ కార్మికులేనని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనులు చేసే సమయంలో వాళ్ళు బయట తిరిగి కరోనా వ్యాప్తి జరిగే అవకాశం లేదన్నారు. కేవలం కార్మికులు ఆయా భవనాల్లో మాత్రమే పనులు చేస్తారని, అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ,శానిటైజర్ వినియోగిస్తూ పనులు చేసుకుంటారని, కనుక ప్రభుత్వం ఈ పాక్షిక కర్ఫ్యూ నుంచి భవన నిర్మాణ కార్మికులకు తప్పక మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే గత ఏడాది  కరోనా లాక్ డౌన్ కాలంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్ధిక సాయం అందిస్తామన్న హామీని తక్షణం నెరవేర్చాలన్నారు. భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని,తక్షణం ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇవ్వడంతో పాటు రైతులకు, నేతన్నలకు,రజకులకు,దర్జీలకు ఇస్తున్న విధంగా భవన నిర్మాణ కార్మికులు అందరికీ ఏటా రూ.10వేలు ఆర్ధిక సాయం అందించాలని,ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డులో గత ప్రభుత్వాలు పెట్టిన స్కీములను తొలగించాలనే ఆలోచనను తక్షణం విరమించుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమ స్కీములన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు.


కైవల్య రధాలను ఏర్పాటు చేసిన రామోహన రావు ఫౌండేషన్

 కైవల్య రధాలను ఏర్పాటు చేసిన రామోహన రావు ఫౌండేషన్ 

రాజమహేంద్రవరం, పెన్ పవర్

కరోనా మహామ్మారి రోజు రోజు కు విస్తరించి వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నవారు , కరోనా తో మృతి చెందిన వారి మృతదేహాలను తరలించడం లో పేదలకు,మధ్యతరగతి వారికి భారంగా మారుతున్న తరుణంలో కరోనా వ్యాధితో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా స్మశానవాటికకు  తరలించేందుకు ఉపయోగించే " కైవల్య రధాలు" (వాహనాలు)ఏర్పాటు చేసేందుకు  పెద్ద మనస్సుతో రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ముందుకు వచ్చారు.కోవిడ్ వ్యాధితో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా సేవా భావంతో  తరలించేందుకు వినియోగించే రెండు వాహనాలను జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్ , రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ సంయుక్త ఆద్వర్యంలో వాహనాలు వినియోగిస్తారు.రాజమహేంద్రవరం  మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమక్షంలో బుధవారం జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్ సభ్యులు  ఎం.ఆర్.పట్నాయక్ ద్వారా మున్సిపల్ కార్పోరేషన్ ఎం.హెచ్.ఓ. డాక్టర్ మూర్తి, మేనేజర్ సి.హెచ్ శ్రీనివాస్ లు వాహనాలు ప్రారంభించారు.ఈ రెండు వాహనాలు  రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ తోపాటు రాజానగరం పరిధిలో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా స్మశాన వాటికకు తరలించేందుకు వినియోగిస్తారని తెలిపారు.  మృతి చెందిన వారి బాదిత కుటుంబాల వారు మృతదేహాలను తరలించేందుకు జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 9154622899ను సంప్రదించాలని కోరారు.


వేగేశ్వరపురం లో సోడియం హైపో క్లోరైట్ పిచికారి

వేగేశ్వరపురం లో సోడియం హైపో క్లోరైట్ పిచికారి

తాళ్లపూడి, పెన్ పవర్

బుధవారం వేగేశ్వరపురం  గ్రామంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉన్నందున  సోడియం హైపో క్లోరైట్ ను  సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురమారావు, పంచాయతీ సెక్రెటరీ  వెంకట్రాజు ఆధ్వర్యంలో గ్రామంలో వీధులన్నీ పారిశుద్ధ్య కార్మికులచే  పిచికారి చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది,  వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పరశురామారావు మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని, బయటకు వచ్చినప్పుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి, మనల్ని, మనసమాజాన్ని కరోన బారినుండి కాపాడుకోవాలని తెలియజేశారు.


కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

తాళ్లపూడి, పెన్ పవర్

పవిత్రమైన రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమం బుధవారం వేగేశ్వరపురం గ్రామంలో జరిగింది.  వేగేశ్వరపురం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జిలాని  సచివాలయ సిబ్బంది సహాయంతో కోవిడ్ ఆంక్షల నియమావళి మరియు కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటించి  గ్రామంలో ఉన్న 25 కుటుంబాల వారి ఇంటికి వెళ్లి ఇఫ్తార్ విందు అందజేయడం జరిగింది. వేగేశ్వరపురం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోవిడ్ బారినుండి బయటపడాలని ప్రార్ధన చేశారు.


ఉపాధి కూలీలు కోవిడ్ నిబంధనలు పాటించాలి

 ఉపాధి కూలీలు కోవిడ్ నిబంధనలు పాటించాలి

పెన్ పవర్ , రావులపాలెం

కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉపాధి హామీ పథకం కూలీలు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు చేయాలని ఏపిఓ సత్యవతి సూచించారు. రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం, పొడగట్లపల్లి గ్రామాల్లో జరుగుతున్న కాలువ పనులను గురువారం ఆమె పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కూలీలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఫీల్డ్ అసిస్టెంట్లు విజయకుమార్, వెంకటనాగేంద్ర పాల్గొన్నారు.


గిరిజన ‌ బంధువులను దూరం చేస్తున్న కరోనా

గిరిజన ‌ బంధువులను  దూరం చేస్తున్న కరోనా

చింతూరు,  పెన్ పవర్

గిరిజనుల్లో లో శుభకార్యాలు జరిగినా, అశుభ కార్యాలు జరిగినా ఒక పండుగ జరిగినా బంధువులందరూ పెద్ద ఎత్తున వేడుకకు రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కరోనా కు గురై మృతి చెందిన గిరిజనుల కుటుంబాల వద్దకు బంధువులు ఎవరూ రాకపోవడం హృదయవిదారకమైన విషయం. చింతూరు మండలంలో ఇంచుమించు ప్రతి గ్రామానికి కరోనా సోకింది. ప్రతి గ్రామంలోనూ లాక్ డౌన్ విధించటం గ్రామంలో శానిటేషన్ చేయించటం సెక్రటరీల పని వంతు అయింది. 12:00 తర్వాత లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఆజ్ఞలు జారీ చేసింది. గత రాత్రి  మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోడి కాంతమ్మ (50) కరోనాతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందింది. కాంతమ్మ మృతదేహానికి  సంస్కారాలు చేయడానికి బంధువులు ఎవరూ రాలేదు. కాంతమ్మ మరిది కొడుకులు మరో వ్యక్తి అంతిమ సంస్కారాలు చేశారు. కరొన తీవ్రతరం కావడంతో ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తన సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది హృదయ విదారక దృశ్యం.


చారిటీ సోసైటీ ఆధ్వర్యంలో 20 కుర్చీలు బహుకరణ

 చారిటీ సోసైటీ ఆధ్వర్యంలో  20 కుర్చీలు బహుకరణ

బిక్కవోలు, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం బిక్కవోలు చారిటీ సొసైటీ మరియు గ్లోబల్ విజన్ హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ కరస్పాండెంట్ ఎం.జాన్ డీన్ మరియు ప్రధానోపాధ్యాయులు సత్యవాణి రంగంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం 15 కుర్చీలు పి.హెచ్.సి డాక్టర్ ఎం.కృష్ణ చైతన్య మరియు డాక్టర్ ఎం.పద్మ వీరికి అందించారు. అలాగే సింగంపల్లి ఉప కేంద్రం ఆరోగ్య కేంద్రానికి 5 కుర్చీలు బహుకరిందం జరిగింది అని డాక్టర్లు తెలిపారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కీర్తిశేషులు ఎం.శామ్యూల్ రాజు పేదలకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తు చేసుకుంటాము అని,మా వెన్నంటే ఉంటూ,  ప్రోత్సహించే వారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం కుర్చీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

 శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

  నిరంతరం ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్ల శేషగిరి కరోనా తో అకాల మరణం చెందడం విద్యారంగానికి తీరని లోటని, ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శేషగిరి సామాజిక స్పృహ కలిగిన నాయకుడని, ఉపాధ్యాయుల సంక్షేమం  కోసం, కార్మిక వర్గాల హక్కుల కోసం,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారన్నారు. గురజాడ అధ్యయన వేదిక పక్షాన పలు సామాజిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తూ చైతన్యం కోసం కృషి చేశారన్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యోగ,కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. అంతే కాకుండా శేషగిరి విద్యారంగ విశ్లేషకునిగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఏ విధంగా నష్టపోతారనే వ్యాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. గతంలో యూటీఎఫ్ లో శేషగిరితో ఉద్యమ సహచరునిగా కలిసి పని చేసామని,అదేవిధంగా గత రెండున్నర దశాబ్దాలుగా  ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై జరిగిన అనేక ఐక్య పోరాటాల్లో కలిసి పాల్గొన్నామని సామల తన జ్ఞాపకాలను గుర్తు చేసారు. కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి  మరణం  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం రాష్ట్ర  విద్యారంగానికి, ఉపాధ్యాయ , ఉద్యోగ , కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అభివర్ణించారు  ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సామల పేర్కొన్నారు.

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

 హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని పలు గ్రామాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని పలువురు మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయితీ సర్పంచులు ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనుల చేపట్టారు. ఇందులో భాగంగా పిట్టా డ గ్రామ సర్పంచ్ కాపరపు నాయుడు బాబు ఆధ్వర్యంలో వాణిజ గిరిజన గ్రామంలో  క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గ్రామంలో అన్ని వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు. సర్పంచ్ నాయుడు బాబు  మాట్లాడుతూ ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశలో ఉందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇంట్లో ఉన్న, అత్యవసర సమయాల్లో బయటికి వెళ్ళిన మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని ఆయన వివరించారు. ప్రస్తుతం మెంటాడ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టీకాలు, టెస్టుల్లో చేస్తున్నారని 45 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులకు టీకాలు వేయించుకోవాలని ఆయన తెలిపారు. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

 వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

అంతరిస్తున్న తాటి వనాలు తగ్గిన ముంజుల దిగుబడి

పెన్ పవర్,  విశాఖపట్నం

వేసవి కాలం వచ్చిందంటే ముంజు లేయ్- తాటి ముంజులు అన్న కేక వీధుల్లో వినిపిస్తుంటుంది. తాటి ముంజులు తట్టను మహిళలు నెత్తిన పెట్టుకొని  ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతుంటారు. మంజులేయ్  అన్న కేక వినగానే ఏయ్- ముంజులు ఇలారా  అని పలిచి బేరమాడి మరి కొనుక్కొంటాం. వేడికి ఉపశమనం కలిగించే తాటి ముంజులు సేకరణ లో ఎంతో శ్రమ దాగి ఉంది. తాటి చెట్ల నుంచి లేత కాయలు  దించి కత్తితో వలుస్తారు.ముంజులు తీయడం లో జాగ్రత్త వహించాలి. లేకుంటే ముంజులు పగిలి నీరు పోతుంది. చెట్టు గీత  గాళ్లు నేర్పరి గా ముంజులు తీస్తారు. గ్రామీణ ప్రాంతాలకు పరిమితం అయిన తాటి ముంజులు ఇప్పుడు పట్టణాలకు పాకింది. చేరువలో  ఉన్న  గ్రామాల నుంచి  తాటి ముంజల ను  పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. మారికవలస  పిన గాడి   సబ్బవరం ప్రాంతాల చెట్ల కింద తాటి కాయలు రాశులు  ముంజులు తీసి విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి  ముంజుల ధరలు పెరుగుతున్నాయి  గ్రామీణ ప్రాంతాల్లో డజను పాతిక రూపాయలు ఉంటే నగరంలో 50 రూపాయలకు పైనే. వేసవిలో చెట్టు గీత గార్లకు తాటి ముంజలు కాసులు  పండిస్తున్నాయి.  తాటి చెట్లు  అంతరించిపోతుం డంతో తాటి ముంజల  కొరత  వస్తుంది. తాటి ముంజులు కు పట్టణాల్లో గిరాకీ ఉండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి తాటి కాయలు సేకరిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు పరిమితమైన తాటి ముంజులు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. మాడుగుల ప్రాంతం నుంచి పాడేరు కు. నర్సీపట్నం ప్రాంతం నుండి చింతపల్లి కి ఎస్. కోట నుండి అరకు కి తాటి ముంజులు సరపరా అవుతున్నాయి. దూరం పెరిగే కొద్దీ ముంజుల ధరలు చుక్కల నంటుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని తెలంగాణ జిల్లా ల్లొ తాటి కలఫకు మంచి గిరాకి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో తాటి చెట్లును వ్యాపార్లు రవాణా చేస్తున్నారు. మరి కొంత కాలానికి తాటి చెట్లు కనుమరుగై పోయే అవకాశం ఉంది.


కరోనా నిర్మూలనకు ఆటో ద్వారా ప్రసారం

 కరోనా నిర్మూలనకు ఆటో ద్వారా ప్రసారం

మెంటాడ, పెన్ పవర్ 

మండల కేంద్రం మెంటాడ అక్కడ అక్కడ కరోనా కేసులు నమోదు కావడంతో సర్పంచ్ రేగిడి రాంబాబు వినూత్న ప్రసారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా పట్ల అవగాహన కల్పించడం కష్టతరం అని గ్రామములో ఆటో ఏర్పాటు చేసి ప్రసారానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, బహుదూరం పాటించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వము లాక్ డౌన్, 144 సెక్షన్ అమలు చేసిందని, ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కిరానా, టిఫిన్, పాన్ షాపులు తెరిచి ఉంటాయని ప్రతి ఒక్కరూ తమకు కు కావలసిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని, స్వచ్ఛందంగా ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా ప్రబంధములు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.


కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్

కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ 

మెంటాడ, పెన్ పవర్

మెంటాడ మండలం, చింతలవలస గ్రామపంచాయతీ సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, వైద్య ఆరోగ్య సిబ్బంది,  గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి గురువారం కరోనా పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి పరిసరాల, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని,    ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరిస్తే మంచిదని వారు గ్రామస్తులకు సూచించారు. బహుదూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండాలని, అవసరమైతే మాస్కులు ధరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు,  పెన్ పవర్

 పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు అపరేటర్లు సిబ్బందిని తక్షణమే నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా కన్వీనర్ రామారావు దొర , కో-కన్వీనర్: కూడ రాధాకృష్ణ బూడిద సుమన్ ,ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాలకు ఏకైక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పాడేరు లోనే ఉంది. నిత్యం వందలాది మంది వైద్యం పొందుటకు పాడేరు జిల్లా ఆస్పత్రికి వస్తూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో పాడేరులో వైద్యం చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఇక్కడ సరైన సిబ్బంది లేక కెజిహెచ్ కు రిఫరల్ చేస్తూ ఉంటారు. దానివల్ల మార్గమధ్యంలోనే అనేక మంది చనిపోతున్నా ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆక్సిజన్ వెంటిలేటర్ అందక ఒక వ్యక్తి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో గంట వ్యవధిలోనే మరణించిన పరిస్థితి ఉందని, తక్షణమే ఆదివాసీల ప్రాణాలు కాపాడుటకు ఆక్సిజన్ వెంటిలేటర్ సిబ్బందిని నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.


గజ గజ లాడిస్తున్న గజ రాజులు

 గజ గజ లాడిస్తున్న గజ రాజులు 

కూరగాయలు కోత కు వెళ్లిన మహిళ మృతి
పొలాల్లో కి వెళ్ళడానికి భయపడుతున్న రైతులు
నేటి కి ఆరుగురు మృతి 
ప్రభుత్వం రెండు కోట్లు కు పైగా నష్టపరిహారం చెల్లింపు
పదుల సంఖ్యలో ఫారెస్ట్ సిబ్బంది కి గాయాలు, వాహనాలు ధ్వంసం
మూడు ఏళ్లుగా ఇదే తంతు దొరకని  శాశ్విత పరిష్కారం

కురుపాం, పెన్ పవర్

కురుపాం నియోజకవర్గంలో లో ఏనుగులు ప్రవేశించి మూడు ఏళ్ళు పైగా అవుతుంది,కానీ నేటికీ శాశ్విత పరిష్కారం దొరకలేదు,గురువారం తెల్లవారుజామున కోమరడా మండలం పాత కల్లికోట గ్రామానికి చెందిన అల్లాడా అప్పమ్మా అనే మహిళ కూరగాయలు కోయడానికి వెళ్ళేరు,ఇమే పై ఒక ఏనుగు దాడి చేయడం తో ఆమె అక్కడ కు అక్కడే మృతి చెందింది, ఇమే మృతి తో మృతుల సంఖ్య ఆరు కు చేరింది,ఒక వైపు కరోనో మరో వైపు ఏనుగుల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,నాగావళి నది తీరం ఉండటం తో  పుష్కలంగా నీరు,జియ్యమ్మవలస కోమరడా మండలలో అరటి , చెరకు ,లాంటి పంటలు ఉండటం తో వాటికి ఆహారం కూడా ఇబ్బంది లేకుండా ఉండటం తో ఈ ప్రాంతం విడి పోవటం లేదు,గతం లో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడుకు అది కార్యరూపం దాల్చలేదు,ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు,గాయాలు పాల అయిన వారికి,ప్రాణ నష్టం జరిగిన వారికి కలిపి సుమారు రెండు కోట్ల రూపాయలు వరకు నష్ట పరిహారం చెల్లించింది, ఒక వైపు ఫారెస్ట్ అధికారులు కష్టం మరో వైపు ప్రభుత్వం నష్ట పరిహారం రూపం లో చెల్లిస్తున్న కోట్ల రూపాయలు  వృధా అవుతున్నా శాశ్విత పరిష్కారం చుపలేకపోతున్నారు.

కురుపాం, పార్వతీపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అధికారులు కు నిరంతరం ఏనుగులు ను ట్రాక్ చేస్తున్న ఎలిఫెంట్ ట్రాకర్ లు కు కూడా చేతిలో బాంబులు పేలి గాయాలు పాల అయ్యారు,ఎవరో చనిపోతే ఆస్తి నష్టం జరిగి రైతులు రోడ్ ఎక్కితేనే ఈ విషయం పై ఒకరోజు చర్చ జరిగి తరవుతా వదిలేయడం కారణంగా ఇన్ని ఏళ్లుగా ఈ సమస్య కు పరిష్కారం కాలేదు,ఇప్పటికి అయిన ఫారెస్ట్ అధికారులు ,నాయకులు,శాశ్విత పరిష్కారం చూపాలని ప్రజలు,రైతులు కోటుతున్నారు.

 మూడు ఏనుగులు మృతి..

మనుషులు ప్రాణాలు, ఆస్తి నష్టం ఎంత ముఖ్యమో ముగ జీవులు ప్రాణాలు కాపాడటం కూడా మనకు అంతే ముఖ్యం,గతం లో ఒక ఏనుగు విద్యుత్ షాక్ తో మరో ఏనుగు నాగావళి నదిలో చిక్కుకొని మృతి ఛేధింది.మూడవ ఏనుగు అనారోగ్యంతో మృతి చెందింది.. దీనితో జంతు ప్రేమికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు,ముగ జీవులు కు ప్రజలు కు ఇరువులు కు ఇబ్బంది లేని ప్రదేశానికి వాటిని తరలించాలని కోరుతున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...