Followers

Showing posts with label HELP. Show all posts
Showing posts with label HELP. Show all posts

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

మహారాణి పేట, పెన్ పవర్

అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  గౌరవ చైర్మన్ ఆదేశాల మేరకు కరోనాతో చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చెకూరాలని గురువారం 6 మే ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మన జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు 50 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షురాలైన షేక్  మున్ని  సహయ సహకారాలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నేషనల్ జనరల్ సెక్రటరీ కేశవరావు  స్టేట్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షురాలు పిల్ల సత్యవతి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి.హెచ్. ఆదిలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లాయువజన విభాగం వైస్  ప్రెసిడెంట్ షేక్ గౌస్ లజం  తదితరులు పాల్గొన్నారు.


మానవత్వం చాటుకున్న తొర్రూరు పోలీసులు

 మానవత్వం చాటుకున్న తొర్రూరు పోలీసులు.

తొర్రూరు, పెన్ పవర్

తేదీ 21.04.2021న మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీకృష్ణ హాస్పిటల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన గుర్తుతెలియని వృద్ధురాలు చికిత్స పొందుతూ... మంగళవారం మృతి చెందింది.గుర్తుతెలియని వృద్ధురాలికి చెందిన వారు ఎవరూ రాకపోవడంతో మానవతా దృక్పథంతో  తొర్రూరు పోలీసులు,మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలతో అనాధ వృద్ధురాలికి అంత్య క్రియలు నిర్వహించినట్లు తొర్రూరు ఎస్ఐ సిహెచ్ నగేష్ తెలిపారు. ఎవరూ లేని అనాధ వృద్ధురాలికి రెండవ ఎస్ఐ మునిరుల్లా, కానిస్టేబుల్ సర్వార్ పాషా, హోంగార్డ్ రఫీయా లతో కలిసి పూలమాలవేసి, అంత్యక్రియలు నిర్వహించారు.

బాధిత కుటుంబానికి ట్రాస్మా చేయూత

 బాధిత కుటుంబానికి ట్రాస్మా చేయూత...

బోథ్, పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో గత శుక్రవారం కరెంట్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ దాసరి గంగయ్య ను మంగళవారం నాడు బోథ్ మండల ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ట్రాస్మా పరామర్శించి, సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా బాధితుడు తోటి సహాయ కరస్పాండెంట్ గంగయ్య కు మనోధైర్యం అందించారు. అలాగే 7000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు.కరోనా మహమ్మారి తో గత రెండు సంవత్సరాలుగా ప్రయివేటు పాఠశాలలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటి కి తోటి కరస్పాండెంట్ ను ఆపత్ కాల సమయంలో ఆదుకోవలనే సదుద్దేశంతో ఆర్థిక సహాయం చేయడం సంతోషం కలిగించందని బాధితుడు దాసరి గంగయ్య ట్రాస్మా సబ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండలంలోని అన్నిప్రయివేటు పాఠశాలల కరస్పాండెంట్ లు పాల్గొన్నారు.

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి

 ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి

జర్నలిస్టుల మరణాలను ఆపండి - టీయూడబ్ల్యూజే


 
పెన్ పవర్, మల్కాజిగిరి

జర్నలిస్టులను కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించి జర్నలిస్టులకు మనోధైర్యం, ఆర్థిక చేయూత అందించాల ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు ఒక ప్రకటనలో కోరారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి, రెండో దఫాల్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 55 మంది జర్నలిస్టులు కరోనాతో నేలకొరిగినట్లు వారు విచారం వ్యక్తం చేశారు. ఒక్క ఏప్రిల్ మాసంలోనే రాష్ట్రంలో వరుసగా 29 మంది జర్నలిస్టులు అకాల మరణం చెందినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా ప్రారంభం నుండి నేటివరకు 3,800 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినట్లు ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు వివరించారు. అయితే ఐసోలేషన్ లో ఉంటున్న కొందరికి మాత్రమే మీడియా అకాడమీ నుండి ఆర్థిక సహాయం అందుతున్నదని, ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకుంటున్న పలువురు బాధిత జర్నలిస్టులకు సహాయం అందించడంలో జాప్యం చేయడం సరైంది కాదన్నారు. అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు అందిస్తున్న 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన అప్పులకు కూడా సరిపోవడం లేదని శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శేఖర్, విరాహత్, శ్రీకాంత్ లు ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబాలకు ఇతర రాష్ట్రాల మాదిరిగా కనీసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. అలాగే పంజాబ్, పశ్చిమ బెంగాల్,  బీహార్, ఒరిస్సా తదితర రాష్ట్రాల మాదిరిగా వెంటనే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని, కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందించడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.

అనాధల పాలిట ఆత్మీయుడు....

అనాధల పాలిట ఆత్మీయుడు...

మహారాణి పేట, పెన్ పవర్

అనాధ వృద్ధులు కరోనా బారిన  పడకుండా ఉండేందుకు మాస్కులు, పండ్లు పంపిణీ మధ్యాహ్నం అన్నదానం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అనాధల పాలిట ఆత్మీయుడిగా నిలిచారు. అనాధల కోసం తరచూ అన్నదానం, వస్త్ర దానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.విశాఖ వన్టౌన్లో ఉన్న వివేకానంద అనాధ ఆశ్రమంలో ప్రముఖ సంఘ సేవకులు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రంగరాజు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు కరోనా బారిన పడకుండా  ఉండేందుకు పండ్లు,మాస్కులు అందజేశారు..మధ్యాహ్నం అన్నదానం చేశారు.అనాధ ఆశ్రయంలో ఆశ్రయం పొందుతున్న అనాధల కోసం ఆయన తరచూ ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.అనాధలను తన కుటుంబ సభ్యులుగానే భావిస్తూ కాసేపు వారితో సంతోషంగా గడుపుతారు అనాధలంతా ఆయనను  ఆత్మీయుడుగా భావిస్తూ ఆయన రాకకోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని,భౌతిక దూరం పాటించాలని పలు సూచనలు తెలిపారు.

దివీస్ ల్యాబ్ నుండిఆక్సిజన్ సిలిండర్లు సహాయం

 దివీస్ ల్యాబ్ నుండి ఆక్సిజన్ సిలిండర్లు సహాయం

విశాఖపట్నం, పెన్ పవర్

జిల్లాలో కోవిడ్ ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపడుతున్న వివిధ జాగ్రత్తలలో భాగంగా దివీస్ ల్యాబ్ నుండి వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కు,దివీస్ ల్యాబ్, జనరల్ మేనేజర్ కోటీశ్వరరావు సుమారు 80 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.సోమవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో అందించి,విశాఖ ఇండస్టియల్ గ్యాసెస్ నుండి వివిధ ఆసుపత్రులకు ఇప్పటికే 350 సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బలిటీ కింద ఈ ఆక్సిజన్ సిలిండర్లు ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు.దివీస్ ల్యాబ్ లేటరీ నుండి సి.ఎస్.ఆర్. మేనేజర్ డి. సురేష్ కుమార్, పి.అశోక్ మరియు సీనియర్ లైజన్ కన్సల్టెంట్  వరహాలరెడ్డి పాల్గొన్నారు.

బి.జె.పి యువమోర్చా ఆధ్వర్యంలో ఆహారం వితరణ

 బి.జె.పి యువమోర్చా  ఆధ్వర్యంలో  ఆహారం వితరణ

రాజమహేంద్రవరం, పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఈ కరోనా విపత్కర సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ మరియు బి.జె.వై.యం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ పార్టీ శ్రేణులకు,యువతకు సూచనలు అందించారు.బిజెవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందికొండ రమేష్ మాట్లాడుతూ ఈరోజు నుండి వారం రోజుల పాటు రోగుల సహాయకులకు ప్రతీ రోజు 200మందికి ఉదయం అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.అదేవిధంగా బిజెవైయం జిల్లా అధ్యక్షులు కందుకూరి మనోజ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ సెంటర్లు పరిశీలన జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కండవల్లి సాయి,డి. సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరో మధర్ తెరిస్సా.! సంధ్యా..రాణమ్మా.!

 మరో మధర్ తెరిస్సా.! సంధ్యా..రాణమ్మా.!

అడగనిదే అమ్మైన అన్నం పెట్టదు కానీ..

అడగకుండానే కరోనా బాధితులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది

పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి


రామగుండం , పెన్ పవర్ 

పాలకుర్తి మండలంలోని గుడిపల్లి మరియు కొత్తపల్లి గ్రామాలలో కోవిడ్ సోకి హోం క్వారెంటైన్ లో ఉన్న 30 మంది బాధితులకి వారు కరోనా మహామ్మారి నుండి త్వరగా కోలుకోవాలని వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొంది తిరిగి ఆరోగ్యవంతులు కావాలనే ధృఢ సంకల్పంతో మీకు అండగా నేనున్నాననే మంచి మనసుతో మధర్ తెరిస్సా వంటి సేవా భావంతో శనివారం నాడు పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి కరోనా పాజిటీవ్ వచ్చిన వారి ప్రతీ ఇంటింటికి తిరుగుతూ  వివిధ రకాలైన పండ్లు డ్రై-ఫ్రూట్స్ పంపిణీ చేసి కరోనా నివారణ కి పలు జాగ్రత్తలు తెలియజేస్తూ సూచనలు సలహాలు చెప్పి వారిలో మనో ధైర్యాన్ని నూరి పోసింది. ఇంకా ఈ కార్యక్రమంలో గుడిపెల్లి గ్రామ సర్పంచ్ కొప్పు రాజేషం, పొరండ్ల రాజిరెడ్డి, గ్రామ శాఖ అద్యక్షులు  ఊర వెంకటేష్, కొలిపాక శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్న పురపాలక సిబ్బంది

కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్న పురపాలక సిబ్బంది


తొర్రూరు, పెన్ పవర్ 

కరోనా మృతదేహానికి   అంత్యక్రియలు  నిర్వహించేందుకు రక్తసంబంధీకులు, బంధువులు ముందుకు రాకపోవడంతో తొర్రూరు మున్సిపల్ కమిషనర్ గుండె బాబు ఆదేశాల మేరకు. పురపాలక సిబ్బంది మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్నారు.శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో కరోనాతో బాధపడుతున్న 58 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించగా, దహన సంస్కారాలు చేయడానికి బంధువులు భయపడ్డారు.అలాంటి సమయంలో కూడా మృతుని బంధుమిత్రులు సాయం పట్టడానికి ముందుకు రాలేదు. నాలుగో వ్యక్తి ఎవరైనా వస్తారా అని అరగంట సేపు ఎదురుచూసినా ఫలితం లేదు. దీంతో పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది మృతదేహన్ని ప్యాకింగ్‌ చేసి, బయటకు తీసుకు రావడానికి వారికి గంటకు పైగా సమయం పట్టింది.పట్టణంలోని హరిపిరాల రోడ్డులోని స్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.కొవిడ్‌ మహమ్మారి బంధాలను చిదిమేస్తోంది. బతికి ఉన్నప్పుడు ఆలింగనం చేసుకున్నవారు, మరణించాక మృతదేహం వద్దకు వచ్చేందుకు కూడా సాహసించడం లేదు. కుటుంబ సభ్యులు మరణించినా అనవసరమైన అపోహలతో అంత్యక్రియలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఆత్మబంధువుల్లా మారి, మునిసిపాలిటీ సిబ్బంది చనిపోయిన వారి మతాచారాల ప్రకారం  అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు లు మాట్లాడుతూ... కరొనాతో మరణిస్తే బంధువులు భయపడుతున్నారని, తాము కూడా కొవిడ్‌ బారిన పడతామని ఆందోళన చెందుతున్నారన్నారు. మృతదేహానికి ప్యాకింగ్‌ చేసి, పీపీఈ కిట్లు ధరించి, అంత్యక్రియలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కొవిడ్‌తో మరణించిన వారి శరీరంలో కనిష్ఠంగా 3, గరిష్ఠంగా 6గంటలు మాత్రమే వైరస్‌ ఉంటుందన్నారు.ఆ తర్వాత మృతదేహంలో ఎలాంటి వైరస్‌ ఉండదని, మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అందరికీ ఆత్మీయతను పంచినవారు మరణిస్తే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబ సభ్యులు, బంధువుల బాధ్యత అన్నారు.కరోనాపై ప్రజల్లో అపోహలు దూరం చేసేందుకు ప్రయత్నించాలన్నారు.ఈ అంత్యక్రియల్లో ఆర్ఐ రాకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్  కొమ్ము దేవేందర్,వీఆర్ఏ రాంబాబు,తదితరులు ఉన్నారు.

బాలుడి వైద్య ఖర్చులు భరిస్తా - మైనంపల్లి రోహిత్

 బాలుడి వైద్య ఖర్చులు భరిస్తా - మైనంపల్లి రోహిత్

రామసాయి నైనిశ్ కు అండగా ఉంటా

మెరుగైన వైద్య సేవలు అందించాలి - రోహిత్

పెన్ పవర్, మల్కాజిగిరి

బాలుడు రామసాయి నైనిశ్(5) వైద్య ఖర్చులు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్టు భరిస్తుందని ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. శనివారం మౌలాలి ఎంజేకాలనీలో నివాసం ఉండే దనుంజయ్ శర్మ సాయి సిందూజ కొడుకు నైనిశ్ విద్యుత్ షాక్ కు గురైయి ఏఎస్ రావునగర్ అంకూర్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతు నైనిశ్ ను మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్ పరమార్శించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి బాలుడి చికిత్స కోసం ఆయ్యే వైద్య ఖర్చులను భరిస్తామని తెలిపారు. అసుపత్రిలో వైద్య ఖర్చులు మీరూ చెల్లించాల్సిన పనిలేదని అన్నారు. అసుపత్రి యజమాన్యంతో మాట్లాడి వైద్య ఖర్చులు మైనంపల్లి ట్రస్టు భరిస్తుందని తెలిపారు. బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించి ఇంటికి వచ్చే వరకు తన బాధ్యత అన్ని రోహిత్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్షి జీ.ఎన్.వి సతీష్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, ఎం.బాగ్యనందరావు, ఉపేందర్ రెడ్డి, సంతోష్ నాయుడు, మహేష్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీల దాహార్తిని తీర్చిన తాండూర్ సీఐ బాబు రావు

 ఆదివాసీల దాహార్తిని తీర్చిన తాండూర్ సీఐ బాబు రావు


తాండూర్, పెన్ పవర్

ఆదివాసీలకు అండగా నిలిచి వారి తాగునీటి సమస్య పరిష్కరించి మానవత్వం చాటుకున్న తాండూర్ సి.ఐ బాబు రావు సొంత ఖర్చులతో నీటి సమస్య పరిష్కారానికి కృషి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది: తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాబు రావు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది మంచిర్యాల తాండూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అబ్బాపూర్ గ్రామంలో తాగడానికి,ఇతర అవసరాలకు నీళ్లు లేకుండా,నీటి సమస్యతో బాధబపడుతూన్న విషయం ని ఆ గ్రామ ప్రజలందరు తాండూర్ సి.ఐ బాబు రావు దృష్టికి తీసుకెళ్లగా సి.ఐ  వెంటనే స్పందించి,నిన్న 30వ తేదీన, శుక్రవారం నాడు,అబ్బాపూర్ గ్రామాన్ని సందర్శించి,గ్రామ ప్రజలతో నీటి కొరత గురించి మాట్లాడి సమస్యను ఒక బాధ్యతగా తీసుకుని గ్రామానికి అర కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి లో పూడికను తీయించి సిఐ సొంత ఖర్చులతో మోటార్ కొనుగోలు చేసి ఆ బావి నుండి ఊరిలోకి పైప్ లైన్ వేయించి గ్రామ ప్రజల దాహన్ని తీర్చి సి.ఐ బాబు రావు  మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా సిఐ  మాట్లాడుతూ...పోలీసులు కేవలం కేసులను చేధించడమే పని కాకుండా,ప్రజల శ్రేయస్సు,వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ తరుపున ఎల్లప్పుడూ కృషి చేస్తామని ప్రజల రక్షణ మరియు శాంతియుత జీవనం గడిపేలాగా ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది అని సిఐ  తెలిపారు. త్రాగటానికి మరియు ఇతర అవసరాల నిమిత్తం అడగగానే వెంటనే స్పందించి నీటి సమస్యలు తీర్చడానికి ఎనలేని కృషి చేసిన సీఐ కి గ్రామస్తులు కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేశారు.

సింగరేణి లో రక్షణ చర్యలు తీసుకోవాలి

 సింగరేణి లో రక్షణ చర్యలు తీసుకోవాలి

టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో వినతి

బెల్లంపల్లి , పెన్  పవర్

 సింగరేణి వణికిస్తున్న తరుణంలో ఎండలు పెరుగుతున్న కారణంగా కరోనా కూడా విజృంభిస్తు కావున సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఇతర డిపార్ట్మెంట్లలో పని చేస్తున్నా కార్మికులకు వైరస్ సోకకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి ఆసుపత్రి పర్యవేక్షణా ధికారికి వినతిపత్రం అందజేశారు, అనంతరం ఉపాధ్యక్షులు మనిరామ్ సింగ్ మాట్లాడుతూ  శానిటైజర్లు మాస్కులు ఉచితంగా కార్మికులకు అందించాలని,కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా వైరస్ కార్మికులకు వ్యాధి వ్యాపించి నట్లయితే జాతీయ విపత్తు చట్టం 1897 ప్రకారంగా సింగరేణిలో కార్మికులకు వేతనాలు కట్టి ఇవ్వాలని అన్నారు కార్మికులు కరోనా బారినపడి చనిపోయినట్లు అయితే గని ప్రమాదంగా గుర్తించాలని, కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంతరం ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు అమానుల్లాఖాన్ ,దుర్గం రాజయ్య, బొల్లు మల్లయ్య, రియాజ్, తలారి రాజు, సుధాకర్, అశోక్, భూపతి, తదితరులు పాల్గొన్నారు

రూ10 లక్షలవిరాళం ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్

 రూ10 లక్షలవిరాళం  ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్ 
పెన్ పవర్, కందుకూరు

 కందుకూరు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు నాక్ ఏ గ్రేడ్ సాధన కొరకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు కాకినాడ కు చెందిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిట్ వారి  కరేడు కు దగ్గర అలగాయపాలెం వద్ద ఉన్న హ్యాచరి మేనేజంగ్ డైరక్టర్   కార్తూరి సత్యన్నారాయణ మూర్తి ఆదేశాల మేరకు సేల్స్ మేనేజర్ సురేంద్ర కుమార్, హ్యాచరి మేనేజర్ ఎ. నాగేశ్వరావు లు శాసన సభ్యులు మహీధర్ రెడ్డి సమక్షంలో పదిలక్షల రూపాయలు కళాశాల అభివృద్ధి కోసం విరాళం ప్రకటించారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు మహీధర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు, నాక్ ఎ గ్రేడ్ సాధించేందుకు  దాతల సహాయ సహకారం తో కళాశాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 

మన ప్రాంతం కానివారప్పటికి మన కళాశాల అభివృద్ధి కి,  పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకరిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.నాక్  సాధన సమితి సభ్యులు శీలం సుధీర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకోని వారు, ఈ ప్రాంతం వారు కాని వారు స్పందిస్తున్న తీరు చాలా సంతోషమని, అదేవిధంగాఈ కళాశాలలో చదువుకున్న వారు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అయితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు.అనంతరం దాతల తరుపున వచ్చినవారికి శాసనసభ్యులు మహీధర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం రవి కుమార్, నాక్ సాధన కమిటీ సభ్యులు శీలం సుధీర్, మంచిరాజు మురళి పాల్గొన్నారు.

రెండు కోటాల ఉచిత బియ్యం పంపిణీ

రెండు కోటాల ఉచిత బియ్యం పంపిణీ

తవణంపల్లి, పెన్ పవర్

తవణంపల్లె  మండల   కేంద్రం తాసిల్దార్ కార్యాలయం నందు వీఆర్వోలు సమావేశం జరిగింది ఈ సందర్భంగా శుక్రవారం తాసిల్దార్ హనుమంతు మాట్లాడుతూ నేడు 2 కోటాలు 10 కేజీలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని చక్కెర కందిపప్పు కు ఖరీదు చెల్లించాలని తెలియజేశారు వీఆర్వో లు దగ్గరుండి ఉదయం 6 గంటలకు డీలర్ల వద్ద నుండి బియ్యం ట్రక్కుల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ పద్ధతులు పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకటరమణ . విఆర్వో లు పాల్గొన్నారు.

జుత్తాడ బాధిత కుటుంబాలకు 12లక్షల చెక్కును అందజేసిన విజయసాయి రెడ్డి

జుత్తాడ బాధిత కుటుంబాలకు 12లక్షల చెక్కును అందజేసిన విజయసాయి రెడ్డి

విశాఖ తూర్పు, పెన్ పవర్

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వైకాపా జాతీయ కార్యదర్శి,వైకాపా రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. పెందుర్తి మండలం జుత్తాడ హత్యాకాండలో బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరుపున  మృతులు ఒక్కొక్కరికి 2 లక్షలు చొప్పున మొత్తం 12 లక్షల చెక్కును శివజీపాలెం లోని బాధిత కుటుంబ సభ్యుల నివాసంలో  శుక్రవారం ఉదయం అందజేశారు.

 అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఏ1( అప్పలరాజు)ని ఇప్పటికీ పోలీస్ కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. ఏ2 (బత్తిన శ్రీను) హోమ్ గార్డును విధులు నుండి తొలగించి విచారణ  చేపడుతున్నట్లు తెలిపారు. ఏ3, ఏ4 లను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలకు త్వరిత గతిన న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో నగర మేయర్ గోలగాని వెంకట హరి కుమారి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, నగర వైకాపా పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సహయ కార్యక్రమాలు

 స్వచ్ఛత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సహయ కార్యక్రమాలు

ఎలమంచిలి, పెన్ పవర్

లమంచిలి నెహ్రూ నగర్, ద్వారకా నగర్ యువకులు స్వచ్ఛత ఆర్గనైజేషన్ స్థాపించి ఉన్నారు. దీని ద్వారా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు అనగా శుక్రవారం ఎలమంచిలి ఎన్జీవో హోం నందు 20 మందికి దివ్యాంగులు,వృద్ధులు మరియు పేదవారికి మూడు చక్రాల సైకిల్,బియ్యం, దుప్పట్లు మరియు పళ్ళు,మాస్కులు,శానిటైజర్, పెద్దల చేతుల మీద పంచడం జరిగింది.గాంధీజీ,మదర్ తెరిస్సా పటాలకు పూలమాల వేసి కార్యక్రమం మొదలు పెట్టి ఉన్నారు.

మొదటగా చార్టెడ్ అకౌంట్ బంగారు శెట్టి, వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి బోదె పు గోవింద్, స్వచ్ఛత ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గోకివాడ శ్రీను,సెక్రెటరీ కొత్తలంక రాజేష్, మరియు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎస్కే అబ్దుల్లా మాస్టర్,సంఘ వ్యవస్థాపకులు కొత్తలంక ప్రసాద్ బాబు,13 వ వార్డు కౌన్సిలర్ గుప్తా,మరియు టి టి అప్పారావు,వెలుపల శేఖర్ బాబు, మనం మనం చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గోపి, సెక్రటరీ సురేష్,25 వ వార్డు కౌన్సిలర్ సంతోష్, అలాగే స్వచ్ఛత  ఆర్గనైజేషన్ సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శానిటైజర్స్, మాస్కులు, పంపిణీ చేసిన మళ్ళ సురేంద్ర

 శానిటైజర్స్, మాస్కులు, పంపిణీ చేసిన మళ్ళ సురేంద్ర 

అనకాపల్లి, పెన్ పవర్

పట్టణంలోని స్థానిక వన్ వే ట్రాఫిక్ జంక్షన్ డౌన్లో   నెయ్యాల వీధిలో మరియు ఎన్టీఆర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రామానాయుడు కాలనీలలో  పేద కుటుంబాలకు తెలుగుదేశంపార్టీ విశాఖజిల్లా ఉపాధ్యక్షులు మళ్ళ సురేంద్ర ధన సహాయంతో అందరికీ శానిటైజర్స్, మాస్కులు,పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ మనం కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు కరోనా కష్టాల్లో ఉన్నారని ఇటువంటి సమయంలో మనం ధైర్యంగా ఉంటూ వారికి ధైర్యం చెబుతూ  అవకాశం ఉన్నంత వరకు అందుబాటులో ఉంటూ వీలైనంత సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు.

ప్రజలు కూడా కరోనా నుండి రక్షణ కొరకు ఇళ్లలోనే ఉంటేనే ఈ కరోనా విలయతాండవాన్ని నివారించవచ్చు అని ప్రజలను కోరారు.అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలి అని అదికూడా మాస్క్,శానిటైజర్ తప్పకుండా వాడాలి అని కోరారు.45 దాటిన అందరూ కూడా భయపడకుండా వేక్సిన్ వేయించుకోవాలి అని పిలుపునిచ్చారు.వేక్సిన్ ఒక్కటే నివారణ అని తెలియ జేశారు.  ఈ కార్యక్రమంలో యల్లపు శ్రీనివాసరావు, వేగి కృష్ణ,అనకాపల్లి రాము,ఎండకుర్తి అప్పలరాజు,అనకాపల్లి శేఖర్,అనకాపల్లి మోహన్,తిప్పన అప్పారావు,బుద్ధ జోగినాయుడు,మోనో శ్రీను,జొన్నాడ సురేష్, ఎస్, భాను చందర్ అఖి మరియు తదితరులు పాల్గొన్నారు. 

అమరులైన జర్నలిస్టుల కు జోహార్లు...జోహార్లు.....

 అమరులైన జర్నలిస్టుల కు జోహార్లు...జోహార్లు.....

అమరులైన జర్నలిస్ట్ కుటుంబాలకు 

50 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి

కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.


 ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

 తెలంగాణ రాష్ట్రం లో కరోనా మహామ్మారీ వలన ఇప్పటివరకు   17 మంది జర్నలిస్టులు  మృత్యువాత పడి అమరులయ్యారనీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన  జర్నలిస్టులు గురువారం సాయంత్రం 7-00 గంటల సమయంలో   పెధ్ధ ఎత్తున కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు..వారికి నివాళులర్పించారు.   ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బండారి పాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమరులైన 17 మంది జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అదే విధంగా మరణించిన జర్నలిస్టు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు అదేవిధంగా అదేవిధంగా మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు జర్నలిస్టులు అమరులైన జర్నలిస్టులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అనంతరం నివాళులు అర్పించారు ఈ ర్యాలీలో జర్నలిస్టులు బండారి బాల్ రెడ్డి .ఓగ్గు బాలరాజు యాదవ్ .శ్రీ రామోజు దేవరాజు.కూలేరీ దీప్తి కిషోర్ బాబు విజయ్.మారేపు  భూశంకర్ కొండ్లేపు జగదీష్. . కూలేరీ కిషోర్.  దుర్గం విజయ్. బురుక బాబ్జి . కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ దోమ్మాటి నరసయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు.శేఖ్ గౌస్ .బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మద్దుల బుగ్గా రెడ్డి  పారి పెల్లి సంజీవరెడ్డి రామిండ్ల జయపాలా. ఆటో యూనియన్ మల్లయ్య. నీజామ్. పంతంగి పర్షరాములు. ర్యాలీలో పాల్గొని నివాళులు అర్పించారు.

కోవిడ్ వారియర్స్ కు, బాధిత కుటుంబ సభ్యులకు డాక్టర్ ఆకుల భోజనం ఏర్పాట్లు

కోవిడ్ వారియర్స్ కు, బాధిత కుటుంబ సభ్యులకు డాక్టర్ ఆకుల భోజనం ఏర్పాట్లు

రాజమండ్రి, పెన్ పవర్

రాజమండ్రి- నగర వైసీపీ కో ఆర్డినేటర్ ,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమండ్రి- ప్రభుత్వాస్పత్రి లో కోవిడ్ వారియర్స్ కు, కోవిడ్ బాధిత కుటుంబసభ్యులకు భోజనం పంపిణీ ప్రారంభించారు. ఐదొందలకు మందికి సరిపడా విజిటబుల్ బిర్యాని, ఒక కర్రితో పేకింగ్ బాక్స్ లలో అందజేశారు. గురువారం మధ్యాహ్నం రాజమండ్రి- ప్రభుత్వాస్పత్రి లో  జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రమేష్ కిషోర్ చేతులు మీదుగా విజిటబుల్ బిర్యానీ బాక్స్ లు పంపిణీ ప్రారంభించారు. 

కోవిడ్ సమయంలో అవసరమైనన్నీ రోజులు భోజన పంపిణీ చేయడానికి డాక్టర్ ఆకుల సత్యనారాయణ సంకల్పించారు. కోవిడ్ రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కొంతమంది వారి బంధువులు ఆస్పత్రి ఆరుబయట  నిరీక్షిస్తున్నారని, అలాగే నిరంతరం గా  వైద్యసేవలు అందిస్తున్న సిబ్బంది పడుతున్న ఇబ్బందుల నేపధ్యంలో భోజనం సరఫరా చేయాలని ఆకుల నిర్ణయించారు. ఇందుకోసం వంటలు చేయడానికి  ప్రత్యేకంగా వంటశాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఆకుల సత్యనారాయణ, వైసీపీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, వైసీపీ నాయకులు ఉమామహేశ్వరి,అడపా అనిల్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న ఆటోడ్రైవర్ కు ఆర్ధిక సహయం

 రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న ఆటోడ్రైవర్ కు ఆర్ధిక సహయం

అపదలో అదుకున్న ఎం.ఎస్.ఎస్.ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్

పెన్ పవర్,  మల్కాజిగిరి

దూలపల్లి అయప్ప కాలనీకి చెందిన సాయికుమార్ ఆటోడ్రైవర్ గత 10 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒక కాళ్లు పోగొట్టుకున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయన్ని తెలుసుకున్న ఎం.ఎస్.ఎస్.ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో సాయికుమార్ కుటుంబానికి ఆర్ధిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా ఎం.ఎస్.ఎస్.ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ సాయికుమార్ రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్ని ఇద్దరి పిల్లలతో ఇబ్బందులు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకుని సాయికుమార్ కుటుంబానికి ఆర్ధిక సహయం అందించామని, ఇద్దరి పిల్లలకు ఎం.ఎస్.ఎస్.ఓ సంస్థ ద్వారా తనే చదివిస్తామని హామి ఇచ్చారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...