Followers
ముమ్మరంగా వరి నాట్లు
కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి
భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి
అనకాపల్లి,పెన్ పవర్
ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు
ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు
సామర్లకోట, పెన్ పవర్
లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి
లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి
ఏలేశ్వరం,పెన్ పవర్
రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మేధావులు హితవు పలుకుతున్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండలాల వారిగా లాక్ డౌన్ విధించే అధికారం స్థానిక అధికారులకు ఇచ్చారు. ఈ మేరకు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక అధికారులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసరాలు, కూరగాయలు తదితర ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ఉదయం ఒక్కసారి గా ప్రజలు తమ వాహనాలను వేసుకుని మార్కెట్లకు , ఇతర అవసరాలకు రోడ్లపైకి రావాల్సిన అవసరం వస్తున్నది. దీంతో వ్యాపార సమూహాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడి సామాజిక దూరం పాటించే పరిస్థితు లకు భంగం కలుగుతుంది. గంటల తరబడి రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలను రెట్టింపు చేస్తున్నట్లు అవుతుంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్ నిబంధనలపై పునః సమీక్ష చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6:00 వరకు వ్యాపార సంస్థలు నిర్వహించుకునే లా, ప్రజలు సామాజిక దూరం పాటించేలా వ్యాపార సంస్థల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేధావుల అభిప్రాయం.ఏలేశ్వరం మెయిన్ రోడ్ లో సోమవారం ఉదయం 10 గంటలకు ట్రాఫిక్ రద్దీ, షాపుల వద్ద నిరీక్షిస్తున్న జన సమూహాలు
పరిశుభ్రత వార్షికోత్సవం
పరిశుభ్రత వార్షికోత్సవం
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురం మండలం పేరవరం లో లో లో పరిశుభ్రతా పక్షోత్సవాలలో భాగంగా సోమవారం పైలట్ పంచాయతీలైన పేరవరం,బొబ్బర్లంక గ్రామాలలో ఎంపీడీఒ నాతి బుజ్జి ఆద్వర్యంలో పరిశుభ్రత కమిటీ సభ్యులు , టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు, సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లతో కలిసి గ్రామ సందర్శ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఘన,ద్రవవ్యర్ధాల నిర్వహణ,-త్రాగునీటి సరఫరా, పైప్ లైన్ లీకేజ్ లు, వ్యక్తిగత మరుగుదొడ్లు మరియు కమ్యూనిటీ మరుగు దొడ్లు వాడకం, బహిరంగ మల విసర్జన లేకుండా అవగాహన కల్పించడం, డ్రైన్లు శుభ్రం చేయడం- SWPC షెడ్ నిర్వహణ ,
అంటువ్యాధులు ,ఇతర ఆరోగ్య సంబంధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి , పంచాయతీ సిబ్బందికి తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్ , కార్యదర్శులు శివరామకృష్ణ, హనుమ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకాంత్, బొబ్బర్లంక మాజీ ఎంపీటీసి సల్లపూడి క్రీస్తమ్మ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
మనం మన పరిశుభ్రత
మనం మన పరిశుభ్రత
పెద్దాపురం పెన్ పవర్
కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు
కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు
క్వారంటైన్ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు
ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు డిమాండ్
పెద్దాపురం,పెన్ పవర్
కోవిడ్ వైద్య సేవలు మెరుగు
కోవిడ్ వైద్య సేవలు మెరుగు పర్చాలంటూ సి పి ఎం ధర్నా
సామర్లకోట, ,పెన్ పవర్
కరోనా పట్లప్రజలు మరింతఅప్రమత్తం
కరోనా పట్లప్రజలు మరింతఅప్రమత్తంగా ఉండాలి
సొంత నిధులతో గ్రామ ప్రజలకు మాస్కులు శానిటైజర్లు. పి.పి.ఈ కిట్టు పంపిణీ
పంచాయతీ సెక్రటరీ పద్మరాజ
పెద్దాపురం,పెన్ పవర్
సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా
సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా
వారం రోజులు దాటినా విడుదల కాని రిపోర్టులు పరీక్షలు చేయించుకున్న వారిలో తీవ్ర ఆందోళన...
సామర్లకోట,,పెన్ పవర్
సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారి
ప్రభుత్వ కార్యాలయాల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారి.
గోకవరం పెన్ పవర్
కరోనా ను జయప్రదం సి డి ఆవిష్కరణ
కరోనా ను జయప్రదం సి డి ఆవిష్కరణ
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురం మండలం ర్యాలీ లో నిర్వహించిన ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక మ్యాజిక్ ఫ్యామిలీ శ్యామ్ జాదూగర్ కరోనా పై రూపొందించిన కరోనా ను జయుద్దాం అనే వీడియో సిడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ జాదూగర్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న వేళ మనం కరోనా తో సహజీవనం చేయవలసి ఉన్నకారణంగా దీని బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిలోనూ మనో బలం, శారీరక బలం, వినోద బలం లను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఈ సీడీలో వివరించడం జరిగిందని వీటిని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజలలో అవగాహన పెంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు మోహిత్, అన్నపూర్ణ, రుషిత్ లు పాల్గొన్నారు.
డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి
డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అబ్దుల్ కలాం నివాళి కలలు కనండి_ వాటిని సాకారం చేసుకోండి అనే మాటను పది మందికి చెప్పడమే కాదు తాను కూడా ఆచరించి, జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహనీయుడు.. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం అనీ, ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉండాలన్న సందేశాన్ని చేతల్లో చూపిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తరం గొప్ప వ్యక్తి మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం అంటూ ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి కొనియాడారు. జూలై-27 సోమవారం డా.అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పులమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వరప్రసాద రావు, పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారిణి సుగుణ, కార్యదర్శి గంగూలీ, సమీర్ , ఏపీఎం సునీత తదితరులు పాల్గొన్నారు.
చేసిన వారిపై చర్య
దళిత యువకునికి శిరోముండనం చేసిన వారిపై చర్య తీసుకోండి
గోకవరం పెన్ పవర్
రాజుపేటలో నూతన గ్రామ సచివాలయం
రాజుపేటలో నూతన గ్రామ సచివాలయం నిర్మాణం
వీ.ఆర్.పురం. పెన్ పవర్
జైభీమ్ విద్యపౌన్ డేషన్ అవార్డు
జైభీమ్ విద్యపౌన్ డేషన్ అవార్డు
రాజమండ్రి రూరల్ , పెన్ పవర్
రెండోసారి గింటి
రెండోసారి గింటి
తూర్పు గోదావరి,పెన్ పవర్
గొప్పవ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు
గొప్పవ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు
.పిట్టా నాగమణి
అన్నవరం , పెన్ పవర్ ప్రతినిధి
రెండవరోజున బంద్
రెండవరోజున బంద్ విజయవంతం
- కరోనా కారణంగా ముంపు మండలాల్లో ఐదు రోజులు బంద్
వి.ఆర్.పురం. పెన్ పవర్
వినయ విధేయ పవన్
వినయ.. విధేయ.. పవన్
అందరి మన్ననలు అందుకుంటున్న హెల్త్ అసిస్టెంట్
కరోనా విపత్కరి పరిస్థితిలో ప్రజలకు అండగా సేవలు
పేదలకు తన వంతు ఆర్ధిక సహాయం
గోకవరం ,పెన్ పవర్
బ్యాంకుల పని వేళలు మార్పు
బ్యాంకుల పని వేళలు మార్పు
అనకాపల్లి , పెన్ పవర్
స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంచొద్దు
స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంచొద్దు
అనకాపల్లి , పెన్ పవర్
లాల్ సలామ్
లాల్ సలామ్
నేటి నుంచే మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు
మన్యాన్ని జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు
చింతపల్లి, పెన్ పవర్
జజ్జనకరి జనారే డప్పుల దరువులు... ఉత్తేజపరిచే ఎర్రదండు విప్లవ గీతాలు... తుపాకీ నీడన అమర వీరులకు అర్పించే జోహార్లు... చైతన్యం నింపే ప్రసంగాలు... ఇవీ ఎరుపెక్కిన మన్యంలో వారం రోజులపాటు మావోయిస్టులు నిర్వహించే వారోత్సవాల విషయాలు...
ప్రతీ ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీలో పని చేసి అసువులు బాసిన వారి పేరుతో నాటి సి పి ఐ (ఎంఎల్) నేటి మావోయిజం, నక్సల్బరీ పితామహుడు చారు మజుందార్ మృతి చెందిన తేదీని స్మరిస్తూ వారోత్సవాలు నిర్వహిస్తారు. నక్సల్బరీ చావలేదు... దానికి చావు లేదంటూ నాటి నక్సల్స్ నుంచి నేడు పేరు మార్చుకున్న మావోయిస్టుల వరకు అదే నినాదంతో పోరాటాలు చేస్తూ వస్తున్నారు. పోలీస్ వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ స్థూపాలు నిర్మించి ఎర్ర జెండాల రెపరెపల మధ్య 1972 జూలై 28 నుంచి నేటి వరకు ఆ వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తూ వస్తున్నారు. మావోయిజానికి చావు లేదనే నినాదాన్ని పాటిస్తూ ఈ సమయంలోనే కొత్తవారిని దళంలో చేర్చుకొని శిక్షణ ఇస్తారు. ఈ సమయంలోనే యాక్షన్ టీంలు రంగ ప్రవేశం చేస్తాయి. పోలీసులను పక్కదోవ పట్టించి మరీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారు.గాలింపు చర్యలు జరుగుతున్న ప్రాంతాల్లోనే మృతిచెందిన మావోయిస్టులకు స్థూపాలు (తాత్కాలికంగా) నిర్మిస్తారు. మారుమూల గ్రామాల్లో యువతను చైతన్య పరచి సమావేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. వారోత్సవాలు మరింత ఉత్సాహంగా సాగడానికి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఏవోబీ లోని దళ సభ్యులు కూడా పాల్గొంటారు.ఈ దఫా ఏవోబీ, విశాఖ ఏజెన్సీలోని వారోత్సవాలకు కేంద్ర కమిటీ మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ రామకృష్ణ( ఆర్ కె), ఏవోబీ కార్యదర్శి చలపతి, అరుణ, ఉదయ్, జగన్ వంటి నాయకులు హాజరై ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 22 న, జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్ కె తప్పించుకోగా చలపతి, అరుణ గాయపడినట్లు తెలిసింది. వారు విడిచి వెళ్ళిన రైఫైల్,కిట్ బ్యాగులు పోలీసులు గుర్తించి, స్వాధీనపరుచుకున్నారు.25న, జరిగిన ఎదురు కాల్పుల్లో ముఖ్య మావోయిస్టు నాయకులు తప్పించుకోగా ఒక మావోయిస్టు మృతి చెందాడు.మావోయిస్టులు జరిపే ఈ వారోత్సవాల వలన వారం రోజుల పాటు గిరిజన ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఏజెన్సీ ప్రాంతంలోని పలువురు రాజకీయ నాయకులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు.లాల్ సలాం అంటూ సిపిఐ మావోయిస్టు జరిపే కార్యక్రమాలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వారం, పది రోజుల పాటు భయానక వాతావరణంలో గడపవలసిందేనని ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం
విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం.
విశాఖపట్నం,పెన్ పవర్
కరోనా పరీక్ష కేంద్రాలు
ఏజెన్సీ 11 మండలాల్లో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్య పడాల్.
చింతపల్లి , పెన్ పవర్
దళ సభ్యుల ప్రాణాలు బలి
అభివృద్ధి నిరోధకులు మావోయిస్టు లు
అగ్ర నాయకుల ప్రాణాలకు దళ సభ్యుల ప్రాణాలు బలి
ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు
చింతపల్లి, పెన్ పవర్
మూడువేల లీటర్ల సారా
మూడువేల లీటర్ల సారా పులుపు ద్వంసం
పాయకరావుపేట,పెన్ పవర్
హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ
కరోనా పై పరవాడ జనసైనికుల పోరాటం.
స్వయంగా వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ.
పరవాడ, పెన్ పవర్
పరవాడ : కరోనా పై పోరాటానికి పరవాడ జనసైనికులు నడుం బిగించారు. స్వయంగా జనసైనికులు భుజాలకు హైపో క్లోరైడ్ ద్రావణ డబ్బాలను తగిలించుకొని గ్రామ పురవీధుల్లో ఆదివారం ఉదయం పిచికారి చేసి గ్రామస్తులు చేత శభాష్ అనిపించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ మాత్రం భయపడకుండా గ్రామ పురవీధుల్లో క్రిమిసంహారక మందును స్వయంగా స్ప్రే చేయడంపై పలువురు జనసైనికుల పై ప్రశంసల కురిపిస్తున్నారు. పరవాడ గ్రామంలో జనసైనికులు శెట్టి బలిజ, రజక వీధి, సిరిపురపు వారి వీధి, చుక్క వారి వీధి, శివాలయం రోడ్డు చేలల్లో ఇళ్లలు, ముస్లిం వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ పిచికారి చేసారు. ఈ కార్యక్రమంలో చుక్కా నాగు, కరెడ్ల అభిరామ్, వడిసెల రాము సన్నాఫ్ బంగారు బాబు, మెకానిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఫార్మా నిర్వాసిత గ్రామాల్ని తరలించండి
ఫార్మా నిర్వాసిత గ్రామాల్ని తరలించండి
పెందుర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బొద్ధపు వెంకటరమణ
పరవాడ పెన్ పవర్
ఘనంగా సీ ఆర్పీ ఎప్ ఆవిర్బావ దినోత్సవం
విశాఖలో సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది.మదురవడా సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు.సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తూ అత్యు న్నత స్థాయిలో సీఆర్పీఎఫ్ పాలమిలాటరీ ఫోర్స్ తరహాలో సేవలను అందిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ సీఆర్పీఎఫ్ .. విపత్కర పరిస్థితుల్లో, రక్షణ పరంగా అండగా నిలుస్తూ భద్రతను కల్పిస్తుంది.82వ ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన అధికారులకు సీఆర్పీఎఫ్ అధికారులు ఘన నివాళి అర్పించారు.
జిల్లాలో బ్యాంకులు1గంట వరకే
జిల్లాలో బ్యాంకులు1గంట వరకే పనిచేస్తాయ్..
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్
విశాఖపట్నం, పెన్ పవర్
మావోయిస్టులు మృతి
ఏవోబీలో పోలీసులు మావోల మధ్య ఎదురుకాల్పులు.
మావోయిస్టులు మృతి. మృతుడు జి.మాడుగుల వాసి.
మల్కన్ గిరి జిల్లా గుజ్జేడు అటవీ ప్రాంతంలో కాల్పులు.
విశాఖపట్నం, పెన్ పవర్
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎదురు కాల్పులు జరిగిన సంఘటనలో మావోలు విడిచిన 3 కిట్ బ్యాగులు 303 రైఫిల్ మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 28నించి ఆగస్టు3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి. మావోల ప్లీనరీ చెదించడానికి విశాఖ గ్రేహౌండ్స్ ఒడిశా ఎస్ వో జి బలగాలు శనివారం సాయంత్రం మల్కనగిరి జిల్లా గుజ్జేరు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు తలెత్తాయి. మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య భీకర తుపాకీల పోరు జరిగింది. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. రాత్రి కావడంతో మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టు జి. మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన దయాగా పోలీసులు గుర్తించారు. 2016 లో జరిగిన రామ్ గూడా ఎన్కౌంటర్లో మృతి చెందిన పాంగి దోసో సోదరుడు దయా. అక్క మృతిచెందడంతో మావోయిస్టుల్లో చేరాడు. ఈ పది రోజుల్లో ఏవోబీ పరిధిలో నాలుగు దఫాలు ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ చల పతి అగ్రనేత ఆర్ కె తప్పించుకున్న విషయం తెలిసిందే. రెండు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు. పోలీసులు మావోయిస్టు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎదురు కాల్పులకు తెగబడుతున్నారు.
విస్తృతంగా టెస్ట్ లు
కరోనా నివారణకు విస్తృతంగా టెస్ట్ లు నిర్వహించాలి
సీపీఎం మండల కన్వీనర్ పి.మాణిక్యం
పరవాడ ,పెన్ పవర్
ఫ్లైఓవర్ పై వాహనాలు రాకపోకలు
నేటి నుంచి ఎయిర్ పోర్ట్ విశాఖ సిటీల మధ్య
ఫ్లైఓవర్ పై వాహనాలు రాకపోకలు
మంత్రి బొత్స
విశాఖపట్నం, పెన్ పవర్
ఎయిర్ పోర్ట్ విశాఖ సిటీ మధ్య ఫ్లై ఓవర్ పై మంగళ వారం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయనతోపాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ ఎంపీ సత్యనారాయణలు ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో అధికారులకు తగిన సూచనలు చేశారు. విశాఖ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంమధ్యలో ఫ్లైఓవర్ పైనుంచి వాహనాలు నడుపు కోవచ్చని ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశించారు. మర్రిపాలం నుంచి గోపాలపట్నం మధ్యలో ఫ్లైఓవర్ ను ఆగస్టు 15 నా ప్రారంభిస్తామన్నారు. పనులు కొద్దిగా మిగిలి ఉండడంతో వాటిని పూర్తి చేసి ఆరోజున దానాలు రాకపోకలు అనుమతిస్తున్నారు. ఎంతో కాలంగా విశాఖ వాసులను వెంటాడుతున్న ట్రాఫిక్ జామ్ సమస్య నేటితో తీరిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో అతిపెద్ద ట్రాఫిక్ సమస్య ఎన్ఏడి కొత్త రోడ్ వద్దనే అని అది నేటితో తీరిపోతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరం అయినా చోట్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి లను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. మంత్రులతోపాటు అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గుట్టు రట్టు
సృష్టి ఆసుపత్రి కేంద్రంగా వెలుగుచూసిన పసిపిల విక్రయ రాకెట్
గుట్టు రట్టు చేసిన నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా.
ఆస్పత్రి ఎం డి తో ఎనిమిది మంది అరెస్ట్.
పిల్లల సేకరణలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం.
విశాఖపట్నం ,పెన్ పవర్
విశాఖ నగరంలో సృష్టి ఆస్పత్రి కేంద్రంగా జరుగుతున్న పసిపిల్లల విక్రయ రాకెట్ను పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా ఆదివారం విలేకరుల సమావేశంలో సృష్టి హాస్పత్రి లో పసిపిల్లల అమ్మకాల గుట్టు రట్టు చేశారు. ప్రధాన ముద్దాయిగా సృష్టి ఆస్పత్రి ఎండి పచ్చిపాల నమ్రత ఇద్దరు ఆశా వర్కర్ లు (ఏ 2ఏ 3) కోడి వెంకటలక్ష్మి బొట్టు అన్నపూర్ణ ఏ4గా ఏజెంట్ ఆర్ డి రామకృష్ణ ఏ 5 డాక్టర్ తిరుమల ఏ6 లోపింటి చం గూగుల్ద్రమోహన్ ఏ7ఏ 8 లుగా పిల్లాడ్ని కొనుగోలు చేసిన పశ్చిమ బెంగాల్ కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని సి పి ఆర్కె మీనా వివరించారు.వైల్డ్ లైవ్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీస్ కమిషనర్ చాకచక్యంగా వ్యవహరించి పసిపిల్లల విక్రయ రాకెట్ను చేధించారు. వివరాల్లోకి వెళితే మాడుగుల మండల కేంద్రం కనికర మాత కాలనీకి చెందిన ఒక వీడో అవాంఛిత గర్భం ధరించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఆశ కార్యకర్త బొట్ట అన్నపూర్ణ చీడికాడ మండలం అర్జునగిరి ఆశ కార్యకర్త కోడి వెంకటలక్ష్మికి తెలిపింది. గర్భవతిని ఏజెంట్ రామకృష్ణ ద్వారా సృష్టి ఆస్పత్రి తీసుకువెళ్లారు. ఉచితంగా డెలివరీ చేయడం బిడ్డకు కొంత డబ్బు ఇస్తామని చెప్పడంతో ఆమె అంగీకరించింది. వైద్యుల సూచన మేరకు గర్భిణీ ని ఆశా వెంకటలక్ష్మి డెలివరీ వరకు తన వద్ద ఉంచుకొని సాకంది.సుందరమ్మకు మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్ కు చెందిన వారికి అమ్మేసారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన సుందరము కార్యకర్త ఆరా తీసింది. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలియజేయడంతో డొంక కదిలింది.చైల్డ్ లైవ్ సంస్థ పోలీసులకు తెలియజేయడంతో విచారణ మొదలైంది. విశాఖ జిల్లా పరిషత్ పరిధిలో యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండి పచ్చిపాల నమ్రత విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఒడిశా ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తు అక్కడి ఆశా వర్కర్ లను ఆకర్షిస్తుంటారు.ఆ ప్రాంతాల్లో పేద గర్భిణీలు అవాంఛిత గర్భిణీలు టార్గెట్ చేస్తున్నారు. ఆ శాల ఆధ్వర్యంలో వారికి డబ్బు ఎర చూపుతున్నారు. ఆశాలు దళారీల ఒత్తిడితో పసిపిల్లల సేకరణ పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
ఘన స్వాగతం పలికిన సిబ్బంది
అనారోగ్యం నుండి కోలుకుని విధులకు హాజరవుతున్న
ఎస్సై శ్రీనివాసరావు కి ఘన స్వాగతం పలికిన సిబ్బంది గ్రామస్థులు
మునగపాక పెన్ పవర్
రు"3.26లక్షల ఆర్థిక సహాయం
ఉద్దేశ్ వైద్యానికి భరణికం హెల్పింగ్ హాండ్స్ బృందం అందించిన ఆర్ధిక సహాయం
రు"3.26లక్షల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేత.
పరవాడ పెన్ పవర్
ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు లో ఎదురుకాల్పులు
ఆ
ంధ్రా ఒడిస్సా సరిహద్దు లో ఎదురుకాల్పులు
మావోయిస్టు మృతి
చింతపల్లి , పెన్ పవర్
ఆంధ్రా ఒడిస్సా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు బలగాలకు, మావోయిస్టులకు శనివారం సాయంత్రం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఒడిస్సా రాష్ట్రం, మల్కన్ గిరి జిల్లా, చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధి, విశాఖ జిల్లా, జి.మాడుగుల మండలం,గజ్జెడు అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల సంఘటనలో జి.మాడుగుల మండలం, వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి పేతురు అలియాస్ దయ (23) మృతిచెందాడు. ఈ ఎదురుకాల్పుల సంఘటనలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్ కె), ఉదయ్, అరుణ, జగన్ లు తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన మావోయిస్టు పేతురు అలియాస్ దయ రామ్ గూడ లో పోలీసులకు మావోయిస్టులకు 2016 లో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలో మృతి చెందిన మావోయిస్టు దొసో తమ్ముడు ఈ దయ. అన్న చనిపోవడంతో తమ్ముడు ఉద్యమంలో చేరాడు. సంఘటనా స్థలంలో పోలీసులు 303 తుపాకీ, 3 కిట్ బ్యాగులు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు మృతదేహాన్ని బలపం, కోరుకొండ అటవీ ప్రాంతం మీదుగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తప్పించుకున్న మావోయిస్టు నేతల కోసం పోలీసులు మన్యాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ఏ ఓ బి లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏవోబీ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
ఏవోబీ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
కాల్పల ఘటనలో మావోయిస్టు మృతి
సీలేరు, పెన్ పవర్
మృతిచెందిన మావోయిస్టు పాంగి దయగా గుర్తింపు జి.మాడుగుల మండలం వాకపల్లికి చెందిన పాంగి దయ గత ఆరేళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న పాంగి దయ శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎదురుకాల్పులు సుమారు 4 గంటలపాటు కొనసాగిన ఎదురుకాల్పులు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు మల్కన్గిరి జిల్లా సరిహద్దు గుజ్జేడు ప్రాంతంలో ఘటన మావోయిస్టు అగ్రనేతలు ఉండడంతో హోరాహోరీగా కాల్పులు ఘటనాస్థలంలో మందుపాతరలు నిర్వీర్యం చేసిన పోలీసులు 303 తుపాకి, పిస్తోల్, 3 కిట్ బ్యాగ్లు, 3 సెల్ఫోన్లు స్వాధీనం ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు.
కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది
కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది
సామర్లకోట, పెన్ పవర్
కరోనా ఉధృతి దేశంలో చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లోను,రాష్ట్రంలో చూస్తే తూర్పుగోదావరి జిల్లాలోను అధికమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దీనిని కట్టడి చేసే విషయంలో ఎంతో నిర్లక్ష్యన్ని కనపరుస్తుంది అని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి తదితరులు అన్నారు.స్థానిక తెదేపా కార్యలయంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ తీరును విమర్శించారు. వారు మాట్లాడుతూ పాజిటివ్ కేసులో ఎంతో ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న పరీక్షలు చేయించుకునే వారికి సరిపడా కిట్లు అందించకుండా,ప్రజలకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టకుండా,కారంటెయిన్లో ఉన్న రోగులకు పోషకాహారం,మందులు పూర్తిస్థాయిలో అందించకుండా చాలా తేలికగా తీసుకుంటుంది అన్నారు.ఒక ప్రక్క ప్రాణనష్టం విపరీతమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.క్వారంటైన్ లో ఉన్న రోగులకోసం రోజుకు 5 వందలు ప్రభుత్వం కేటాయించిన వారికి సరైన మెనును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలి పెడుతున్నట్టు స్వయంగా ఆ రోగులు ఫోన్ లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.బ్రాందీ షాపులను తెరచి కరోనా ఉధృతి కి ప్రభుత్వం కారణమైంది అన్నారు.షాపులు వద్ద భౌతిక దూరం పాటించకుండా ఉండటం తో కేసులు పెరిగిపోతున్నాయి అన్నారు.తక్షణం వ్యాధి ఉధృతి తాగేంతవరకు బ్రాందీ షాపులను మూసివేసి పరీక్ష కిట్టులు తగినన్ని అందించడంతో పాటు క్వారంన్ టైన్ రోగులు తగిన సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఇంకా పార్టీ కార్యదర్శి బడుగు శ్రీకాంత్,నాయకులు అందుగుల జార్జి చక్రవర్తి, కంటే జగదీష్, వాసు తదితరులు పాల్గొన్నారు.
శిరోముండన కేసులో దోషులను వెంటనే అరెస్టు చెయ్యాలి
శిరోముండన కేసులో దోషులను వెంటనే అరెస్టు చెయ్యాలి
సామర్లకోట ,పెన్ పవర్
సీతానగరంలో దళితునిపై జరిగిన శిరోముండనం కేసులో దోషులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పట్టణ తెదేపా దళిత నాయకులు మాజీ కౌన్సీలర్ అందుగుల జార్జి చక్రవర్తి డిమాండ్ చేశారు.తెదేపా కార్యలయం లో ఆయన మాట్లాడుతూ ఎస్సి,ఎస్టీల పట్ల వైఎస్సార్ ప్రభుత్వం ఎంతో చులకన భావంతో ఉందన్నారు.వైసిపి నాయకులు ఏమి చెబితే వాటిని పోలీసులు చేస్తున్నారు అన్నారు.దానికి నిదర్శనమే ఈ శిరోముండన ఘటనగా ఆయన విమర్శించారు. బాధ్యత గల ఉన్న ఎస్ఐ ,ఒక కానిస్టేబులు కలసి ఇంతటి దారుణానికి పాల్పడటం వెనక ఆ గ్రామానికి చెందిన వైసిపి నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే వారిని పురిగొల్పిన వైసిపి నాయకులును అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును నమోదు చేయాలన్నారు.అలాగే సామర్లకోట పట్టణంలో ఒకే గృహంలో కరోనాతో తల్లి,కుమారులు మృతిచెందగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో గాని, ఆ ప్రాంతంలో తక్షణ భద్రతా చర్యలు చేపట్టే విషయంలో గాని అధికారులు ఎంతో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్టు ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని లేదంటే వైసిపి ప్రభుత్వానికి చివరి రోజులు వచ్చినట్టుగా తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా చక్రవర్తి వెంట తెదేపా నాయకులు అడబాల కుమారస్వామి,బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్, వాసు పాల్గొన్నారు.
మెంటాడ లో కరోనా టెన్షన్
మెంటాడ లో కరోనా టెన్షన్
మెంటాడ, పెన్ పవర్
ప్రెస్ క్లబ్ సహకారంతో జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ
ప్రెస్ క్లబ్ సహకారంతో జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ
పరవాడ పెన్ పవర్
భాజపా ఆధ్వర్యంలో వైద్యులకు పిపిఈ కిట్లు
భాజపా ఆధ్వర్యంలో వైద్యులకు పిపిఈ కిట్లు
అనకాపల్లి , పెన్ పవర్
భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో వైద్యులకు పీపీఈ కిట్లు శుక్రవారం అందజేశారు. జిల్లా అధ్యక్షులుు డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో నాయకులు వైద్యులుకు అందజేశారు. ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ కి ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో రోగులకు వైద్యం అందించడం లో వైద్యుల త్యాగం మరువలేనిదన్నారు. వైరస్ ప్రబలే అవకాశంం లేకుండా పి పి ఈ కిట్లు లేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. దీంతో పార్టీ ఆదేశాల మేరకు తాము వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణగా వీటిని అందజేశామన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు , మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు , దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు కొండబాబు మాస్టారు, అనకాపల్లి టౌన్ ప్రధాన కార్యదర్శి కర్రి రామకృష్ణ , అనకాపల్లి మండల అధ్యక్షులు కసిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుంది
లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుంది కోప్పల రామ్ కుమార్
పూర్ణ మార్కెట్, పెన్ పవర్
వారోత్సవాలు కొనసాగింపా వాయిదా
మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొనసాగింపా వాయిదా
చింతపల్లి ,పెన్ పవర్
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...