Followers

శిరోముండన కేసులో దోషులను వెంటనే అరెస్టు చెయ్యాలి

శిరోముండన కేసులో దోషులను వెంటనే అరెస్టు చెయ్యాలి


సామర్లకోట ,పెన్ పవర్


సీతానగరంలో దళితునిపై జరిగిన శిరోముండనం కేసులో దోషులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పట్టణ తెదేపా దళిత నాయకులు మాజీ కౌన్సీలర్ అందుగుల జార్జి చక్రవర్తి డిమాండ్ చేశారు.తెదేపా కార్యలయం లో  ఆయన మాట్లాడుతూ ఎస్సి,ఎస్టీల పట్ల వైఎస్సార్ ప్రభుత్వం ఎంతో చులకన భావంతో ఉందన్నారు.వైసిపి నాయకులు ఏమి చెబితే వాటిని పోలీసులు చేస్తున్నారు అన్నారు.దానికి నిదర్శనమే ఈ శిరోముండన ఘటనగా ఆయన విమర్శించారు. బాధ్యత గల ఉన్న ఎస్ఐ ,ఒక కానిస్టేబులు కలసి ఇంతటి దారుణానికి పాల్పడటం వెనక ఆ గ్రామానికి చెందిన వైసిపి నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే వారిని పురిగొల్పిన వైసిపి నాయకులును అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును నమోదు చేయాలన్నారు.అలాగే సామర్లకోట పట్టణంలో ఒకే గృహంలో కరోనాతో తల్లి,కుమారులు మృతిచెందగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో గాని, ఆ ప్రాంతంలో తక్షణ భద్రతా చర్యలు చేపట్టే విషయంలో గాని అధికారులు ఎంతో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్టు ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని లేదంటే వైసిపి ప్రభుత్వానికి చివరి రోజులు వచ్చినట్టుగా తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా  చక్రవర్తి వెంట తెదేపా నాయకులు అడబాల కుమారస్వామి,బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్, వాసు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...