Followers

ఎ.వి.ఎన్, కళాశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

 ఎ.వి.ఎన్, కళాశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం 




మహారాణి పేట, పెన్ పవర్


మిసెస్ ఎ.వి.ఎన్, కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.కళాశాల పూర్వ విద్యార్థి మరియు నోబెల్ గ్రహీత సర్. సి.వి. రామన్. కనిపెట్టిన రామన్ ప్రభావమునకు గుర్తుగా 28 ఫిబ్రవరి జాతీయ సైన్స్ దినోత్సవముగా  జరుపుకోవడం చాలా సంతోషకరమని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సి.హెచ్.మధుసుధనరావు తెలిపారు. సైన్స్ ప్రయోగాల యొక్క ఆవశ్యకత మరియు సైన్స్ యొక్క పరిజ్ఞానం పెంపొందించుకోనుట ఇప్పటి పరిస్థితులలో, ఎంతైనా అవసరమని ఫిజిక్స్ విభాగాధిపతి మరియు వైస్ ప్రిన్సిపల్ ఆచార్య. ఏస్. శ్రీనివాసు రావు తెలిపారు. రామన్ యొక్క ప్రయోగాలు మరియు ఉపన్యాశాల గురించి అతిథిగా వచ్చిన డాక్టర్. డి.జగదీశ్వర్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో కాళాశాల వైస్      ప్రిన్సిపాల్ డాక్టర్. వి.వి.జె. గోపాలక్రిష్ణ ప్రశంగిస్తూ విద్యార్థులందరు పూర్వ విద్యార్థి ఆయిన సర్. సి.వి.రామన్ ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో విజయం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్. ఎన్.రామక్రిష్ణ యితర ఆచార్యులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రచారంలో హేమలత జోరు ... ప్రత్యర్ధులు బేజారు...

    5వ  వార్డు   మారికవలసలో టీడీపీ అభ్యర్థి మొల్లి హేమలత విస్తృత ప్రచారం. 



 మధురవాడ, పెన్ పవర్ 

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని మొల్లి హేమలత ప్రచారంలో దూసుకుపోతున్నారు.తన తండ్రి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి మొల్లి లక్ష్మణరా వు వారసురాలిగా పదునైన మాటల తూటాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ,తన దైన శైలిలో ప్రచారం హోరేతిస్తున్నారు.


 ఆదివారం మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో గల దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సుమారుగా 1000 మందితో పాదయాత్రగా బయలుదేరారు. రాజీవ్ గృహకల్ప కాలనీ , జె.ఎన్.ఎన్ . యు.ఆర్.ఎమ్.న్యూ కాలనీలో గల పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటి పరిస్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్ధించారు. 




ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, పాల్గొన్నారు. కృతజ్ఞతలు :మా యొక్క గెలుపునకు కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, తెలుగు తమ్ముళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ నాగోతి సత్యన్నారాయణ (జపాన్).సెక్రటరీ ఈగల రవి. భీమిలి నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు బోయి రమదేవి.నమ్మి శ్రీను.5వ వార్డ్ మహిళ  అధ్యక్షురాలు హేమలత. గోడు అరుణ.వియ్యపు నాయుడు.ఓలేటి శ్రావణ్.నమ్మి సూరి అప్పారావు. మొల్లి అప్పలస్వామి. టీడీపీ అభిమానులు.కార్యకర్తలు.నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రచారంలో దూసుకుపోతున్న మళ్ళ సురేంద్ర

 

ప్రచారంలో దూసుకుపోతున్న మళ్ళ సురేంద్ర 

మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో  50 మంది యువకులు తెలుగుదేశం లో చేరిక.



పెన్ పవర్ ,అనకాపల్లి

81వ వార్డ్ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి  శ్రీమతి మళ్ళ కృష్ణ కుమారి  ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక నెయ్యల వీధి జంక్షన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో  81వ డివిజన్ ఇంచార్జ్  మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో 50 మంది యువకులు మళ్ళ సురేంద్ర గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు  జాయిన్ అయిన వారిలో రేబాక గణేష్, ఎండపల్లి శేఖర్, అనకాపల్లి చందు, ఎండపల్లి శివశంకర్,మంగరపు సతీష్, ఏడువకల మూర్తి, అనకాపల్లి సన్యాసిరావు, ఎండపల్లి మహేష్, ఎండపల్లి గణేష్, ముత్యాల మల్లిబాబు, అనకాపల్లి నగేష్, అనకాపల్లి మధు, మంగరపు సురేష్, కోడూరు శేఖర్, మరికొంతమంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీ కొణతాల వెంకటరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయిందని ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వాన్ని దేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనకాపల్లి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రజలందరూ దాన్ని గుర్తించి ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఇక్కడ 81 వ డివిజన్ లో మళ్ళ సురేంద్ర  సతీమణి మళ్ళ కృష్ణ కుమారి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అని మళ్ళ సురేంద్ర  గురించి మీ అందరికీ తెలిసిందే అనిగత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీయే కాకుండా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని ఇప్పుడు మళ్ళ సురేంద్ర  భార్య ని గెలిపించుకుంటే ఈ ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కొణతాల రత్నకుమారి, అనకాపల్లి సంతోషిని, చంద్ర, దాడి రామారావునాయుడు, కొణతాల శ్రీనివాసరావు,  పెతకం శెట్టి వెంకట్రావు, దానాల విష్ణు చౌదరి, బుద్ధ రాజేష్, యల్లప్పు శ్రీనివాసరావు, ఎండకుర్తి అప్పలరాజు, నీలగిరి శీను, మళ్ళ గణేష్, వానపల్లి కోటేశ్వరరావు, దొడ్డి జగదీష్, కొణతాల తులసి, తిప్పన అప్పారావు వేగి కృష్ణ, పెంటకోట వరప్రసాద్, అనకాపల్లి మోహన్, ఎండపల్లి చంద్రశేఖర్, అనకాపల్లి రాము మరియు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మనసున్న నాయకుడు మన జగన్ అన్న..

 మనసున్న నాయకుడు  మన జగన్ అన్న..



 గిరిజన ప్రాంత రహదారులకు మోక్షం కలిగిస్తున్న సీఎం

పెన్ పవర్ బ్యూరో ,విశాఖపట్నం

 గత ప్రభుత్వాల నిరాదరణకు గురైన గిరిజన ప్రాంత రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని  ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. శనివారం సాయంత్రం  సెక్స్మాడుగుల పంచాయతీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న రహదారులు తాగునీటి సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించింది అన్నారు. వైఎస్ జగన్ మనసున్న నాయకుడు అని సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంత రహదారులకు  మోక్షం కలిగించే విధంగా  చర్యలు జరుగుతున్నాయన్నారు. మాడుగుల మండలం శివారు రాజంపేట కొత్తవలస  ఉరక గెడ్డ  వాగుపై  బ్రిడ్జి మరియు 7:30 మీటర్ల రహదారి నిర్మాణానికి  9 కోట్ల రూపాయలు  మంజూరు అయిందని టెండర్లు పూర్తి అయ్యి త్వరలో పనులు ప్రారంభం అవుతాయి అన్నారు  మండలంలో నాలుగు రోడ్లు దేవరపల్లి మండలం లో ఒక రోడ్డు అభివృద్ధికి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుంచి ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు ఈ నిధులతో కల్వర్టులు బ్రిడ్జీలు తార్ రోడ్డు  7:30 మీటర్లు విస్తరించనున్న మన్నారు మాడుగుల రామచంద్రపురం రోడ్డుని గ్రామ పంచాయతీ నిధుల నుండి 7:30 మీటర్లు వెడల్పు తారు రోడ్లు కల్వర్టు నిర్మిస్తామన్నారు. ఒక కిలోమీటర్ 800 మీటర్లు రోడ్డు నిర్మాణానికి 85 లక్షలు మంజూరు అయిందన్నరు.  కింతలి వల్లాపురం శివారు శరభన్నపాలెం నుంచి తణుకు గదబ వీధి  2 కిలోమీటర్ల  తారు రోడ్డు నిర్మాణానికి 85 లక్షలు.  పేద సారాడ  శరభన్నపాలెం  మూడు కిలోమీటర్ల 400 మీటర్లు రోడ్డు నిర్మాణానికి ఒక కోటి 85 లక్షలు  ఏ వీరనారాయణం పెద్ద గొర్రె గడ్డ 1 కిలోమీటర్ 600 మీటర్లు రోడ్డుకు  కోటి 20 లక్షలు దేవరపల్లి మండలం గర్సింగి  ఎర్ర చెరువు రెండు కిలోమీటర్ల 100 మీటర్లు ఒక కోటి 10 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మాడుగుల దేవి ఆడిటోరియం  తా చెరువు వాగు వరకు రెండు విడతల్లో రోడ్డు విస్తరణ చేపడతామన్నారు. తాడివలస గోపూర్ లో తాగునీటి సమస్యకు  మినీ వాటర్ ప్లాంట్ నిర్వహించామన్నారు. తాజాగా గెలుపొందిన గ్రామ సర్పంచులు   వార్డు మెంబర్లు బాధ్యతగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. తమ తమ పరిధిలో ప్రజాసమస్యలు ప్రతి ఒక్కటీ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పురవీధుల్లో మట్టి రోడ్లను సిమెంట్ రోడ్ల గా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయితీ ఆస్తులను పరిరక్షించి అవసరం మేరకు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. మోదకొండమ్మ ఆలయం నుంచి రామచంద్రపురం మీదుగా కాశీపురం వరకు రోడ్డు నిర్మాణం బ్రిడ్జి ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  కళావతి  ఉప సర్పంచ్  శ్రీనాథ్ శ్రీనివాసరావు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలు ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

 ఆడపిల్లలు ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి



గరికి వలస జిల్లాపరిషత్ పాఠశాలలో బాలికలకు శానిటైజర్ బాక్సుల పంపిణీ

పెన్ పవర్,విజయనగరం

విజయనగరం జిల్లా గుర్ల మండలం గరికవలసజిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం కేసలి స్వచ్ఛంద సంస్థ అధినేత తల్లి జ్ఞాపకార్థం పిల్లలకు పండ్లు ఫీడ్స్ తో పాటు పుస్తకాలు పెన్నులు బాలికలకు తదితర సామాగ్రిని అందజేశారుఈ సందర్భంగా ఆడపిల్లల ఆరోగ్యం ఆనందం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తూర్పుగోదావరి జిల్లా బాలల సంక్షేమ సమితి అధ్యక్షులు మాధవీలత అన్నారు శనివారం మండలంలో గరికవలస గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు విశాఖపట్నం బాలల సంక్షేమ సమితి అధ్యక్షురాలు శ్యామల రాణి ఎన్ఆర్ఐ ప్రతినిధులుసేవ్ టు చైల్డ్ ఫౌండేషన్ ప్రతినిధి జి సునంద శ్రీధరు ధన్య తో పాటు విజయనగరం జిల్లా కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఆడ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలన్నారు ఆడపిల్లలకు విద్య చాలా అవసరమని శ్యామల అని అన్నారు వెనుకబడిన ప్రాంతాల్లో ఆడపిల్ల విద్య చాలా అవసరమని అని పేర్కొన్నారు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం తదితర ప్రాంతాలలో బాలికల సంరక్షణ తో పాటు మంచి పౌష్టికాహారం అందించే బాధ్యత కూడా తీసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు కే అప్పారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద వారికి విద్య అందుబాటులోకి వచ్చే విధంగా అదే విధంగా వారికి సకల సౌకర్యాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రమ

తపాలా సేవలు వినియోగించుకోవాలి

 తపాలా సేవలు వినియోగించుకోవాలి 

జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్.

 నెల్లికుదురు,పెన్ పవర్.


తపాలాశాఖ వినియోగులను సద్వినియోగంచేసుకోవాలని మహుబూబాబాద్  జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ సైదా నాయక్ అన్నారు. శనివారం మండలంలోని రత్తిరామ్ తండాలో బడితండా,నల్లగుట్ట, రత్తిరామ్ తండ,కాచికల్ గ్రామాలకు చెందిన పోస్ట్ఆఫీస్ రత్తిరామ్ తండలో మంజూరు కావడంతో శనివారం వివిధ రకాల గ్రామీణ తపాలా జీవిత బీమా ఖాతాలు తెరవడం కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గుగులోత్ బిక్కు నాయక్ తో కలిసి ఖాతాలను ప్రారంభించిన సైదా నాయక్ మాట్లాడుతూ..ఎస్బి, ఆర్ డి, సుకన్య సమృద్ధి యోజన లతోపాటు ఐపీబిమ్, ఏఇపిఎస్ సేవలను తపాల శాఖ అందిస్తుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ భూక్యా బాలాజీ నాయక్, ఉప సర్పంచ్ విజయ బాలాజీ, నెల్లికుదురు సబ్ పోస్ట్మాస్టర్ నర్సయ్య,ఆయా గ్రామాల బీపీఎం లు నవీన్ రావు,ఉమామహేశ్వర్, ఐస్లాం,మహేశ్వరి, ప్రశాంత్, స్థానికులు చందూలాల్, శ్రీనివాస్, బిచ్చనాయక్,రఘుతో పాటు తదితరులు పాల్గొన్నారు

అభివృద్ధి పథంలో నడిపిస్తా..వైసిపి 39వ వార్డు కార్పొరేటర్.. అభ్యర్థిని కొల్లి సింహాచలం

 అభివృద్ధి పథంలో నడిపిస్తా..వైసిపి 39వ వార్డు కార్పొరేటర్.. అభ్యర్థిని కొల్లి సింహాచలం




మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ, దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డు ప్రాంతాన్నిఅభివృద్ధి పథంలో నడిపిస్తానని వైసిపి కార్పొరేటర్ అభ్యర్థిని కొల్లి సింహాచలం ప్రకటించారు.కోటవీధి,ఫెర్రీ వీధి తదితర ప్రాంతాల్లో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అడుగడుగునా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. హారతులతో ఘన స్వాగతం పలికారు.స్థానికంగా నెలకొన్న సమస్యలను త్వరితంగా పరిష్కరిస్తానని ఆమె స్థానికులకు భరోసా ఇచ్చారు.అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాని, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే నిర్విరామంగా శ్రమిస్తున్నానని, తనకు ఘనవిజయం అందించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

పాచి పెంట శాంతకుమారి కి నందీ అవార్డు ..

 పాచి పెంట శాంతకుమారి కి నందీ అవార్డు (భాషా సాంస్కృతిక శాఖ)




అరకు, పెన్ పవర్

ఫిలాంత్రోఫిక్ ఇంటర్నేషనల్  సొసైటీ  డాక్టర్  అద్దంకి యోనరాజ వ్యవస్థాపకులు  వారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏట నిర్వహించే గోదావరి నంది పురష్కరాలు శనివారం ఆనం రోటరీ హాల్ వై జంక్షన్ రాజమహేంద్రవరం వద్ద ఫిలాంత్రోఫిక్ సొసైటీ ద్వారా  వంగపండు ఉష  చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) వారు చేతుల మీదుగా నందీ అవార్డు. బి.ఆర్ అంబేద్కర్ సేవాట్రస్ట్ సేవలను గుర్తించి వ్యవస్థాపకురాలు  పాచి పెంట శాంతకుమారి అరకు వేలి కి రాష్ట్ర స్థాయి లో  నంది పురస్కారాలు అవార్డు దక్కడం అభినందనలు.అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకోవాలని కోరుచున్నాను అని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం..

 ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం..

సురభి వాణీదేవిని గెలిపించి పీవీ నర్సింహరావుకి సముచిత గౌరవం ఇద్దాం...

నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే...

దుండిగల్,పెన్ పవర్




కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బహదూర్ పల్లి గ్రామంలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. సురభి వాణీదేవి నరనరాల్లో ప్రజాసేవ జీర్ణించుకోపోయిందని, ఇప్పటికే వాణి దేవి విద్యాసంస్థలను స్థాపించి విద్యాపరంగా ఎన్నో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రాడ్యుయేట్ల సమస్యలను దగ్గర్నుండి చూసిన ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేసే అవకాశం ఉందని అన్నారు. వాణీ దేవిని అభ్య‌ర్థిగా ప్రకటించిన వెంటనే ఇతర పార్టీలకు బయం పట్టుకుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎలాగైనా విమర్శలు చేయాలనే ఆలోచనలో విపక్షాలు పడ్డాయని అన్నారు. వారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆలోచనతో ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రోజూ పెట్రోల్ ధరలు పెంచుతూ, ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ బ‌డ్జెట్ కేటాయింపులు చేస్తూ, తెలంగాణ‌కు బడ్జెట్‌లో మొండి చేయి చూపించిన బిజెపికి గుణపాఠంగా జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు దేశానికి రోల్ మోడ‌ల్‌ అని అన్నారు. వారు గలిస్తే బాస్ లు ఢిల్లీలో ఉంటారని, మనం గెలిస్తే మనకు మనమే బాస్ అన్నారు. ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ కనుక మన అభ్యర్థి వాణీ దేవి గారిని గెలిపించి పీవీ నర్సింహరావు గారికి సముచిత గౌరవం ఇద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీతోనే సుభిక్షమైన పాలన

 తెలుగుదేశం పార్టీతోనే సుభిక్షమైన పాలన




విజయనగరం,పెన్ పవర్ 

 తెలుగుదేశం పార్టీతోనే సుభిక్షమైన పాలన సాధ్యమవుతుందని విజయనగరం టీడీపీఇన్ ఛార్జ్ అదితి గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం 38వ డివిజన్ లో , సాయంత్రం 39, 41వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ విజయనగరం అభివృద్ది చెందాలన్నా, పన్నుల భారం తగ్గాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విజయనగరం పట్టణంలో అభివృద్ది జరిగిందన్నారు.వైకాపా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కార్పొరేషన్  కి ప్రత్యేకమైన నిధులు తీసుకురాలేకపోయారన్నారు.జనరల్ నిధులను పూర్తిగా ఖర్చుచేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు.ఒక త్రాగునీటి ప్రాజెక్టును కూడా .కాంగ్రెస్, వైకాపా ప్రభుత్వాలు పట్టణానికి తీసుకురాలేకపోయాయన్నారు.కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన వాటర్ స్కీమ్లు ద్వారానే పట్టణంలో త్రాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. తాటిపూడిలో నీరు లేనప్పుడు ఆదుకున్న గడిగెడ్డ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయకుండా ఆ స్కీమ్ ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో సంక్షేమ పధకాలు ఇస్తున్నారని, ఎవరి జోబులోని సొమ్ము కాదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ఓటు వేయలేదని అర్హులకు పధకాలు రద్దు చేస్తే, వారి తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి తిరిగి పధకాలను అందజేస్తామన్నారు. వైకాపా అక్రమ చర్యలకు సహకరిస్తున్న అధికారులను న్యాయస్థానంలో నిలబెడతామన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న వాలంటీర్ల వివరాలను, ఆదారాలను అధికారులకు, ఎన్నికల సంఘానికి పంపించి వారిపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మేయర్ అభ్యర్థి కంది శమంతకమణి, 38వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బొబ్బాది ఉషశ్విని, 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కొర్నాన రాజ్యలక్ష్మి, 41వ డివిజన్ టీడీపీ అభ్యర్థి అనురాధా బేగం,పార్టీ నాయకులు బొబ్బాది త్రినాథ్, బొబ్బాది విజయలక్ష్మి, విజ్ఞపు ప్రసాద్, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రజలకు మెరుగైన ఆరోగ్యం...

పట్టణ  ప్రజలకు మెరుగైన ఆరోగ్యం...



పెన్ పవర్, విజయనగరం

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టణ ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలన్న సంకల్పంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించి, అందుకు కావలసిన భవనాలు, మౌలిక సదుపాయాలు సమకూర్చారని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు అన్నారు. శనివారం నాడు కోలగట్ల నివాసంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో ప్రస్తుత ఉద్యోగ సిబ్బందిని కొనసాగించవలసిందిగా కోరుతూ ఆరోగ్య సిబ్బంది అందరూ కలిసి  గౌరవనీయులు విజయనగరం శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారికి వినతి పత్రం అందజేశారు. ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన రిక్రూట్మెంట్ లో ముందుగా గత కొన్ని ఏళ్లుగా పని చేస్తున్నా మాకు ప్రాధాన్యతనిచ్చి మిగిలిన ఖాళీలను కొత్తవారికి ఎంపిక చేయాలని కోరారు. ఈ విషయమై కోలగట్ల సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య (UPHC) సిబ్బంది ఎస్ గణపతి (డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్),ఎం రమేష్ బాబు (సెక్రెటరీ),ఏ సంజీవ్ (జాయింట్ సెక్రెటరీ),ఎం విజయమ్మ (మెంబర్),తో పాటు సి.ఓ లు, ఏ.యన్.ఎం లు, ల్యాబ్ టెక్నీషియన్ లు, జి.ఎన్.ఎం లు, క్లీనింగ్ అసిస్టెంట్లు, వాచ్ మెన్ లు, స్వీపర్లు పాల్గొన్నారు.

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలలో కౌన్సిలర్ శంకర్ నాయక్..

 సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలలో కౌన్సిలర్ శంకర్ నాయక్..

ప్రభుత్వ ఆదేశాలతోనే 27వార్డులో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు.. కమీషనర్ జ్యోతి..

దుండిగల్,పెన్ పవర్




బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు పురస్కరించుకొని 27వ వార్డు పరిధిలోని దుందిగల్ తాండ-1లో ఘనంగా నిర్వహించారు.. ఈవేడుకలను దుండిగల్ మున్సిపల్ కమీషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి ప్రభుత్వం తరఫున.. ప్రభుత్వ ఆదేశానుసారం జయంతి వేడుకలు తామే ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమీషనర్ జ్యోతి తెలిపారు.. స్థానిక కౌన్సిలర్ శంకర్ నాయక్ జయంతి వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఆలయ పూజారి వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో మరియు వరంగల్ జిల్లా ప్రధాన స్వామిజీ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో భోగ్ బండర్, అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బంజారాల సాంప్రదాయిక పద్దతిలో కమీషనర్ జ్యోతికి తలపాగ చుట్టి.. హోమం వద్ద అగ్నిహోత్రునికి నెయ్యితో కమీషనర్ అభిషేకం చేశారు..సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ కు కమీషనర్ నివాళులు అర్పించారు.. స్థానిక బంజారా మహిళలు కూడా జయంతి వేడుకలలో పాల్గొన్నారు.. తాండావాసులయ అతిధులను సత్కరించారు.. ముఖ్య అతిథిగా విచ్చేసిన 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్ చౌహన్ సేవాలాల్ మహరాజ్ కు నివాళులు అర్పించారు.. ప్రభుత్వం తరుపున జిల్లా అడిట్ ఆఫీసర్ కొంగు వెంకటేష్, నాయకులు భీమ్ సింగ్ నాయక్, రవీందర్ నాయక్, మహేందర్ నాయక్, అమర్ సింగ్ లాల్ సింగ్ నాయక్, విజయ్ నాయక్, బాబులాల్ నాయక్ రాకేష్ నాయక్, బాబు నాయక్, రాములు నాయక్, మరియు తాండ పెద్దలు మహిళా మణులు ఈ భోగ్ బండర్ కార్యక్రమంలో పాల్గొన్నారు..

పార్వతీపురం వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు

 పార్వతీపురం వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు



పార్వతిపురం,పెన్ పవర్ 

పార్వతిపురం నియోజకవర్గ కేంద్రంలో గల ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ గారు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, విజయనగరం జిల్లా ఏమ్ఎల్సి పెనుమత్స సురేష్ బాబు మరియు విజయనగరం జిల్లా వైసీపీ సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ గారు, విజయనగరం జిల్లా డిసిసిబి చైర్మన్ మరిశర్ల తులసి తదితర ముఖ్య అతిదిలును గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు సాదరంగా ఆహ్వానించడం జరిగినది. అందరూ కార్యాలయంలో కాసేపు ముచ్చటించి త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించి అన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులను అఖండ విజయం చేకురేవిదంగా కృషి చేయాలని పార్టీ ముఖ్య నాయకులుకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుతో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, వైసీపీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయు అభ్యర్థులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ భర్తీ చేయాలి...

ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ భర్తీ చేయాలి...

గిరిజన సంఘం డిమాండ్

 పెన్ పవర్, విశాఖపట్నం

కొత్త కోట ప్రదమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ ను తక్షణం భర్తీ చేయాలని గిరిజన సంఘం డిమాండ్ చేసింది. శనివారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్   సాధన కమిటీ ఆధ్వర్యంలో కొత్తకోట పి.హెచ్.సి వద్దా ధర్నా జరిగింది. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోట పీహెచ్ సీ  పరిధిలో 10 పంచాయతీలు, 28 గిరిజన గ్రామాలు 30 వేల జనాభా కు వైద్య సేవలు అందించడం కోసం ప్రత్యేకంగా కొత్తకోట పి.హెచ్.సి ఏర్పాటు చేశారు.వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతుంది   ప్రభుత్వం.  వాస్తవానికి ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయవలసి ఉంది,  అలాగే ప్రతి శనివారం వందలాది మంది ప్రజలు వైద్యం కోసం కొత్తకోట పి.హెచ్.సి ఏర్పాటు చేశారు, ఇక ల్యాబ్ విషయం కు   వస్తే ల్యాబ్ టెక్నీషియన్ లేరని, వైద్యం చేసి పంపిస్తున్నారని,పరీక్షలు మాత్రం ప్రైవేట్ లాబ్ లలో  చేయంచుకోమని  అలా చేసుకుంటే చేయాలంటే వందల రూపాయలు ఖర్చవుతుందని,ఈ పి హెచ్ సి.ప్రధానంగా టి అర్జాపురం. చీమలపాడు గ్రామాల్లో... గిరిజనులు మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు బారిన పడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో గిరిజనుల వద్ద డబ్బు లేకపోవడంతో. వస్తువులు తాకట్టు పెట్టుకుని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ వద్ద పరీక్షలు నిర్ణయించుకుంటున్నారు.  వాస్తవానికి ఆరోగ్య కమిటీ ఎంపీడీవో అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరగాలి. ఈ సమావేశంలో హాస్పిటల్ యొక్క స్టాప్. ఇటువంటి సౌకర్యం ఉండాలని చర్చించి ఆస్పత్రి అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టాలి. నేటికీ మూడు సంవత్సరాలు అవుతున్న ప్రత్యేక అధికారులు పరిపాలనలో ఈ ఆస్పిటల్ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పేషెంట్లు మంచినీరు తాగాలంటే  గ్లాసులు కూడా లేవు. తక్షణమే జిల్లా వైద్య అధికారులు స్పందించి రెండు వారాల్లోగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు గిరిజనసంఘం మండల అధ్యక్షులు సిహెచ్ శంకర్రావు. సిహెచ్ రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి ఉద్యోగులకు అండగా ఉంటాం:టీయూడబ్ల్యూజే..

 ఆంధ్రభూమి ఉద్యోగులకు అండగా ఉంటాం:టీయూడబ్ల్యూజే..

హైదరాబాదు,పెన్ పవర్


ఆంధ్రభూమి పత్రిక ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ స్పష్టం చేశారు. 

శనివారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కేంద్ర కార్యాలయంలో ఆంధ్రభూమి ఉద్యోగులు ఆయనను కలిసి మద్దతును కోరిన సందర్భంలో వారినుద్దేశించి మాట్లాడారు.

కోవిడ్ సాకుతో ఏడాది క్రితం ప్రచురణ నిలిపివేసి, ప్రస్తుతం శాశ్వతంగా మూసివేసేందుకు కుట్రలు చేస్తున్న ఆంధ్రభూమి యాజమాన్యానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పకతప్పదని విరాహత్ హెచ్చరించారు.. ఏడాది నుండి ఉద్యోగులకు జీతాలు చెల్లించక పోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నారని, ఆర్థిక కష్టాలతో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు మృతి చెందడం విచారకరమన్నారు. ఆంధ్రభూమి రాజమండ్రి ఎడిషన్ ఉద్యోగి రాం చందర్ రాజు, అతని భార్య ఆర్థిక కష్టాలతో అనారోగ్యానికి గురై చికిత్స పొందలేక ప్రాణం కోల్పోయిన దుర్ఘటనను ఆయన గుర్తుచేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థను నమ్ముకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మంది జీవనం కొనసాగిస్తున్నారని, ఆ పత్రిక యాజమాన్య వైఖరితో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఉద్యోగులకు బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని,  క్రానికల్, భూమి ఉద్యోగుల మధ్య వ్యత్యాసం చూపవద్దని, క్రానికల్ ఉద్యోగులకు వర్తింపజేస్తున్న అన్నీ సౌకర్యాలు ఆంధ్రభూమి ఉద్యోగులకు కల్పించాలని, ప్రావిడెంట్ ఫండ్ అప్డేట్ చేయాలని, ఆదాయపు పన్నులు చెల్లించాలని, విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యుటీ, వెజ్ బోర్డ్ ఏరియర్స్, బోనస్, ఎల్.టి.సి, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పై డిమాండ్లను వారం రోజుల్లో పరిష్కరించని పక్షంలో ప్రత్యక్ష పోరాటం తప్పదని విరాహత్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రభూమి సీనియర్ ఉద్యోగులు వెలిజల చంద్రశేఖర్, బి.వి.ప్రసాద్, రాజేశ్వర్ ప్రసాద్, జె.ఎస్.ఎన్.మూర్తి, డి.రవికుమార్, తిర్మల్ రావు, సి.హెచ్.నగేష్, విజయ్ ప్రసాద్, విశ్రాంత ఉద్యోగులు మల్లయ్య, శర్మ, ఓదయ్య, పి.మధుకర్, ఏ.అవినాష్, టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఎ. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆజాద్ ఆశయ సాధనలో బాగస్వాములవుదాం

 ఆజాద్ ఆశయ సాధనలో బాగస్వాములవుదాం

కూకట్ పల్లి,పెన్ పవర్


మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కె.పి.హెచ్.బి కాలని మూడో ఫేస్ కట్టా వారి సేవా కేంద్రం వద్ద శనివారం భారతీయ ఉద్యమకారుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్  వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె.పి.హెచ్.బి కాలనీ 114డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొల్లా శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భముగా కొల్లా శంకర్, మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా నరసింగరావు మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ జీవించినది 25సంవత్సరాలే అయినా స్వాతంత్ర ఉద్యమ కాలంలో  భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లతో కలిసి భారత స్వాతంత్రం కొరకు పాటుపడిన గొప్ప నాయకుడని, అతిచిన్న వయసులో దేశం కోసం పాటుపడి ప్రాణత్యాగం చేసారని, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నాల సహచరుడని, చంద్రశేఖర్ ఆజాద్ కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడుగా, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న  అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడయ్యాడని, చంద్రశేఖర్ ఆజాద్ను గుర్తు చేసుకుని ఆయన ఆశయాల సాధనలో మనమందరం భాగస్వాములమవుదామని అన్నారు. ఈ కార్యక్రమములో ముప్పాల్ల సాంబశివరావు, గోపరాజు శ్రవణ్ కుమార్, కలకొండ నరేష్, సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు

వైసీపీ ప్రజల ప్రభుత్వం....

వైసీపీ ప్రజల ప్రభుత్వం....




 పెన్ పవర్,విజయనగరం 

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, గత తెలుగుదేశం ప్రభుత్వం  మాటలే కాని, చేతలు లేవని ఈ తేడాను ప్రజలందరూ గమనించాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం నాడు తన నివాసంలో పూల్ బాగ్ కాలనీ మూడవ వార్డు కు సంబంధించి బాబామెట్ట గట్టు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పడగల అప్పారావు, బమ్మిడి పెద్ద బాబ్జి, అయిత ప్రసాద్, ఇప్పిలి కిషోర్, ఎల్లమ్మ, పైలు వరలక్ష్మి ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వంద కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి ఎమ్మెల్యే కోలగట్ల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నేటి నుంచి మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, మీ గౌరవం పెరిగే విధంగా తమ ప్రవర్తన ఉంటుందన్నారు. అందరినీ కలుపుకొని వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వేముల కృష్ణవేణి విజయానికి కృషి చేయాలన్నారు. కేవలం ఎన్నికల ముందు కనపడే నాయకులు , మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, బంగ్లా లో ఎవరిని కలవాలో తెలియని అనిశ్చిత పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మీరు చూసారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు అన్ని విధాల తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయి ఎమ్మెల్యే కోలగట్ల వారికి భరోసా ఇచ్చారు. కులం పేరు చెప్పుకొని మూడు సార్లు చైర్ పర్సన్ గా చేసిన గత తెలుగుదేశం పాలకులు, సమస్యలు తీర్చాలి అనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. తాను శాసనసభ్యునిగా పదవీ పగ్గాలు చేపట్టిన సంవత్సర కాలంలో మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి , వేసవిలో కూడా మంచినీటి సమస్య లేకుండా కృషి చేస్తున్నాం అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలు మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పాలకులు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు అని ప్రశ్నించారు. ప్రజలను అమాయకులను చేసి, ఓట్ల ద్వారా పదవులు పొంది, ఆ తరువాత చేతులెత్తేసి ప్రజలను అధోగతి పాలు చేసింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో అశోక్ బంగ్లాకు తాళాలు వేసుకున్నారని, విజయనగరం ప్రజలు కరోనాతో భయభ్రాంతులు గురవుతుంటే, ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత గా ,ప్రజా ప్రతినిధిగా  తాను ప్రజలకు అండగా ఉంటూ కరోనా బాధితులకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. శాసనసభ్యునిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అన్నారు. సుదీర్ఘ కాలం శాసన సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు ప్రజలను ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. సామాన్య కార్యకర్త గా జీవితాన్ని ప్రారంభించిన తాను, అశోక్ గజపతి రాజు పై తాను గెలిచాం అంటే అది  కార్యకర్తలు, ప్రజల అభిమానంతోనే అని అన్నారు. శాసనసభ్యునిగా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా నగర అభివృద్ధికి కృషిచేసిన వాస్తవాన్ని ప్రజలందరూ గ్రహించాలన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మూడో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల రాంప్రసాద్, మెండ వెంకటరమణ, జగదీష్ మాస్టారు, గండ్ర టీ సన్యాసిరావు, వేముల ప్రకాష్, కోట మంతి శ్రీను, దారపు సన్ని బాబు, సంతోష్, సంచా న ఆది, బండి రమేష్, లా వా డ శ్రీను, లతోపాటు మహిళలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సమీకృత వ్యాపార సముదాయాలకు స్థల పరిశీలన చేసిన అడిషనల్ కలెక్టర్.

 సమీకృత వ్యాపార సముదాయాలకు స్థల పరిశీలన చేసిన అడిషనల్ కలెక్టర్..

మల్లంపేట్ సర్వేనెంబర్ 258లో..దొమ్మర పోచంపల్లి 199లో స్థలాన్ని ఎంపిక..

దుండిగల్,పెన్ పవర్




మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.జాన్ శాంసన్.. దుందిగల్ పురపాలక సంఘం పరిధిలోని దొమ్మర పోచంపల్లిలో సర్వేనెంబర్ 199 లో.. మల్లంపేట్ సర్వేనెంబర్ 258లో చేపట్టబోయే సమీకృత వ్యాపార సముదాయం నిర్మాణానికి కావలసిన స్థల పరిశీలన చేశారు..ఈవ్యాపార సముదాయాల వల్లన ఒకేచోట నిత్య అవసరాలు వివిదరకాల వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు సమీకృత వ్యాపార సముదాయాలు ఎంతగానో ఉపయోగపడుతాయి..ఈ కార్యక్రమములో చైర్ పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ, మున్సిపల్ కమీషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి..గండిమైసమ్మ మండల సర్వేయర్, గండిమైసమ్మ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ షణ్ముఖం మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు,

యువత ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలి...

 యువత ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలి...

పౌరవేధిక చైతన్య సదస్సులో భీశెట్టి పిలుపు






  పెన్ పవర్,విజయనగరం

 జిల్లా జరగనున్న మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా అంతటా ఓట్లు ఉన్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా పౌరవేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు శనివారం ఉదయం ఉమాభారతి డిగ్రీ కళాశాలలో ఎన్నికలు యువత పాత్ర అనే అంశం పై పౌరవేధిక ఆధ్వర్యంలో చైతన్య సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న భీశెట్టి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బ్రతికించాలనే తపన యువతీ యువకులకు ఉండాలని నచ్చిన అభ్యర్థులకు ఓటును వేసుకునే అవకాశం తో పాటుగా నచ్చకపోతే నోటా కి ఓటు వేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించిందని ప్రతి విద్యార్థి తమ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఓట్లు వేసేలా చూడాలని కోరారు పౌరవేధిక ప్రతినిధి ఎస్.శివాజీ మాట్లాడుతు ఎన్నికలను యువతి యువకులు పట్టించుకోకుండా ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయని నచ్చినవారికి ఓటు వేయాలని లేకపోతె కనీసం నోటా కి ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని అన్నారు ఓటు ని వజ్రాయుధం గా గుర్తించాలని కోరారు, జిల్లా క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి కో కన్వీనర్ మమ్ముల తిరుపతి మాట్లాడుతూ మంచి రాజకీయాలు కావాలంటే మంచి వ్యక్తులు గెలుపొందలని అందుకే అందరూ రాజకీయాలు పట్టించుకోవాలని ఓటర్ లిస్టులో పేరు ఉందొ లేదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన లిస్టులో చూసుకొని ఓటు వేయాలని కోరారు,విద్యాసంస్థల అధినేత బి. ఏ.రావు అధ్యక్షత న జరిగిన సమావేశంలో వేదిక ప్రతినిధులు ఇప్పల వలస గోపీ, బసవ మూర్తి,తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకుసీటు దక్కించుకున్న "కెల్లా" విజయం సాధించేనా!

 ఎట్టకేలకుసీటు దక్కించుకున్న "కెల్లా" విజయం సాధించేనా!




 ఆరిలోవ, పెన్ పవర్

ఎట్టకేలకు 13వ వార్డు వైసిపి అభ్యర్థిని గా కెల్లా సునీత సత్యనారాయణ.పార్టీలో మొదటి నుండి కష్టపడి పనిచేసిన కెల్లా సునీత సత్యనారాయణ కాదని అప్పుడే పార్టీలోకి వచ్చిన అభ్యర్థికి వైసీపీ టిక్కెట్ కేటాయించడంపై మనస్తాపం చెందిన కెల్లా, తమ కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చిన పార్టీ అధిష్టానానికి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించి పార్టీకి బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇంతవరకు తనపై నమ్మకం ఉంచి తనకి సహాయ సహకారాలు అందించిన వార్డు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా వైసిపి టికెట్ ఆశించి భంగపడ్డ సుశీల సుధాకర్ తన ప్రభావం పార్టీపై ఎంతవరకు ఉంటుందో,! పార్టీ విజయానికి ఎంతవరకు సహకరిస్తారో! రెబల్ గా వేస్తారో వేచి చూడాలి. వార్డులో అధిక సంఖ్యలో స్వతంత్రులు ఇతర పార్టీలు ఉండగా కెల్లా సునీత సత్యనారాయణ విజయం సాధించే నా!?

గండిగుండం లో ఓటర్లను సజీవ సమాధి చేస్తామంటూ బెదిరించారని ఎంపీ విజయసాయిరెడ్డి పై ఆరోపణ

గండిగుండం లో ఓటర్లను సజీవ సమాధి చేస్తామంటూ  బెదిరించారని ఎంపీ విజయసాయిరెడ్డి పై  ఆరోపణ

పెన్ పవర్, విశాఖపట్నం సీటీ

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ డిమాండ్ పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం తగిన విధంగా స్పందించకపోతే జై ఆంధ్ర ఉద్యమం మళ్ళీ  పురుడు పోసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న  పరిస్థితులను వివరిస్తూ శనివారం.. రాష్ట్రపతి, ప్రధాన  మంత్రి కార్యాలయాలకు  తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ స్వయంగా వినతిపత్రాలను  అందజేశారు. ఆ వినతి పత్రాలలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.విశాఖ జిల్లా  గండిగుండం గ్రామంలో ఓటర్లను సజీవ సమాధి చేస్తామని.. అధికార వైసీపీకి చెందిన నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు  విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తం శెట్టి  శ్రీనివాసరావు, గండిగుండం లో స్థానిక నాయకుడు  గండ్రేడ్డి శ్రీనివాస్ ఓటర్లను బెదిరించిన వారిలో ఉన్నారని పేర్కొన్నారు.  ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ని సైతం చంపుతామని వైసిపి నాయకులు నేరుగా బెదిరిస్తున్నారని, మరోవైపు తనకు కూడా చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని రామ్ ఆందోళన వ్యక్తం చేశారు.   ఉత్తర కోస్తా ప్రజలు ఎవరూ  పరిపాలన రాజధానిని  కోరుకోక పోయినా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  ప్రతిపాదన తీసుకు వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో  ఉన్నప్పుడు అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా ఆవిర్భవించిందన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో అమరావతి ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్  ఏకైక రాజధాని అమరావతి నే  కొనసాగించాలంటూ 438 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నార న్నారు.   ఈ క్రమంలో ఇప్పటివరకు 120 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను పరిశీలిస్తే  ఆంధ్ర ప్రదేశ్ అసలు భారత దేశంలో ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తక్షణమే.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో ఉత్పన్నమైన  రాజకీయ సంక్షోభం నుంచి ఆంధ్ర ప్రదేశ్ ను, అమరావతిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.డాక్టర్ జి.వి.ఆర్.శాస్త్రి తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ కోరారు. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ప్రైవేటీకరణ కాకుండా చూసారో ఇప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని త్వరలోనే విశాఖపట్నం వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిగా రామ్ కోరారు.

37వా వార్డు పర్యటనలో టి.డి.పి కార్పొరేటర్ అభ్యర్ధి... భంగారి రవి శంకర్

 37వా వార్డు పర్యటనలో టి.డి.పి కార్పొరేటర్  అభ్యర్ధి... భంగారి రవి శంకర్

 మహారాణి పేట, పెన్ పవర్

శనివారం జి.వి.ఎమ్.సి, దక్షిణ నియోజకవర్గం 37వ వార్డు టి.డి.పి అభ్యర్ధి అయిన బంగారి రవి శంకర్ వార్డు పర్యటనలో నిమిత్తం పెయిన్ దొర పేట, రెల్లి వీధి,జబ్బరి తోట, స్కీమ్ బిల్డింగ్స్, గొల్ల వీధి,తదితర ప్రాంతాల్లో పర్యటించి, వార్డు ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈకార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కె.చిన్న,తెలుగు యువత అద్యక్షులు తాతాజీ,వార్డు వైస్ ప్రెసిడెంట్ హేమలత,గంగమ్మ, సీనియర్ నాయకులు కనక రాజు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

జోరుగా సాగుతున్న అలుపన కనకరెడ్డి ప్రచారం

 జోరుగా సాగుతున్న అలుపన కనకరెడ్డి ప్రచారం




మహారాణి పేట, పెన్ పవర్

శనివారం సాయంత్రం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు లో శాసనసభ్యులు,వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్పొరేట్ అభ్యర్థి, అలుపన కనకరెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది, సాగుతున్న సమయంలో  ప్రజలను ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా ఆరా తీస్తున్న కనకరెడ్డి అంతేకాక నాకు ఒకసారి కార్పొరేటర్గా అవకాశం ఇవ్వండి ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి  అడుగుతున్నా కనకరెడ్డి నేను నాయకుడుని కాదు మీ సేవకుడిని అంటూ ప్రచారంలో పాల్గొన్న అలుపన కనక రెడ్డీ.

వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి..

 వ్యవసాయ బావిలో పడి  యువకుడు మృతి..



వి.మాడుగుల,పెన్ పవర్

  మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన యువకుడు శనివారం ఉదయం వ్యవసాయ బావిలో పడి  మృతి చెందాడు. మాడుగుల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్  రామారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పర్రె అర్జున్ రావు( 30)కి  గత కొంతకాలంగా మతిస్తిమితం లేదని ఇల్లు విడిచి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో  పొలాల వైపు పరిగెత్తుకుంటూ  వెళ్తుండగా  అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని వెలికి తీశారు. శవ పంచనామా జరిపించి పోస్టుమార్టం కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామారావు తెలిపారు.

సత్యవేడులో మద్యం షాపుల వద్దే యదేచ్ఛగా బార్లు ..

 సత్యవేడులో  మద్యం షాపుల వద్దే యదేచ్ఛగా బార్లు 



 ప్రేక్షక పాత్ర వహిస్తున్న బేవరేజ్ కార్పొరేషన్ అధికారులు 

పెన్ పవర్ న్యూస్ సత్యవేడు

చిత్తూరు జిల్లా సత్యవేడు డివిజన్ పరిధిలో ప్రభుత్వ మద్యం షాపుల వద్ద యదేచ్చగా అక్రమ బార్లు నడుస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి .ఆంధ్ర ప్రదేశ్ ను మద్య రహిత రాష్ట్రం గా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే ప్రైవేటు గుప్పిట్లో ఉన్న మద్యం షాపులను సర్కారు స్వాధీనంలోకి తీసుకురావడం జరిగింది .ఇందుకు అనుగుణంగా ప్రతి ఏడాది 20 శాతం మేర మద్యం షాపులను కుదిస్తూ వీటి నిర్వహణ బాధ్యతలను బేవరేజ్ కార్పొరేషన్ సంస్థకు అప్పగించడం జరిగింది . దీంతోపాటు మద్యం షాపుల వద్ద మద్యం సేవించడాన్ని పూర్తిగా నిషేధించింది . అనధికార బార్లు మద్యం షాపుల వద్ద ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది .  సత్యవేడు డివిజన్ పరిధిలోని పలు సర్కారు మద్యం షాపుల వద్ద యదేచ్ఛగా అక్రమ బార్లు నడుస్తోంది .ఈ డివిజన్ పరిధిలోని సత్యవేడు ,వరదయ్యపాలెం ,నాగలాపురం , పిచ్చాటూరు మండలాలలో దాదాపు 24 మద్యం షాపులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి .ఇందులో భాగంగా సత్యవేడు పట్టణంలో ఐదు మద్యం షాపులు , దాసుకుప్పంలో నాలుగు మద్యం షాపులు , పెద్దఈటిపాకం ఎస్టి కాలనీ ,పాలగుంట , అప్పయ్యపాల్యం తదితర ప్రాంతాల్లో సర్కారు మద్యం షాపులు కొనసాగుతున్నాయి . అయితే సత్యవేడు పట్టణంలో రోడ్డు కు ముందు మద్యం షాపులు నడుస్తుండగా వెనుక వైపు బార్లు కొనసాగుతున్నాయి . టెంకాయ కీతుల షెడ్లలో కూర్చొని మద్యం ప్రియులు మద్యాన్ని సేవించడం సర్వసాధారణమైపోయింది .అలాగే దాసు కుప్పం ప్రాంతంలో రోడ్డు ముందు పలు టిఫిన్ సెంటర్లో మద్యం బార్లు నడుస్తుండగా వెనుక వైపు సర్కారు మద్యం షాపులు కొనసాగుతున్నాయి .మద్యం షాపుల వద్ద విచ్చలవిడిగా బార్లు కొనసాగుతున్న సంబంధిత బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది . పైగా చట్టానికి తూట్లు పొడిచే విధంగా మద్యం షాపుల వద్ద బార్లు కొనసాగుతున్న సంబంధిత సత్యవేడు డివిజన్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర శెట్టితిరుపతయ్య  ప్రేక్షక పాత్ర వహించడం అనుమానాలకు తావిస్తోంది .మద్యం షాపుల వద్ద తాత్కాలిక మద్యం బార్లు నడిపిస్తున్న కొందరు వ్యాపారస్తులతో బేవరేజ్ ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కు అయ్యారేమొన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి .ఇప్పటికైనా సంబంధిత బేవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి మద్యం షాపుల వద్ద అనధికారికంగా కొనసాగుతున్న మద్యం బార్లను నిర్మూలించడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

ఉత్తర నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న.. వి.విజయసాయిరెడ్డి

ఉత్తర నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న.. వి.విజయసాయిరెడ్డి 




విశాఖ ఉత్తరం, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉత్తర నియోజకవర్గం లో  53,54,55,42 వార్డులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి,  ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు మరియు స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ముందుగా  మురళీనగర్ లో  ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం  ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు  దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో జీవీఎంసీ ఎన్నికల ప్రచార సీడీని ఆవిష్కరించారు  అనంతరం. 53 వార్డు శివనగర్, 54 వార్డు మర్రిపాలెం, జ్యోతి నగర, నలంద నగర్, గజపతినగర్, 55 వార్డు గాంధీనగర్, తిక్కవాని పాలెం, ధర్మానగర్, తాటిచెట్ల పాలెం, 42 వార్డు రైల్వే న్యూ కొలనీ, నందగిరి నగర్, రెల్లి వీధి ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పర్యటించారు. ఈ పర్యటన లో ఆ యా ప్రాంతాల్లో స్థానిక సమస్యలు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించారు.వాటిలో కొన్ని వెంటనే చేయుటకు హామీ ఇచ్చారు. కొన్ని సంబంధించిన శాఖ లతో మాట్లాడి పరిష్కరిస్థానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, లోక్ సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, కాయల వెంకటరెడ్డి, వరుదు కల్యాణి, మాధవి వర్మ, మాజీ వుడా చైర్మన్ రవి రాజు,  మిలినియం శ్రీధర్ రెడ్డి వార్డు సీనియర్ నాయకులు , మహిళలు, కార్యకర్తలు వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సింహాచలం దేవస్థానం ఈవోగా సూర్యకళ నియామకం...

  సింహాచలం దేవస్థానం ఈవోగా సూర్యకళ నియామకం



  సింహాచలం, పెన్ పవర్ ...

   శ్రీ  వరాహ లక్ష్మీ నరసింహ స్వామి  దేవస్థానం ( సింహాచలం) ఈవోగా ఎం. వి  సూర్య కళను  నియమిస్తూ ప్రభుత్వం   ఉత్తర్వులు జారీ చేసింది.  విశాఖ  జాతీయ హైవే నెంబర్ 16 కు  భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న సూర్య కళని,   రెవెన్యూ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా...  నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాసు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గతంలో విశాఖ జెసి 2 గా  పని చేసిన విషయం తెలిసిందే.  కాగా  సింహాచలం దేవస్థానం పరిధిలో భూకబ్జాలు,  ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి, అనేక  సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అలాగే  గతంలో పనిచేసిన ఈ వో లు అవినీతి పరులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు రావడం తో  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దేవస్థానం పరిధిలో భూములు అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయని,  ప్రజాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సూర్య కళ నియామకం ప్రత్యేకత సంతరించుకుంది. అందులో జరుగుతున్న అవినీతి అక్రమాలకు...   ఆమె అడ్డుకట్ట వేస్తారని  భక్తుల విశ్వాసి స్తున్నారు.

తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఫౌండేషన్స్ డే .

 తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఫౌండేషన్స్ డే .

తొర్రూర్ ,పెన్ పవర్.


  ప్రపంచ ఫౌండేషన్స్ డే ని పురస్కరించుకుని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన ఫ్యూచర్  స్టార్స్ ఫౌండేషన్  వాలంటీర్స్ ఆధ్వర్యంలో మహుబూబాద్ జిల్లా తొర్రూర్  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనాధ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ మరియు నిరుపేదలకు నిత్యావసర వస్తువులుపంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ స్టార్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రుద్రారపు  మహేష్ జనరల్ సెక్రటరీ ఆర్కే, జె  అశోక్  వైస్ ప్రెసిడెంట్  మురళి కృష్ణ, జాయింట్ సెక్రటరీ రుద్రారపు  సురేష్,మరియు వాలంటీర్స్ అరుణ్,తుర్పాటి శేఖర్, రా కేష్ మధు  డి. శీను , ఏ మహేష్  ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ,కాసుల శ్రీకాంత్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు స్కూలు ప్రధానోపాధ్యాయులు పి శ్రీను బాబు,, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు , అలీ, వినోద్ రెడ్డి  ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పాడేరు ఐటిడిఏ కాలనీలో తాగునీటి కష్టాలు...

 పాడేరు ఐటిడిఏ కాలనీలో తాగునీటి కష్టాలు..



పైపు లైన్ పగిలి నీటి సరఫరాకు అంతరాయం

మంచి నీటి కోసం ఆదివాసీ మహిళల అవస్థలు

తక్షణమేతాగు నీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ డిమాండ్

పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)

  పాడేరు ఐటీడీఏ రేకుల కొలనీలో మంచినీటి సమస్యతో ఆదివాసీ మహిళలు అల్లాడుతున్న  అధికారులు పట్టించుకో లేదని సిపిఐ డివిజన్ కార్యదర్శి రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పేరుకే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్, మరియు గ్రావిటీ పైపులైన్లు. ప్రజలకు మంచి నీరు అందించడంలో అధికారులు వైఫల్యం చెందారని మండి పడ్డాడు. ఇది ఎక్కడో మారు మూల కాదు పాడేరు ఐటీడీఏ వెనకాల ఉన్న  వీధి లో ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎలా  ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇది మన ఐటీడీఏ తీరని వాక్యనించారు. పాడేరు మండలం పాడేరు ఐ.టి.డి.ఎ కు ఆనుకుని ఉన్న ఐటీడీఏ రేకుల కొలనీలో మంచినీళ్ల సౌకర్యం లేక కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేక నానా అవస్థలు పడుతున్న. అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు: వారు మాట్లాడుతూ ఐటీడీఏకు ఆమడ దూరంలో లేని ఐటీడీఏ వెనకాల ఉన్న  ఐటీడీఏ రేకుల కొలనీ గ్రామం మంచినీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పత్రికల్లో ప్రకటనలు  వచ్చిన కనీసం స్పందించకపోవడం చాలా దుర్మార్గం వారన్నారు ఐటీడీఏ వెనకాల ఉన్న వీధిలోనే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎలా ఉంటుందో కూడా చెప్పనవసరం లేదని ,వారు అన్నారు పాడేరు పట్టణంలో  పేరుకే పెద్ద  ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ మరియు గ్రేట్ పైప్ లైన్లు అలంకార ప్రాయం తప్ప ప్రజలకు మంచినీరు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని లేనిపక్షంలో మహిళలతో పెద్ద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు ఒక ప్రకటనలో హెచ్చరించారు.

గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్

గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్




 పెన్ పవర్  న్యూస్ విశాఖపట్నం సీటీ

  21 వార్డ్ పరిధిలో గల కోటక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఆయా పరిధిలో గల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి తగు సూచనలు చేస్తూ, వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ,   ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు. విశాఖలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చేయుటకు రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి  ప్రణాళిక సిద్ధం చేసారని అన్నారు.  అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు చేరుటకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డ్ లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పొలంబడి కార్యక్రమం

 పొలంబడి కార్యక్రమం



తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలంలో తాళ్ళపూడి  గ్రామం రైతులకు శనివారం ఆత్మా తాళ్ళపూడి వారి సౌజన్యంతో వరిలో సమగ్రమైన సస్యరక్షణ, వ్యవసాయ, ఉద్యాన ప్రభుత్వ పథకాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహిoచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ-పంట నమోదు, రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన ఇన్పుట్స్ సప్లై, డా.వైయస్సార్ పొలంబడి, కస్టమ్ హైరింగ్ సెంటర్స్, కౌలురైతులకు బ్యాంక్ రుణాలు మొదలగు అంశాలను మండల వ్యవసాయ అధికారిణి జి.రుచిత వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నక్కా చిట్టిబాబు, ఉపసర్పంచ్ జి.వి.వి.సత్యనారాయణ, గ్రామ వ్యవసాయ సహాయకులు ఆనంద్, రేవతి, తాళ్ళపూడి పంచాయతీ సెక్రెటరీ వీరన్న, కుకునూరు సెక్రెటరీ యస్.శ్రీను, మరియు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం కార్పొరేటర్ అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం

 దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం కార్పొరేటర్ అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం




దాబా గార్డెన్స్ విశాఖపట్నం పెన్ పవర్ న్యూస్ 

విశాఖ ఇస్లామిక్ ఉమెన్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన VJF ప్రెస్ క్లబ్ డాబా గార్డెన్ నందు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పర్వీన్ బాబీ మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలలో 85 శాతం పంచాయతీలను గెలుచుకొని, పల్లె ప్రజల అభిమానాన్ని చురగొన్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామని త్వరలో జరగబోయే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా తమ అంచనా ప్రకారం పంచాయితీ ఫలితాలు కన్నా ఎక్కువ శాతం సీట్లు సాధించి, అన్ని మేయర్ పదవులను ఆదిష్టిఇస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజారంజక సంస్కరణలే అని అన్నారు. ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు అమలు చేసి వారి అభివృద్ధికి ఎంతో దోహదపడుతూ అనతి కాలంలోనే 100శాతం  ముస్లింల అభిమానాన్ని చూరగొన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అన్నారు. జీవీఎంసీ ఎలక్షన్ దృష్ట 98 వార్డులకు గాను 75 వార్డులలో నామినేషన్ ఒక కొలిక్కి వచ్చిందని మిగతా 25 వార్డులలో నామినేషన్ వేయవలసి ఉందని తాము భావిస్తున్నామని అన్నారు. ప్రత్యేకంగా జీవీఎంసీ ఎన్నికలలో సీటు కేటాయించిన రెండు సీట్లను గెలిపించుకోవడం తోపాటు, ఇతర వార్డులలో కూడా తమ వంతు కృషి గా ప్రచారం చేసి, అఖండ పార్టీ అభ్యర్థులు మెజార్టీ సాధించడం కోసం తాము ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. 75 వార్డులకు గాను కొంతమందికి బీఫామ్ ఇచ్చారని కొన్ని వార్డులలో అభ్యర్థులు యొక్క వార్డులలో ప్రాధాన్యం ఉన్న వర్గానికి చెందిన వ్యక్తి కాదా ఇతర కారణాల దృష్ట్యా ప్రజల్లో ఉన్న గుర్తింపుతో సేవా కార్యక్రమాలను చేస్తున్నవారిని ఆరా తీసి సెలెక్ట్ చేస్తే బాగుంటుందని తాను భావిస్తున్నాను అని అన్నారు. అందులో భాగంగా దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం. దీనిలో భాగంగా 3000 జనాభాతో ముస్లింలు 39 వ వార్డు లో రెండో స్థానంలో ఉన్నారని గత ఎన్నికలలో వీరు అధికంగా ప్రభావం చూపించారు. ప్రతిసారి ఒకే వర్గానికి సీట్లు కేటాయిస్తున్నారు. కానీ ఈ సారి కి తప్పనిసరిగా ముస్లింలకు ఆ సీటు కేటాయించాలని అభ్యర్థిస్తున్నాము. పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి మా విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని నామినేషన్ల పరిశీలన గడువు ముగిసినప్పటికీ ఉపసంహరణ ఇంకా గడువు ఉన్నందున ముస్లిం అభ్యర్థి దక్షిణ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న వార్డులలో అవకాశం  కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోప్రార్వీన్ భాబీ, రేష్మ, సీమ, నాజమా, రుబినా ఖాతున్, ఖాతీజ, మెహెరావున్నిసా, రెహానా, నగ్మా,  పాల్గొన్నారు.

వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దు

 వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దు  




విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు 

విజయనగరం,పెన్ పవర్

 వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం 16వ డివిజన్, సాయంత్రం 22, 23, 24 డివిజన్లలోని పలు ప్రాంతాల్లో అదితి గజపతిరాజు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. అదితి గజపతిరాజు ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ఆదాయాలు పడిపోయి ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చూసి దిక్కుతోచని స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. అలాగే ఆస్తి విలువ ఆదారంగా మున్సిపల్ పన్నులను పెంచుతూ ప్రభుత్వం జీవోలను జారీ చేయడం దుర్మార్గమన్నారు. గత ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హెూదా సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నిండా ముంచేసారని విమర్శించారు. మద్యాపాన నిషేదం అంటూ మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక నాశిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్నారు. సంక్షేమ పధకాల డబ్బులన్నీ తిరిగి బ్రాందీ షాపులకే వస్తున్నాయని ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పట్టణంలో కొళాయిలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం జరిగిందని, మళ్లీ టీడీపీకే ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ అభ్యర్ధి పురుషోత్తం అనురాధ, 22వ డివిజన్, మేయర్ అభ్యర్ధి కంది శమంతకమణి, 23వ డివిజన్ అభ్యర్ధి పతంగి విజయకృష్ణ, 24వ డివిజన్ అభ్యర్ధి గొల్లకోటి హారిక, పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పార్టీ నాయకులు ఉండ్రాళ్ల వెంకటప్పారావు, విజ్జపు ప్రసాద్, గొల్లకోటి గురునాథ్, కంది మురళీ నాయుడు, ఉండ్రాళ్ల రాజేష్, గొల్లకోటి శివ, పట్టణానికి చెందిన

పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కలమడుగులో ప్రారంబమైన నరనారాయణస్వామి జాతర

కలమడుగులో ప్రారంబమైన నరనారాయణస్వామి జాతర

మంచిర్యాల బ్యూరో , పెన్ పవర్


 జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలోని శ్రీ నరనారాయణస్వామి దేవాలయం వార్షికోత్సవం అంగరంగ వైబవంగా ప్రారంబం అయింది. శుక్రవారం రోజున మండలంలోని కలమడుగు గ్రామంలోని అతి పురాతన దేవాలయం శ్రీ నరనారాయణస్వామి దేవాలయం వార్షికోత్సవ జాతర కార్యక్రమాలు ఆలయకమిటీ ఆద్వర్యంలో పురోహితులు కాకేర నర్సయ్యశర్మ కాకేర రాజనరేంద్రేశర్మ లు ప్రారంబించారు. ఈ సందర్బంగా ఈ రోజు మహిళలు కుంకుమ పూజలు జరిగాయి.136 మండి మహిళలు ఈ కుంకుమ పూజలలో పాల్గొన్నారు. అదేవిదంగా ఉదయం నుండే పూజారులు దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమలో శ్రీహరి మౌనస్వామి  గ్రామ సర్పంచ్ కార్తీకరావు  ఆలయకమిటీ సబ్యులు నర్సగౌడ్ అంజగౌడ్ గోపాల్ రావు శంకరయ్య ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్ వి కె షిప్పింగ్ కార్మికుల ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి....సి.ఐ.టి.యూ

 ఎస్ వి కె షిప్పింగ్ కార్మికుల ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి....సి.ఐ.టి.యూ




మహారాణి పేట, పెన్ పవర్

శ్రీ వంశీ క్రిష్ణ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో 13 మంది కార్మికులను తొలగించారు ఆ కార్మికులు విధుల్లో పెట్టుకోమని లేబర్ కమిషనర్ ఆర్డర్ కూడా ఇచ్చారు అయినా సరే వంశీకృష్ణ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు కార్మికులే సక్రమంగ చూడని వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు ఏలా రకంగా ఆదేశిస్తారు. తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి లేనిపక్షంలో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి లేకపోతే ఆయన పోటీ చేసే వార్డు లోకి వచ్చి ప్రచారం చేస్తామని హెచ్చరించారు అలాగే పనిచేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు ఇంకా ఇవ్వట్లేదు పి.యఫ్ కూడా కట్టలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మా సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అ ధర్నా జరిగింది ఈ ధర్నాలో సిఐటియు నగర కార్యదర్శి డి.అప్పలరాజు, రాము,రమణ, గురువులు, సాంబ సింహాచలం,బి.జగన్ తదితరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...