Followers

పాడేరు ఐటిడిఏ కాలనీలో తాగునీటి కష్టాలు...

 పాడేరు ఐటిడిఏ కాలనీలో తాగునీటి కష్టాలు..



పైపు లైన్ పగిలి నీటి సరఫరాకు అంతరాయం

మంచి నీటి కోసం ఆదివాసీ మహిళల అవస్థలు

తక్షణమేతాగు నీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ డిమాండ్

పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)

  పాడేరు ఐటీడీఏ రేకుల కొలనీలో మంచినీటి సమస్యతో ఆదివాసీ మహిళలు అల్లాడుతున్న  అధికారులు పట్టించుకో లేదని సిపిఐ డివిజన్ కార్యదర్శి రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పేరుకే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్, మరియు గ్రావిటీ పైపులైన్లు. ప్రజలకు మంచి నీరు అందించడంలో అధికారులు వైఫల్యం చెందారని మండి పడ్డాడు. ఇది ఎక్కడో మారు మూల కాదు పాడేరు ఐటీడీఏ వెనకాల ఉన్న  వీధి లో ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎలా  ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇది మన ఐటీడీఏ తీరని వాక్యనించారు. పాడేరు మండలం పాడేరు ఐ.టి.డి.ఎ కు ఆనుకుని ఉన్న ఐటీడీఏ రేకుల కొలనీలో మంచినీళ్ల సౌకర్యం లేక కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేక నానా అవస్థలు పడుతున్న. అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు: వారు మాట్లాడుతూ ఐటీడీఏకు ఆమడ దూరంలో లేని ఐటీడీఏ వెనకాల ఉన్న  ఐటీడీఏ రేకుల కొలనీ గ్రామం మంచినీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పత్రికల్లో ప్రకటనలు  వచ్చిన కనీసం స్పందించకపోవడం చాలా దుర్మార్గం వారన్నారు ఐటీడీఏ వెనకాల ఉన్న వీధిలోనే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎలా ఉంటుందో కూడా చెప్పనవసరం లేదని ,వారు అన్నారు పాడేరు పట్టణంలో  పేరుకే పెద్ద  ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ మరియు గ్రేట్ పైప్ లైన్లు అలంకార ప్రాయం తప్ప ప్రజలకు మంచినీరు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని లేనిపక్షంలో మహిళలతో పెద్ద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు ఒక ప్రకటనలో హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...