Followers

ఆడబిడ్డల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

 ఆడబిడ్డల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ప్రధాన ధ్యేయం 

దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా..

రాష్ట్రంలో సిఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు

రెండున్నర ఏళ్లలో 4000 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌


రామగుండం,  పెన్ పవర్ 

తెలంగాణ ఆడబిడ్డల వివాహాలు పేదింటి తల్లిదండ్రులకు భారం కావద్దని దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేసి నిరుపేద కుటుంబాల్లో అనందం నింపుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేధికలో 77 కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమాఖ్య పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు పుడితే అమ్ముకుని పరిస్థితులుండేవని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సిఎం కేసీఆర్ ఆడ పిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టడంతో ఈ రోజులల్లో ఆడపిల్ల పుడితే మహలక్ష్మీ పుట్టిందనే సంతోషించే పరిస్థితులున్నాయని అన్నారు. ఆడపిల్లల పెళ్లీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను అమలు చేసి 1లక్ష 116 రూపాయలు పెళ్లి కానుకగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సకల వర్గాల సంక్షేమం కోసం సీఎం నిత్యం శ్రమిస్తున్నారని రైతులను రాజులుగా మార్చలన్నా సంకల్పంతో ఉచిత కరెంట్, రైతు భీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్న సిఎం కేసీఆర్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తే ప్రజలు సహించవద్దని, తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రామగుండం నియోజవర్గంలోని ప్రజల సేవ కోసం పని చేస్తున్నామని తము ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు నియోజవర్గంలో 4000వేల కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులను లబ్దిదారులకు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం తహాసీల్ధార్ బండి ప్రకాష్ తో పాటు ఎంపిపి దుర్గం విజయ, జడ్పీటిసి ఆముల నారాయణ, వైస్ ఎంపిపి మట్ట లక్ష్మి-మహేందర్ రెడ్డి, సర్పంచ్ లు బండారి ప్రవీణ్ కుమార్, ఎదులపూరం నీరజ-వెంటటేష్, కొల్లురి సత్య-సతీష్, గంగాధరి దేవమ్మ-రామయ్య, కుర్ర వెంకటమ్మ-నూకరాజు, ఎంపిటిసి కొలిపాక శరణ్య-మధుకర్ రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు దివాకర్, మండల కో-ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, తెరాస పార్టీ మండల అధ్యక్షులు తిరుపతినాయక్, కోల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 6 సం॥లుగా 80 వేల మంది రజక లబ్దిదారుల ఎదురు చూపులు

రాష్ట్రంలో 6 సం॥లుగా 80 వేల మంది రజక లబ్దిదారుల ఎదురు చూపులు

రామగుండం కార్పొరేషన్ రజక సంఘం అధ్యక్షులు శంకర్ రజక

రామగుండం,  పెన్ పవర్ 

 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మన రాష్ట్రంలో చాలా మంది రజక సోదరులకు ప్రభుత్వం తప్పక అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తుందనే ఆశతో దీనిలో భాగంగానే 2015 నుండి 2021 7సం॥లలో కొన్ని అంతకు ముందు తెలంగాణలో గల 33 జిల్లాల నుండి రజక సోదరులు, కులవృత్తి దారులు రైతులు చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకున్న వారు నిరుద్యోగులు, మహిళలు మరియు రజక ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ద్వారా సోసైటీ గ్రూప్ లను ఏర్పాటు చేసుకున్న సంఘాల సభ్యులు రజక లబ్దిదారులు 50 వేల నుండి 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలకై ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గత ఏడాది కిందట కొన్ని జిల్లాల్లో 2 వేల మందికి పైగా రజకులకు మాత్రమే కేవలం 50 వేల రూపాయల చొప్పున సబ్సిడీ రుణాలు మంజూరు చేశారు. ఇంకా నేటికీ 68 వేల మందికి పైగా రజకులు ఎదురు చూస్తునే ఉన్నారని ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీలోనే చాలా మంది రజక సోదరులు పని చేస్తున్నారని మంత్రులను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లను తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ కలిసి విన్నవిస్తున్న లాభం లేకపోయిందని కానీ ఈ రుణాల కోసం ఏ ఒక్క పార్టీ నాయకులు మద్దతు రజకులకు అందించడం లేదని మరింత ముందుకు వెళ్ళేందుకు సంబంధిత బీసీ మంత్రి, ఆర్థికశాఖ మంత్రి దృష్టికి అధికార పార్టీ నాయకులు ఎవరు తీసుకెళ్లడం లేదని రజకులు బాధపడుతున్నారని ఇకనైనా ఈ అంశం పై ప్రయత్నాలు చేయాలని రామగుండం కార్పొరేషన్ రజక సంఘం అధ్యక్షులు శంకర్ రజక ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

మద్యం బాటిల్ ల పట్టివేత

 మద్యం బాటిల్ ల పట్టివేత... 

బేలా, పెన్ పవర్

 కరోనా మహమ్మారి నేపథ్యంలో  గ్రామ ప్రజలకు హాని కలిగే విషయాలు,  ఏ పనులైనా చేయకుండా ఉండాలని నేపథ్యంలో బేల మండలంలోని సిర్సన్న  గ్రామస్తుల, విడిసి ల మాట వినకుండా గ్రామానికి చెందిన ఫరీద్ అనే వ్యక్తి తన కిరాణా కొట్టు లో మద్యం సీసాలు అమ్ముకుంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు గ్రామ పెద్దలు విడిసి నాయకులు మద్యము అమ్మ వద్దని  సూచించినప్పటికీ వీడీసీ మాట లెక్క చేయకుండా మద్యం అమ్మేవాడు,  ఈ క్రమంలో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు గ్రామ విడిసి నాయకులు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్సై కళ్యాణ్ పోలీసులతో అక్కడికి చేరుకొని, అక్రమంగా మద్యం అమ్ముతున్న 30 ఆఫీసర్ ఛాయిస్,  చీప్ లిక్కర్ బాటిల్ అను స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు చేపట్టి అతనిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇండియన్ ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ కు ఘన స్వాగత సన్మానం

 ఇండియన్ ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ కు ఘన స్వాగత సన్మానం

వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం

వన్ టౌన్ సిఐ రమేష్ బాబు

రామగుండం , పెన్ పవర్

వ్యాయామం చేయడం ద్వారా ప్రశాంతతతో పాటు వ్యాధులను నిర్మూలించే శక్తి మెరుగుపడుతుందని ఇండియన్ ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పూర్తితో ప్రారంభమైన సైకిల్ యాత్ర శుక్రవారం గోదావరిఖనికి చేరుకోగ వన్ టౌన్ సీఐ రమేష్ బాబు మరియు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఐ భారత్ కు పులా మాల వేసి స్వాగతం పలికారు. సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఖచ్చితంగా వ్యాయమం చేయాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని అన్నారు. ఈ సందర్భంగా భారత్ యాదవ్ మాట్లాడుతూ రోజుకు 160 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా2400 కిలోమీటర్లు ప్రయాణం చేయడమే తన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉమాసాగర్ మరియు హోంగార్డు రామిల్ల రాజశేఖర్, ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాజీపేట జైపాల్ పాల్గొన్నారు.

ప్రజలే నా పంచ ప్రాణాలు

 ప్రజలే నా పంచ ప్రాణాలు

కరోనా పేషెంట్లు కోలుకునేంత వరకు అండగా ఉంటా.!

గుండె నిబ్బరం కోల్పోయిన వారికీ మనోధైర్యం అనే మందుతో బాగు చేస్తా..!

తెరాస మహిళ నేత కందుల సంధ్యారాణి



రామగుండం ,  పెన్ పవర్ 

రామగుండం నియోజకవర్గంలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అసలు ఎవరావిడా.? అనే ప్రశ్న ఎవరికి వేసిన చాలు అందరి నోట వచ్చే ఒకే ఒక్క మాట.! ఎవరైన సరే ఆకలితో ఉన్న అంటే చాలు వారికి అన్నం పెట్టే అమ్మ.! అని ఎవరైన సరే ఆపదలో ఉన్నామని తెలిస్తే చాలు మరు క్షణమే వాళ్ళ వద్దకు వెళ్ళి వారి కష్టం తీర్చే ఓ అక్క.! నియోజకవర్గ ప్రజల నోట్లో నాలికై ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించే ప్రజలే తన పంచ ప్రాణాలుగా భావించి అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆది పారా శక్తే మా మహా నాయకురాలు కందుల సంధ్యారాణి అని  చెప్పే వాళ్ళు కోకొళ్ళలు.. ఇక అసలు విషయానికి వస్తే పాలకుర్తి మండలంలో గత రెండు రోజుల క్రిందటే కరోనా వైరస్ భారిన పడ్డ పేషెంట్లకి వారి ఆరోగ్యం కుదుట పడి వారు త్వరగా కోలుకోవాలని వాళ్ళ ఇంటింటి తానే స్వయంగా తిరుగుతూ వాళ్ళ రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేయడమే కాకుండా గుండె నిబ్బరం కోల్పోయిన వాళ్ళలో మనో ధైర్యాన్ని నింపారు. అదే విధంగా శుక్రవారం రోజున మళ్ళీ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుక్కలగూడుర్ గ్రామంలో కూడ కరోనా సోకి హోం క్వారంటైన్ లో ఉన్న కరోనా వైరస్ బాధితుల ఇంటింటికీ తిరుగుతూ వారిని పరామర్శిస్తూ గుండె నిబ్బరాన్ని కోల్పోయిన వారిలో మనోధైర్యం అనే మందుగా వాళ్ళకి కొండంత ధైర్యాన్ని నింపుతూ వాళ్ళ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన పండ్లని డ్రై ఫ్రూట్స్ ని అందజేస్తూ మంచి పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని వారికి సలహాలు సూచనలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తన వెంట గోపు రామన్న, ఆశ్రఫ్, చెల్ల సురేష్, పత్తిపాక శంకరయ్య, ఆడెపు కిషణ్, రాజు, శ్రీనివాస్, బరుపటి నారాయణ మరియు  కర్ణ, పద్మ తదితరులు ఉన్నారు.

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ 9 రోజులు బంద్

 కేసముద్రం వ్యవసాయ మార్కెట్ 9 రోజులు బంద్,,

మార్కెట్ చైర్మన్ మరి నారాయణ రావు...

కేసముద్రం, పెన్ పవర్

 కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో పనిచేసే గుమస్తాలు, హమాలీలు, దడువాయిలు, వీరితో పాటు వ్యాపారస్తుల కోరికమేరకు కోవిడ్-19  వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున వాక్సిన్ వేయించుకొనుటకుతేది.01.05.2021నుండితేది.09.05.2021 వరకు మార్కెట్ బంద్ చేయాలని కోరినట్లు మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు తెలిపారు. అంతేగాక మిల్లుల వద్ద కొనుగోలు చేయమని, అట్టి పనులలో కార్మికులు పాల్గొనమని చెప్పడంతో రైతులు తమ సరుకులను మార్కెట్ గాని, వ్యాపారస్తులమిల్లుల వద్దకు గాని తీసుకురావద్దని తెలియజేశారు. ఈ పది రోజుల సెలవులలో మే 1న మే డే సెలవు గా, మే 2న ఆదివారం కాగా, మే 3నుండి మే 7 వరకు కూలీలు హమాలీల వ్యాపారస్తుల కోరికమేరకు కరోన బంద్ గా అలాగే మే 8 వారాంతపు సెలవు గా మే 9న ఆదివారం కాగా రైతుల ఇట్టి విషయాన్ని గమనించి రైతులు ఎవరు కూడా సరుకులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని తిరిగి తేదీ 09.05.2021 (సోమవారం)  రోజున మార్కెట్ యార్డ్ కు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకు రాగలరని తెలియజేయడం జరిగింది.

బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

 బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం


తొర్రూరు, పెన్ పవర్

టివిఎస్ ఎక్సెల్ బైక్ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సిహెచ్ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన మేడిగా లక్ష్మయ్య (57) బట్టల వ్యాపారం చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నారు. తొర్రూరు మండల కేంద్రానికి పని మీద వచ్చి పని ముగించుకొని, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తన ఎక్సెల్ బండి పై ఇంటికి వెళుతున్న దారిలో బొత్తల తండా శివారులోని కల్వర్ట్ దగ్గర కాలువలో ఉన్న బండా రాయిపై పడి, తలకు బలమైన గాయం కావడంతో, మరణించడం జరిగిందని,మృతుని భార్య మేడిగా మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.శవ పంచనామ కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మయ్య మృతితో అమ్మాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

హెల్ప్ లైన్ సెంటర్ ను సందర్శించిన ఆదిలాబాద్ డి ఎం హెచ్ ఓ

 హెల్ప్ లైన్ సెంటర్ ను సందర్శించిన  ఆదిలాబాద్ డి ఎం హెచ్ ఓ...

ఆదిలాబాద్ ,  పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరెందర్ రాథోడ్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్ని మతాల పెద్దల ఆధ్వర్యంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు లో మాట్లాడారు ఈ సంధర్భంగా డి.యం.హెచ్.ఓ. మాట్లాడుతూ మొదట సాజిద్ ఖాన్ గారికి కృతజ్ఞతలని తను చెప్పిన వెంటనే అన్ని మతాల పెద్దలతో ఇంత చక్కటి అవగాహన కార్యక్రమం చేపట్టాడం అభినందనీయమన్నారు.మన ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా వ్యాధి తీవ్రస్థాయిలో ఉందని.ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటించక పోవడం,నిర్లక్ష్యపు ధోరణి  ఈ కరోనా మహమ్మారి తీవ్రతరం కావడానికి ముఖ్యకారణాలు అని అన్నారు.మాస్కులు అన్ని సమయాల్లో ధరించాలని, సామాజిక దూరం పాటించి,ఏ వస్తువు ముట్టినా సబ్బుతో చేతులు కడుక్కోవాలని ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు.  ఈ మూడు నియమాలు పాటించాలని కోరారు. 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరూ ఎలాంటి సందేహాలు లేకుండా భయపడకుండా వాక్సిన్ తీసుకోవాలని,ఒకవేలా మళ్ళీ పాజిటివ్ వచ్చినా చిన్న చిన్న లక్షణాలతో,మరణం లేకుండా బయట పడవచ్చని తెలిపారు.అనంతరం వివిధ మతాల మత పెద్దలు  పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆయా మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కరోనా కట్టడికి మే 8 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

 కరోనా కట్టడికి మే 8 వరకు  రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

మందమర్రి ఎస్.ఐ లింగంపల్లి భూమేష్

పెన్ పవర్,  మందమర్రి 

రాష్ట్రంలో సెకండ్ వేవ్ లో   రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నందున, ప్రజలను ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పట్టణ ఎస్.ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. అన్నారు. ప్రజలు తమ పనులను రాత్రి 9 గంటల లోపు ముగించుకొని ఎవ్వరి ఇండ్లలో వారు ఉండాలని మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని కిరణా దుకాణాలు,వైన్స్ షాపులు,హోటళ్లు వ్యాపార సముదాయాలను (అత్యవసర సేవలు మినహా) ప్రతి రోజు రాత్రి 8 గంటల లోపే  మూసి వెయ్యాలని ఆయన తెలిపారు.అతి వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మరిని కట్టడి చెయ్యడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై కరోనా బారిన పడకుండా మనల్ని మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలన్నారు.పై నిబంధనలు దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంగిస్తే మరింత కఠిన ఆంక్షలను విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కరోన నిభందనలపై నిర్లక్ష్యం వ్యహిస్తే కఠిన చర్యలు

 కరోన నిభందనలపై నిర్లక్ష్యం వ్యహిస్తే కఠిన చర్యలు - సిఐ నర్సింహ్మ స్వామి

మాస్కు, బౌతిక దూరం తప్పనిసరి

కర్ప్యూ  నిబంధనలు మరింత కఠినం బయటకు వస్తే కేసులు


పెన్ పవర్, మల్కాజిగిరి 

కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ, మాస్కులు, బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి అన్నారు. కరోనా నిబంధనలు నిర్లక్ష్యం వ్యహిస్తే వారిపై నేరేడ్మెట్ పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశానుసారం ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలో, కాలనీలలో తనిఖీలు చేస్తూ మాస్కులు, కర్ఫ్యూ నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పిస్తూ పెట్టి కేసు నమోదు చేస్తున్నామని సిఐ నరసింహ స్వామి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 68, బౌతిక దూరం పాటించని వారిపై 15, గుంపులు గుంపులుగా తిరుగు తున్న వారిపై 9, కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై2, ప్రధాన రహదారిపై పాన్ గుట్కా వేసుకొని ఉమ్మేసిన వ్యక్తిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సింగరేణి లో రక్షణ చర్యలు తీసుకోవాలి

 సింగరేణి లో రక్షణ చర్యలు తీసుకోవాలి

టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో వినతి

బెల్లంపల్లి , పెన్  పవర్

 సింగరేణి వణికిస్తున్న తరుణంలో ఎండలు పెరుగుతున్న కారణంగా కరోనా కూడా విజృంభిస్తు కావున సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఇతర డిపార్ట్మెంట్లలో పని చేస్తున్నా కార్మికులకు వైరస్ సోకకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి ఆసుపత్రి పర్యవేక్షణా ధికారికి వినతిపత్రం అందజేశారు, అనంతరం ఉపాధ్యక్షులు మనిరామ్ సింగ్ మాట్లాడుతూ  శానిటైజర్లు మాస్కులు ఉచితంగా కార్మికులకు అందించాలని,కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా వైరస్ కార్మికులకు వ్యాధి వ్యాపించి నట్లయితే జాతీయ విపత్తు చట్టం 1897 ప్రకారంగా సింగరేణిలో కార్మికులకు వేతనాలు కట్టి ఇవ్వాలని అన్నారు కార్మికులు కరోనా బారినపడి చనిపోయినట్లు అయితే గని ప్రమాదంగా గుర్తించాలని, కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంతరం ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు అమానుల్లాఖాన్ ,దుర్గం రాజయ్య, బొల్లు మల్లయ్య, రియాజ్, తలారి రాజు, సుధాకర్, అశోక్, భూపతి, తదితరులు పాల్గొన్నారు

డ్యూటీ నర్సులకు ఎన్ని తిప్పలో..?

 డ్యూటీ నర్సులకు ఎన్ని తిప్పలో..?

అకామిడేషన్ పేరుతో శ్రమను దోచుకుంటున్న ఆసుపత్రి బాసులు..??

దాదాపు రోజుకు 12గంటల పనివేళ్లలు..ఇలా చేస్తే..ఆరోగ్య పరిస్థితి ఏమిటీ???

కొన్ని వైద్యశాలలో నర్సులకు అసలుఆరోగ్య రక్షిత కిట్లు ఇస్తున్నారా..???

12గంటలు డ్యూటీ చేసి..కంటిన్యూగా రాత్రిలో డ్యూటీనా..???

రాత్రి సమయంలో ఎటువంటి భద్రత లేకుండా నర్సును ఒంటరిగా కోవిడ్ డ్యూటీ రప్పించడం భావ్యమా..???

వైద్యశాలలు నిర్వహిస్తున్న డాక్టర్లకు విశ్రాంతి అవసరం..??అకామిడేషన్ పేరుతో ఇలా నర్సులతో కంటిన్యూగా డ్యూటీ చేప్పించడం ఎంత వరకు సబబు???                               ఆప్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి ప్రశ్న

పెన్ పవర్, హైదరాబాద్

 నేడు తెలుగు రాష్ట్రాలలో, జిల్లాలో ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ లపై కోవీడ్ మహమ్మారి సందర్బంగా జరిగే అవినీతి పై విజిలెన్స్ దాడి చేస్తుడడం  సంతోషం.. అలాగే వాటిల్లో పని చేసే డ్యూటీ నర్స్ ల సమస్యలను చూడాలని ఆప్స్ రాష్ట్ర అధ్యక్షులు "ఎన్.రాజా రెడ్డి" కోరారు. నేటి ప్రస్తుత సమాజంలో పుట్టగొడుగుల్లా ఆసుపత్రిలు వీధి ఒక్కటి చొప్పున కొలువై.. ప్రస్తుత తరుణంలో వారి వారి ప్రత్యేకతలతో ప్రత్యేక చికిత్సలతో ఓ హోదా తెచ్చుకుంటున్నారు అసలు విషయానికి వస్తే ఆసుపత్రిలో అన్ని వసతులు ఇస్తామని చెప్పి..రోజుకు 8గంటలు మాత్రమే పనిచేయు వేళలని యువతులకు చెప్పి చేర్చుకుంటుండడం..వీరి మాటలను నమ్మి అకామిడేషన్ మరియు పని చేయు సమయ వేళలు 8గంటలని చేరిన రోజు నుంచి నర్సులకు ఎన్ని బాధలో.. వీరి బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియదు..సార్ కు చెబితే ఏమంటావో.. ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు.. దిక్కుతోచని స్థితిలో ఎందరో..మరెందరో నర్సులు  మదనపడి పోతున్నారు. యాజమాన్యాలు ఒక్కసారి వారి కష్టాలను తెలుసుకుంటే నియమ నిబంధనలను గుణంగా పనిచేయు సమయం 8గంటలు కానీ పలు కార్పోరేట్ ఆసుపత్రిలో.. సాధారణ హాస్పిటల్స్ లో నర్సులతో అదనపు సమయంలో విధులు చేప్పించు కుంటూ..జోబులు నింపుకుంటున్న కొన్ని సాధారణ ఆసుపత్రులు..కొన్ని ఆసుపత్రుల్లో మరొక్క ముఖ్య విషయం ఏమనగా కొన్ని ఆసుపత్రుల్లో రోజుకు 50మంది కరోనా పేషంట్లు వస్తున్న నేపథ్యంలో   ఒక్క సెక్యూరిటీ ఉండరు..ఒక్క అటెండర్ ఉండరు.. ఒక్క స్వీపర్ ఉండరు..ముగ్గురు చేసే పనిని ఒక్కరితోనే పనిని చేప్పించుకుంటూ ..నర్సులకు పనివత్తిడి పెంచుతూ..తీవ్ర ఆరోగ్య పరిస్థితికి కారణం అవ్వుతున్నారని వారి తల్లిదండ్రుల వాదన. ఇక్కడ ఈ చిన్న వైద్యశాలల్లో నగర వాసులకు ఏదేని ఆరోగ్య సమస్యలు వచ్చినను ఇక్కడకు వస్తే తప్పకుండా నయం చేసి పంపిస్తారనే  వైద్యులుగా పేరుపొందిన వీరు.. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లేడీ నర్సును ఒంటరిగా కోవిడ్ పేషెంట్స్ లకు దెగ్గర డ్యూటీ నిర్వహిస్తున్నారో అంతుబట్టని విషయం.. అంతేకాకుండా లేడీ నర్సులకు ఆత్మరక్షణ కిట్లు ఉండవు..టైమ్ కు తిండి ఉండవు.. నిద్ర ఉండవు.. స్వంత పనులకు సమయం దొరకదు..ఇంత కఠినాటికఠినంగా ఎలా వీరి శ్రమను దోచుకుంటున్నారు. వైద్య శాలల్లో ఒక్కసారి విచారణ చేప్పట్టితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది..వైద్యశాలలు నిర్వహిస్తున్న వైద్యులు ఇంకనైన చొరవ తీసుకుని.. సంపాదనే ధ్యేయంగా కాకుండా..పనిచేస్తున్న లేడీ నర్సులపై పని భారాన్ని తగ్గించి..ఎంతవరకు అవసరమో అంతవరకు నర్సులను.. అటెండర్లను..సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి..విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కోవిడ్ ఆత్మరక్షణ పరికరాలను ఇచ్చి..నియమ నిబంధనలనుగుణంగా పని చేయు సమయంలో విధులు నిర్వహించేలా చొరవ తీసుకుని వారికి వేతనాలను ఇవ్వాలని వైద్యశాలను నిర్వహిస్తున్న వైద్యులు ఇంకనైన మేల్కొనకపోతే అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా రెడ్డి కోరారు.

విద్య రంగంలో ఎంఈఓ రాజయ్య సేవలు మరువలేనివి

 విద్య  రంగంలో ఎంఈఓ రాజయ్య సేవలు మరువలేనివి

సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

విద్యారంగంలో ఎంఈఓ మంకు రాజయ్య సేవలు మరువలేనివని రాచర్ల బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి అన్నారు.  ఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గల జ్ఞానదీప్ హైస్కూల్లో మండల విద్యాధికారి మంకు రాజయ్య మరియు వెంకటాపురం ఉపాధ్యాయుడు ఓలాద్రి యాదగిరిరెడ్డి లకు ఉపాధ్యాయ బృందం నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ టిఆర్ఎస్ మండల  అధ్యక్షుడు వరుస  కృష్ణ హరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ లు  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.   కరోనాతో మరణించిన ఎంఈఓ మంకు రాజయ్య మరియు ఉపాధ్యాయుడు ఓలాద్రి యాదగిరిరెడ్డి  లకు  జ్ఞానదీప్ హై  స్కూల్ ఉపాధ్యాయ బృందం మేనేజ్మెంట్,  ప్రభుత్వ ఉపాధ్యాయులు నివాళులు అర్పించి వాళ్ళు చేసిన సేవలను కొనియాడారు.  ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంఈఓ మంకు రాజయ్య ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో అహర్నిశలు కృషి చేశాడని ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత  మంకు రాజయ్య కు దక్కుతుందని అన్నారు.  అనంతరం సర్పంచ్ కొండపురం బాల్ రెడ్డి  మాట్లాడుతూ  మంకు రాజయ్య కరోనాతో చనిపోవడం వలన మన రాష్ట్రము మంచి విద్యావేత్త ను కోల్పోయిందని అన్నారు.  విద్యా రంగంలో అహర్నిశలు కృషి చేసి విద్యావ్యవస్థను మార్పు తెచ్చింది  ఎంఈఓ మంకు రాజయ్య అని అన్నారు.  అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పాఠశాలలు అన్నీ ఒక మంచి స్థాయిలో ఉన్నాయి అంటే దానికి కారణం మంకు రాజయ్య అని అన్నారు.  ప్రభుత్వ పాఠశాలను ఒక కార్పొరేట్ పాఠశాలలు గా మార్చిండని  రమేష్ గౌడ్ అన్నారు.  రాజయ్య మరణము విద్యా రంగానికి తీరని లోటు అని అన్నారు.  రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం మండల వనరుల కేంద్రం ను మంకు రాజయ్య కేంద్రాలుగా  మార్చాలని ప్రభుత్వాన్ని కొండ రమేష్ గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో జ్ఞానదీప్ స్కూల్ కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ,  ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్. సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వర్ష కృష్ణహరి, ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి.  ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయులు బాలయ్య మారుపాక రాజు డాక్టర్ భాను ప్రేమ్ సాగర్ రవీందర్,  తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు

ముస్లిం సోదరులకు రంజాన్ కానుక..శిరీష రెడ్డి

 ముస్లిం సోదరులకు రంజాన్ కానుక..శిరీష రెడ్డి 


పెన్ పవర్,  కాప్రా

ఎ.ఎస్.రావు నగర్ డివిజన్ లోని మహమ్మదీయ మసీదులో రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫా లను డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శిరీష మాట్లాడుతూ కరోన వైరస్ రెండవ దశ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటిస్తూ స్వీయనియంత్రణ స్వీయ పరిశుభ్రత పాటించాలని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కోవిడ్  నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, నాను లలిత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

చిల్కానగర్ డివిజన్ లో రంజాన్ తోఫా పంపిణీ

 చిల్కానగర్ డివిజన్ లో రంజాన్ తోఫా పంపిణీ 

తార్నాక,  పెన్ పవర్ 

 చిల్కానగర్ డివిజన్ లో చిల్కానగర్ పెద్ద మసీదు (మజీద్ ఈ అక్స ) లో  రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రంజాన్ తోఫాలను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో  250 రంజాన్ తోఫా లను ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా. కార్పొరేటర్ మాట్లాడుతూ  కష్టకాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయమని, ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఖచ్చితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం నిజంగా కూడా అటువంటి గొప్ప సీఎం తెలంగాణ ప్రజలకు దొరకడం చాలా అదృష్టం అని అన్నారు. డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సోదరులను అదేవిధంగా అన్ని వర్గాలను అక్కున చేర్చుకొని ఇట్లాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా  రంజాన్ పండుగను   దృష్టిలో పెట్టుకొని వారికి దుస్తులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో  మస్జీద్ ఏ అక్సా అధ్యక్షులు ఎండీ యూసుఫ్, వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, జనరల్ సెక్రటరీ మహమ్మద్ హనీఫ్, జాయింట్ సెక్రటరీ నజీర్ అలీ ఖాన్, ట్రెజరర్ మహమ్మద్ గౌస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ రహీం, మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, కొంపల్లి రాజ్ కుమార్, ఆబ్బు భాయ్, కుమార్,పరమేష్,పుష్ప రాజ్,బింగి శ్రీనివాస్, ముద్దం శ్రీనివాస్, మహమూద్, ఫారుక్,  సాయినాజ్ బేగం,సంతోష్ నాయక్,బాలు సుందర్, కుమార్, శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.

దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలి

 దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలి 

ఓయూలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం ప్రారంభించాలి

ఏ ఐ ఎస్ ఫ్  డిమాండ్ 

తార్నాక,  పెన్ పవర్

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ గా ఇవ్వాలని ఏ ఐ ఎస్ ఫ్ జాతీయ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యం లో  ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఐ ఎస్ ఫ్ కౌన్సిల్ ఆర్ట్స్ కళాశాల ముందు ఆందోళన నిర్వహించింది దేశంలోని ప్రజలందరికీ ఫ్రీ గా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన *రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ ఆర్. ఎన్ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షు లు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ  ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వంకి డిమాండ్ చేశారు.  గతంలో  దేశంలో సంభవించిన అనేక వ్యాధులకు ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్,టీకాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. మోడీకి దేశ ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు. ప్రజలందరికీ ఫ్రీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేదాకా పోరాడుతామని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఐ ఎస్ ఫ్ కార్యదర్శి క్రాంతి రాజ్ మాట్లాడుతూ ఓయూ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు కరోనా మహమ్మారి కి బలి కావడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ల,ఉద్యోగుల ఆరోగ్యం పరిరక్షణకు యూనివర్సిటీ అధికారులు  ఓయూ లోనే కరోనా వ్యాక్సిన్ పంపిణి సెంటర్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఓయూ హెల్త్ సెంటర్ నీ మౌలిక సదుపాయాలు కల్పించి కరోనా ఐసొలేషన్   కేంద్రంగా  మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో ఏ ఐ ఎస్ ఫ్ ఓయూ నేతలు రహమాన్, రాజు, పవన్, లింగస్వమి, నిఖిల్, అన్వర్, హరీష్, చిన్న, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఏరియా జనరల్ మేనేజర్ మేనేజర్ లతో కూర్చొని, కొవిడ్,పై సమీక్ష సమావేశం

 ఏరియా జనరల్ మేనేజర్ మేనేజర్ లతో కూర్చొని, కొవిడ్,పై సమీక్ష సమావేశం


పెన్ పవర్,  మందమర్రి 

కరోనా కోవిడ్ పై ప్రస్తుత పరిస్థితులను అన్ని పెరియాల జనరల్ మేనేజర్ లను అడిగి తెలుసుకున్నారు కరొన వచ్చిన ఉద్యోగులకు, ఆక్సిజన్ మెడిసిన్ విషయాలలో రాజీపడకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు, కో వీడ్ సేవల కోసం 20 మంది డాక్టర్ల నియామకం అవసరమైన సిబ్బందిని ఎక్కడికక్కడ  నియమించు కోవాలని సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆస్పత్రిలో కోవిడ్ వైద్య సేవల కోసం ముందస్తుగా అవసరమైన మందులు ఆక్సిజన్ సిలిండర్లు సమకూరుస్తున్న మని ఏరియాలలో ప్రస్తుత బెడ్ లతొ, మరో 500 బెడ్లతో, ప్రత్యేక అవార్డులు ఏర్పాటు చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ లను, కోరారు మే నెలలో కేసులు వృద్ధికి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుండే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కోవడానికి అన్ని ఏరియా హాస్పిటల్ సిద్ధ పరచాలని కోరారు, ఆక్సిజన్ కొరతతో ఏర్పడకుండా ఉండేలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిశ్రమలతో సంప్రదింపులు జరుపుతున్నామని సింగరేణికి ప్రత్యేకించి ఆక్సిజన్ సిలిండర్లు పోతున్నామని తెలిపారు ఈ లోపుగా స్థానికంగా ఆక్సిజన్ కొనుగోలు చేయాలని కోరారు రాపిడ్, పరీక్షలు నిర్వహించడం కోసం, 25, వేల కిట్లను ప్రభుత్వం నుండి  సేకరించామని వీటిని ఏరియాలకు పంపి స్తున్నట్లు తెలిపారు, అసౌకర్యాలు స్థానిక భవనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు చైర్మన్ అనుమతితో 20 మంది వైద్య నిపుణులను, నియమించుకోవడం జరిగిందని ఇంకా అవసరమైతే వాడు వాయిస్ నర్సులు సిబ్బందిని స్థానికంగా నిర్మించుకోవాలని జనరల్ మేనేజర్ లను ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ఎస్, ఓ, చోటు, జిఎం గోపాల్ సింగ్, డీ వై సి ఎం   ఓ శ్రీమతి ఉష కే కే ఆర్ సి పి పి ఓ రమేష్ కేకే ఏజెంట్ రామ్ చందర్ పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ హెల్త్ ఆఫీసర్ లోకనాథ్ రెడ్డి  ఐ టి ప్రోగ్రామర్ రవి తదితరులు పాల్గొన్నారు

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు మాస్కులు

 ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు మాస్కులు  

  వి.ఆర్.పురం, పెన్ పవర్  

 వి.ఆర్.పురం మండలం వి ఆర్ పురం గ్రామం లో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ  విగ్రహాలకు వడ్డిగూడెం పంచాయతీ సంబంధించిన సెక్రెటరీ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహాలకు మాస్కులు  కట్టడం జరిగింది. ఈ సందర్భంగా వడ్డిగూడెం పంచాయతీ సంబంధించిన సెక్రటరీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ  మండలంలోని గ్రామాల ప్రజలు చాలామంది   మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. ఆ ప్రజలు విగ్రహాలను చూసి ఇకనైనా మాస్కులు దరి ఇస్తారని అతని అభిప్రాయం. కోవిడ్ విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వారి వారి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. మనిషి మనిషికి దూరం పాటించాలి. డెటాల్ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పని ఉంటేనే ఇంటి నుండి బయటికి రావాలి. ఈ కార్యక్రమంలో వాలంటరీ వీర్ల శివ భేతి సాయి పంచాయతీ వాలంటరీ లు తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిల్లో సమస్యలపై ఏకరువు...!

 కౌన్సిల్లో సమస్యలపై ఏకరువు...!

సామర్లకోట, పెన్ పవర్ 

సామర్లకోట మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన కౌన్సి లమ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉభా జాన మోజెస్ తో సహా ఆధికార పక్ష కౌన్సిలర్లు పలువురు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఏకరువు పెట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సాధారణ సమావేశం సుమారు మూడు గంటల పాటు సదీర్ఘంగా సాగింది. మొత్తం జీరో అవర్‌గానే సమావేశం కొనసాగగా పట్టణంలోని సమస్యల పై సభ్యులు అధికారులను ప్రశ్నలతో నిలదీయగా కౌన్సిల్ హాలు హోరెత్తింది. సమావేశంలో తొలుత కౌన్సిలర్లు జీరో అవర్‌ను కోరగా చైర్ పర్శన్ దానికి అనుమతినిచ్చారన్నారు. దానితో వైస్ చైర్మన్ జాన మోజెస్ మాట్లాడుతూ పిఠాపురం రోడ్డులో ఏర్పాటు చేస్తున్న లే అవుట్ల యజమానులు ఇరిగేషన్ కు సంబందించిన కాలువలు మూసివేస్తూ లే అవుట్లు చేపడుతున్నట్టు చెబుతూ ఆ లే-అవుట్లకు అలాంటి అనుమతులున్నాయని అధికారులను ప్రశ్నించారు. దానికి కమీషనరు బీఆర్ ఎస్ శేషాద్రి వివరణిస్తూ లే-అవుట్లకు అనుమతులు గుడా ఆద్వర్యంలో జరుగుతున్నట్టు చెప్పారు. అంతా ఆన్ లైనులోనే జరుగుతున్నందున అది మన పరిదిలో లేనందున దాని పూర్తి వివరాలు తమ వద్ద లేవన్నారు. కాగా అయితే లే-అవుట్ల పైన వివరాలు సేకరించి పనులు నిలిపి వేయనున్నట్టు చెప్పారు. అయితే పట్టణంలో ఎన్ని ప్రభుత్వ స్థలాలున్నాయో వివరాలు తెలపాలని వైస్ చైర్మన్ కోరారు. దానికి డిఇ సిమెచ్ రామారావు వివరణిస్తూ వచ్చే సమావేశం నాటికి వివరాలు అందించనున్నట్టు చెప్పారు.  

కాగా సమావేశంలో కౌన్సిలరు నేతల హరిడబాబు మాట్లాడుతూ పట్టా ఇళ్ళకు పన్నులు విధించమని ప్రజలు కోరుతున్నా మున్సిపల్ అదికారులు పన్నులు వేయడం లేదని, దానికి ప్లాన్ అప్రోవల్ కావాలని అడుగుతున్నారని పట్టా గృహాలకు, హౌసింగు పధకంలో నిర్మించుకున్న గృహాలకు ప్లాన్ అప్రోవల్ ఎలా ఉంటాయని ఆయన అధికారులను ప్రశ్నించారు. దానిపై కమీషనరు మాట్లాడుతూ ప్కగా ఇళ్ళకు సంబందించి డాక్యుమెంట్లు ఉంటేనే పన్నులు విధిస్తామన్నారు. కాగా మున్సిపాలిటీలో ఏఏ విభాగాల్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారో వివరాలు తెలపాలని వైస్ చైర్మన్ మోజెస్ కోరారు. దానికి కమీషనరు సిబ్బంది వివరాలను సమావేశంలో తెలిపారు. అలాగే కౌన్సిలరు పితాని కృష్ణ మాట్లాడుతూ వర్షం వస్తే తమ వార్డు మొత్తం మునిగిపోతున్నందున డ్రెయిన్ల ఆధునీకరణ, వంతెన నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్ చేసారు. దానికి డిఇ రామారావు వివరణిస్తూ 14వ ఆర్థిక నిదులు విడుదల అయ్యాయని త్వరలోనే నూతన డ్రైన్ల నిర్మాణం, వంతెన నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాగా సమావేశంలోని జీరో ఆవర్ లో కౌన్సిలర్లు యార్లగడ్డ జగదీష్, పాగా సురేష్, చల్లపల్లి శ్రీను, పాగా సురేష్, పాలిక కుసుమచంటిబాబు, పెండ్యాల వెంకటలక్ష్మి, చిట్టిమాని రాఘవ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ వారి వార్డులో ఉన్న సమస్యల పరిష్కారంపై అదికారులకు విన్నవించి వాటిని పరిష్కరించాలని కోరారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన సమావేశం అనంతరం అజెండా అంశాలపై చర్చ ప్రారంభం కాగా వాటిలో 13 అంశాలను సభ్యులు ఆమోదించగా వారపు సంత రోడ్డు మార్గంలో ఆశీల వసూళ్ళ అంశాన్ని సమావేశం వాయిదా వేసింది. ఈ సమావేశంలో ఇంకా మున్సిపల్ ఎఇ రాజశేఖర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్, అన్ని శాఖల అధికారులు, అందరు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

సింహాచల కొండపై అన్ని సేవలూ ఒకే చోట ఈ.ఓ, సూర్యకళ

 సింహాచల కొండపై అన్ని సేవలూ ఒకే చోట ఈ.ఓ, సూర్యకళ

సింహాచలం, పెన్ పవర్

సింహాచలం దేవస్థానం ఈ.ఓ గా బాధ్యతలు చేపట్టాక సంస్కరణలు, అవసరమైన మార్పులకు ఎంవీ.సూర్యకళ శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా భక్తులకు సేవలను అందించే విషయంలో ఆమె ఏమాత్రం రాజీ పడటం లేదు. ఇందులో భాగంగానే కంప్లైంట్ సెల్ ఏర్పాటుచేశారు.భక్తులకు ఏమాత్రంఅసౌకర్యంకలిగినా దేవస్థానం భూముల విషయంలో ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చంటూ రెండు ఫోన్ నంబర్లు (0891-2764949, 9398523937),కంప్లైంట్లు స్వీకరణ బాధ్యత సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఇవ్వడం జరిగింది. కొండపై టికెట్లు ఇచ్చే చోటు ఒక దగ్గర, విరాళాలు స్వీకరించే ప్రాంతం మరోదగ్గర, ప్రొటోకాల్ -కొండపై రూంలు బుకింగ్ కౌంటర్ ఇంకో చోట ఉండటంతో భక్తులు, దాతలు గందరగోళానికి గురయ్యేవారు.

ఇప్పుడు దానికి చెక్ పెడుతూ...  విరాళాలు, టికెట్ల కౌంటర్లను పి.ఆర్.ఓ, ఆఫీసులో పెట్టడం జరిగింది. దీంతో భక్తులు ఎలాంటి సేవలు కావాలన్నా... గాలిగోపురం ఎదురుగా ఉండే పీఆర్వో ఆఫీసులో పొందవచ్చు. కొండ కింద టికెట్ తీసుకోనివారు నేరుగా ఇక్కడే  వచ్చి ఆ సేవలను పొందవచ్చు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆపీసును తీర్చి దిద్దడం జరిగింది. అంతేకాదు కోవిడ్ నిబంధనల దృశ్యా  స్వామివారి దర్శనం దగ్గర క్యూలైన్లు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శనాలకోసం మూడు ప్రత్యేక ర్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవడం సులభమవుతోంది. ఈ సౌకర్యాలను శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి భక్తులు ఉపయోగించుకోవచ్చు.

మల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో కరోనాతో మృతి...

మల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో కరోనాతో మృతి...

గండేపల్లి, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆదిత్య శంకర్ (50)కరోనాతో వీధుల్లో ఉండగా మృతి చెందారు. మృతదేహానికి పరీక్ష రాపిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు, ఈయనది కొంతమూరు  గ్రామం అని సమాచారం.

కోవిడ్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కోవిడ్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

పెన్ పవర్, ఉలవపాడు 

మండల కేంద్రమైన ఉలవపాడు లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు టాస్క్ ఫోర్స్ నెంబర్స్ తాసిల్దార్ కె .సంజీవ్ రావు ,ఎంపీడీవో టి.రవికూమర్,ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని వీఆర్వోలు,పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తో తాసిల్దార్ మాట్లాడుతూ కోవిడ్ పై క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని కోవిడ్ సెకండ్ వేలో ఉలవపాడు మండలంలోని పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని  కనుక ప్రజా ప్రతినిధులతో కలిసి వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటిని సర్వే చేసి కరోనా పై అవగాహన కల్పించి అనుమానంగా ఉన్నవారిని ప్రజా వైద్యశాల కి తరలించే విధంగా చూడాలి, ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి మండలంలోని ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేయాలని వైయస్సార్ బీమా యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు అర్హులైన వారిని నమోదు చేయాలని అని వీడు నిబంధనలు పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి, మౌత్ దూరం పాటిస్తూ, శానిటైజర్, వాడుతూ అదేవిధంగా ప్రజలకు జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కల్పించాలి.

 కందుకూరు డిఎస్పి కండే శ్రీనివాసరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ప్రతి మండలంలో క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్ట పడుతున్నారు అని ప్రతి పంచాయతీలోనూ కరోనా పై అవసరమైన పరికరాలను వెంటనే అందించే విధంగా చూస్తున్నారని,కోవిడ్ సెకండరీ తీవ్రత ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని పాజిటివ్ వచ్చినవారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తీవ్రంగా ఉందని మరణాలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయని అందరూ జాగ్రత్తలు పాటించాలని కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలని అనిమండల స్థాయి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ పి విశ్వనాధ రెడ్డి, డాక్టర్ కే శ్రీనివాసరావు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, పాల్గొన్నారు.

ఉచితంగా 20 టన్నుల బ్లీచింగ్ పంపిణీ

ఉచితంగా 20 టన్నుల బ్లీచింగ్ పంపిణీ     

పెన్ పవర్, కందుకూరు

 కందుకూరు నియోజకవర్గంలో కరోనా రెండో దశలో విజృంభిస్తున్న తరుణంలో కందుకూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు, మున్సిపాలిటీకి బ్లీచింగ్, సున్నం పంపిణీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్  రెడ్డి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సాటి మనుషులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారం అందించే భావన తపన, ప్రతి ఒక్క మనిషి లో ఉండాలి అని అన్నారు. కందుకూరు పట్టణం లో 14వ వార్డు కు చెందిన మాధవ పేదవాడు అయినప్పటికీ మంచి మనసుతో, సేవా దృక్పథంతో 50 వేల రూపాయలతో 21 టన్నుల సున్నాన్ని కందుకూరు మున్సిపాలిటీ అందజేశారు. ఈ సందర్భంగా మాధవ కి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం  మండలాల వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థుల అందరూ కలిసి 20 టన్నుల బ్లీచింగ్ ను అందజేశారని అన్నారు. ఇప్పటికే 20 టన్నుల బ్లీచింగ్ ను,  సున్నాన్ని ఉచితంగా అందజేశామని అన్నారు. ఇక నుంచి వచ్చే బ్లీచింగ్ పంచాయితీలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అని అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు  3500 జతల గ్లౌజులు, 150 లీటర్ల శానిటైజర్ ను, ఐదువేల మాస్కులను ప్రభుత్వం ఇచ్చేవి కాకుండా అదనంగా  అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్నీ ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు మాస్కులు, మెడికల్ కిట్లు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఆఫీస్ కి వచ్చి ఉన్నాయని వాటిని రేపు అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు  అందజేస్తామని అన్నారు.


 కరోనా వచ్చిన పేషెంట్లు ఎవరు దయచేసి బయటకు రావద్దుని ప్రభుత్వ డాక్టర్లు  ఇచ్చిన సూచనలు సలహాల మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ ప్రభుత్వం వారిచ్చిన మందులు వాడుకుంటూ ఉండాలని అలా కాకుండా వారు బయటకు వచ్చి వారి ద్వారా జబ్బును మరింత మందికి వ్యాప్తి చేసి సమాజానికి నష్టపరిచే కార్యక్రమం చేయవద్దని వారిని కోరారు. కందుకూరు పట్టణం లో సుమారు 14 మంది, పల్లెటూర్లలో పదిమంది వరకు  మరణించారని, ఎటువంటి అవసరం లేకుండా పల్లెటూర్ల నుంచి కందుకూరు కి రావద్దని అన్నారు. పల్లెటూర్లో కూడా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా ని దరిచేరకుండా చూసుకోవాలి అని అన్నారు.ఇప్పటికే జరగాల్సిన నష్టం 30శాతం జరిగిపోయిందని ఇప్పటినుంచైనా 15 రోజుల వరకూ జాగ్రత్తగా ఉంటే కొంతవరకు కరోనా ని కట్టడి చేయవచ్చు అని అన్నారు. ఒంగోలు రిమ్స్ హాస్పటల్లో సామర్థ్యాన్ని రెట్టింపు చేసినా, అంబులెన్స్లోవేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే ఎంత డబ్బులు ఇచ్చినా బెడ్ దొరకట్లేదు అని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఇది గమనించి అనవసరంగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ కరోనా ను కట్టడి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, కందుకూరు, వలేటివారిపాలెం, లింగాసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు మండలాల ఎంపిడివో లు విజయ శేఖర్, రఫీక్ అహ్మద్, మాలకొండయ్య,. వెంకటేశ్వర్లు, రవి కుమార్ తదిరులు పాల్గొన్నారు.

మీ సేవలు చిరస్మరణీయం

 మీ సేవలు చిరస్మరణీయం

మునగపాక, పెన్ పవర్

మునగపాక పోలీసు స్టేషన్ లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన అదనపు ఎస్.ఐ.బి.గురునాథ్ ను జిల్లా ఎస్.పి, బి.కృష్ణారావు ఐ.పి.ఎస్., తమ కార్యాలయములో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

విధుల్లో చేరిన నాటి కాలంలో అప్పటి స్థితిగతులను నిలదొక్కుకుంటూ కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వర్తించడం సాధారణ విషయం కాదన్నారు. పదవి విరమణ తరువాత  కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను నేరుగా సంప్రదించ వచ్చునని  సూచించారు.ఈ కార్యక్రమంలో  ఏ.ఆర్ డి.ఎస్.పి  ఆర్.పి.ఎల్.శాంతి కుమార్,పదవీ విరమణ పొందిన ఎస్సై కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లాక్ డౌన్ పెట్టండి లేదా 144 సెక్షన్ ను కఠినంగా అమలుచేయండి

లాక్ డౌన్ పెట్టండి లేదా 144 సెక్షన్ ను కఠినంగా అమలుచేయండి 

విజయనగరం, పెన్ పవర్

జిల్లాలో తక్షణమే లాక్ డౌన్ విధించండి లేదా 144 సెక్షన్ ను కఠినంగా అమలు చేయాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణరావు(బాలు) శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికాప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా మహమ్మారి  రెండోవేవ్ లో ప్రపంచ దేశాలతోపాటు మన జిల్లా ప్రజలకు కరోనా కేసులు వెలకొద్ది పెరగడం, ఓపక్క ఎక్కువ మరణాలు సంభవించడం ప్రజలను భయబ్రాంతులకు గురుచేస్తుస్తున్నాయని ఇటువంటి తరుణంలో రాత్రిపూట కర్ఫ్యూ ఏమి ఉపయోగం ఉండదని, ప్రజలకు సేవచేసే జిల్లా యంత్రాంగం,ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు,మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు మరియు సిబ్బంది,పోలీసులు, వైద్య సిబ్బంది, ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులు కరోనా బారినపడి ప్రజలతోపాటుగా ప్రాణాలుమీదకు తెచ్చుకుంటున్నారని, ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించినా పట్టణంలో ప్రధాన కేంద్రాలైన గంటస్థంభం పెద్ద మార్కెట్,కోట జంక్షన్, రైతుబజార్లు,కాకుండా వివిధ ప్రధాన కూడళ్లలో ప్రజలు గుమిగూడి ఉంటున్నందున ప్రజలంతా అవస్థలు పడుతున్నారన్నారు. ఇటువంటి తరుణంలో లాక్ డౌన్ ను విధిస్తే గాని ఉదృతంగా పెరుగుతున్న కరోనాను అరికట్టలేమని అన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలందరూ కారోనాపై అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని,ప్రతీఒక్కరూ మాస్కులు ధరించాలని,ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని అన్నారు.    ఈ విపత్కర పరిస్థితులను ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ గాని, 144 సెక్షన్ ను కఠినంగా వ్యవహరించాలని కోరారు.


70మందికి రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్

70మందికి రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్

పెన్ పవర్, తవణంపల్లి

 తవణంపల్లి మండల పరిధిలోని నల్లి శెట్టిపల్లి సచివాలయం నందు శుక్రవారం 70 మందికి రెండవ డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి దత్తాత్రేయ తాసిల్దార్ హనుమంతు ఎంపీడీవో ధనలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో కరోనా కట్టడికి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సబ్బుతో తరచు చేతుల శుభ్రత శానిటైజర్ తో చేతుల శుభ్రత పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత ప్రతి ఒక్కరూ తన్నుతాను రక్షించుకొని కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ రచ్చబండ దగ్గర గుంపులు గుంపులుగా ఉండరాదని ప్రభుత్వ అధికారులు సూచనలు సలహాల మేరకు నిబంధనలు పాటించాలని 45 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందులు హెల్త్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం రెడ్డి సి హెచ్ వో రమాదేవి సూపర్వైజర్లు రాజశేఖర్ జయమ్మ  అపంచాయతీ కార్యదర్శి  రామకృష్ణ  వాలంటీర్లు ఆశ కార్యకర్తలు  సర్పంచి ఎంపీటీసీ లు పాల్గొన్నారు.

లలితనగర్ లో వృద్ధురాలు మెడలో చైన్ స్నాచర్లు బంగారం చోరీ...

 లలితనగర్ లో వృద్ధురాలు మెడలో చైన్ స్నాచర్లు  బంగారం చోరీ...

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక లలితానగర్ ఈ. ఎస్.ఐ హాస్పిటల్ రోడ్ నందు అక్కడ వృద్ధ మహిళ మెడలో బంగారం గుర్తు తెలియని దుండగులు ఇద్దరు ద్విచక్రవాహనంపై అటుగా రోడ్ దాటుతున్న వృద్ధురాలు బంగారం అపహహరించుకుని పరార్ అయ్యారు.వృద్ధురాలు కిందపడి గాయాలు పాలయ్యింది.సి.సి ఫుటేజులు అక్కడ ఆప్రదేశం లో ఉన్నాయి అని వాటి ఆధారంగా ఆ దుండగులు ఎవరు అనేది 3 వ పట్టణ  పోలీసులు దర్యాప్తు లో తెలియాలని అక్కడ స్థానికులు తెలపడం జరిగింది.

మానవ సేవే మాధవ సేవ అంటున్న దళారులను నమ్మకండి

 మానవ సేవే మాధవ సేవ అంటున్న దళారులను నమ్మకండి

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రోనా బారిన పడి మృతిచెందిన వారిని ఆసరాగా చేసుకుని మృతుని బందువులు నుంచి అక్రమ దోపిడికు గురౌతున్నారని, ఇకపై ఆటువంటివి పునరావృతం కాకూడదని రాజమహేంద్రవరం వైస్సార్సీపీ సిటీ కొ ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు.రాజమహేంద్రవరం నగరంలో ప్రతి ఒక్కరికి నేను అండగా ఉన్నానని,  వైఎస్ఆర్సిపి పార్టీ మీకు తోడుగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,  శానిటైజర్ 100% వాడాలని  డాక్టర్ ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు.  రాజమహేంద్రవరం స్థానిక ఏ వి అప్పారావు రోడ్డు ఆకుల సత్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  కరోనా  వైరస్ సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతుందని కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకున్న ఆకుల సత్యనారాయణ తెలుపరు.కోవిడ్ వైరస్ వచ్చి ఎవరైనా మృతి చెందితే అయ్యే ఖర్చు  వైఎస్సార్సీపీ పార్టీ తరఫున మేమే ఖర్చు పెడతామన్నారు.కైలాస భూమిలో ఎవరైనా ఎక్కువ తీసుకుంటే మాకు తెలియపరచాలని ఆయన అన్నారు.తోరలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాము అని,పట్టపగలు వెంకట్రావు వారితో సంప్రదింపులు జరపడం ఆయన కూడా ముందుకు రావడం జరిగింది అని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంత్యక్రియలు(దహన సంస్కారాలు)  నిర్వహించుకునే వారు స్వల్ప ఖర్చు మాత్రమే అని ఆయన వివరాలు ఈ సంధర్భంగా తెలియ జేశారు.ఈ సమావేశంలో రాజమహేంద్రవరం నగర వైస్సార్సీపీ అధ్యక్షులు నందెపు శ్రీను,మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీను,మహిళ నాయకురాలు ఉమా మహేశ్వరి,వైస్సార్సీపీ ఇంచార్జి గెడ్డం అనిల్,తదితరులు పాల్గొన్నారు.

కోనసీమ తిరుపతి ఆలయంలో కరోనా కలవరం

కోనసీమ తిరుపతి ఆలయంలో కరోనా కలవరం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు  నిత్యం భక్తులతో రద్దీగా ఉండే వాడపల్లి దైవ క్షేత్రం కరోనా మహమ్మారి సెకండ్ వే  విజృంభన కారణంగా ఆలయ దర్శనాలు భక్తులకు కుదించారు  అయినా ఆలయ అర్చకులలో  ఒకరు కు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా మిగిలిన అర్చకులను హోమ్  ఐ సొల్యూషన్ ఉండవలసిందిగా కోరారు అందువలన వాడపల్లి వెంకన్న దర్శనానికి 1.05.2021 నుండి8.05.2021 వరకు ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించబోమని   ఆలయ ఈవో చెప్పడం జరిగినది.

హెచ్ఆర్పీసీఐ నియోజకవర్గ చైర్మన్ గా హరిప్రసాద్ నియామకం

 హెచ్ఆర్పీసీఐ నియోజకవర్గ చైర్మన్ గా హరిప్రసాద్ నియామకం

తొర్రూరు, పెన్ పవర్

హెచ్ఆర్పిసిఐ పాలకుర్తి నియోజకవర్గ చైర్మన్ గా మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన కందుకూరి హరిప్రసాద్ నియమితులయ్యారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఆర్పిసిఐ నియోజకవర్గ చైర్మన్ గా నియమితులైన హరిప్రసాద్ కు జిల్లా చైర్మన్  పాలిశెట్టి శ్రీనివాసరావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ...రాజ్యాంగ బద్దంగా వస్తున్న హక్కులను కాలరాసే వారిపై న్యాయస్థానాల్లో చర్యలు తీసుకునే హక్కు ఉందన్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడంతో ప్రజలు మోసపోతున్నారన్నారు. ఎవరైనా హక్కులను హరిస్తే హెచ్ఆర్పిసిఐ తరపున చర్యలు తీసుకుంటామన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు,  జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సంజీవ లకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి జాలిగామ సత్తయ్య, జిల్లా మహిళా చైర్మన్ నల్లకుంట ఉమాదేవి, ప్రతినిధులు తోట నగేష్, అల్లం శ్రీను, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అభినందనీయం

 ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అభినందనీయం

-జిల్లా కలెక్టర్ విపి గౌతమ్

తొర్రూరు,  పెన్ పవర్

కరోనా విపత్కర వేళ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అందించడం అభినందనీయమని,జిల్లా కలెక్టర్ విపి గౌతమ్  పేర్కొన్నారు. కరోనా విస్తృతి వేళ పరీక్షలకు వినియోగించే సర్జికల్ టేబుళ్లను ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ధరావత్ విమల ప్రభుత్వ ఆసుపత్రికి విరాళంగా అందించారు. విమల కోడలు డాక్టర్ మౌనిక జన్మదినాన్ని పురస్కరించుకొని, శుక్రవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు పరికరాలను జిల్లా కలెక్టర్ పివి గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గుండాల మురళీధర్ కు అందజేశారు. విమల సేవా నిరతిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. లాక్ డౌన్ సమయంలోనూ విమల పేదలకు నిత్యావసర సరుకులు  అందించి, దాతృత్వం చాటుకుందని, కలెక్టర్ గుర్తుచేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల సంఖ్య పెంచేందుకు, వ్యాక్సినేషన్ కు అందరినీ సమాయత్తం చేసేందుకు వైద్య,ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని, కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి ఓపీ నిమిత్తం వచ్చేవారికి భోజనం అందించేందుకు సైతం చొరవ చూపాలని, కలెక్టర్ విమలకు సూచించారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు విమల అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో  డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీ రామ్, తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో భారతి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, ధర్మ శ్రీ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ప్రమీల,అధ్యక్షుడు ధరావత్ విశ్వనాధ్, హోమేష్, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం చెల్లించాలి

ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం చెల్లించాలి

 పెన్ పవర్, ఉలవపాడు 

మండల కేంద్రమైన ఉలవపాడు లోని ఉపాధి కూలీలకు రూ.300 కూలీ,200రోజులు పని కల్పించాలని, ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం 10వేలు చెల్లించాలని,50కేజీల బియ్యం, నిత్యావసర సరుకులన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మికసంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఉలవపాడులో శుక్రవారం  ఎంపీడీఓ టి. రవి కుమార్ గారికి వినతి పత్రం అందజేస్తున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్,సిపిఎం నాయకులు . గౌస్,సీఐటీయూ ఉలవపాడు మండల నాయకులు గంజి. శ్రీను, జహీర్,M. కోదండం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రూ10 లక్షలవిరాళం ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్

 రూ10 లక్షలవిరాళం  ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్ 
పెన్ పవర్, కందుకూరు

 కందుకూరు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు నాక్ ఏ గ్రేడ్ సాధన కొరకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు కాకినాడ కు చెందిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిట్ వారి  కరేడు కు దగ్గర అలగాయపాలెం వద్ద ఉన్న హ్యాచరి మేనేజంగ్ డైరక్టర్   కార్తూరి సత్యన్నారాయణ మూర్తి ఆదేశాల మేరకు సేల్స్ మేనేజర్ సురేంద్ర కుమార్, హ్యాచరి మేనేజర్ ఎ. నాగేశ్వరావు లు శాసన సభ్యులు మహీధర్ రెడ్డి సమక్షంలో పదిలక్షల రూపాయలు కళాశాల అభివృద్ధి కోసం విరాళం ప్రకటించారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు మహీధర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు, నాక్ ఎ గ్రేడ్ సాధించేందుకు  దాతల సహాయ సహకారం తో కళాశాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 

మన ప్రాంతం కానివారప్పటికి మన కళాశాల అభివృద్ధి కి,  పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకరిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.నాక్  సాధన సమితి సభ్యులు శీలం సుధీర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకోని వారు, ఈ ప్రాంతం వారు కాని వారు స్పందిస్తున్న తీరు చాలా సంతోషమని, అదేవిధంగాఈ కళాశాలలో చదువుకున్న వారు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అయితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు.అనంతరం దాతల తరుపున వచ్చినవారికి శాసనసభ్యులు మహీధర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం రవి కుమార్, నాక్ సాధన కమిటీ సభ్యులు శీలం సుధీర్, మంచిరాజు మురళి పాల్గొన్నారు.

మాస్క్ లు ధరిస్తూ కరోనా రక్కసిని అడ్డుకుందాం

మాస్క్ లు  ధరిస్తూ కరోనా రక్కసిని అడ్డుకుందాం 


పెన్ పవర్, రెబ్బెన 

కొమరంభీమ్ జిల్లా రెబ్బెన మండలము లోని రాజారాం గ్రామ పంచాయతి లో ప్రజలు అందరూ అప్రమత్తం గా ఉండాలి. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరిస్తూ భేతిక దూరం పాటించాలి. ఈ మహమ్మారి అడ్డుకుందం అందరూ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అవసరానికి మించి బయటకు రావద్దని ప్రజలు అందరూ హోమ్ లోనే ఉండాలి. మన గ్రామ పంచాయతి లోని వాడ  వాడలా కు హైపో  క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కరోనా -19 వ్యాక్సిన్ తీసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజారాం సర్పంచ్ ఒరగంటి మల్లేష్  సందీప్ అజయ్ రాజేందర్ నరేష్  పాల్గొన్నారు. 

మేడే ను జయప్రదం చేయండి..

 మేడే  ను జయప్రదం చేయండి..

 చిత్తూరు, పెన్ పవర్

చిత్తూరు నగరంలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘాల కార్మిక వర్గానికి  ఏఐటీయూసీ  గౌరవ అధ్యక్షులు  ఎస్. నాగరాజు పిలుపు మే 1న  ప్రపంచ కార్మికుల దినోత్సవం  మేడే సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ సంఘాల  నాయకులు,  కార్యకర్తలు, ప్రస్తుతం కరోన  వైరస్ విపరీతంగా ప్రబలుతున్న దృష్ట్యా వారి వారి సంఘాల ఆధ్వర్యంలో  ఎర్రజెండాను ఆవిష్కరించాలి. ఊరేగింపులు, సమావేశాలు రద్దు చేసుకోని  ఎర్రజెండాలు మాత్రం ఆవిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మే 1వ తేదీన ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 లోపు  జెండా ఆవిష్కరించే కార్యక్రమాలు ను పూర్తి చేయాలి. చిత్తూరు నగరంలో కరోనా వైరస్  నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు జరుపుకోవాలని  పిలుపునిచ్చారు.

రెండు కోటాల ఉచిత బియ్యం పంపిణీ

రెండు కోటాల ఉచిత బియ్యం పంపిణీ

తవణంపల్లి, పెన్ పవర్

తవణంపల్లె  మండల   కేంద్రం తాసిల్దార్ కార్యాలయం నందు వీఆర్వోలు సమావేశం జరిగింది ఈ సందర్భంగా శుక్రవారం తాసిల్దార్ హనుమంతు మాట్లాడుతూ నేడు 2 కోటాలు 10 కేజీలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని చక్కెర కందిపప్పు కు ఖరీదు చెల్లించాలని తెలియజేశారు వీఆర్వో లు దగ్గరుండి ఉదయం 6 గంటలకు డీలర్ల వద్ద నుండి బియ్యం ట్రక్కుల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ పద్ధతులు పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకటరమణ . విఆర్వో లు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...