Followers

Showing posts with label TELANGANA. Show all posts
Showing posts with label TELANGANA. Show all posts

సర్పంచ్ ఆహ్వానించకుండా నే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ కిషన్ రా

సర్పంచ్ ఆహ్వానించకుండానే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ కిషన్ రావు

బెల్లంపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాల గ్రామపంచాయతీ లో ఈరోజు వడ్ల కొనుగోలు  కేంద్రంను చైర్మన్ కిషన్ రావు మాజీ సర్పంచ్ సత్తయ్య సీ.ఈ.వో మధుకర్ సెంటర్ ఇన్ ఛార్జ్ ఓడల హనుమంతు కలసి గ్రామ అ శివార్లలో అనగా రైతులకు అనుకూలంగా కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో  వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు మంగళవారం రోజున సిపల్లి లక్ష్మి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా లింగాల గ్రామ సర్పంచ్ మాట్లాడుతు నన్ను పిలువకుండా ప్రోటోకాల్ పాటించ కుండా నే వడ్ల కొనుగోలు కేంద్రమును  ప్రారంభించారు లింగాల సర్పంచ్ దళిత మహిళా కావడంతో నే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించలేదని . ఈ పరిణామం మనోభావనీ కించపరిచే చేశారని వాపోయారు ఈ కార్యక్రమం దళితుల ను  కించపరిచే విధంగా ఉందని వారి మనోభావాలు దెబ్బతినేలా నడుచుకునేల  ఉన్నాయని వారు వాపోయారు. వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు .అలాగే వారిపై ఎస్సీ. ఎస్టీ. అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని. రేపు అధికారుల కు కు వినతి పత్రం అందజేస్తారని ని అధికారులకు కలెక్టర్ కి ఎమ్మార్వో కు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని . ఫిర్యాదు చేస్తానని.లింగాల సర్పంచ్ లక్ష్మి కోరారు.

మాస్క్ ధరించని వారిపై కొరడా

 మాస్క్ ధరించని వారిపై కొరడా

చట్ట ప్రకారం 46 కేసులు నమోదు

పెన్ పవర్, మల్కాజిగిరి

నేరేడ్మట్ పోలీస్ స్టేషన్ సిఐ నర్సింహ్మ స్వామి ఆద్వర్యంలో రచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశల మేరకు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్డు పై తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేసి రూ1000 జరిమానా విధించారు. నేరేడ్మట్, వినాయక్ నగర్ ప్రాంతల్లో 46 కేసులు నమోదు చేశామని సిఐ తెలిపారు. ఈ సందర్బంగా సిఐ నర్సింహ్మ స్వామి మాట్లాడుతూ కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ, మాస్కులు, బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి అన్నారు. కరోనా నిబంధనలు నిర్లక్ష్యం వ్యహిస్తే వారిపై నేరేడ్మెట్ పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశల మేరకు ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలో, వినాయక్ నగర్ లో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వ్యహిస్తు నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పిస్తూ పెట్టి కేసు నమోదు చేస్తున్నామని సిఐ నరసింహ స్వామి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న 46 కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మానవత్వం చాటుకున్న తొర్రూరు పోలీసులు

 మానవత్వం చాటుకున్న తొర్రూరు పోలీసులు.

తొర్రూరు, పెన్ పవర్

తేదీ 21.04.2021న మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీకృష్ణ హాస్పిటల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన గుర్తుతెలియని వృద్ధురాలు చికిత్స పొందుతూ... మంగళవారం మృతి చెందింది.గుర్తుతెలియని వృద్ధురాలికి చెందిన వారు ఎవరూ రాకపోవడంతో మానవతా దృక్పథంతో  తొర్రూరు పోలీసులు,మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలతో అనాధ వృద్ధురాలికి అంత్య క్రియలు నిర్వహించినట్లు తొర్రూరు ఎస్ఐ సిహెచ్ నగేష్ తెలిపారు. ఎవరూ లేని అనాధ వృద్ధురాలికి రెండవ ఎస్ఐ మునిరుల్లా, కానిస్టేబుల్ సర్వార్ పాషా, హోంగార్డ్ రఫీయా లతో కలిసి పూలమాలవేసి, అంత్యక్రియలు నిర్వహించారు.

తెలంగాణ ద్రోహి కేసిఆర్

 తెలంగాణ ద్రోహి కేసిఆర్

 పీసీసీ సభ్యులు దసురు నాయక్

కేసముద్రం, పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి అనేక విధాలుగా నష్ట పోయిన వారికి ద్రోహం చేస్తూవారిని పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులైన సమైక్యవాదులను తన చుట్టూ పెట్టుకొని బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయుటకు ప్రయత్నం చేస్తున్నాడు అని టిపిసిసి సభ్యులు దసురునాయక్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ ను భూకబ్జా పేరుతో మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేశాడని కావాలనే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిని ఒక తెలంగాణ ఉద్యమ కారుడిని ఇలా చేయడం చాలా బాధాకరమని మాట్లాడారు. కానీ అవినీతి భూ కబ్జాలు చేసిన వారిపై చర్యలలో భాగంగా ఈటెల పై చర్యలు తీసుకున్నారనుకుంటే  మరి సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది భూకబ్జాలు అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరివారి మీద ఎందుకు తీసుకోవడం లేదు అంతేగాక ఇలాంటి ఆరోపణలు తన కొడుకు కేటీఆర్ పై కూడా ఉన్నవి కెసిఆర్  కి నీతి నిజాయితీ పై నమ్మకం ఉంటే వారు అందరిపై కూడా ఉన్నత అధికారులతో కమిటీలు వేసి వెంటనే మంత్రి పదవి నుండి తొలగించి విచారణ చేయించినట్లయితే పారదర్శకతను పాటించినట్లు అవుతుంది. లేనిచో  కేవలం 24 గంటలలోపే విచారణ పూర్తి కావాలని ప్రభుత్వం కుట్రపూరితంగా నే ఈటెల పై కెసిఆర్ దాడి చేసినట్లే అవుతుంది అని అన్నారు. అంతేగాని ఈటల రాజేందర్ పైనే కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

బెల్లంపల్లి స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రారంభం

 బెల్లంపల్లి స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రారంభం

బెల్లంపల్లి, పెన్ పవర్

బెల్లంపల్లి లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు చైర్పర్సన్ శ్రీత. శ్రీధర్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ కరోనా కట్టడి కోసం వ్యాపార యజమానులతో మాట్లాడి అన్ని రకాల వ్యాపార సంస్థలు  స్వచ్ఛందం గా  లాక్ డౌన్ లో పాల్గొనాలని అన్నారు ఇందులో భాగంగా మంగళవారం 3. గంటల నుంచి  మొదటిరోజు బజార్ ఏరియా లోని దుకాణ యజమానులు తమ దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు ...

పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే

 పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే…

 నిబంధనలు ఉల్లంఘిస్తే కోవిడ్ చట్ట ప్రకారం చర్యలు.

నెల్లికుదురు తహసిల్దార్. అనంతుల రమేష్ కుమార్

నెల్లికుదురు,పెన్ పవర్

 కరోణ సెకండ్  వేవ్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా మండలంలోని ప్రజలు ఎవరు కూడా  మాస్కులు లేకుండా బయట సంచరించ కూడదని,  ఒకవేళ అత్యవసర పని ఉన్నట్లయితే మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ బయటకి రావాలని మహబూబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం తాసిల్దార్ అనంతుల రమేష్ కుమార్ ప్రజలను హెచ్చరించారు మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ గ్రామాలలో ఫంక్షన్లు,  పెళ్లిళ్లు,  ఎలాంటి పండుగలైన జరుపుకునేవారు వాయిదా వేసుకోవాలని,  పెళ్లిళ్లు తప్పనిసరి చేయాలి అనుకునేవారు అధికారుల అనుమతి పొంది కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించు కోవాలని లేనిపక్షంలో కోవిడ్ చట్ట ప్రకారము ఎంతటివారి పైన గాని చర్యలు  తీసుకోబడుతుంది అని తెలియజేశారు.

ఆందోళన వద్దు

 ఆందోళన వద్దు...

సెంటర్ల సంఖ్య పెంచుతాం - ఎమ్మెల్యే మైనంపల్లి

పెన్ పవర్, మల్కాజిగిరి

వ్యాక్సినేషన్, కరోనా టెస్ట్ ల గురించి నగర ప్రజలు ఆందోళన చెందవద్దు, ఇప్పటికే ఉన్న సెంటర్లకు అదనంగా నేరేడ్మట్ డివిజన్ లో రెండు, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ లో రెండు, గౌతం నగర్ డివిజన్లో మూడు, మల్కాజిగిరి డివిజన్ లో మూడు, వినాయక్ నగర్ డివిజన్ లో ఒకటి వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించాం. వ్యాక్సినేషన్ సెంటర్లే కాకుండా టెస్టింగ్ సెంటర్ల సంఖ్యను పెంచుతాం అన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.

మాస్క్ ధరించకుంటే జరిమానా

 మాస్క్ ధరించకుంటే జరిమానా, లేదంటే జైలుకే

పెద్దగూడూరు, పెన్ పవర్ 

కొత్తగూడ ఎస్సై సురేష్  కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో రెండు రోజులుగా మహబూబబాద్ జిల్లా కొత్తగూడ లో మాస్కులు ధరించకుండా కరోనా నిబంధనలు అతిక్రమించిన వారికి ఫైన్ లు పోలీసులు వసూలు చేస్తున్నారు. మాస్కులు ధరించని వాహనదారుపైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక్కొక్కరికి 1000/- జరిమానాను కొత్తగూడ ఎస్సై సురేష్ విధిస్తున్నారు. ఇప్పటికే పదూల సంఖ్యలో ఈ చలాన్ల రూపంలో జరిమానాలను పంపించారు. ఇక పై బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా కనబడినట్లయితే వారి పై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. వ్యాపారస్తులు కూడా మాస్క్ ఉంటేనే కస్టమర్లను షాపుల్లోకి అనుమతించాలని, దీన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. కోవిడ్ ని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించని వారిపైన క్రిమినల్ కేసులు కూడా తప్పవని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ ధరించకుంటే ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, కోర్టులో హాజరుపరుచుతామని తెలిపారు. పదుల సంఖ్యలో ఈ-చలానాలు పంపామన్నారు. ఇక జరిమానా సొమ్ము చెల్లించని వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతామంటున్నారు పోలీసులు. మాస్క్ అనేది మీ రక్షణ కోసమేనని ధరించాలనీ, దయచేసి పోలీసులు ఫెనాల్టీ లు విధిస్తారని మాత్రం ధరాంచకండి అని ఎస్సై సురేష్ విజ్ఞప్తి చేశాడు.

ఘనంగా బేలా సర్పంచ్ జన్మదిన వేడుకలు

 ఘనంగా బేలా సర్పంచ్  జన్మదిన వేడుకలు ...

బేలా, పెన్ పవర్ 

సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరాడంబరంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు మండల టిఆర్ఎస్ నాయకులు,యువజన సంఘాల నాయకులు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యువజన సంఘాల నాయకుల రవి, సునీల్, రాహుల్, యాదవ్, అజయ్, అంకుష్తదితరులు పాల్గొన్నారు.

పేదింటి బిడ్డ పెండ్లికి ఆర్ధిక, సహాయం అందించిన, టిఆర్ఎస్ నేత

 పేదింటి బిడ్డ పెండ్లికి ఆర్ధిక, సహాయం అందించిన, టిఆర్ఎస్ నేత

పెన్ పవర్,  మందమర్రి 

మందమర్రి పట్టణానికి చెందిన టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే మందమర్రి పట్టణంలోని 23వ వార్డు మేదర్ బస్తీ కి చెందిన  రామగిరి మల్లేష్ శంకరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న రామగిరి మల్లేశ్ పెద్ద కూతురు రామగిరి శ్వేత వివాహము మే 16వ తేదీన నిశ్చయం కాగా పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో  వీరి కుటుంబ సభ్యులు మంగళవారం అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ ను కలిసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించి వెంటనే ఆర్ధిక సహాయంగా 20 వేల రూపాయల చెక్కు తోపాటు ఒక క్వింటాలు బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో రాజ్ కుమార్ రంగనాథ్, సతీష్ , రిధం సది , బంటి తిరుపతి, ప్రసాద్, రఘు గంగుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.ఆర్ధిక సహాయం ను అందించిన బండి సదానందం కు రామగిరి మల్లేశ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వైరస్ తో రేషన్ కార్డుదారుల ఇక్కట్లు

 కరోనా వైరస్ తో రేషన్ కార్డుదారుల ఇక్కట్లు

బెల్లంపల్లి , పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా కార్డుదారులు వివిధ కారణాలవలన ఆధార్ లింక్ చేసుకోకపోవడంతో ప్రస్తుతం ఐరిష్ వలన వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం డీలర్లు రేషన్ నిలిపివేయడం జరిగింది. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని కార్డుదారులు కూడా ఐరిష్ తో రేషన్ తీసుకోవడానికి భయాందోళనకు గురవుతున్నారు. కావున రెవిన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఇతర ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్లు మరియు కార్డు దారులు కోరుతున్నారు.

మోడల్ స్కూలు అడ్మిషన్ కు గడువు పొడిగింపు

 మోడల్ స్కూలు అడ్మిషన్ కు గడువు పొడిగింపు 

పెన్ పవర్,  మందమర్రి 

కాసిపేట:  కాసిపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూలు నందు అడ్మిషన్ కొరకు దరఖాస్తు పొడిగింపు జరిగింది అని ప్రిన్సిపల్ అందే నాగమల్లయ్య తెలిపారు. ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఆరవ తరగతి ప్రవేశానికి అలాగే ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆన్ లైన్ ధ్వారా దరఖాస్తు చేసుకోవడానికి  ఈ నెల 8 వ తేదీ అని తెలిపారు. ఈ అవకాశాన్ని  విద్యార్థులు వినియోగించుకోగలరు అని, పరీక్ష ఫీజు ఓపెన్ కేటగిరీకి 150  రూ, ఎస్సీ ,ఎస్టీ ,బిసి విద్యార్థులకు 75 అని రూపాయలు ప్రిన్సిపల్ నాగమల్లయ్య తెలిపారు.

ఆట పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం

 ఆట పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం...

 ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న

 బేల, పెన్ పవర్

ఆటల పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని ఓడిపోయిన వాళ్లు నిరాశ పడకుండా ముందుకెళ్లే పట్టు సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం మండలంలోని చప్రాల గ్రామంలో లో గత 15 రోజుల నుంచి నిర్వహించిన క్రికెట్ పోటీలు నేటితో  ముగిశాయి. మొదటి బహుమతి చాంద్ పెళ్లి జట్టుకు జోగు పౌండేషన్ తరఫున రూ31,000, రెండో బహుమతి చప్రాల జట్టుకు జడ్పిటిసి సభ్యులు అక్షిత సతీష్ పవార్ తరఫున (ఆడానేశ్వర్ ఫౌండేషన్ )రూ 15,000,గెలుపొందిన జట్లకు బహుమతులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధానం చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో  ఉన్న యువకుల ప్రతిభను వెలికి తీయడానికి గ్రామా గ్రామాల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ యువకులు గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, ఆడణేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, స్థానిక సర్పంచ్ దౌలత్ రావు, టిఆర్ఎస్ నాయకులు దేవన్న, సతీష్, ప్రవీణ్ , జగన్నాథ్,ప్రకాష్ రెడ్డి,గేడం సునీల్,  క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

సిసి రోడ్డూ నిర్మాణం పనులను ప్రారంభించిన సర్పంచ్

  సిసి రోడ్డూ నిర్మాణం పనులను ప్రారంభించిన సర్పంచ్

పెద్దగూడూరు, పెన్ పవర్ 

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చంద్రుగూడెం లో మంగళవారం సి సి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 30 లక్షల అంచనా వ్యయంతో ఆరు వీధులకు గాను సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు గూడూరు మండలం మేజర్ సర్పంచ్ నూనవత్ రమేష్ నాయక్ పనులను తానే స్వయంగా పార పట్టి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంతర్గత రహదారులు సరిగ్గగా లేనందున సి సి రోడ్డు నిధులను మంజూరు చేయించామని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని అలాగే గ్రామస్తులు పర్యవేక్షించాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ కత్తి స్వామి, ఉప సర్పంచ్ శివరాత్రి సంపత్, చంటి, శివక్రిష్ణ, తదితరులు పాల్గోన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనాను తరిమికొట్టాలి

 వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనాను తరిమికొట్టాలి...

 డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్

బేల,  పెన్ పవర్ 

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు.బేలా మండలం లోని మాంగ్రూడ్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరన్ని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పరిశీలించారు. గ్రామంలోని 73 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యులు  తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య శాఖ అధికారి క్రాంతికుమార్, ఎంపీడీవో రవీందర్ భగత్, ఎస్ఐ సాయన్న, ఎంపీటీసీ ఠాక్రె మంగేష్, కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ వార్డ్ లో పనిచేస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్, బిస్కెట్లు పంపిణీ.

 కోవిడ్ వార్డ్ లో పనిచేస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్, బిస్కెట్లు పంపిణీ...

అదిలాబాద్, పెన్ పవర్

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్  జన్మదినాన్ని పురస్కరించుకొని రిమ్స్ ఆసుపత్రి లో మంగళవారం  కోవిడ్ వార్డుల్లో పని చేస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్స్, బిస్కట్స్, జ్యూస్ బాటిల్స్ ని సాజిద్ ఖాన్ గారు కాంగ్రెస్ జిల్లా నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రాణాలకు ప్రాణంగా పెట్టుకుని కోవిడ్ రోగులకు వైద్య సేవలు మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో నాయకులు మల్లేష్ యాదవ్, రాహుల్, రాజు యాదవ్, రసూల్ ఖాన్ ,ఎం ఏ షకీల్, నాహిద్, మోసిన్ పటేల్, జాబీర్తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ టీకా సెకండ్ డోసు తీసుకున్న జడ్పీటీసీ చారులత రాథోడ్

 కోవిడ్ టీకా సెకండ్ డోసు తీసుకున్న జడ్పీటీసీ చారులత రాథోడ్...

ఉట్నూర్,  పెన్ పవర్

కోవిడ్ వ్యాక్సిన్ టీకాను ప్రతిఒక్కరూ వేసుకోవాలని ఉట్నూర్ జడ్పిటిసి చారులత రాథోడ్ సూచించారు. మంగళవారం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారి భర్త రాథోడ్ శైలెందర్ తో కలిసి కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ ని వేసుకున్నారు.వారితో పాటు పంచాయతీ రాజ్ ఎస్.ఈ. జాదవ్ వెంకట్ రావ్ దంపతులు ఉపాధ్యాయుడు చౌహాన్ రమేష్ దంపతులు టీకాను వేసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి చారులత రాథోడ్ మాట్లాడుతు కరోనా కట్టడికి టీకాయే మార్గమని, కోవిడ్ వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు 45 ఏళ్ళు పైబడిన వారు టీకాను వేసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండల ప్రజలందరు టీకా కోసం నేటి నుండి ఆన్లైన్ లో selfregistration.cowin.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకొని ఆసుపత్రికి వెళ్ళి టీకా వేసుకోవాలన్నారు.

ఈనెల 5న సోయా విక్రయ కేంద్రం ప్రారంభం

ఈనెల 5న సోయా విక్రయ కేంద్రం ప్రారంభం...

జైనథ్ , పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా జైనథ్  వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 5వ తేదీన ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా సోయాబీన్ విత్తనాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించ నున్నట్లు పి.ఏ.సి.ఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.  మంగళవారం జైనథ్ మండల నాయకులతో చర్చించిన అనంతరం ఈ విక్రయ కేంద్రం తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో 1000 బ్యాగ్ ల కరిష్మా సోయాబీన్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమున్న రైతులు ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు మార్కెట్ యార్డ్ లోని విత్తన విక్రయ కేంద్రానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో  ఎంపీపీ మరిశెట్టి గోవర్ధన్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లింగా రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఏవో వివేక్ తదితరులు పాల్గొన్నారు. 

బాధిత కుటుంబానికి ట్రాస్మా చేయూత

 బాధిత కుటుంబానికి ట్రాస్మా చేయూత...

బోథ్, పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో గత శుక్రవారం కరెంట్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ దాసరి గంగయ్య ను మంగళవారం నాడు బోథ్ మండల ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ట్రాస్మా పరామర్శించి, సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా బాధితుడు తోటి సహాయ కరస్పాండెంట్ గంగయ్య కు మనోధైర్యం అందించారు. అలాగే 7000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు.కరోనా మహమ్మారి తో గత రెండు సంవత్సరాలుగా ప్రయివేటు పాఠశాలలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటి కి తోటి కరస్పాండెంట్ ను ఆపత్ కాల సమయంలో ఆదుకోవలనే సదుద్దేశంతో ఆర్థిక సహాయం చేయడం సంతోషం కలిగించందని బాధితుడు దాసరి గంగయ్య ట్రాస్మా సబ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండలంలోని అన్నిప్రయివేటు పాఠశాలల కరస్పాండెంట్ లు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమం కోసం బంద్

 ప్రజల సంక్షేమం  కోసం బంద్

నార్నూర్, పెన్ పవర్ 

గాదిగుడా మండలంలోని స్థానిక గ్రామాల్లో 4/5 /2021 నుండి 20/5/21తేదీ వరకు మద్యాహ్నం రెండు గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని స్ధానిక సర్పంచ్ మెస్రం జైవనత్ రావు, వార్డు మెంబర్ల సమక్షంలో తీర్మానం చేశారు. మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో  సర్పంచ్ మాట్లాడుతూ రెండవ దశ  లో కరోన ఉద్రిక్తత విజృంభించడంతో  ఇటూ జ్వరాలు అటు కరోనా మహమ్మారి ప్రజలను వంకించడం తో గాడిగూడా గ్రామపంచాయతీ పరిధిలో నిసమావేశం అయి రేపటి నుంచి అన్ని దుకాణాలు  మద్యాహ్నం రెండు గంటలకు మూసివేయాలని అలాగే ప్రతిఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఎవరైనా ఈ తీర్మానాన్ని ఉలంగిస్తే కఠినచర్యలు తప్పవని రు.1000 జరిమానా విధించాలలసి ఉంటుందని హెచ్చరించారు. మార్కెట్ మార్నింగ్ 6 గం. నుండి మద్యాహ్నం 2 గం వరకు తేరియా వలసిందిగా మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కొంచెడ సుంగు అన్నారు. ఈ తీర్మానమును స్థానిక పోలీస్ స్టేషన్  ఎస్ ఐ ముజాహియోదిన సమర్పించిన తమ వంతు సహకరించాలని తీర్మానని సమర్పించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ కోటంబె డిగంబర్, రెవత, జైతు, నందకిశోర్, బాలాజీ, శాలుబాయి, దేవుబయి ,రుక్మబాయి  ఉన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...