Followers

ఈనెల 5న సోయా విక్రయ కేంద్రం ప్రారంభం

ఈనెల 5న సోయా విక్రయ కేంద్రం ప్రారంభం...

జైనథ్ , పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా జైనథ్  వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 5వ తేదీన ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా సోయాబీన్ విత్తనాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించ నున్నట్లు పి.ఏ.సి.ఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.  మంగళవారం జైనథ్ మండల నాయకులతో చర్చించిన అనంతరం ఈ విక్రయ కేంద్రం తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో 1000 బ్యాగ్ ల కరిష్మా సోయాబీన్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమున్న రైతులు ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు మార్కెట్ యార్డ్ లోని విత్తన విక్రయ కేంద్రానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో  ఎంపీపీ మరిశెట్టి గోవర్ధన్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లింగా రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఏవో వివేక్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...