Followers

క్రమశిక్షణతో చదివి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలి

క్రమశిక్షణతో చదివి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలి

విజయనగరం,పెన్ పవర్

విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తుది పరీక్షలకు ఉపయోగపడే ఆల్-ఇన్-ఒన్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బంగ్లాలో,బుధవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు డా ఎం. హరిజవహర్‌లాల్ ముఖ్య అతిధిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు డా ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ - ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీగారు తమ శాఖ ద్వారా 41 ప్రభుత్వ పాఠశాలలను దత్తత స్వీకరించి, విద్యార్ధులలో శక్తి సామర్థ్యాలను పెంచి, వారిని ఉన్నతమైన స్థానాలకు తీసుకు వచ్చేందుకుగాను, స్టూడెంట్ పోలీసు క్యాడెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు మంచి ఫలితాలు సాధించేందుకు పట్టుదల, క్రమశిక్షణతో, చదువు పట్ల ఆసక్తితో చదవాలన్నారు.ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి ఫలితాలు సాధించే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు శక్తి వంచన లేకుండా విద్యార్ధుల ఉన్నతికి కృషి చేయాలన్నారు. విద్య అన్నది ప్రతీ వ్యక్తికి అత్యంత గౌరవాన్ని తీసుకొస్తుందని, ఆగౌరవం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు, జన్మ స్థలం యొక్క ఉన్నతిని పెంచుతుందన్నారు. బాగా చదువుకోవడం వలన మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, విజయనగరం అంటే విద్యలనగరమని, ఆ పేరుకు సార్ధకత తీసుకువచ్చే విధంగా చదవాలన్నారు.పోలీసుశాఖ వలన క్రమశిక్షణ అలవడుతుందని, క్రమశిక్షణ ద్వారా పట్టుదలను పెంచుకొని, బాగా చదివి ఉన్నతమైన స్థానాలలోకి ఎదిగి, మీ తల్లిదండ్రులను, మంచి పేరు తీసుకువచ్చి, మీ ప్రాంతాలను అభివృద్ది చెయ్యాలని జిల్లా కలెక్టరు ఆకాంక్షించారు. విధ్యార్ధులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత లక్ష్యాలను లక్ష్యంగా చేసుకొని, ఉన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా ఎదగాలన్నారు. 

స్టూండెంట్ పోలీసు క్యాడిట్ కార్యక్రమంలో విద్యార్ధులకు ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను జిల్లా ఎస్పీబి. రాజకుమారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా హర్షణీయమని, విధ్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని వృధా చేయకుండా బాగా చదివి 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టరు డా|| ఎం. హరిజవహర్లాల్ అన్నారు.విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - విద్య ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చునని అన్నింటికీ మూల కారణం విద్యే అన్న సత్యాన్ని ప్రతీ విద్యార్థి గ్రహించాలన్నారు. విద్య ద్వారా వినయం, తద్వారా సమర్ధత, సంపద, ధర్మం, సంతోషం వస్తాయన్నారు. విద్యార్ధి దశలో వినయం, సమయపాలన, శ్రద్ధ, ఆసక్తి, సానుకూల దృక్పథం, నీతి, నియమాలు అలవరుచుకోవాలన్నారు. ఎపిసి పాఠశాలలకు ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని విశాఖపట్నం రేంజ్ డి. ఐ. జి. ఎల్.కే.వి. రంగారావు విజయనగరం జిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో విద్యార్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించారని, అప్పటినుండి ఎస్పీలుగా పనిచేస్తున్న వారంతా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం పోలీసు సంక్షేమ నిధి నుండి రూ. 4 లక్షల వ్యయంతో ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను ఎపిసి పాఠశాల విద్యార్ధులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, విద్యార్ధులు పట్టుదలతో చదివి జూన్ లో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో 10/10 గ్రేడు మార్కులు సాధించాలన్నారు.

విద్యార్థి దశలో 8, 9, 10 మరియు ఇంటర్మీడియట్ చాలా ముఖ్యమైనవని, ఈ దశలో విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన విద్యార్థులలో ఉండాలని, విద్యార్ధి దశ మళ్ళీ రాదని, తల్లిదండ్రులు మనికిచ్చిన అవకాశాన్ని, ఉపాధ్యాయులు మనకి నేర్పిస్తున్న జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకొనిరాబోతున్న 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి, మీపై మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెట్టుకొన్న నమ్మకాన్ని నిలపాలన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, మంచి వ్యక్తిత్వం ద్వారా ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొనే వరకు విశ్రమించకూడదన్నారు. విద్యార్ధి దశలో 10వ తరగతి చాలా కీలకమైనదని, సమయం చాలా విలువైనదని, సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగపర్చుకొని, ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను చదివి, మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఎస్.పి.సి. కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడత 10పాఠశాలలను ఎంపిక చెయ్యగా, వాటికి అదనంగా మరో 31 పాఠశాలలను ఎంపిక చేసామన్నారు. ఈ కార్యక్రమాన్నిఅమలు చేసే క్రమంలో ప్రతీ విద్యార్ధితోనుపోలీసు అధికారులు కలిసి మాట్లాడి, వారిలో స్ఫూర్తి కలిగించడం వలన మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు.
ఒఎస్టీ ఎన్.సూర్యచంద్రరావు మాట్లాడుతూ - విలువలతో కూడిన విద్య నేర్వాలని, దేవుడిచ్చిన సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. విద్యను మన నుండి ఎవరూ తీసుకోలేరని, విద్య వలన కీర్తిని పొందవచ్చునన్నారు. ఆచార్యదేవోభవ అని,పిల్లల్ని తీర్చిదిద్దిన గురువులను అభినందించాలన్నారు. ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను సద్వినియోగం చేసుకొనిరాబోయే 10 వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలన్నారు.విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి జి. నాగమణి మాట్లాడుతూ - పోలీసు శాఖ తమ విధులలో బిజీగా ఉంటున్నా ఎస్పీ బి.రాజకుమారి ఆధ్వర్యంలో ఈ స్టూడెంట్ పోలీసు క్యాడిట్ కార్యమ్రాన్ని విజయవంతంగా అమలు చేసి,విద్యార్థులలో ఆత్మసైర్యాన్ని నింపుతున్నారని, గతంలో ఈ కార్యక్రమం ద్వారా అందించిన సహాయం వలన 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు జిల్లాకు వచ్చాయని, మళ్ళీ మంచి ఫలితాలను సాధించి, రాష్ట్రంలో జిల్లాను ప్రధమస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.అనంతరం, విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి చేతుల మీదుగా 14 ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ఆల్-ఇన్-ఒన్ స్టడీ మెటీరియల్ ను అందజేసారు. 
విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ బి. రాజకుమారి,ఎస్ బి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు, ఒఎడ్ జె.రామమోహనరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు,డి. ఇ. ఒ జి.నాగమణి మరియు ఇతర అధికారులు సహపంక్తి భోజనాలు చేసి, పరీక్షల గురించి, ప్రిపరేషను గురించిఆరా తీసి, వారిలో స్ఫూర్తి నింపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, ఎస్ ఈబి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఒఎ. ఎన్. సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డిఈ ఒ జి. నాగమణి, ఎస్పీసి నోడల్ అధికారి ఎఆర్ డిఎస్పీఎల్. శేషాద్రి, విజయనగరం డి.ఎస్పీ పి.అనిల్ కుమార్, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, డిఎస్పీ ఎస్ సి ఎస్ సెల్-1 మరియు 2 ఆర్. శ్రీనివాసరావు, రామారావు, సిఐలు బి.వెంకటరావు, ఎన్.శ్రీనివాసరావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, జె. మురళి, సిహెచ్. శ్రీనివాసరావు, ఎర్రంనాయుడు, టి.ఎస్. మంగవేణి, శ్రీధర్, జి. గోవిందరావు, సింహాద్రినాయుడు, టి.వి. తిరుపతిరావు, సిహెచ్. లక్ష్మణరావు, సంజీవరావు, ఎల్.అప్పలనాయుడు, ఆలు చిరంజీవి, బి. నాగేశ్వరరావు, కుమార్, ఈశ్వరరావు, రమణమూర్తి, పి.ఎం. రాజు మరియు ఇతర పోలీసు అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కరోనా తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

 కరోనా తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ... ఎస్సై సాయన్న

బేల, పెన్ పవర్ 

 కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ సాయన్న పేర్కొన్నారు. బుధవారం బేలా మార్కెట్ నందు కోవిడ్ - 19 అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యాపారులు, ప్రజలు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా మాస్క్ ధరించాలని, కరోనా విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు మాస్క్ దరించని యెడల విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టుకు పంపటం జరుగుతుందని అన్నారు. వారి వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

మాస్కులు పంపిణి చేసిన ట్రాఫిక్ సిఐ సుదీర్ కృష్ణ

 మాస్కులు పంపిణి చేసిన ట్రాఫిక్ సిఐ సుదీర్ కృష్ణ

పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి చౌరస్తా లో మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో వెళ్తున్న వాహనదారులు పాదచారులకు మాస్కులు పంపిణీ చేసిన మల్కాజిగిరి ట్రాఫిక్ సీఐ సుధీర్ కృష్ణ. ఈ సందర్బంగా సిఐ సుధీర్ కృష్ణ మాట్లాడుతూ సెకండ్ వేవ్ కోవిడ్ - 19, కరోనా విజృంభిస్తున్న నేఫధ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, బౌతిక దూరం పాటించి, శానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొవాలని అవగాహన కల్పించారు, వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర డిజిపి మరియు రాచకొండ కమిషనర్ సూచనలు మేరకు అవగాహన కల్పిస్తున్నట్లు సిఐ సుదీర్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. తేజ, ఎ. ఎస్.ఐ.రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య సిబ్బంది అవగాహన కల్పించకపోవడమే లోపం

 వైద్య సిబ్బంది అవగాహన కల్పించకపోవడమే లోపం

 సంతబొమ్మాళి, పెన్ పవర్

మండల కేంద్రం సంతబొమ్మాళి లో గ్రామ సచివాలయ స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు సంతబొమ్మాళి పి హెచ్ సి, సచివాలయం-1  ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఎంపిక చేశారని తహసిల్దార్ రాంబాబు తెలిపారు. కోవిద్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపుతామని తెలిపారు. దీని ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా పరిశీలించేందుకు డాక్టర్ పి.అవని హాజరయ్యారు. మండలంలో 45  పైబడిన వారు చాలామంది ఉన్నప్పటికీ కేవలం 24 మంది వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. వైద్య సిబ్బంది అవగాహన లోపంతో వ్యాక్సినేషన్ కు వెనకంజ అయిందని వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ కె ఎస్ ప్రసాద్, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాస్కు ధరించకుంటే జైలుకు

 మాస్కు ధరించకుంటే జైలుకు


పెన్ పవర్,  మల్కాజిగిరి 

రాష్ట వ్యాప్తంగా డిజిపి మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ సూచనలు మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ చౌరస్తాలో ఎస్.ఐ అనంత చారి ఆద్వర్యంలో సెకండ్ వేవ్ కోవిడ్- 19, కరోనా విజృంబిభిస్తున్న నేఫేద్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలంటు అవగాహన కల్పించారు. వ్యాపారస్తులు, వాహనదారులు, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి, బౌతిక దూరం పటించి, శానిటైజర్ తో శుభ్రం చేసుకొవాలని అన్నారు. వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, అయినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహించి మాస్కులు ధరించకుండా ఉంటే వారిని జైలుకు తరలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిష్టేబుల్ రమేష్, వీరా చారి, కృష్ణ, మహిళా కానిష్టేబుల్ మాధవి, సంధ్య, శ్రీదేవి పాల్గొన్నారు.

విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలి

విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలి

విజయనగరం,పెన్ పవర్

వివిధ సచివాలయాల్లో సమయపాలన పాటించని 8 మంది కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మెమోలు జారీ చేశారు. సచివాలయాల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా బుధవారం నగరంలోని 46, 47, 48 నెంబరు గల సచివాలయాలను కమిషనర్ పరిశీలించారు. నిర్ణీత సమయానికి విధులకు హాజరు కాని 8 మంది కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెమోలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యదర్శులనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలని కార్యదర్శులకు ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా సమయపాలన పాటించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించడం, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో సచివాలయ వ్యవస్థ రూపొందించిందని, అటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి అధికారులకు మంచి పేరు తేవాలని చెప్పారు.

డస్ట్ బిన్ రహిత నగరం

 డస్ట్ బిన్ రహిత నగరం

విజయనగరం,పెన్ పవర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన క్లాప్ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ కోరారు. బుధవారం సాయంత్రం ఈ మేరకు పారిశుద్ధ్య అధికారులు, పర్యవేక్షకులు, కార్యదర్శులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాలు, పట్టణాలు పరిశుభ్రత,పచ్చదనంతో పరిఢమిల్లాలని ప్రభుత్వం క్లాప్  కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు.

 ఈ కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వార్డుల్లో పరిశుభ్రత కు అధిక ప్రాధాన్యత ఇచ్చి పచ్చదనంతో వెల్లి విరియాలని అన్నారు. వార్డులలో సమూల మార్పులు తీసుకొచ్చి పచ్చదనానికి, పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. డస్ట్ బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దడం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సంపూర్ణ చైతన్యాన్ని ప్రజలలో తీసుకొచ్చి తద్వారా క్లాప్ కార్యక్రమ విశిష్టతను చాటి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య  అధికారి డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలి

 జర్నలిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలి

బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్

గొల్లపల్లి,  పెన్ పవర్

 తెరాస నాయకులు గొల్లపెల్లి మండల జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలని మండల బిజెపి అధ్యక్షులు కట్ట మహేష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్య సమాజానికి ఎంతో అన్యోన్యంగా ఉంటున్న జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన వారిని కఠినంగా శిక్షించి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. తెరాస ప్రభుత్వ పాలనలో విలేకరులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని బాధిత జర్నలిస్ట్ కు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. బర్నలిస్ట్ లకు మద్దతుగా పోరాటం చేస్తామన్నారు.  అలాగే బిజెపి సీనియర్ నాయకులు కస్తూరి సత్యం మాట్లాడుతూ విలేకరుల ను టిఆర్ఎస్ నాయకులు చులకనగా హేళన చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులను గౌరవించే విధంగా మాట్లాడాలని టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ భారత్ రాష్ట్ర కన్వీనర్ మంచి రాజేష్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి సత్యం జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ బుగ్గారం మండల పార్టీ అధ్యక్షులు మంచాల పరుశురాం బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు వెంకటేష్ కళ్యాణ్ శేఖర్ తదితరులున్నారు..

మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతరాజు జన్మదిన వేడుకలు

 మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతరాజు జన్మదిన వేడుకలు

విశాఖ ద్వారాకనగర్,పెన్ పవర్  

శ్రీ భారతి జాలరి కుల  సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో  మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతరాజు జన్మదిన వేడుకలు కొత్తజాలరి పేటలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేకు ను కట్ చేశారు. తదుపరి సంఘ సభ్యులు శాలువా ను కప్పి పుష్ప గుచ్చాన్ని సమర్పించారు.కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ హార్ధిక  జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు.  పిమ్మట పేదవారికి  పండ్లను , మిఠాయిలను  పంచిపెట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ పోతరాజు మాట్లాడుతూ.... కరోన 2 వ దశ విజృంభిస్తున్న తరుణంలోనే  ప్రజ లందరూ ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారు అతి జాగ్రత్తగా ఉండాలని శుభ్రతను పాటించాలని ,  ఎప్పటికప్పుడు చేతులకు శానిటైజేసన్ చేసుకోవాలని ,  మాస్కులను తప్పక  దరించాలని ,సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎవరైనా కరోనా వ్యాధి లక్షణాల తో భాదపడుతున్నట్లైతే  వారు మాకు తెలియజేసినట్లైతే వారికి తప్పక మా సంఘం అన్నివేళలా అందుబాటులో ఉండి తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు కుర్మాన అప్పారావు , ఉపాధ్యక్షులు చింతపల్లి సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శి కదిరి అచ్చుత మోహన్ రావు , కోశాధికారి చింతపల్లి పోతరాజు మరియు గ్రామ పెద్దలు , 30 , 37 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

24 గంటలు తాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

24 గంటలు తాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

అనకాపల్లి, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ పరిధిలో ప్రజలకు24 గంటలు త్రాగు నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అందుకోసం నూతనంగా ఎన్నికయిన కార్పొరేటర్ లు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం అన్నారు. మంగళవారం స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి మున్సిపాలిటీ గా ఉన్న నాటి నుండి కేవలం మున్సిపల్ నీటి కనెక్షన్లు కి ఉదయం కేవలం గంట మాత్రమే సరఫరా చేసేవారని జీవీఎంసీ లో విలీనం అయినప్పటికీ అదే తీరు కొనసాగుతుండడం విచారకరమన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 24 గంటలు మంచి నీరుని  సరఫరా చేసేలా ఆలోచన చేయాలని కోరారు. ఒక వేళ అది సాధ్యపడక పోతే కనీసం రెండు పూటలు అయినా సరఫరా చేయాలని, అందుకోసం పట్టణానికి చెందిన కార్పొరేటర్ ల తో పాటు విశాఖ సిటీ పరిధిలోని కార్పొరేటర్ లు అందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. విశాఖ ప్రజలకు తాగు నీటి అవసరాల కోసం  మేఘాద్రి గెడ్డ నుండి నిల్వ చేసి ప్రజలకు తాగు నీరు సరఫరా చేయడం జరుగుతుందని ఈ క్రమంలో చాలా నీరు వృధా అవుతుందని అన్నారు. ప్రస్తుతం విశాఖ ప్రజల త్రాగునీటి కోసం 200 ఎంజి డి ల నీరు అవసరమవుతుంది అని అన్నారు. ఐతే ఇటీవల ప్రభుత్వం 3339 కోట్ల రూపాయల నిధుల తో ఏలేరు నుండి నీటిని పైపులైన్ ద్వారా తీసుకువచ్చేందుకు డిపిఆర్ఓ రూపొందిస్తున్నట్లు తెలిసిందని తొలగిన ఆమోదం తెలిపి పనులు ప్రారంభిస్తే తాగునీటి సమస్యలు తొలగిపోతాయి అన్నారు. అలాగే సముద్రపు నీటిని డిశాలినాషన్ పద్ధతి ద్వారా శుద్ధి చేసి పరిశ్రమలకు అందించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయమని ఐతే ప్రకటనల కే పరిమితం కాకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆచరణలో తీసుకురావాలని ప్రభుత్వాన్ని కొణతాల సీతారాం కోరారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో జై అనకాపల్లి సేన ఆధ్వర్యంలో మంచి నీటిని సరఫరా చేసేందుకు సిద్ధముగా ఉన్నామని కొణతాల సీతారాం స్పష్టం చేశారు.

వాలంటీర్ కు ఆర్థిక సాయం

 వాలంటీర్ కు ఆర్థిక సాయం

సంతబొమ్మాళి, పెన్ పవర్

మండలం లోని లక్కివలస గ్రామ సచివాలయం పరిధిలో  లో  పనిచేస్తున్న గెద్దలపాడు  వాలంటీర్ సిరిగిడి యశోదకు సచివాలయం సిబ్బంది ఆర్థిక సాయం అందించారు. వాలంటీర్ యశోద భర్త  సాయి ఇటీవల మరణించారు. ఈ మేరకు బాధిత వాలంటీర్ ఆదుకోవడానికి   పంచాయితీ సెక్రటరీరమేష్ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది,  వాలంటీర్లు అందరు కలిసి 20,000/సమకూర్చారు. ఈ మొత్తం ఆర్ధిక సహాయం ను సర్పంచ్  శ్రీరంగం వీరాస్వామి  చేతులు మీదుగా బుధవారం వాలంటీర్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు పాల్గొన్నారు.

మహిళల భద్రతకు అండగా "దిశ" వాహనం

 మహిళల భద్రతకు అండగా "దిశ" వాహనం

గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళల భద్రతకు  గాను "దిశ" ద్విచక్ర వాహనాన్ని జిల్లా యస్.పీ  అందించినట్లు యస్.ఐ కృష్ణప్రసాద్ తెలియచేసారు.జూనియర్ కళాశాల లోని మహిళా విద్యార్థులతో సమావేశం నిర్వహించిన  మండలంలోని ఏ ఒక్క మహిళ   విద్యార్థినిలు  ఇబ్బందులకు గురైతే తక్షణమే ప్రత్యేక సహాయక నంబర్ "100" మహిళా సహాయవాణి నంబర్ "112"  సైబర్ మిత్రమా నంబర్ "9121211100" ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ "181" లలో ఏదో ఒక నంబర్ కి ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి జీ.పీ.యస్ సాంకేతికత ఆధారంగా ఆపదలో ఉన్న మహిళలలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి బాధిత మహిళలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం లో ఈ దిశ వాహనం యొక్క ఆవశ్యకత చాలా ఉందని ఈ వాహనంలో గిరిశికర ప్రాంతాలకు కూడా అతి తొందరగా చేరుకుని బాధితులకు అండగా నిలబడగలమని తెలిపారు.ఈ దిశ వాహనం చూసి విద్యార్థినిలు హర్షం వ్యక్తం చేసు ఈ వాహనం కూత వినపడితే ఆకతాయిల గుండెల్లో గుబులు పుట్టడం కాయమని మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతున్న ప్రభుత్వ భద్రత పతకాలకు వారి హర్షద్వానాలతో జోహార్లు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో యస్.ఐ కృష్ణ ప్రసాద్ తో పాటుగా నందు, మహిళా కానిస్టేబుల్ సంధ్య, మాలతి పాల్గొన్నారు.

3వ వార్డులో పలు సమస్యలపై జెడ్.సి కి వినతిపత్రాన్ని సమర్పించిన గంటా నూకరాజు

 3వ వార్డులో పలు సమస్యలపై జెడ్.సి కి వినతిపత్రాన్ని సమర్పించిన గంటా నూకరాజు

భీమిలి, పెన్ పవర్

భీమిలి జోన్ 3వ వార్డులో ఉన్న పలు సమస్యలపై  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు ఆధ్వర్యంలో  మంగళవారం భీమిలి జోనల్ కమీషనర్  సి.హెచ్. గోవిందరావుకి వినతిపత్రం ఇవ్వడమైనది.తెలుగుదేశం పార్టీ  అధికారంలో ఉండేటప్పుడు భీమిలి జోన్ లో బోయవీధి,ఎగువపేట,తోటవీధి,నేరళ్ళవలస కోలనీ, గొల్లలపాలెం,క్రిష్ణా కోలనీ,రెళ్లివీధిలో  7 సామాజిక భవనాలు నిర్మించారని గంటా నూకరాజు అన్నారు.  సామాజిక భవనాలు నిర్మించేటప్పుడే  పూర్తయిన తరువాత ఆయా గ్రామాలకు వాటి నిర్వహణ బాధ్యత అప్పగించి, పూర్తిగా  ఆ గ్రామ  ఆధీనంలో ఉండేవిధంగా చేస్తామని అప్పటి ప్రభుత్వం తరపున అధికారులు మాట ఇచ్చారని  కానీ ఆ 7 సామాజిక భవనాలపై అధికారులు మాట తప్పారని, వెంటనే వాటిని ఆ గ్రామస్టులకు పెద్దల సమక్షంలో  అప్పజెప్పాలని జోనల్ కమీషనర్ కి ఇచ్చిన వినతిపత్రంలో కోరామని  గంటా నూకరాజు అన్నారు. కొన్ని సామాజిక భవనాలలో సచివాలయమని,  మరి  కొన్నింటిని  వృధాగా ఉంచారని అన్నారు.దయచేసి ఈ 7 సామాజిక భవనాలను ఆయా గ్రామాల అవసరాల కోసం ఇవ్వాలసిందిగా  కోరామని చెప్పారు.అదేవిధంగా  జలగెడ్డ శ్మశానవాటిక,గాడువీది శ్మశానవాటిక,  జెడ్.పి.గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న  చెరువుగట్టు దగ్గర విపరీతంగా తుప్పలు మొలిసాయని,శ్మశానవాటికలో అయితే అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్లినవారికి సరైన మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు.  ఇక్కడ తుప్పలు తొలగించాలని కోరారు.అదేవిధంగా  మహాత్మాగాంధీ పాఠశాలలో  అంగన్వాడీ కేంద్రం నడుపుతున్నారు.విద్యార్థులు ఎక్కువగా ఉండటం,   వీరికి మంచినీరు గాని, కరెంట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను పరిష్కరించాలని గంటా నూకరాజు ఇచ్చిన వినతిపత్రంలో కొరడమైనది.భీమిలి - దొరతోట రోడ్డుకు ఆనుకొని గొల్లలపాలెం పాఠశాల మరియు రెల్లివీధి పాఠశాలలు ఉన్నాయి.ఇక్కడ తరచు ప్రమాదాలు జరుగుతుండటం విద్యార్థులను,వారి తల్లిదండ్రులను మరియు  స్థానికులను కలవర పడుతుంది.  అందువలన పాఠశాలకు దగ్గరలో రెండువైపులా  వాహనాల వేగ నియంత్రణ చర్యలు చేపట్టే విధంగా స్పీడ్ బ్రేకర్లు వెయ్యవలసినదిగా కోరడమైనది.గుప్తా వీధి,గొల్లలపాలెంలో కాలువలు పూర్తిగా చెత్తతో నిండి ఉండటం వలన మురుగునీరు నిల్వ ఉంటుంది.  దీనివలన దోమలు ఎక్కువగా నిల్వ ఉండటమే కాకుండా,దుర్వాసన  స్థానికులను కలవర పడుతుంది.పైన సూచించునటువంటి సమస్యలను పరిష్కరించాలని జోనల్ కమీషనర్ కి ఇచ్చిన వినతిపత్రంలో గంటా నూకరాజు కోరడమైనది.ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెంటపల్లి యోగీశ్వరరావు, మారోజు  సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు,జలగడుగుల మురళి, కంచెర్ల కామేష్ తదితరులు పాల్గొన్నారు.

తీరంలో ఇసుక దందా..

 తీరంలో ఇసుక  దందా..

సంతబొమ్మాళి,పెన్ పవర్

మండలంలోని పాత మేఘవరం లో సాయి పవన్ రొయ్యల హేచరి పనుల కోసం తీర ప్రాంత సముద్రం ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఒక ట్రాక్టర్, జేసీబీని టెక్కలి ఫారెస్ట్ రేంజర్ అధికారి పి వి శాస్త్రి స్వాధీనంచేసుకున్నట్లుతెలిరు.నిబంధనలు విరుద్ధంగా సముద్ర పరివాక ప్రాంతాల్లో ఇసుకను రవాణా చేస్తున్న ఈ సమయంలో పట్టుకుని ని పీఓఆర్ నెంబరు 06671  అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి టెక్కలి ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యం లో వాహనాలు సీజ్ చేసి ఉంచామని ఫారెస్ట్ అధికారి అరుణ తెలిపారు. కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గతంలో కూడా ఈ హేచరీకి సంబంధించి పలు కేసులు ఫైల్ అయినట్లు సమాచారం. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా ఫారెస్ట్ భూముల్లో,అక్రమ తవ్వకాలు జరిపి సముద్రంలోని వరకు పైప్ లైన్లు కూడా వేసినట్లు సమాచారం. వీటి అంతటికీ మైనింగ్ అధికారుల, రెవెన్యూ అధికారుల పూర్తి సహాయ సహకారాలతో ఇలాంటి దుశ్చర్యలు కు పాల్పడుతున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

చలివేంద్రం ప్రారంభించిన తాసిల్దార్.. దూసి రవి

 చలివేంద్రం ప్రారంభించిన తాసిల్దార్.. దూసి రవి

మెంటాడ, పెన్ పవర్ 

 మెంటాడ మండలం లోని కుంతిని వలస గ్రామం లో బుధవారము గ్రామ సర్పంచ్ పెద్ది రెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మెంటాడ తాసిల్దార్ దూస రవి చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రవి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. గ్రామస్తులు కూడా తాగునీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, వైసిపి నాయకులు పొరిపిరె డ్ది సూర్యారావు, వై. సింహాచలం, పలువురు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

నారాయణ పురం గ్రామంలో కోవిడ్ పరీక్షలు

 నారాయణ పురం గ్రామంలో కోవిడ్ పరీక్షలు

కేసముద్రం, పెన్ పవర్

 మండలంలోని నారాయణపురం గ్రామపరిధిలో గల తులస్య తండాలో బుధవారం కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించారు.  61 మంది పురుషులు, 69 మంది స్త్రీలు మొత్తం 130 మందికి కోవిడ్- 19 పరీక్షలు నిర్వహించగా ఏడు కుటుంబాలకు చెందిన 12మందికి  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని హెల్త్ సూపర్ వైజర్ రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ రవి, గ్రామ సర్పంచ్ పందుల లక్ష్మీపతి, ఆశ వర్కర్స్ కనక లక్ష్మి, నాగలక్ష్మి, ఉపేంద్ర, గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కేతిరెడ్డి బండిపై అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి

 కేతిరెడ్డి బండిపై అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి

దేశం కోసం ఉన్నత చదువులు చదివి , రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగిస్తూ , ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములవుతూ , ప్రభుత్వాలకతీతంగా ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్న ఐఎఎస్ కలెక్టర్ ను నీచంగా , హేయంగా , బహిరంగంగా మీడియాలో మాట్లాడిన వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై  అనర్హ వేటు వేసి ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకా రమేష్ బాబు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం దళిత ప్రజా సంఘాల ఆర్ధ్వర్యం లో ధర్నా నిర్వహించి వినతిపత్రం డి.ఆర్.ఓ.కు  సమర్పించారు. ఈసందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులతో ఎదిగి కలెక్టర్ గా సామన్య ప్రజల మన్ననలు అందుకుంటున్న అనంతరం కలెక్టర్ శ్రీగంధం చంద్రుడుపై అసలు పరిపాలన , ప్రజా సంక్షేమం , కనీస అవగాహన లేని ఎమ్మెల్యే కేతిరెడ్డి బహిరంగంగా మీడియాలో కలెక్టర్ ను వ్యక్తిగతంగా దూషించే రీతిలో మాట్లాడటం దుర్మార్గమన్నారు . ఇలాంటి వారిని చట్టా సభలలో కొనసాగించటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు .దేశంలోనే తొలిసారిగా కులాలను సూచించేలా ఉన్న కాలనీ పేర్లుతొలగించాలని ఆదేశించారన్నారు. మాల పల్లె , మాదిగ పల్లె , హరిజనవాడ , దళితవాడ వంటి కులాలను సూచించే పేర్లను మార్చేయాలని ఆదేశించాన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దేశంలోనే తొలిసారి ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆయన అమలు చేశారన్నారు . ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అవార్డును కలెక్టర్ గంధం చంద్రుడు స్వయంగా కేంద్ర వ్యవసాయశాఖామంత్రి తోమర్ చేతుల మీదుగా అందుకున్నారు . అవార్డు అందుకున్న కలెక్టర్‌ను సీఎం జగన్ ప్రశంసించారు . అయితే జగన్ వద్ద గంధం చంద్రుడు ప్రశంసలు అందుకోగా , ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం ఈ క్రెడిట్ జాయింట్ కలెక్టరు దక్కుతుందని , ఆయన చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించడం హేయమైన చర్య అన్నారు. విజయనగరం అభివృద్ధి వేదిక అధ్యక్షుడు పుక్కిళ్ళ షణ్ముఖ రావు మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్ స్వరో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు అని సంజయ్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారురు. వారి ఇరువురు పై అట్రాసిటీ కేసు నమోదు చేయకుంటే  ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో బహుజన కళా మండలి కార్యదర్శి ఆతవ ఉదయ భాస్కర్, ఆదడా మోహన రావు, గంటన అప్పారావు, గండ్రేటి సత్యనారాయణ, కొమ్ము సోములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేగేటి సంతోష్, కింతడా పైడి రాజు, బోనెల అరుణా, ఎద్దు సంతోషి, విజయనగరం నియోజకవర్గ కన్వీనర్ అయినాడ కృష్ణ, గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ పెంట శంకర్ రావు, సోము మురళీ తదితరులు పాల్గొన్నారు.

జిందాల్ రైతులకు న్యాయం చెయ్యండి

జిందాల్ రైతులకు న్యాయం చెయ్యండి 










విజయనగరం,పెన్ పవర్  

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం గ్రామ పరిధిలో జెడ్ ఎస్ డబ్ల్యూ  జిందాల్ అల్యూమినియం లిమిటెడ్ పరిశ్రమను నిర్మించేందుకు జరిగిన భూసేకరణ లో అన్యాయం జరిగిన రైతులకు న్యాయం చేయాలని బుధవారం విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి భవాని శంకర్ ని లోక్సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు,వినతిపత్రం అందించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2008 వ సంవత్సరం లో బొడ్డవర, ముసిడిపల్లి,చినఖండేపల్లి,మూల బొడ్డవర, కిల్తం పాలెం,ప్రాంతాల్లో 1050 ఎకరాలు గిరిజనులు నుండి భూమిని సేకరించి జిందాల్ పరిశ్రమకి ఇచ్చారని ఇందులో డి పట్టా భూములు,ప్రభుత్వ భూమి కూడా ఉందని,భూసేకరణ లో అప్పటి అధికార పార్టీ నాయకులు అధికారులు చేతివాటం ప్రదర్శించి తమకు నచ్చినట్టు ప్రవర్తించి నిజమైన లబ్ధి దారులైన గిరిజనులకు అన్యాయం చేశారని,భూ సేకరణ జరిగి నేటికీ14 సంవత్సరాలు పూర్తి అయినా కర్మాగారం రాలేదని, భూమిని ఇచ్చిన కొంతమంది రైతులు ఆందోళన తో చచ్చిపోయారని వారి కుటుంబాలు రోడ్డు న పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు, భూ సేకరణలో కొంతమంది కి భూములు లేక పోయినా దొంగ రికార్డు లతో అధికారులు చలవతో లక్షల రూపాయలు స్వాహా చేసారని లోక్సత్తాపార్టీ ఆధారాలతో బయట పెట్టిందని,ప్రభుత్వం నేటివరకు బినామిలనుండి రికవరీ చేయలేకపోయిందని,గత ప్రభుత్వం కూడా కనీసం రైతులకు న్యాయం చేయలేదని ఆరోపించారు, జిల్లా రెవెన్యూ అధికారులు తగిన చర్యలు వెంటనే తీసుకోక పోతే లోక్సత్తాపార్టీ నుండి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భీశెట్టి అన్నారు,ఆర్డీఓ భవాని శంకర్ ని కలసినవారిలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు,ఎస్. కోట.నియోజకవర్గ అధ్యక్షుడు కాండ్రేగుల ప్రసాద్,రఘు రాం,తదితరులు ఉన్నారు.

నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి ధర పొందవచ్చు

 నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి ధర పొందవచ్చు,,,

మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు

కేసముద్రం,  పెన్ పవర్

 మిర్చి పండించిన రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి మార్కెట్ కు అమ్మేందుకు తీసుకువస్తే మంచి ధర దక్కుతుందని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు అన్నారు. బుధవారం మిర్చి యార్డులో వేలం పాటలను పరిశీలించారు. మార్కెట్ కు వచ్చిన మిర్చిని చూసి రైతులతో మాట్లాడారు. రైతులు తాము తీసుకువచ్చే మిర్చిని పూర్తిగా ఎండబెట్టి , తాలు లేకుండా వేరు చేసి తీసుకురావాలన్నారు. పూర్తిగా ఎండబెట్టకుండా తేమగా ఉన్న మిర్చిని అమ్మకానికి తెస్తే ఆశించిన ధర దక్కదని అన్నారు. వ్యాపారులు వేలం పాటలు అయిపోయిన వెంటనే తూకాలు వేసి రైతులను త్వరగా వారి వారి గ్రామాలకు పంపించే విధంగా చూడాలని వ్యాపారులకు సూచించారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు ఉన్న ప్రతిష్టను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మార్కెట్ కు వచ్చిన ప్రతి రైతు భాదతో కాకుండా, సంతోషంగా వెళ్ళేవిధంగా మార్కెట్ అధికారులు, వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది వ్యవహరించాలని కోరారు.

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియో తెరిఫి పై అవగాహనా కార్యక్రమం

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియో తెరిఫి పై అవగాహనా కార్యక్రమం            


 విజయనగరం, పెన్ పవర్                   

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న వాకార్స్ క్లబ్ నడకమైదానంలో శ్రీనిధి ఫిజియో థెరిఫి సెంటర్ ఫిజియో థెరఫిస్ట్ డాక్టర్ పొగిరి విశ్వేశ్వరరావు చే ఫిజియో థెరిఫిపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ విశ్వేశ్వరరావు క్లబ్ సభ్యులందరికి శరీరంలో కండరాలు, ఎముకలు పై సంబంధించిన జాగ్రత్తలును ఏవిధంగా తీసుకోవాలో వివరిస్తూ ఫిజియో థెరిఫి ఎప్పుడు అవసరమో,నడక సభ్యులు ఏవిధమైన వ్యాయామాలు చేయాలో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 గవర్నర్ ఎడ్ల గణేష్ మాట్లాడుతూ ఇటువంటి ఆరోగ్యకరమైన అవగాహనా కార్యక్రమాలు క్లబ్ సభ్యులుకు,ప్రజలకు ఎంతో దోహదపడుతుందని, కార్యక్రమం  నిర్వహించిన అధ్యక్షకార్యదర్శిలకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్ పొగిరి ఈశ్వరరావుకు క్లబ్ సభ్యులు సత్కరించారు. శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ పెద్దలు,గోల్డ్ డోనర్ పిన్నింటి సూర్యనారాయణ, క్లబ్ గౌరవ అధ్యక్షులు,గోల్డ్ డోనర్ డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాస్టారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కార్యదర్శి ఆరికతోట తిరుపతి రావు,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కోశాధికారి వై. శ్రీనివాసరావు, క్లబ్ కార్యదర్శి ములగ శ్రీనివాసరావు, కోశాధికారి ఆర్.సి.హెచ్.అప్పలనాయుడు, జాలీ వాకర్ నలమరాజు, సభ్యులు కె.ఎన్.స్వామి,డి.రాములు,బి.నరసింహమూర్తి,ఐ.వి.ప్రసాదరావు, పైడియ్య,వల్లూరి శ్రీనివాసరావు,చక్రధర్ పట్నాయక్,నాగరాజు,కోట్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీ

 కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీ.. 

పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట.. 

విపత్కరపరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు.. 

రూ.2.36 కోట్ల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని 236 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.2,36,27,376 విలువైన కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను బుధవారం చింతల్ లోని కేఎంజి గార్డెన్స్ లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. పేదలను ఆర్థికంగా అన్ని విధాల ఆదుకోవాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల వంటి ప్రతిష్ఠాత్మక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ అర్హులైన వారికి అందజేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్,మంత్రి సత్యనారాయణ, నిజాంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, వార్డు సభ్యులు సత్తి రెడ్డి, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.

మాస్కుధారణపై అవగాహ కల్పించిన ట్రాఫిక్ పోలీసులు

 మాస్కుధారణపై అవగాహ కల్పించిన ట్రాఫిక్ పోలీసులు

విజయనగరం,పెన్ పవర్

కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు మాస్కు తప్పనిసరిగా ధరించాలని విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు అన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, ఐ.పి.ఎస్., ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది బుదవారం నాడు విజయనగరం పట్టణంలో ప్రధాన కూడళ్ళు ఒవర్ బ్రిడ్జి, ఎస్పీ బంగ్లా జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్ లు పడుతున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శించి, కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు మాస్కులు ధరించడం చాలా ముఖ్యమని ప్రయాణికలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఎస్.ఐలు భాస్కరరావు, జియావుద్దీన్ మరియు సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శించి బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు మాట్లాడుతూ - కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ముఖ్యంగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను సబ్బుతోగాని, సేనిటైజర్ తో గాని తరుచూ శుభ్రపరుచుకోవాలన్నారు.జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి ఆదేశాలతో విజయనగరం పట్టణ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కు ధరించడం గురించి ప్రజలలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ అవ కార్యక్రమాలలో భాగంగా ప్రధాన కూడళ్ళలో సిగ్నల్స్ పడుతున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా వాహనదారులకు మాస్కు ఆవశ్యకత గురించి అవగాహహన కల్పిస్తున్నామన్నారు.

క్లాస్ మేట్ క్లబ్ వనపర్తి ఆధ్వర్యంలో కోనేరు హంపి జన్మదిన వేడుకలు

 క్లాస్ మేట్ క్లబ్ వనపర్తి ఆధ్వర్యంలో కోనేరు హంపి జన్మదిన వేడుకలు

వనపర్తి, పెవర్

వనపర్తి క్లాస్ మేట్ క్లబ్ అద్వర్యంలో వనపర్తి జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో  కోనేరు హంపి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి క్లాస్ మేట్ క్లబ్ మెంర్ అంబటి పల్లి వాస్తవ్యులు అంతటి శివప్రసాద్  పాఠశాల కు క్రీడా సామాగ్రి అందజేశారు. ముఖ్య అతిథి వనపర్తి మున్సిపల్ వైస్ ఛైర్మెన్ వాకిటి శ్రీధర్  మాట్లాడుతూ చదరంగం మేధాశక్తిని పెంచుతుందని,  విద్యార్థులు అందరూ సాధన చేయాలని కోరారు. ప్రముఖ క్రీడాకారులు, క్రీడా కారిణిల యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విధి గా ఆటల పోటీలు నిర్వహిస్తూ, వివిధ పాఠశాలలకు క్రీడా సామాగ్రి అందజేస్తున్నందుకు క్లాస్ మేట్ క్లబ్ ఫౌండర్ వాస రాఘవేందర్ కు, క్లాస్ మేట్ క్లబ్ ప్రతినిధుల కు అబినందనలు తెలిపారు.  ఎఎమ్.ఓచంద్రశేఖర్  మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో మేము ఇకపై పాల్గొంటామని, క్లాసుమేట్ క్లబ్ ద్వారా ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించి వారి బాగు కొరకు ప్రయత్నం చేస్తున్న క్లాసుమేట్ క్లబ్ కు అభినందనలు తెలిపారు.ఎఎమ్.ఓ గణేష్  మాట్లాడుతూ చెస్ నేర్చుకోవడం వలన మాథ్స్ బాగా వస్తుందని, పిల్లలు చురుకుగా తయారు అవుతారని, వారి జీవితంలో కూడ మంచి ప్లాన్ ఏర్పాటు చేసుకొని అన్నింట్లో విజయం సాధిస్తారన్నారు.స్కూల్ హెడ్ మాస్టర్ తారబాయ్  మాట్లాడుతూ మీరు మా స్కూల్ లో ప్రోగ్రాం చెయ్యడం చాలా ఆనంద దాయకం అని అన్నారు. వనపర్తి జిల్లా క్లాసుమేట్ క్లబ్ అధ్యక్షులు ఆకుల రవి శంకర్  మాట్లాడుతూ అందరం కలిస్తే ఇలాంటి కార్యక్రమాలు  ఇంకా ఎక్కువ మంది ప్రతిభ గల నిరుపేద విద్యార్థులను గుర్తించి వారికీ సహాయం చెయ్యొచ్చు అని అన్నారు. వనపర్తి  ప్రెసిడెంట్ వెంకటయ్య ,జనరల్ సెక్రటరీ రవీందర్ గౌడ్, కోశాధికారి కురుమూర్తి , క్లాసుమేట్ క్లబ్ ప్రతినిధులు అయిన నుర్జహాన్, పి.ఇ.టి పద్మ ,సతీష్, స్కూల్ బోధన, బోధనేతర సిబ్బంది,ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు అనురాధ, ఎస్.మాదవి, మౌనిక, వనజ, క్లాసుమేట్ క్లబ్ ప్రతినితులు పాల్గొన్నారు.

విజేత ఎస్ వి ఎస్ ఎస్

 విజేత ఎస్ వి ఎస్ ఎస్

సంతబొమ్మాళి, పెన్ పవర్

మండల కేంద్రం సంతబొమ్మాళి లో శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఉత్సవాలు సందర్బంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఎస్ వి ఎస్ ఎస్ (మామిడి పల్లి) టీమ్ విజేత గా నిలిచి ప్రధమ బహుమతిగా 20వేలు రూపాయలు గెలుచుకుంది.హనుమాన్ గురుస్వామి పప్పు రాజు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ఆదివారం నుంచి జరిగిన ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి 50టీమ్ లుపాల్గొన్నాయి.   ద్వితీయ స్థానం లో పాలకొండ టీమ్ నిలిచి 15వేల రూపాయలు గెలుపొందగా, తృతీయ స్థానం లోసింగుపురం,  మామిడి పల్లిటీమ్ లు నిలబడి చెరో 8వేలు బహుమతి గా గెలుచుకున్నారు. విజేతలు కు సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పాల వసంత రెడ్డి, మరియు కోత సతీష్ చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ కళింగ పట్నం లక్ష్మి, వైసీపీ నాయకులు వాదాల దుర్గారావు,  కొన్న శ్రీరాములు, పాల మహేష్,  సోమేసు, డాక్టర్ అప్పారావు, అట్టాడ వెంకటరమణ, దూబ వేణు, పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్లకు సత్కారం

 మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్లకు సత్కారం

పెద గంట్యాడ, పెన్ పవర్

ఇటీవల జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ బాడీ బిల్డర్ లు తమ సత్తా చాటారు. 85 కేజీల విభాగంలో లో సూర్య గోల్డ్ మెడల్ సాధించాడు.75 కేజీల విభాగంలో రాము ఆరవ స్థానంలో నిలిచాడు. పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రైస్ లో 120ప్లస్ కేజీ ల విశాఖ డిస్టిక్ లో సతీష్ గోల్డ్ మెడల్ సాధించగా,  ఆంధ్ర బాడీ లిఫ్టింగ్ లో ఐదవ స్థానంలో పండు యాదవ్ గెలుపొందాడు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి, సీనియర్ వైసీపీ నాయకులు ధర్మాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాడీ బిల్డర్ లకు సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ రెడ్డి మాట్లాడుతూ యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతి ఒక్కరి పేరు పై దృష్టి సాధించాలని అని అన్నారు. 

నే వి, ఆర్మీ, బి ఎస్ ఎఫ్, సీ ఐ ఎస్ ఎఫ్, పోలీస్ వంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయని అని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్రయత్నించాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిమ్ అధినేత ఆర్మీ రాజు, ఎమ్మెల్యే మహేష్, ములకలపల్లి ఈశ్వరరావు, ప్రసాద్, తేజ, గోవింద్ వంశీ, బుజ్జి, దుర్గ, ఎల్లాజీ, దినీష్  జిమ్ యువకులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నర్సింహారెడ్డి

అదనపు కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నర్సింహారెడ్డి.. 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ను కలిసిన నర్సింహారెడ్డి.. 

కలెక్టర్ చాంబరులో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకారం.. 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి.. 


మేడ్చల్ , పెన్ పవర్ 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కొత్తగా మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తా మని ఈ విషయంలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని కలిసిన ఆయన కలెక్టర్‌కు పూలబోకె అందించారు.. అనంతరం అదనపు కలెక్టరేట్లోని ఛాంబర్లో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు,  అధికారులు,  ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.  జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలన్నింటినీ పక్కా ప్రణాళికతో అధికారుల సహకారంతో విజయవంతమయ్యేలా కృషి చేస్తానని వివరించారు . కరోన రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, సానిటైజ్ చేసుకోవాలని, టీకాలు వేసుకోవాలని ప్రజలకు సూచించారు..

ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ

 ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ
మహారాణి పేట, పెన్ పవర్

కంచరపాలెం రైతు బజార్ వద్ద సెకండ్ వేవ్ కరోనా పట్ల తీసుకోవాల్సిన చర్యల పట్ల ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ క్యాంపయిన్ బుధవారం నిర్వహించాయి. కరోనా కి ప్రస్తుతానికి మందు లేదని, కాబట్టి నివారణ ఒక్కటే పరిష్కారం అని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు కామేశ్వరరావు అన్నారు. అవగాహన కోసం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ప్రజారోగ్య కమిటీ నాయకులు సంతోష్, సోమేశ్వరరావు, అప్పలరాజు,పి.రామారావు, ధర్మరాజు, జగదీశ్, రాము, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రకార్యదర్శిగా వాగ్దేవి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.సత్యనారాయణ

భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రకార్యదర్శిగా వాగ్దేవి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.సత్యనారాయణ 

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ నగరానికి చెందిన వాగ్దేవి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం వి వి సత్యనారాయణ 2021- 2022 గాను  భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రకార్యదర్శిగా ఎంపికయ్యారు. వీరిని భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు జి బాలచంద్రుడు ఎంపిక చేయగా  వివిధ ప్రాంతాలకు చెందిన భారత్ వికాస్ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు బలపరిచారు ఏప్రిల్ 2021 నుండి 2002 ఏప్రిల్ వరకు భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రస్థాయిలో మరియు వివిధ జిల్లాల స్థాయిలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు రాష్ట్ర కార్యదర్శిగా ప్రాతినిధ్యం వహిస్తారు.తనను భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిగా  ఎన్నుకున్నందుకు ఎం వి వి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేసి శక్తివంచన లేకుండా సంస్థ ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో  భారత్ వికాస్ పరిషత్ జాతీయస్థాయి ఉపాధ్యక్షులు ఆర్ సి జైన్ బి వి పి సీనియర్ సభ్యులు డి సూర్య సూర్యప్రకాశరావు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎం వి రాజశేఖర్, పి వెంకటేశ్వరరావు టి హేమచందర్ తదితరులు పాల్గొన్నారు.జాతీయస్థాయి ఉపాధ్యక్షులు జైన్ గారి చేతుల మీదగా నియామక పత్రం అందుకున్నారు.

కుమారి దగ్గులూరు దేవికి 10,000/- ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి

కుమారి దగ్గులూరు దేవికి 10,000/- ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి

మహారాణి పేట, పెన్ పవర్

30వార్డ్ కె.జి.హెచ్ వార్డుబాయ్ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన దగ్గులూరు దేవి, 30సం"రాల వయస్సు కలిగిన దగ్గులూరి దేవికి గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపదుతున్నదని వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే కి తెలియ జేసిన వెంటనే స్పందించి తక్షణమే సొంత నిధుల నుండి 10,000/- ( పదివేల రూపాయలు) ఆర్ధిక చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ ని  అక్కడ ప్రజలు ఎమ్మెల్యే ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 30 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కోడూరు అప్పల రత్నం, వార్డ్ ప్రెసిడెంటు దసమంతుల మాణిక్యాలరావు, పెంటపిల్లి సత్యనారాయణ,కోన శంకర్,రవితేజ,దిలీప్, రమేష్,తదితర నాయకులు పాల్గొన్నారు.

లాసన్స్ బే కోలని లో నూతన ఫిజియోధేరపీ క్లినిక్ ప్రారంభం

 లాసన్స్ బే కోలని లో నూతన ఫిజియోధేరపీ క్లినిక్ ప్రారంభం

విశాఖ తూర్పు, పెన్ పవర్

నగరంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన నూతన ఫిజియోధేరపీ క్లినిక్ ప్రారంభం అయింది.లాసన్స్ బే కోలని పోస్టాఫీస్ మార్గంలో గీతాస్ ఫిజియోధేరపీ నేడు ఘనంగా ప్రారంభమైంది.ప్రారంభోత్సవానికి ముఖ్యాతిదులుగా గీతం యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య పి‌ఎస్ రావు,కే‌జి‌హెచ్ విశ్రాంత విభాగాదిపతి డాక్టర్ ఉదయ్ కుమార్ లు విచ్చేశారు.ముందుగా దీపప్రజ్వలన గావించి క్లినిక్ ని అతిదులు ప్రారంభించారు.ప్రముఖ వైద్యనిపుణులు,సంస్థ మేనేజింగ్ డైరక్టర్ సి‌హెచ్ ఉదయ్ శంకర్ ఆద్వర్యంలో  నిర్వహించనున్న క్లినిక్ ప్రత్యేకతలను అతిదులు అడిగితేలుసుకున్నారు.అత్యాధినిక పరిజ్ఞానంతో పాటుగా నిష్ణార్ధులైన వైద్య నిపుణులతో చికిత్స అందించనున్న క్లినిక్ అంతర్జాతీయ ప్రణాళికతో ఉందని అతిదులు కొనియాడారు.శరీర స్థితిగతులను సరియైన అంచనా వేసి వ్యాదుల నిర్మూలనకు అవసరమైన ఫిజియోధేరపీ వైద్య విధానంతో చికిత్స అందించనున్నామని నిర్వాహికులు తెలిపారు.రోగుల శారీరక స్థితిగతులను తెలుసుకోవడానికి వారితో కలిసి వారి వ్యవహారశైలి,ఆహారపు అలవాట్లు గుర్తించి వారి బౌతీక స్థితికి అనుగుణంగా అత్యున్నతమైన వైద్యం అంధించే క్లినిక్ నగరవ్యాప్తంగా ఎక్కడాలేదని తొలిసారిగా గీతాస్ క్లినిక్ ద్వారానే పరిచయం చేస్తున్నామని తెలిపారు.సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో చికిత్స అందించేలా టారిఫ్ రూపకల్పన చేశామని నిర్వాహికులు తెలిపారు.ఇంతటి ఉత్తమ వైద్యం అందిస్తున్న గీతాస్ క్లినిక్ భవిష్యత్తులో మరింత వృద్ది చెంది మరిన్ని శాఖలుగా విస్తరించాలని అతిదులు ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహికులతో పాటుగా పలువురు వైద్యులు పాల్గొన్నారు.

పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మాస్కుల పంపిణీ.

 పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మాస్కుల పంపిణీ...

నార్నూర్,  పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఎస్ ఐ విజయ్ కుమార్ బుధవారం ఆటో డ్రైవర్లకు ఉచితంగా మాస్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున నేపత్యంలో డ్రైవర్ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజాల దూరాన్నీ పాటించాలని,డ్రైవర్లు బయటి ప్రదేశంలో ఆటోలు నడిపేటప్పుడు ప్రయాణికులకు ఆటోలో కూర్చునప్పుడు జాగ్రత్తలు వివరించి చేతికి శానిటైజర్ చేసి మాస్కులు ధరించాలని తగు సూచనలు పాటించి జాగ్రతలో ఉండాలని ఆదేశించారు. వారి వెంట యూనియన్ ప్రెసిడెంట్ ఫెరోజ్ ఖాన్, ట్రైనీ ఎసై, పోలీస్ సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

పోర్టు షప్పింగ్ కార్యదర్శి సంజీవ్ రంజన్ ను కలిసిన పోర్టు సి.ఐ.టి.యు. యూనియన్

పోర్టు షప్పింగ్ కార్యదర్శి సంజీవ్ రంజన్ ను కలిసిన పోర్టు సి.ఐ.టి.యు. యూనియన్

మహారాణి పేట, పెన్ పవర్

పోర్టు షప్పింగ్ కార్యదర్శి సంజీవ్ రంజన్ మంగళవారం విశాఖ పోర్టు కి వచ్చారు అసందర్బంగా పోర్టు సి.ఐ.టి.యు. యూనియన్ కలవడం జరిగింది.యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.ఎస్.పద్బనాభ రాజు  మాట్లాడుతూ పోర్టుల ప్రవేటీకరణ చెయరాదు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో, ముఖ్యంగా పారా 64,65 మరియు 66 లో భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల కార్యకలాపాలను పరిష్కరించారు. దీనిలో "పిపిపి ఆపరేటర్లను ఈ చర్యలో అనుమతించడం ద్వారా" మేజర్ పోర్టుల సరుకును నిర్వహించడంలో భారం తగ్గుతుంది. మేజర్ పోర్ట్ యొక్క కోర్ కార్యాచరణ కార్గో హ్యాండ్లింగ్. దాని కార్యకలాపాలకు ఇది భారం కాదు. ఈ నేపథ్యంలో, “మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021” ఫలితం పిపిపి మోడ్ కింద మేజర్ పోర్టులలో మొత్తం 30 బెర్త్లను అవుట్సోర్స్ చేయాలని మరియు ఆదాయ వాటాను సంపాదించాలని నిర్ణయించిందని, తద్వారా అన్ని పోర్టులను భూస్వామి మోడల్ క్రింద మార్చాలని మేము చూశాము. ఈ నిర్ణయం మేజర్ పోర్ట్స్ మరియు దాని కార్మికుల ఆసక్తికి చాలా హానికరం అని మా అభిప్రాయం. పార్లమెంటుకు సమర్పించిన కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క నివేదిక ప్రకారం అన్ని పిపిపి ప్రాజెక్టులు విఫలమయ్యాయి. ఉదాహరణకు మా విశాఖపట్నం పోర్టు ట్రస్ట్,అధాని టెర్మినల్, ఏస్.ఈ.డబల్యూ,ప్రాజెక్ట్,ఎస్సార్ మరియు వేదాంత టెర్మినల్స్ నుండి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, మార్కు వరకు ఎటువంటి ఆదాయాన్ని పొందడం లేదు. ఈ ప్రాజెక్టులలో కొన్ని లేదా చట్టపరమైన వ్యాజ్యాలలో మాత్రమే కాదు. పిపిపి ప్రాజెక్టుల వల్ల విపిటి భారీ ఆదాయాన్ని కోల్పోతోంది. అందువల్ల బహుళజాతి జాతీయ సంస్థ ఆక్రమణకు మార్గం సుగమం చేస్తుంది మరియు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విధంగా మన జాతీయ భద్రత మరియు భద్రత సమస్యను మరింత దారి తీస్తుంది కాబట్టి అలాంటి చర్యను విరమించుకోవాలని మేము మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తున్నాము.షిప్పింగ్ సెక్రెటరీ ని సి.ఐ.టి.యు,యూనిటెడ్ పొర్టు మరియు డాక్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ఎస్ కుమార్, వి ఎస్ పద్మనాభ రాజు, వర్కింగ్   ప్రసిడెంట్ సి.హెచ్.త్రినాద రావు,కార్యదర్శి జగన్ కలిసారు.

కరోనా 2వ దశ పై అవగాహన కార్యక్రమం

 కరోనా 2వ దశ పై అవగాహన కార్యక్రమం

విశాఖ తూర్పు, పెన్ పవర్

సీతమ్మదార రైతు బజారు వద్ద మంగళవారం ప్రజారోగ్య వేదిక మరియు ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్తంగా కరోనా 2వ దశ పై అవగాహన కార్య్రక్రమం మరియు కరపత్రం పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమంలో పి.ఏ.వి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్ 2 చాలా ప్రమాద కరమైనదని దీనికి లక్షణాలు కూడా కనిపించవు అని వచ్చిన 3 రోజులలోనే చెయ్యి దాటిపోయి ప్రమాదం ఉందని దీనికి మందులేదని ఏస్.ఎమ్.ఏస్,మాత్రమే నివారణ అని తెలియచేస్తూ (ఏస్) అంటే శానిటేషన్(ఎమ్ ) అంటే మాస్క్(ఏస్ ) అంటే సోషల్ డిస్టెన్స్ ఇది వాక్సిన్ వేసుకున్నా పాటించాలని తెలియచేశారు పి.పి.సి,రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రమౌళి మాట్లాడుతూ ప్రభుత్యం చొరవ తీసుకొని ప్రతీ ఒక్కరికీ మాస్క్ లు మరియు ఉచితంగా ఇవ్వాలని ప్రతీ వారు ఏస్.ఎమ్ఏస్,పాటించే విధంగా చొరవ చేసుకోవాలని  విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎమ్.ఏస్.అర్.యు,నాయకులు చంద్రశకర్, సంజయ్, సంతోష్ మురళి. ఎన్.జి.ఓ, నాయకులు రమణారెడ్డి, సివనగేశ్వరావు, కృష్ణ ,శ్రీను ,మహిళా నాయకులు కుమారి తదితరులు కరపత్రాలు పంచి ప్రజలకు జాగృతం చేశారు.

వై.ఏస్.ఆర్.సి.పి, తీర్థం పుచ్చుకున్న 31 వార్డు టి.డి.పి నాయకులు

వై.ఏస్.ఆర్.సి.పి, తీర్థం పుచ్చుకున్న 31 వార్డు టి.డి.పి నాయకులు

మహారాణి పేట, పెన్ పవర్

తెలుగుదేశం పార్టీ సభ్యులైన మరియు వివిధ విభాగాల్లో 31 వార్డులో పని చేసినటువంటి వార్డు స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో సభ్యులందరూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ చేతులమీదుగా కండువా స్వీకరణ మరియు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీరిలో తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయిలో పని చేసిన సకురు రామకృష్ణ త్రినాథ్ (శివాలయం ట్రస్ట్ చైర్మన్ ) పట్టాభి (ఎల్లమ్మ తల్లి ట్రస్ట్), బీసీ సెల్ ప్రెసిడెంట్ సిరం అప్పలరాజు, మంగరాజు దస్పల్ల శివాలయం ట్రస్ట్ మెంబెర్,సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘ జిల్లా కార్యదర్శి ఉల్లి రమణ వార్డు టిడిపి ప్రధాన కమిటీ కార్యదర్శి గాద పార్వతి బూత్ అధ్యక్షులు పిలక మోహన్,గుత్తుల శ్రీను సూర్యకుమారి,ఎర్ర రామకృష్ణ,దుర్గా రెడ్డి,వడాల సతీష్, టిడిపి యువత నాయకుడు కిరణ్, రాజా బాబు వార్డు టిడిపి కార్యదర్శులు పిలక దుర్గ, శ్రీదేవి శ్రీనివాస్, బాణాల కృష్ణ,చంద్రశేఖర్,సూరిబాబు,గౌరీ శంకర్, సన్యాసమ్మ మరియు విశాఖ సెంట్రల్ పార్క్ మొబైల్ ట్రక్ వెండర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్ మరియు వారి సభ్యులు,మూకుమ్మడిగా వైసిపి తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో లో వార్డు వైసిపి నాయకులు దొడ్డి బాపు ఆనంద్, మాజీ కార్పొరేటర్ సాయి లక్ష్మి,పల్లా శ్రీనివాస్,మొకర గోపి,దొడ్డి రామానంద్, కర్రి ధనలక్ష్మి, గారి రాంబాబు, నవీన్, లక్ష్మణ్, మిగిలిన వార్డు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

 బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు...

బేల, పెన్ పవర్

ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ గుండావార్  తండ్రి, మండలంలోని పాటన్ గ్రామానికి చెందిన కొప్పుల్వర్ రామన్న అనారోగ్యంతో  మరణించడంతో బుధవారం వారి కుటుంబాలను తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణానికి గల కారణం అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ఆదిలాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ జైనాథ్ మండల అధ్యక్షుడు కల్చప్ రెడ్డి, బేల మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాందాస్ నక్లే, కాంగ్రెస్ పార్టీ నాయకులు వమాన్ వాంఖడే, పాఠన్ సర్పంచ్ ఫైజుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జండా కు ,శత సంవత్సరాల వేడుకలు

 జాతీయ జండా కు ,శత సంవత్సరాల వేడుకలు

మహారాణి పేట, పెన్ పవర్

జాతీయ జండా రూపశిల్పి,స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య కు ఘన నివాళులు.పింగళి కి భారతరత్న ఇవ్వాలి.శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చర్ అండ్ యూత్ అకాడమీ,రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ,ప్రకృతి చికిత్సాలయం మహారాణి పేట ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ పాల్గొని ముందుగా స్వాతంత్ర సమరయోధుడు,నిష్కళంక దేశభక్తుడు పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా  త్రివర్ణ పతకమును  గగన తలమునకు ఎగురవేశారు.వారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య ఆగస్టు 2 ,1876 లో కృష్ణా జిల్లాలో  సామాన్య  సాంప్రదాయ కుటుంబంలో జన్మించారని అన్నారు.గాంధీజీ  పిలుపును అందుకొని బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకముగా,భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై జాతీయ స్వాతంత్ర ఉద్యమములో పాల్గొని తన వంతు పోరాటం సాగించారు.1916 లో జాతీయ పతాకము అనే ఆంగ్ల పుస్తకమును రచించారు.త్రివర్ణ పతకమును 1921 లో రూపొందించారు.ఈ పతాకంలో  ఎరుపు రంగు  హిందూ మతానికి ,తెలుపు రంగు ఇతర మతాలకు,ఆకుపచ్చరంగు ఇస్లాం మతమునకు ప్రతీకలుగా రూపొందించారు. మహాత్ముని సూచన తో జెండాలో రాట్నం చిహ్నం పొందుపరిచారు.1947 లో స్వాతంత్రం అనంతరం కాషాయం ,తెలుపు ,ఆకుపచ్చ రంగుల తోటి మరియు మధ్యలో అశోక చక్రమును పొందుపరిచారు .జూలై 4 ,1963 వ సంవత్సరంలో  తన 86వ ఏట పరమపదించారు.విదేశాల నుంచి వచ్చి పేదలకు సేవలు అందిస్తూ, మురికి వాడలలో మత  ప్రచారం చేస్తున్న వారికి కూడా భారతరత్న ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.కానీ 135  కోట్ల మంది ప్రజలు నిత్యము వందనము చేయు జాతీయ జండా రూపకర్తకు  నేటి వరకు  భారత ప్రభుత్వము భారతరత్న ప్రకటించకపోవడం విచారించ వలసిన విషయం. ఆంధ్రులైన పీవీ నరసింహారావు కు ,పింగళి వెంకయ్యకు ఆంధ్రుల ఆత్మ గౌరవం పెంపొందించిన ఎన్టీ.రామారావుకు,అల్లూరికి ,భోగి రాజు పట్టాభి సీతారామయ్య కు  ఇంకా ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలు సైతం త్యాగము చేసిన మహనీయులకు కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వెంకయ్య కుటుంబానికి 75 లక్షలు  ఆర్థిక సహాయము అందజేశారు .ఇన్ని సంవత్సరాలుగా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు ,పోయారు కానీ వెంకయ్య కుటుంబాన్ని ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే.ఈ కార్యక్రమంలో  డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ,డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి ,పల్లా చలపతి రావు ,ఎస్ మహేష్ ,గేదెల శ్రీహరి,డాక్టర్ బుచ్చిబాబు ఎల్,డాక్టర్ వై లక్ష్మణరావు,ఎస్ చాతుర్య , దుటి,రమణ,రాము,శారద,కొండమ్మ ,ఎమ్.ఏస్.  నాయుడు,రమణి,రామదాస్ అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అందరికీ పండ్లు ,స్వీట్స్ పంచారు.

రాజమండ్రి వేదికగా మిస్టర్ ఆంధ్రా పోటీలు

రాజమండ్రి వేదికగా  మిస్టర్ ఆంధ్రా పోటీలు

విశాఖ,పెన్ పవర్ 

 ఈ నెల 28 న రాజమండ్రిలో మిస్టర్ ఆంధ్రా క్లాసిక్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ - 2021 పోటీలు  నవ్యాంధ్ర  ఫిట్నెస్ బాడీ బిల్డర్స్  అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి వీరభద్రరావు ,  ప్రధాన కార్యదర్శి టి.ఎస్. సాల్మన్ రాజు ఆధ్వర్యంలో  జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్రంలో 12 జిల్లాల నుండి  9 గ్రూప్ లు గా మొత్తం 135 మంది బాడీ బిల్డర్లు పాల్గొనడం జరిగింది. అందులో ఒక్కొక్క గ్రూప్ లో ముగ్గురు చొప్పున  మొత్తం 27 మంది కి  వెయిటేజ్ ప్రకారం విజేతలు గా నిర్ణయించి వారి వారి స్థానాలను కేటాయించడం జరిగింది. 

మరల వీరిలో ముగ్గురిని  ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ , బెస్ట్  ప్రేజర్ , మరియు మోస్ట్ మస్క్యూలర్ మాన్ గా ఎంపిక చేసి విజేతలుగా ప్రకటించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న బిల్డర్లకు స్టార్ జిమ్ ఆర్గనై జేషన్ వారు వసతి , భోజన  సదుపాయాలను కల్పించారు. ఈ పోటీలకు ముక్య అతిధులుగా రాష్ట్ర  చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ తానేటి వనిత , రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్ రాం , స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి. యువ నాయకులు  జక్కంపూడి గణేష్ , మాజీ  డిప్యూటీ మేయర్  బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ , మాజీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ బర్రె కొండ బాబు , మునిసిపల్ కౌన్సిలరు అంగడ సరళ దేవి లు హాజరైనారు. వీరి చేతుల మీదుగా గెలిచిన వారికి బహుమతి ప్రధానం చేశారు.  గెలిచిన అభ్యర్థులకు విశాఖ  జిల్లా  బాడీ  బిల్డర్స్   అసోసియేషన్ అధ్యక్షులు  ఎర్రబిల్లి  ప్రభాకర రావు ,  ప్రధాన  కార్యదర్శి  కె. సుబ్రమణ్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

గెలిచిన అభ్యర్థుల వివరాలు 9 గ్రూప్ ల నుండి.......

55 కె.జీ. లు. లోపల

1.సుశాంత్ మినియక. --విజయవాడ   - మొదటి స్థానం

2.ఎం.వంశీ నాయుడు –      విశాఖ     -   రెండవ స్థానం

3.ఎస్.సౌమ్య రాజన్.   -   నెల్లూరు.   -   మూడవ స్థానం 

60 కె.జీ. లు. లోపల

1.ఎం.నూకరాజు.        -     విశాఖ.    -    మొదటి స్థానం

2. పి.ప్రసాద్.              -     విశాఖ.    -     రెండవ స్థానం

3.డి.వంశీ కృష్ణ.         – విజయవాడ -   మూడవ స్థానం

65 కె.జీ. లు లోపల

1.జి.గణేష్.            -    తూ. గో. జిల్లా -   మొదటి స్థానం

2.కె.తిరుమల రెడ్డి. -    కృష్ణ  జిల్లా.   -    రెండవ స్థానం

3.వై.బాబీ.             -    తూ. గో.జిల్లా.-   మూడవ స్థానం

70 కె.జీ. లు. లోపల

1.ఎస్.నాగేంద్ర.     -       ప.గో. జిల్లా -      మొదటి స్థానం

2.జి.భాస్కర్ రావు-       ప.గో.జిల్లా-       రెండవ స్థానం

3.జె.కిరణ్ కుమార్ -         విశాఖ.  -      ముడవ స్థానం

75 కె.జీ. లు లోపల

1.కె.వంశీ.             -    తూ. గో.జిల్లా-     మొదటి స్థానం

2.వి.శ్రీరామ్.         -     ప.గో. జిల్లా. -     రెండవ స్థానం

3.ఎ. నరేంద్ర.        -       విశాఖ.      -    మూడవ స్థానం

80 కె.జీ. లు.  లోపల   

1.ఎస్.కె.యూసుఫ్-   గుంటూరు-        మొదటి స్థానం

2.జి.శ్రీకాంత్.       -       శ్రీకాకుళం -       రెండవ స్థానం

3.జె.ఉమామహేశ్వరావు-     శ్రీకాకుళం-      మూడవ స్థానం

85 కె.జీ. లు లోపల

1.బి.సూర్య.          -         విశాఖ  -      మొదటి  స్థానం

2.కె.రామకృష్ణ.     -        విశాఖ -       రెండవ స్థానం

3.ఎం.వెంటేశ్వర్లు. -  తూ. గో. జిల్లా-    మూడవ స్థానం

90 కె.జీ.లు లోపల

1.ఎం.వెంకటేష్. -          విశాఖ   -     మొదటి స్థానం

2.పి.బాబు ప్రకాష్-       శ్రీకాకుళం-     రెండవ స్థానం

3.ఎ. డి.వి.ప్రసాద్       విశాఖ. -     మూడవ స్థానం

90    కె.జి.లు పైన 

1.ఎం.శివ అప్పలరాజు-  విశాఖ. -      మొదటి స్థానం

2.ఎస్.కె.మునవల్లి.   -   విశాఖ.  -       రెండవ స్థానం

3.ఐ. హరీష్.       -     తూ. గో.జిల్లా-   మూడవ స్థానం

ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ :-

ఎస్. నాగేంద్ర....తూర్పు గోదావరి జిల్లా...

బెస్ట్ ప్రేజర్ : -

ఎస్.కె.యూసుఫ్............గుంటూరు 

మోస్ట్ మస్క్యూలర్ మాన్

జి.గణేష్........తూర్పు గోదావరి జిల్లా....

 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...