Followers

మాస్కు ధరించకుంటే జైలుకు

 మాస్కు ధరించకుంటే జైలుకు


పెన్ పవర్,  మల్కాజిగిరి 

రాష్ట వ్యాప్తంగా డిజిపి మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ సూచనలు మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ చౌరస్తాలో ఎస్.ఐ అనంత చారి ఆద్వర్యంలో సెకండ్ వేవ్ కోవిడ్- 19, కరోనా విజృంబిభిస్తున్న నేఫేద్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలంటు అవగాహన కల్పించారు. వ్యాపారస్తులు, వాహనదారులు, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి, బౌతిక దూరం పటించి, శానిటైజర్ తో శుభ్రం చేసుకొవాలని అన్నారు. వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, అయినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహించి మాస్కులు ధరించకుండా ఉంటే వారిని జైలుకు తరలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిష్టేబుల్ రమేష్, వీరా చారి, కృష్ణ, మహిళా కానిష్టేబుల్ మాధవి, సంధ్య, శ్రీదేవి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...