Followers

వై.ఏస్.ఆర్.సి.పి, తీర్థం పుచ్చుకున్న 31 వార్డు టి.డి.పి నాయకులు

వై.ఏస్.ఆర్.సి.పి, తీర్థం పుచ్చుకున్న 31 వార్డు టి.డి.పి నాయకులు

మహారాణి పేట, పెన్ పవర్

తెలుగుదేశం పార్టీ సభ్యులైన మరియు వివిధ విభాగాల్లో 31 వార్డులో పని చేసినటువంటి వార్డు స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో సభ్యులందరూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ చేతులమీదుగా కండువా స్వీకరణ మరియు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీరిలో తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయిలో పని చేసిన సకురు రామకృష్ణ త్రినాథ్ (శివాలయం ట్రస్ట్ చైర్మన్ ) పట్టాభి (ఎల్లమ్మ తల్లి ట్రస్ట్), బీసీ సెల్ ప్రెసిడెంట్ సిరం అప్పలరాజు, మంగరాజు దస్పల్ల శివాలయం ట్రస్ట్ మెంబెర్,సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘ జిల్లా కార్యదర్శి ఉల్లి రమణ వార్డు టిడిపి ప్రధాన కమిటీ కార్యదర్శి గాద పార్వతి బూత్ అధ్యక్షులు పిలక మోహన్,గుత్తుల శ్రీను సూర్యకుమారి,ఎర్ర రామకృష్ణ,దుర్గా రెడ్డి,వడాల సతీష్, టిడిపి యువత నాయకుడు కిరణ్, రాజా బాబు వార్డు టిడిపి కార్యదర్శులు పిలక దుర్గ, శ్రీదేవి శ్రీనివాస్, బాణాల కృష్ణ,చంద్రశేఖర్,సూరిబాబు,గౌరీ శంకర్, సన్యాసమ్మ మరియు విశాఖ సెంట్రల్ పార్క్ మొబైల్ ట్రక్ వెండర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్ మరియు వారి సభ్యులు,మూకుమ్మడిగా వైసిపి తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో లో వార్డు వైసిపి నాయకులు దొడ్డి బాపు ఆనంద్, మాజీ కార్పొరేటర్ సాయి లక్ష్మి,పల్లా శ్రీనివాస్,మొకర గోపి,దొడ్డి రామానంద్, కర్రి ధనలక్ష్మి, గారి రాంబాబు, నవీన్, లక్ష్మణ్, మిగిలిన వార్డు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...