Followers

చలివేంద్రం ప్రారంభించిన తాసిల్దార్.. దూసి రవి

 చలివేంద్రం ప్రారంభించిన తాసిల్దార్.. దూసి రవి

మెంటాడ, పెన్ పవర్ 

 మెంటాడ మండలం లోని కుంతిని వలస గ్రామం లో బుధవారము గ్రామ సర్పంచ్ పెద్ది రెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మెంటాడ తాసిల్దార్ దూస రవి చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రవి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. గ్రామస్తులు కూడా తాగునీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, వైసిపి నాయకులు పొరిపిరె డ్ది సూర్యారావు, వై. సింహాచలం, పలువురు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...