Followers

Showing posts with label SPORTS. Show all posts
Showing posts with label SPORTS. Show all posts

ఆట పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం

 ఆట పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం...

 ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న

 బేల, పెన్ పవర్

ఆటల పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని ఓడిపోయిన వాళ్లు నిరాశ పడకుండా ముందుకెళ్లే పట్టు సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం మండలంలోని చప్రాల గ్రామంలో లో గత 15 రోజుల నుంచి నిర్వహించిన క్రికెట్ పోటీలు నేటితో  ముగిశాయి. మొదటి బహుమతి చాంద్ పెళ్లి జట్టుకు జోగు పౌండేషన్ తరఫున రూ31,000, రెండో బహుమతి చప్రాల జట్టుకు జడ్పిటిసి సభ్యులు అక్షిత సతీష్ పవార్ తరఫున (ఆడానేశ్వర్ ఫౌండేషన్ )రూ 15,000,గెలుపొందిన జట్లకు బహుమతులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధానం చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో  ఉన్న యువకుల ప్రతిభను వెలికి తీయడానికి గ్రామా గ్రామాల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ యువకులు గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, ఆడణేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, స్థానిక సర్పంచ్ దౌలత్ రావు, టిఆర్ఎస్ నాయకులు దేవన్న, సతీష్, ప్రవీణ్ , జగన్నాథ్,ప్రకాష్ రెడ్డి,గేడం సునీల్,  క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం చెల్లించాలి

ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం చెల్లించాలి

 పెన్ పవర్, ఉలవపాడు 

మండల కేంద్రమైన ఉలవపాడు లోని ఉపాధి కూలీలకు రూ.300 కూలీ,200రోజులు పని కల్పించాలని, ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం 10వేలు చెల్లించాలని,50కేజీల బియ్యం, నిత్యావసర సరుకులన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మికసంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఉలవపాడులో శుక్రవారం  ఎంపీడీఓ టి. రవి కుమార్ గారికి వినతి పత్రం అందజేస్తున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్,సిపిఎం నాయకులు . గౌస్,సీఐటీయూ ఉలవపాడు మండల నాయకులు గంజి. శ్రీను, జహీర్,M. కోదండం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ కోర్టును పునరుద్ధరించాలని మంత్రి కొడాలి నానికి వినతి

వాలీబాల్ కోర్టును పునరుద్ధరించాలని మంత్రి కొడాలి నానికి వినతి 

గుడివాడ, పెన్ పవర్

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులకు ఒక వరమని, దీన్ని పట్టణ, పరిసర ప్రాంత క్రీడాకారులు వినియోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. సోమవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన వాలీబాల్ క్రీడాకారులు ఎం షణ్ముఖ్, జీ సుధాకర్, పీ భార్గవ్, ఎల్ రాజా తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడివాడ పట్టణం ఎన్టీఆర్ స్టేడియంలోని వాలీబాల్ కోర్టును పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు వినియోగించుకుంటున్నారని, తద్వారా క్రీడా నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయన్నారు. ఎంతో మంది వాలీబాల్ క్రీడాకారులు స్టేడియం కమిటీ సహకారంతో ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చుకున్నారన్నారు. గుడివాడ పట్టణంలో ఇటీవల కాలంలో దాదాపు పది మందికి పైగా వాలీబాల్ క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలను పొందారని చెప్పారు. ఇటీవల స్టేడియంలో వాలీబాల్ కోర్టును తొలగించారన్నారు. వాలీబాల్ క్రీడాకారులను స్టేడియంలోకి అనుమతించడం లేదని, దీనివల్ల క్రీడాకారుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఏర్పడిందన్నారు. క్రీడాకారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్ కోర్టును పునరుద్ధరించాలని వారు కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వాలీబాల్ కోర్టు ఏర్పాటుకు సంబంధించి స్టేడియం కమిటీ సభ్యులతో మాట్లాడతానని చెప్పారు. క్రీడల అభివృద్ధికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో వివిధ స్థాయిల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తూ పట్టణ, పరిసర ప్రాంత క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా స్టేడియం కమిటీ ప్రోత్సహిస్తోందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్

 గ్రంథాలయ చైర్మన్  రౌతు   మనోహర్

బేలా, పెన్ పవర్

 ఆటల పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మనోహర్ అన్నారు. గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న మండలంలోని చెప్రాల గ్రామంలో  కబడ్డీ పోటీల గురువారంతో ముగిసాయి. ఈ పోటీలలో మొదటి బహుమతి తలై గూడ, రెండో బహుమతి రాంపూర్ గ్రామాల జట్టు గెలుపొందాయి. వీరికి జిల్లా గ్రంథాలయ చైర్మన్, గ్రామ టిఆర్ఎస్ నాయకులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ఆటల పోటీలలో గ్రామస్తులు గ్రామ యువకులు రాణించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ యువకులు ఉద్యోగుల కోసం అనేక క్రికెట్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి కమిటి చైర్మన్ సంతోష్, టిఆర్ఎస్ నాయకులు సతీష్, గ్రామ  సంఘాల యువ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లి జూనియర్ కాలేజీ మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్

 చింతపల్లి జూనియర్ కాలేజీ మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్ 

చింతపల్లి, పెన్ పవర్

గత 2 రోజుల నుండి విశాఖపట్నం జిల్లా, చింతపల్లి పోలీసులు, మరియు ఐటిడిఎ వారి ఆద్వర్యంలో గ్రామ వాలంటీర్లకు చింతపల్లి జూనియర్ కాలేజీ మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్‌లో మొత్తం 15 పంచాయతీ జట్లు పాల్గొన్నాయి.చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నుండి 9 జట్లు మరియు అన్నవరం పరిధి పోలీస్ స్టేషన్ నుండి 6 జట్లు పాల్గొన్నారు. ఏ.ఏస్.పి,చింతపల్లి  సమక్షంలో ఈ రోజు ఫైనల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఎ.ఎస్.పి చింతపల్లి విద్యా సాగర్ నాయుడు ఐ.పి.ఎస్. ప్రధమ విజేత అయనా కుడుముసారి పంచాయతీ వాలంటీర్‌  జట్టుకు రూ:10,000/-, రెండవ బహుమతి లామ్మసి పంచాయతీ వాలంటీర్‌ జట్టుకు రూ:5000/-, మూడవ బహుమతి కొమ్మంగీ పంచాయతీ జట్లుకు రూ;2000/- మరియు మెమెంటోలతో  సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఏస్.పి, చింతపల్లి  వాలంటీర్లు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అందరూ వాలీబాల్ టోర్నమెంట్ ను క్రీడాస్పూర్తితో ఆడారని మరియు ఈ టోర్నమెంట్ వారిని ప్రోత్సహించడానికి నిర్వహించామని తెలియజేసారు. వాలంటీర్లు ప్రజలకు మారింత సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సిఐ టి.శ్రీను, అన్నవరం ఎస్ఐ ప్రశాంత్ కుమార్, శిక్షణ ఎస్‌ఐ రామకృష్ణ, చింతపల్లి శిక్షణ ఎస్.ఐ.,రవీంద్ర మరియు,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ విజేత పొల్లాచి ...

వాలీబాల్ విజేత పొల్లాచి ...

బంగారుపాలెం, పెన్ పవర్

బంగారుపాలెం లో మూడు రోజులుగా జరుగుతున్న దక్షిణ రాష్ట్రాల వాలీబాల్ టోర్నమెంట్ లో పురుషుల విభాగంలో పొల్లాచి కి చెందిన శ్రీ సరస్వతి త్యాగరాజన్ కాలేజ్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా మహిళా విభాగంలో చెన్నైకి చెందిన ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ జట్టు విజేతలుగా నిలిచాయి మహిళా విభాగంలో మైసూర్ స్పోర్ట్స్ హాస్టల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా ఈ రోడ్డు చెందిన పీ కే ఆర్ ఆర్ట్స్ కాలేజి జట్టు తృతీయ స్థానంలో నిలిచింది విజయం సాధించిన జట్లకు నగదు బహుమతి ట్రోఫీ లను జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు కుమార్ రాజా చేతులమీదుగా అందించారు ఆదివారం రాత్రి నిర్వహించిన ముగింపు సమావేశంలో పలువురు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులను బంగారుపాలెం సర్పంచ్ కృష్ణమూర్తి ఉమాదేవి ఉప సర్పంచ్ కామరాజు ఎంపీటీసీ పద్మావతి ఆటగాళ్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు తులసి రెడ్డి కోశాధికారి మురారి జిల్లా వాలీబాల్ కోచ్ సుదర్శన్ నాయుడు. మాజీ వాలీబాల్ క్రీడాకారులు దిలీప్. పెరుమాల్. తిరుమల రావు, బాలాజీ, చందు, ప్రసాద్ నాయుడు, వెంకటేష్ ,పైనీ,  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

హోరాహోరీగా వాలీబాల్ పోటీలు

 హోరాహోరీగా వాలీబాల్ పోటీలు 

చిత్తూర్, పెన్ పవర్

 స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ పోటీలకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ఆహ్వానిత జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో మొదటి మ్యాచ్ లయోలా కాలేజ్ చెన్నై బంగారుపాలెం స్పైకర్ మధ్య జరిగిన పోటీల్లో లయోలా కాలేజ్ చెన్నై గెలుపొందింది. మరో మ్యాచ్లో కోయంబత్తూర్ ఈ రోడ్డు మధ్య జరిగిన పోటీల్లో కోయంబత్తూర్ గెలుపొందింది. 

ఈ పోటీలు తిలకించడానికి జిల్లాలో నలుమూలల నుంచి క్రీడా అభిమానులు విచ్చేశారు. ఈ పోటీలు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫ్లడ్లైట్ల వెలుతురులో సాగుతాయని నిర్వాహకులు  తెలిపారు. ఈ పోటీలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుమార్ రాజా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ వాలీబాల్ ఆటగాడు తులసి రెడ్డి చిత్తూరు జిల్లా వాలీబాల్ కోచ్ సుదర్శన్ నాయుడు, మాజీ వాలీబాల్ క్రీడాకారులు కృష్ణమూర్తి మురారి, దిలీప్, వెంకటేష్, చందు, పెరుమాల్, తిరుమల్ రావు, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ ఆన్ లైన్ కరాటే చాంపియన్ షిప్ ని గెలిపించిన మత్యకార ముత్యాలు

 అంతర్జాతీయ ఆన్ లైన్ కరాటే చాంపియన్ షిప్ ని గెలిపించిన మత్యకార ముత్యాలు 

పరవాడ, పెన్ పవర్

అంతర్జాతీయ ఆన్ లైన్ కరాటే చాంపియన్ షిప్ ని ఫిబ్రవరి 2 తేదీ నుండి 10 తేదీ వరకు  తెలంగాణ రాష్ట్రం లోని మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ లో నిర్వహించారు.మొదటిసారిగా ఆన్ లైన్ లో నిర్వహించిన  అంతర్జాతీయ  ఈ-కటా  కరాటే ఛాంపియన్ షిప్ లో మత్స్యకార గ్రామం ముత్యాలమ్మపాలెంలో గల బ్రూస్ లీ రాజ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కి చెందిన 48 మంది విద్యార్థులు కటా & టీమ్ కటా & వెపన్ కటా విభాగాలలో పాల్గొనగా,76 బంగారు పథకాలు & 30 రజత పతకాలు గెలుచుకుని ప్రదమ స్థానంలో నిలిచారు.చాంపియన్ షిప్ లో మొత్తం 106 మెడల్స్ సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్ కప్ భారతదేశం కైవసం  చేసుకుంది.ఈ పోటీలలో ఛాంపియన్ షిప్ గెలుపుతో మత్యకార యువ కిశోరాలు ప్రధాన విజేతలు గా నిలిచారు.ఈ పోటీల్లో దాదాపు 25 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముత్యాలమ్మపాలెం గ్రామం సర్పంచ్ మరియు మాజీ వైస్ ఎమ్.పి.పి .పరవాడ ,  పంచాయతీ రాజ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ & డైరెక్టర్ ఆఫ్ బ్రోమ అకాడమీ చింతకాయల సుజాత ముత్యాలు, మరియు చైర్మన్ ఆఫ్ బ్రోమ అకాడమీ మైలపిల్లి అప్పన్న ధనలక్ష్మి, అకాడమీ ఫౌండర్ మరియు చీఫ్ కోచ్ సిహాన్ అప్పలరాజు, ప్రెసిడెంట్ సాంబాబు ని క్రీడాకారులు మర్యాద పూర్వకంగా కలిసి ఛాంపియన్ షిప్ ట్రోపిని,మెడల్స్ ని అందించారు.విద్యార్థులను మరియు విజేతల బృందాన్ని అకాడమీ సభ్యులు అభినందించారు.చాంపియన్ షిప్ లో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను చూసి చింతకాయల సుజాత ముత్యాలు 10,000/- రూపాయల నగదు ని బహుమానంగా అకాడమీ చీఫ్ కోచ్ సిహాన్ అప్పల రాజు గారికి అందించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ సుజాత ముత్యాలు, చైర్మన్  మైలిపిల్లి అప్పన్న ధనలక్మి,ఎమ్.ఎస్.కే.డి.ఏ.వి.పి ప్రెసిడెంట్ ఎర్రబాబు,జనరల్ సెక్రెటరీ అప్పలరాజు,అకాడమీ ప్రెసిడెంట్ సోంబాబు, మరియు అకాడమీ ఫౌండర్&చీఫ్ కోచ్ షిహాన్ ఆర్జిల్లి అప్పలరాజు,సిలంబమ్ స్పెషలిస్ట్ సోంబాబు, జాయింట్ సెక్రటరీస్ శివ, శివాజి,అకాడమీ టీం మేనేజర్ శైలజ  పాల్గొన్నారు.

గోరంట్ల చే ప్రశంసలు పొందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు మరియు పర్వతారోహకుడు

 గోరంట్ల చే ప్రశంసలు పొందిన  ప్రముఖ టేబుల్ టెన్నిస్  క్రీడాకారుడు మరియు పర్వతారోహకుడు     

       


రాజమహేంద్రవరం, పెన్ పవర్

ఇటీవల టాంజానియా దేశంలోని  ప్రపంచంలోనే ప్రముఖ మరియు క్లిష్ట మయిన  కిలిమంజోరో పర్వత శిఖరాన్ని అధిరోహించి భారత దేశానికి  మరియు తెలుగు జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన ఆచంట ఉమేష్ కుమార్ నేడు తన తండ్రి ఆచంట బాలాజీ తో కలిసి రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఆచంట ఉమేష్ కుమార్ సాధించిన ఘనత పట్ల గోరంట్ల సంతోషం వ్యక్తం చేసి శాలువా కప్పి  సత్కరించారు.ఉమేష్ కుమార్ మన ప్రాంతంలో ఎంతోమంది యువకులకి తను సాధించిన విజయాల ద్వారా స్పూర్తిని నింపాడని అలాగే వొక్కొక్క మెట్టు పైకెక్కుతూ మరిన్ని చారిత్రిక విజయాలు సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో బెస్ట్ టీం అవార్డు కైవసం చేసుకున్న కేసముద్రం క్రీడాకారులు

 రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో బెస్ట్ టీం అవార్డు కైవసం చేసుకున్న కేసముద్రం క్రీడాకారులు...

 కేసముద్రం,  పెన్ పవర్

 ఈ నెల 2,3,4 తేదీల్లో మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జూనియర్ బాయ్స్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కేసముద్రం మండల హాకీ క్రీడాకారుల ప్రతిభకు బెస్ట్ టీం అవార్డు దక్కింది.12 హాకీ స్టిక్స్,12 బాల్స్ మంగళవారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో  తెలంగాణ  మాస్టర్ హాకీ చైర్మన్ రఘునందన్ రెడ్డి ల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం సీనియర్ హాకీ క్రీడాకారులు ప్రసాద్, నరేశ్, గణేష్, మోహన్, వినోద్ పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులు కేసముద్రం ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటినందుకు  గ్రామ పెద్దలు అభినందించారు.

విద్యార్థులకు చదరంగం క్రీడ పై అభిరుచి కలిగేలా చూడాలి

 విద్యార్థులకు చదరంగం క్రీడ పై అభిరుచి కలిగేలా చూడాలి


మందమర్రి,  పెన్ పవర్

కరోనా నేపథ్యంలో మైదానంలో ఆడే ఆటల కన్నా ఇంట్లో ఉండి ఆడుకొన్ని, మేధస్సును పెంపొందించే చదరంగం క్రీడ పై పిల్లలకు అభిరుచి కలిగేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సిరాజ్ ఉర్ రెహమాన్ పేర్కొన్నారు. శనివారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో, మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా చదరంగం ఆటకు మంచి గుర్తింపు ఉందని, చెస్ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చునని ఆయన తెలిపారు. చెస్ క్రీడకు రాష్ట్రప్రభుత్వం ఎంతో గుర్తింపు ఇస్తుందని క్రీడాకారులకు సరైన శిక్షణ, వసతులు కల్పించడంతోపాటు క్రీడల్లో రాణించిన వారికి ఉపాధి అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. కారోనా నేపథ్యంలో ఇంటిల్లపాదీ సురక్షితంగా ఇంట్లో కూర్చొని చదరంగం ఆడవచ్చునని, విద్యార్థులకు చదరంగం ఆట పై మక్కువ కలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. చెస్ క్రీడాకారులకు మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు ఈగ కనకయ్య, మండల మాజీ ఉపాధ్యక్షులు వజీర్ సుల్తాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ రాజారెడ్డి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కరస్పాండెంట్ దామెరా సిద్దయ్య, అసోసియేషన్ జిల్లా కోశాధికారి ఈ సమ్మిరెడ్డి, స్థానిక టిఆర్ఎస్ నాయకులు జే రవీందర్, బట్టు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘనపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి

 ఘనపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి

వికారాబాద్,  పెన్ పవర్

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం లోని ఘనపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ రెడ్డి క్రీడలు మనుషులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కనబరుస్తాయి. యువత క్రీడలను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ క్రీడల కోసం చాలా నిధులు ఖర్చు చేస్తుందని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని. నియోజకవర్గంలో పరిగి లో మినీ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగిందని, మహేశ్వర్ రెడ్డి వివరించారు. 

బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి

 బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి


మందమర్రి,  పెన్ పవర్

బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని మందమర్రి పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీలు బంగారు పథకాలు సాధించిన పట్టణ విద్యార్థులను శుక్రవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో అభినందించి‌, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫునకోషి శోతోకొన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కరాటే ఇండియా నిర్వహించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు గోవాలో మార్చి 28,29 నిర్వహించబడ్డాయని, ఈపోటిలలో 800 మంది విద్యార్థులు పాల్గొనగా మందమర్రి పట్టణానికి చెందిన డ్రాగన్ కరాటే కుంగ్ ఫూ అకాడమీ విద్యార్థినిలు జి శివాని,డి హర్షిత శర్మలు చక్కటి ప్రతిభ కనబరచి పతకాలు సాధించారని ఆయన తెలిపారు. అండర్ 14 విభాగంలో జి శివాని కుమిటి,కటాస్ లో బంగారు,వెండి పతకాలు సాధించగా, అండర్ 17 విభాగంలో డి హర్షిత శర్మ కటాస్,కుమిటి లో బంగారు, వెండి పతకాలు సాధించారన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని పేర్కొన్నారు. శివాని, హర్షిత లు భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజా గౌడ్, కరాటే మాస్టర్ వెంకటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీ

 కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీ.. 

పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట.. 

విపత్కరపరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు.. 

రూ.2.36 కోట్ల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని 236 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.2,36,27,376 విలువైన కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను బుధవారం చింతల్ లోని కేఎంజి గార్డెన్స్ లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. పేదలను ఆర్థికంగా అన్ని విధాల ఆదుకోవాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల వంటి ప్రతిష్ఠాత్మక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ అర్హులైన వారికి అందజేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్,మంత్రి సత్యనారాయణ, నిజాంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, వార్డు సభ్యులు సత్తి రెడ్డి, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.

మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్లకు సత్కారం

 మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్లకు సత్కారం

పెద గంట్యాడ, పెన్ పవర్

ఇటీవల జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ బాడీ బిల్డర్ లు తమ సత్తా చాటారు. 85 కేజీల విభాగంలో లో సూర్య గోల్డ్ మెడల్ సాధించాడు.75 కేజీల విభాగంలో రాము ఆరవ స్థానంలో నిలిచాడు. పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రైస్ లో 120ప్లస్ కేజీ ల విశాఖ డిస్టిక్ లో సతీష్ గోల్డ్ మెడల్ సాధించగా,  ఆంధ్ర బాడీ లిఫ్టింగ్ లో ఐదవ స్థానంలో పండు యాదవ్ గెలుపొందాడు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి, సీనియర్ వైసీపీ నాయకులు ధర్మాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాడీ బిల్డర్ లకు సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ రెడ్డి మాట్లాడుతూ యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతి ఒక్కరి పేరు పై దృష్టి సాధించాలని అని అన్నారు. 

నే వి, ఆర్మీ, బి ఎస్ ఎఫ్, సీ ఐ ఎస్ ఎఫ్, పోలీస్ వంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయని అని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్రయత్నించాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిమ్ అధినేత ఆర్మీ రాజు, ఎమ్మెల్యే మహేష్, ములకలపల్లి ఈశ్వరరావు, ప్రసాద్, తేజ, గోవింద్ వంశీ, బుజ్జి, దుర్గ, ఎల్లాజీ, దినీష్  జిమ్ యువకులు పాల్గొన్నారు.

పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మాస్కుల పంపిణీ.

 పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మాస్కుల పంపిణీ...

నార్నూర్,  పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఎస్ ఐ విజయ్ కుమార్ బుధవారం ఆటో డ్రైవర్లకు ఉచితంగా మాస్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున నేపత్యంలో డ్రైవర్ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజాల దూరాన్నీ పాటించాలని,డ్రైవర్లు బయటి ప్రదేశంలో ఆటోలు నడిపేటప్పుడు ప్రయాణికులకు ఆటోలో కూర్చునప్పుడు జాగ్రత్తలు వివరించి చేతికి శానిటైజర్ చేసి మాస్కులు ధరించాలని తగు సూచనలు పాటించి జాగ్రతలో ఉండాలని ఆదేశించారు. వారి వెంట యూనియన్ ప్రెసిడెంట్ ఫెరోజ్ ఖాన్, ట్రైనీ ఎసై, పోలీస్ సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

రాజమండ్రి వేదికగా మిస్టర్ ఆంధ్రా పోటీలు

రాజమండ్రి వేదికగా  మిస్టర్ ఆంధ్రా పోటీలు

విశాఖ,పెన్ పవర్ 

 ఈ నెల 28 న రాజమండ్రిలో మిస్టర్ ఆంధ్రా క్లాసిక్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ - 2021 పోటీలు  నవ్యాంధ్ర  ఫిట్నెస్ బాడీ బిల్డర్స్  అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి వీరభద్రరావు ,  ప్రధాన కార్యదర్శి టి.ఎస్. సాల్మన్ రాజు ఆధ్వర్యంలో  జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్రంలో 12 జిల్లాల నుండి  9 గ్రూప్ లు గా మొత్తం 135 మంది బాడీ బిల్డర్లు పాల్గొనడం జరిగింది. అందులో ఒక్కొక్క గ్రూప్ లో ముగ్గురు చొప్పున  మొత్తం 27 మంది కి  వెయిటేజ్ ప్రకారం విజేతలు గా నిర్ణయించి వారి వారి స్థానాలను కేటాయించడం జరిగింది. 

మరల వీరిలో ముగ్గురిని  ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ , బెస్ట్  ప్రేజర్ , మరియు మోస్ట్ మస్క్యూలర్ మాన్ గా ఎంపిక చేసి విజేతలుగా ప్రకటించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న బిల్డర్లకు స్టార్ జిమ్ ఆర్గనై జేషన్ వారు వసతి , భోజన  సదుపాయాలను కల్పించారు. ఈ పోటీలకు ముక్య అతిధులుగా రాష్ట్ర  చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ తానేటి వనిత , రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్ రాం , స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి. యువ నాయకులు  జక్కంపూడి గణేష్ , మాజీ  డిప్యూటీ మేయర్  బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ , మాజీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ బర్రె కొండ బాబు , మునిసిపల్ కౌన్సిలరు అంగడ సరళ దేవి లు హాజరైనారు. వీరి చేతుల మీదుగా గెలిచిన వారికి బహుమతి ప్రధానం చేశారు.  గెలిచిన అభ్యర్థులకు విశాఖ  జిల్లా  బాడీ  బిల్డర్స్   అసోసియేషన్ అధ్యక్షులు  ఎర్రబిల్లి  ప్రభాకర రావు ,  ప్రధాన  కార్యదర్శి  కె. సుబ్రమణ్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

గెలిచిన అభ్యర్థుల వివరాలు 9 గ్రూప్ ల నుండి.......

55 కె.జీ. లు. లోపల

1.సుశాంత్ మినియక. --విజయవాడ   - మొదటి స్థానం

2.ఎం.వంశీ నాయుడు –      విశాఖ     -   రెండవ స్థానం

3.ఎస్.సౌమ్య రాజన్.   -   నెల్లూరు.   -   మూడవ స్థానం 

60 కె.జీ. లు. లోపల

1.ఎం.నూకరాజు.        -     విశాఖ.    -    మొదటి స్థానం

2. పి.ప్రసాద్.              -     విశాఖ.    -     రెండవ స్థానం

3.డి.వంశీ కృష్ణ.         – విజయవాడ -   మూడవ స్థానం

65 కె.జీ. లు లోపల

1.జి.గణేష్.            -    తూ. గో. జిల్లా -   మొదటి స్థానం

2.కె.తిరుమల రెడ్డి. -    కృష్ణ  జిల్లా.   -    రెండవ స్థానం

3.వై.బాబీ.             -    తూ. గో.జిల్లా.-   మూడవ స్థానం

70 కె.జీ. లు. లోపల

1.ఎస్.నాగేంద్ర.     -       ప.గో. జిల్లా -      మొదటి స్థానం

2.జి.భాస్కర్ రావు-       ప.గో.జిల్లా-       రెండవ స్థానం

3.జె.కిరణ్ కుమార్ -         విశాఖ.  -      ముడవ స్థానం

75 కె.జీ. లు లోపల

1.కె.వంశీ.             -    తూ. గో.జిల్లా-     మొదటి స్థానం

2.వి.శ్రీరామ్.         -     ప.గో. జిల్లా. -     రెండవ స్థానం

3.ఎ. నరేంద్ర.        -       విశాఖ.      -    మూడవ స్థానం

80 కె.జీ. లు.  లోపల   

1.ఎస్.కె.యూసుఫ్-   గుంటూరు-        మొదటి స్థానం

2.జి.శ్రీకాంత్.       -       శ్రీకాకుళం -       రెండవ స్థానం

3.జె.ఉమామహేశ్వరావు-     శ్రీకాకుళం-      మూడవ స్థానం

85 కె.జీ. లు లోపల

1.బి.సూర్య.          -         విశాఖ  -      మొదటి  స్థానం

2.కె.రామకృష్ణ.     -        విశాఖ -       రెండవ స్థానం

3.ఎం.వెంటేశ్వర్లు. -  తూ. గో. జిల్లా-    మూడవ స్థానం

90 కె.జీ.లు లోపల

1.ఎం.వెంకటేష్. -          విశాఖ   -     మొదటి స్థానం

2.పి.బాబు ప్రకాష్-       శ్రీకాకుళం-     రెండవ స్థానం

3.ఎ. డి.వి.ప్రసాద్       విశాఖ. -     మూడవ స్థానం

90    కె.జి.లు పైన 

1.ఎం.శివ అప్పలరాజు-  విశాఖ. -      మొదటి స్థానం

2.ఎస్.కె.మునవల్లి.   -   విశాఖ.  -       రెండవ స్థానం

3.ఐ. హరీష్.       -     తూ. గో.జిల్లా-   మూడవ స్థానం

ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ :-

ఎస్. నాగేంద్ర....తూర్పు గోదావరి జిల్లా...

బెస్ట్ ప్రేజర్ : -

ఎస్.కె.యూసుఫ్............గుంటూరు 

మోస్ట్ మస్క్యూలర్ మాన్

జి.గణేష్........తూర్పు గోదావరి జిల్లా....

 

తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ టెక్నికల్ రిఫరీగా ఇమామ్

 తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ టెక్నికల్ రిఫరీగా ఇమామ్

నెల్లికుదురు, పెన్ పవర్

ఈనెల ముప్పై, ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి, రెండు తేదీ లలో తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో జరిగే రాష్ట్ర స్థాయికబడ్డీ పోటీలకు టెక్నికల్ రిఫరీ గా మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని రాజులకొత్తపల్లి జ.డ్పీ.ఎస్ఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఇమామ్ ను ఎంపిక చేసినట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తోటసురేష్ సోమవారం తెలిపారని ఇమామ్ వెల్లడించారు.  ఈ సందర్భంగా ఇమామ్ మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన రాష్ట్ర కార్యదర్శి సురేష్ కు,జిల్లా అధ్యక్షుడు మద్ది వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్

 క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్

మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు


లక్షెట్టిపెట్, పెన్ పవర్

క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు.పట్టణంలో ప్రభుత్వ కళశాల మైదానంలో నిర్వహించిన కొక్కిరాల రఘుపతి రావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమనికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గత పది రోజులుగా అట్టహాసంగా సాగిన క్రికెట్ పోటీల్లో తుది పోరు లక్షెట్టిపెట్ మున్సిపాలిటీ 14వ వార్డ్ 5వ వార్డు టీమ్ ల మధ్య జరగగా 14వ వార్డు టీం విజేతగా నిలిచింది 14వ వార్డు విజేత జట్టుకు రూ,75 వేలు రన్నర్ గా నిలిచిన 5వ వార్డు టీంకి నలబై వేలు సెమీఫైనల్ వరకు ప్రతిభతో ఆడిన జట్టుకు ఇరవై వేల రూపాయలను మాజీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అందజేశారు.ఈ సందర్భంగా ప్రేంసాగర్ రావు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యపరంగా క్రీడలు ఆడటం వలన ఉల్లాసం ఉత్సాహం మెరుగుపడుతుందని భవిష్యత్తులో యువత ముందడుగు వేయాలి కోరారు. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కి యువకులు క్రీడలు అడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ముత్తె సత్తయ్య,ఎంపీపీ అన్నం మంగ కౌన్సిలర్లు చెల్లా నాగభూషణం, చింతల సువర్ణ అశోక్,రందేని వెంకటేష్, అరిఫ్,కాంగ్రెస్ నాయకులు నవాబ్, అయిల్లా విజయ్,పెండం శ్రీలత, ముజ్జు,తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో స్నేహ భావం ఏర్పడుతుంది

 క్రీడలతో స్నేహ భావం ఏర్పడుతుంది...

 బిజెపి అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి

 బేలా,  పెన్ పవర్

 క్రీడలతో స్నేహ భావం ఏర్పడి, మానసిక ఉల్లాసం లభిస్తుందని ఆదిలాబాద్ బిజెపి పార్టీ అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి  అన్నారు. శుక్రవారం బేల మండలంలోని సాంగిడి గ్రామంలో  పాయల్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ముఖ్యఅతిథిగా ఆయన హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యన్ని వెలికితీయడానికి  ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామీణ క్రీడాకారులు  గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు సమయస్ఫూర్తితో ఆటలు ఆడాలని పేర్కొన్నారు. పాయల్ పౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని గ్రామాలలో గ్రామీణ క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి క్రికెట్ టోర్నమెంట్ లను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా బిజెపి యూత్ అధ్యక్షులు పద్మ వార్ రాకేష్, జైనథ్ ఉప సర్పంచ్ వై. రాకేష్ రెడ్డి, జైనథ్ మండల సోషల్ మీడియా కన్వీనర్ గేడం తరుణ్,  మండల బిజెపి నాయకులు దార్నె జీవన్, కధరపు ప్రవీణ్, అశోక్, ఉషన్న, బిజెపి పార్టీ యూత్ లీడర్ లు,  కార్యకర్తలు, గ్రామస్తులు,  క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...