Followers

హోరాహోరీగా వాలీబాల్ పోటీలు

 హోరాహోరీగా వాలీబాల్ పోటీలు 

చిత్తూర్, పెన్ పవర్

 స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ పోటీలకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ఆహ్వానిత జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో మొదటి మ్యాచ్ లయోలా కాలేజ్ చెన్నై బంగారుపాలెం స్పైకర్ మధ్య జరిగిన పోటీల్లో లయోలా కాలేజ్ చెన్నై గెలుపొందింది. మరో మ్యాచ్లో కోయంబత్తూర్ ఈ రోడ్డు మధ్య జరిగిన పోటీల్లో కోయంబత్తూర్ గెలుపొందింది. 

ఈ పోటీలు తిలకించడానికి జిల్లాలో నలుమూలల నుంచి క్రీడా అభిమానులు విచ్చేశారు. ఈ పోటీలు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫ్లడ్లైట్ల వెలుతురులో సాగుతాయని నిర్వాహకులు  తెలిపారు. ఈ పోటీలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుమార్ రాజా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ వాలీబాల్ ఆటగాడు తులసి రెడ్డి చిత్తూరు జిల్లా వాలీబాల్ కోచ్ సుదర్శన్ నాయుడు, మాజీ వాలీబాల్ క్రీడాకారులు కృష్ణమూర్తి మురారి, దిలీప్, వెంకటేష్, చందు, పెరుమాల్, తిరుమల్ రావు, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...