Followers

వాలీబాల్ విజేత పొల్లాచి ...

వాలీబాల్ విజేత పొల్లాచి ...

బంగారుపాలెం, పెన్ పవర్

బంగారుపాలెం లో మూడు రోజులుగా జరుగుతున్న దక్షిణ రాష్ట్రాల వాలీబాల్ టోర్నమెంట్ లో పురుషుల విభాగంలో పొల్లాచి కి చెందిన శ్రీ సరస్వతి త్యాగరాజన్ కాలేజ్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా మహిళా విభాగంలో చెన్నైకి చెందిన ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ జట్టు విజేతలుగా నిలిచాయి మహిళా విభాగంలో మైసూర్ స్పోర్ట్స్ హాస్టల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా ఈ రోడ్డు చెందిన పీ కే ఆర్ ఆర్ట్స్ కాలేజి జట్టు తృతీయ స్థానంలో నిలిచింది విజయం సాధించిన జట్లకు నగదు బహుమతి ట్రోఫీ లను జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు కుమార్ రాజా చేతులమీదుగా అందించారు ఆదివారం రాత్రి నిర్వహించిన ముగింపు సమావేశంలో పలువురు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులను బంగారుపాలెం సర్పంచ్ కృష్ణమూర్తి ఉమాదేవి ఉప సర్పంచ్ కామరాజు ఎంపీటీసీ పద్మావతి ఆటగాళ్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు తులసి రెడ్డి కోశాధికారి మురారి జిల్లా వాలీబాల్ కోచ్ సుదర్శన్ నాయుడు. మాజీ వాలీబాల్ క్రీడాకారులు దిలీప్. పెరుమాల్. తిరుమల రావు, బాలాజీ, చందు, ప్రసాద్ నాయుడు, వెంకటేష్ ,పైనీ,  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...