Followers

గూడెం గిరిజన గ్రామంలో బోరు ఏర్పాటు

 గూడెం గిరిజన గ్రామంలో బోరు ఏర్పాటు

మెంటాడ, పెన్ పవర్: 

 మెంటాడ మండలం లోని, ఆగూరు పంచాయితీ, శివారు గూడెం గిరిజన గ్రామంలో కొత్తగా నిర్మించిన బోరు బావి ని ఆగూరు సర్పంచ్ ఆకుల శివ మొదట పూజా కార్యక్రమంలో నిర్వహించి అనంతరం ఆయన చేతుల మీదగా బోరు బావి ని ప్రారంభోత్సవం చేశారు. గూడెం గ్రామంలో గిరిజనులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సాలూరు ఎమ్మెల్యే వీడికి రాజన్నదొర దృష్టికి తీసుకువెళ్లగా ఆయన బోరు బావి మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. గూడెం గిరిజన గ్రామంలో ఎట్టకేలకు తాగునీరు సమస్య తీరిందని మహిళలు, పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాశల ప్రసాదరావు, ఆగూరు డీలర్ రెడ్డి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...