Followers

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియో తెరిఫి పై అవగాహనా కార్యక్రమం

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియో తెరిఫి పై అవగాహనా కార్యక్రమం            


 విజయనగరం, పెన్ పవర్                   

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న వాకార్స్ క్లబ్ నడకమైదానంలో శ్రీనిధి ఫిజియో థెరిఫి సెంటర్ ఫిజియో థెరఫిస్ట్ డాక్టర్ పొగిరి విశ్వేశ్వరరావు చే ఫిజియో థెరిఫిపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ విశ్వేశ్వరరావు క్లబ్ సభ్యులందరికి శరీరంలో కండరాలు, ఎముకలు పై సంబంధించిన జాగ్రత్తలును ఏవిధంగా తీసుకోవాలో వివరిస్తూ ఫిజియో థెరిఫి ఎప్పుడు అవసరమో,నడక సభ్యులు ఏవిధమైన వ్యాయామాలు చేయాలో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 గవర్నర్ ఎడ్ల గణేష్ మాట్లాడుతూ ఇటువంటి ఆరోగ్యకరమైన అవగాహనా కార్యక్రమాలు క్లబ్ సభ్యులుకు,ప్రజలకు ఎంతో దోహదపడుతుందని, కార్యక్రమం  నిర్వహించిన అధ్యక్షకార్యదర్శిలకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్ పొగిరి ఈశ్వరరావుకు క్లబ్ సభ్యులు సత్కరించారు. శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ పెద్దలు,గోల్డ్ డోనర్ పిన్నింటి సూర్యనారాయణ, క్లబ్ గౌరవ అధ్యక్షులు,గోల్డ్ డోనర్ డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాస్టారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కార్యదర్శి ఆరికతోట తిరుపతి రావు,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కోశాధికారి వై. శ్రీనివాసరావు, క్లబ్ కార్యదర్శి ములగ శ్రీనివాసరావు, కోశాధికారి ఆర్.సి.హెచ్.అప్పలనాయుడు, జాలీ వాకర్ నలమరాజు, సభ్యులు కె.ఎన్.స్వామి,డి.రాములు,బి.నరసింహమూర్తి,ఐ.వి.ప్రసాదరావు, పైడియ్య,వల్లూరి శ్రీనివాసరావు,చక్రధర్ పట్నాయక్,నాగరాజు,కోట్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...