Followers

Showing posts with label TELANGANA. Show all posts
Showing posts with label TELANGANA. Show all posts

వివాహానికి హాజరైన జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్.

 వివాహానికి హాజరైన జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్

నార్నూర్, పెన్ పవర్

నార్నూర్ మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో తడిహత్నూర్  కు చెందిన  కేంద్రే మహాదవ్  సూపుత్రుని వివాహానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరై నూతన వధు వరులకు అక్షింతలేసి ఆశీర్వదించారు. వారి వెంట  మండల వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కో అప్షన్ మెంబర్ దస్తగిర్,పరమేశ్వర్,సురేష్ ఆడే, రాథోడ్ ఉత్తమ్,దుర్గే కాంతారావు, మోతె రాజన్న,సయ్యద్ కశిం, అహమ్మద్తదితరులు పాల్గొన్నారు.

గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం

 గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం...

 నార్నూర్, పెన్ పవర్ 

గాడిగూడా మండల పి హెచ్ సి ఆధ్వర్యంలో కోవిడ్19 మహమ్మారి విపరీతంగా  పెరగడం తో మరో వైపు ఏజెన్సీ ప్రాంతంలో  జ్వరాలు ఏకువగా పెరిగి ఉనందున ప్రభుత్వ ఆసుపత్రి లో మంగళవారం  రక్త పరీక్ష శిభిరం నిర్వహించారు.రక్త పరీక్ష కు ప్రజలు ముందుకు రావాలని  హెచ్ ఇ ఓ పవర్ రవీందర్ అన్నారు.వారి వెంట ఏ ఎన్ ఎం ఊర్మిళ, హెచ్ ఏ సురేష్,సి హెచ్ డబ్ల్యూ కుంతబాయి, ఉన్నారు.

12వ వార్డులో బొర్వెల్ కు మరమ్మత్తుల నిర్వహణ

 12వ వార్డులో బొర్వెల్ కు  మరమ్మత్తుల నిర్వహణ

బెల్లంపల్లి, పెన్ పవర్..

పట్టణ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కాల్ టెక్స్ లో రామకృష్ణ థియేటర్ వెనుకాల గల మినీవాటర్ సప్లై బోర్ పాడయ్యి ఎండాకాలం వలన పంపులలో నీరు సరిగ్గా రాక బస్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వార్డు కౌన్సిలర్ నెల్లిశ్రీలతరమేష్  దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి,వార్డు తెరాస నాయకులు రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ఇంజనీర్లతో మాట్లాడి, వారి సహాయంతో  దగ్గరుండి బోర్ వెల్ లో పైపుల మరమ్మత్తులు నిర్వహించారు. పైపులమరమ్మత్తు ద్వారా బస్తి మొత్తానికి నీటికొరత లేకుండా చేసారని,బస్తి ప్రజలు కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు

ప్రమాదాలు జరగకుండా మెష్ ఏర్పాటు

 ప్రమాదాలు జరగకుండా మెష్ ఏర్పాటు

నాలాలో ఉన్న చెత్త తొలగింపు

పెన్ పవర్, మల్కాజిగిరి

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గౌతంనగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ నాలా క్లీనింగ్ పనులను, మెష్ ఏర్పాట్ల  పనులను కార్పొరేటర్  సునీత రాముయదవ్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ సునీత రాము యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరేడ్మట్ దీన్ దయళ్ నగర్ లో ఎడాది క్రితం నాలాలో పడి చిన్నారి చనిపోయిన ఘటన జరిగిందని, ఇందుకు ఒపెన్ నాలా వద్ద సరియైన మెష్ రక్షణ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని గుర్తుచేశారు. రాబోయే వర్షకాలం ను దృష్టిలో ఉంచుకుని ప్రజలకోసం నాలాలా పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాముయదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విలేఖరికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు

 విలేఖరికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు...

పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గం లో గౌతమ్ నగర్ డివిజన్ సాక్షి దినపత్రిక విలేకరి మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గతనెల ప్రమాదవశాత్తు వాహనం పై నుంచి పడి తీవ్రంగా గాయపడి ఇంట్లో చికిత్స పొందుతున్నాడు,వెంటనే అబ్దుల్ రెహమాన్ సతీమణి ఆరోగ్యం క్షీణించి లోతుకుంట ఆస్పత్రిలో లో చేర్చి వైద్యం చేయిస్తున్నాడు, కరోనా వల్ల అబ్దుల్ రెహమాన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని మానవ సేవే మాధవ సేవ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు తమ గ్రూప్ లో ఈ విషయాన్ని  సభ్యులతో చర్చించడం జరిగింది. గ్రూప్ సభ్యులు 28 మంది కలిసి రూ16,800 నగదును సహాయంగా అందించారు. అబ్దుల్ రెహమాన్ వారి కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నందున మంగళవారం గ్రూప్ సభ్యులు నమస్తే తెలంగాణ విలేకరి వెంకటేష్ ద్వారా రెహమాన్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మానవ సేవే మాధవ సేవ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు,ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, రషీద్, లయన్ హనుమంతరావు ముదిరాజ్, సక్కురీ భాస్కరరావు, హోటల్ శేఖర్, మనీ, తదితరులు పాల్గొన్నారు.

మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ నిరసన దీక్ష

 మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ  నిరసన దీక్ష

బీసీల ఓట్లతో గెలిచి బీసీలనే బర్తరఫ్ చేస్తారా?

ఈటెలను బర్తరఫ్ చేయడం బీసీలను దగా చేయడమే

 జాజుల లింగంగౌడ్

తార్నాక, పెన్ పవర్ 

పంచాయితీ, పార్లమెంటు, మున్సిపల్, అసెంబ్లీ అన్ని ఎన్నికల్లో బీసీల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా మంత్రి వర్గం నుండి బీసీలను బర్తరఫ్ చేసి అవమానిస్తున్నారని, ఈ వైఖరి మానుకోకపోతే టిఆర్ఎస్ పార్టీకి బీసీలు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి భర్తరప్ చేయడాన్ని నిరసిస్తూ ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర శాతం లేనివాళ్లు, ఐదు శాతం లేని వాళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించవచ్చు, వందల ఎకరాలు అడ్డగోలుగా పొందవచ్చు,  ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా తరతరాలుగా పాలించవచ్చు గాని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లు మాత్రం ఆస్తులుండి పదవులు పొందితే, అవినీతిపరులుగా,  కబ్జాకోరులుగా ముద్ర వేస్తుండడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  బీసీ ఎస్సీ ఎస్టీలు అవినీతి పరులైతే మీరు సుద్దపూసలా అంటూ ప్రశ్నించారూ.ఈరోజు అధికారం ఉందని బీసీ మంత్రి అయిన ఈటల రాజేందర్ ను, గతంలో దళిత వర్గానికి చెందిన రాజయ్యను కేసీఆర్ ప్రభుత్వం మెడలు పట్టి బహుజనుల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా క్యాబినెట్ నుండి గెంటివేశారని, ఇది వ్యక్తులను అవమానించడం కాదని ఇది యావత్ 90 శాతం ఉన్న బడుగుల, బహుజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే అవుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి అగ్రకులాలకు చెందిన ఒక్క మంత్రిని, ఒక్క ప్రజాప్రతినిధిని భర్తరఫ్, సస్పెండ్ లు చేసే దమ్ము లేదని, కేవలం బడుగులను మాత్రమే బలి తీసుకుంటున్నార ని ఇందుకు ఈటల రాజేందర్, రాజయ్యలే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాదేశి రాజేందర్,బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి

 ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి

జర్నలిస్టుల మరణాలను ఆపండి - టీయూడబ్ల్యూజే


 
పెన్ పవర్, మల్కాజిగిరి

జర్నలిస్టులను కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించి జర్నలిస్టులకు మనోధైర్యం, ఆర్థిక చేయూత అందించాల ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు ఒక ప్రకటనలో కోరారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి, రెండో దఫాల్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 55 మంది జర్నలిస్టులు కరోనాతో నేలకొరిగినట్లు వారు విచారం వ్యక్తం చేశారు. ఒక్క ఏప్రిల్ మాసంలోనే రాష్ట్రంలో వరుసగా 29 మంది జర్నలిస్టులు అకాల మరణం చెందినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా ప్రారంభం నుండి నేటివరకు 3,800 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినట్లు ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు వివరించారు. అయితే ఐసోలేషన్ లో ఉంటున్న కొందరికి మాత్రమే మీడియా అకాడమీ నుండి ఆర్థిక సహాయం అందుతున్నదని, ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకుంటున్న పలువురు బాధిత జర్నలిస్టులకు సహాయం అందించడంలో జాప్యం చేయడం సరైంది కాదన్నారు. అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు అందిస్తున్న 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన అప్పులకు కూడా సరిపోవడం లేదని శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శేఖర్, విరాహత్, శ్రీకాంత్ లు ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబాలకు ఇతర రాష్ట్రాల మాదిరిగా కనీసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. అలాగే పంజాబ్, పశ్చిమ బెంగాల్,  బీహార్, ఒరిస్సా తదితర రాష్ట్రాల మాదిరిగా వెంటనే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని, కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందించడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.

శివ సాయి నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించండి

 శివ సాయి నగర్ లో  మౌలిక సదుపాయాలు కల్పించండి.

పెన్ పవర్, కాప్రా 

 చర్లపల్లి డివిజన్ లోని శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు  మంగళవారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ని కలిసి కాలనీ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గత అక్టోబర్ లో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో శాశ్వత బ్రిడ్జి నిర్మాణం జరిగేలా అదేవిధంగా త్రాగునీరు  లేక అల్లాడుతున్న కాలనీ వాసుల దాహార్తిని తీర్చేందుకు వెంటనే నీటి వసతి కల్పించాలని సంబంధిత ఇంజనీరింగ్, జలమండలి అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం పనులు  చేపట్టేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ ఈ ఈ కోటేశ్వరరావు తో సుభాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు . అసలే కరోనా కష్టకాలం పక్క కాలని వాళ్ళు తాగునీరు ఇవ్వడానికి నిరాకరిస్తూ కాదు పొమ్మంటున్నారు తాగేందుకు చుక్క నీరు లేక పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ అధ్యక్షురాలు విజయ, కార్యదర్శి  మాధవి, ఎమ్మెల్యేకు చెప్పడంతో వెంటనే   స్పందించిన ఎమ్మెల్యే జలమండలి డీజీఎం కృష్ణ తో మాట్లాడి  తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి తాగునీరు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం  ప్రతినిధులు సత్యం, పురుషోత్తం రెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి14వ వార్షికోత్సవం

 ఘనంగా  శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి14వ వార్షికోత్సవం..

పెన్ పవర్, కాప్రా

కాప్రా డివిజన్ లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా హోమము ధ్వజారోహణం నిర్వహించారు. అభిరాం శర్మ  రుత్వికులు. అర్చకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఈ సంవత్సరం కోవిడ్  నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమం చేసామని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కరోన మహమ్మారి దేశం నుండి తరిమి కొట్టే విధంగా అందరూ జాగ్రత్తలు పాటించాలని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దయా భక్తులపై ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో  రవి మూర్తి శర్మ ,కే కిరణ్ చార్యులు.పీ హరినాథ్ శర్మ , ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఎర్ర అశోక్ కుమార్ గౌడ్ చైర్మన్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి జె కృష్ణమాచార్యులు, ధర్మకర్త లు చిన్నమ్మ రాజు వెంకటరమణ, మండల , నవీన్ కుమార్ గౌడ్ శ్రీమతి  బచ్చు అరుణ జ్యోతి, కొప్పుల కుమార్ , గోగికర్ నవీన్ కుమార్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

రంజాన్ తోఫా అందజేసిన మంత్రి

 రంజాన్ తోఫా అందజేసిన మంత్రి

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో రంజాన్ తోఫా (కిట్టు) మంత్రి నిరంజన్ రెడ్డి ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి  తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రంజాన్ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి కోరారు. పేద ప్రజలముఖంలో చిరునవ్వులు ఇవ్వడానికి కెసిఆర్  రంజాన్ తోఫా  రంజాన్ పండుగను అత్యంత ప్రతిష్టాత్మక జరుపుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  మంత్రి  చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని రంజాన్ పండుగను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి  కోరారు. దాదాపు అక్కడికి వచ్చిన 120 మంది లబ్ధిదారులకు  మంత్రి తన చేతుల మీదుగా అందజేశారు. ఈ వివరాలు టిఆర్ఎస్ నేత షేక్ జహంగీర్ విలేకరులకు తెలిపారు.

నిజాంపేట్ కార్పొరేషన్ లో త్రాగునీటి సమస్యలు తీర్చండి

 నిజాంపేట్ కార్పొరేషన్ లో త్రాగునీటి సమస్యలు తీర్చండి.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్రాగు నీటి వసతి కోసం కోటి లీటర్ల సామర్థ్యం గల నాలుగు వాటర్ ట్యాంకర్లు ప్రారంభోత్సవానికి నోచుకోక ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం బిజెపి నాయకులు ప్రారంభం లోనే ట్యాంకర్లను సందర్శించి త్రాగు నీటి సమస్యలు పరిష్కరించాలని పర్యటన.. కార్పొరేషన్లో తాగునీరు రోజువారీగా అధికారికంగా అనుమతి ప్రకారం 1.5 కోట్ల లీటర్లు వస్తుంది. కానీ మూడు కోట్ల లీటర్ల త్రాగునీరు నీరు సాధిస్తేనే కానీ కార్పొరేషన్ త్రాగునీటి సమస్య పరిష్కారం కాదు. ఇప్పటి కూడా 6 బలహీనవర్గాల కాలనీలకు పూర్తిస్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించలేని  పరిస్థితి . పైగా ఈ సంవత్సరన్నర కాలంలోనే దాదాపు 1500 అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగింది . కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించి మరో   కోటి లీటర్ల సామర్థ్యం గల మూడు మంచినీటి ట్యాంకులను నిర్మించి, సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభించక పోవడానికి కారణం ఏమిటో మున్సిపల్ , వాటర్ వర్క్స్ అధికారులు సమాధానం చెప్పాలని,నిజాంపేట్ కు 2 కోట్ల లీటర్ల త్రాగునీరు అధికారికంగా  ఉత్తర్వులు లేకపోవడమేనని, తక్షణమే మున్సిపల్,  వాటర్ వర్క్స్ అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని, నూతనంగా నిర్మించిన కోటి లీటర్ల సామర్థ్యం గల వివిధ మంచినీటి ట్యాంకులను తక్షణమే ప్రారంభించాలని ,6ఎంజిడి లీటర్ల త్రాగునీరు అధికారికంగా మంజూరు చేయించి, త్రాగునీరు ప్రజలందరికీ సప్లై చేయాలనీ, శనివారం.. ప్రారంభం నోచుకోని వాటర్ ట్యాంక్ ను సందర్శించడమే గాక, ఈ సమస్యపై కలెక్టర్ మరియు వాటర్ వర్క్స్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడమేగాక సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ముదిరాజ్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర చౌదరి, వైస్ ప్రెసిడెంట్ శివ కోటేశ్వరరావు, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ పాధక్షేత్ర గుట్ట పై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

 శ్రీరామ పాధక్షేత్ర గుట్ట పై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

12 కోట్లతో ఆలయ నిర్మాణానికి సన్నాహలు..

ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంకుటిత దీక్ష

7వ, వారాల పాటు స్వామి వారికి తలనీలాలు సమర్పణ

శ్రీ వేంకటేశ్వర నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్


రామగుండం, పెన్ పవర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం వేళ రామగుండం నియోజవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీరామ పాదక్షేత్రమైన రాముని గుండాల కొండ పై స్వయంబుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంకల్పించారు. సిఎం కేసీఆర్ జన్మదిన సంకల్పం ఫలించేలా అభినవ తిరుమల మాదిరిగా ఆలయ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అకుంటిత దీక్ష చేపట్టారు. ఆలయ నిర్మాణ సంకల్పానికి మరింత బలం చేకురాలని ఎమ్మెల్యే తలనీలాలు స్వామి వారికి సమర్పించారు. మరో ఏడు వారాల పాటు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించేందుకు ఎమ్మెల్యే సంకల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో 12 కోట్ల వ్యయంతో శ్రీ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నాహలు మొదలు పెట్టారు. శనివారం శ్రీ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తలనీలాలను ఎమ్మెల్యే సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పాదక్షేతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం వైభవంగా అభివృద్ది చెందుతుందన్నారు. ఆలయ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారికి 7వారాలు తమ తలనీలాలు సమర్పించ నున్నానని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయ నిర్మాణంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రామగుండం నియోజవర్గంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిలేలా స్వామి వారు దివించాలని వేడుకున్నారు. 85 లక్షలతో కొండ పై రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఆలయ నిర్మాణానికి స్వామివారి భక్తులు, ప్రజలు భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి ఆముల నారాయణ, నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు ఎన్.వి.రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు బద్రి రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మరో మధర్ తెరిస్సా.! సంధ్యా..రాణమ్మా.!

 మరో మధర్ తెరిస్సా.! సంధ్యా..రాణమ్మా.!

అడగనిదే అమ్మైన అన్నం పెట్టదు కానీ..

అడగకుండానే కరోనా బాధితులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది

పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి


రామగుండం , పెన్ పవర్ 

పాలకుర్తి మండలంలోని గుడిపల్లి మరియు కొత్తపల్లి గ్రామాలలో కోవిడ్ సోకి హోం క్వారెంటైన్ లో ఉన్న 30 మంది బాధితులకి వారు కరోనా మహామ్మారి నుండి త్వరగా కోలుకోవాలని వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొంది తిరిగి ఆరోగ్యవంతులు కావాలనే ధృఢ సంకల్పంతో మీకు అండగా నేనున్నాననే మంచి మనసుతో మధర్ తెరిస్సా వంటి సేవా భావంతో శనివారం నాడు పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి కరోనా పాజిటీవ్ వచ్చిన వారి ప్రతీ ఇంటింటికి తిరుగుతూ  వివిధ రకాలైన పండ్లు డ్రై-ఫ్రూట్స్ పంపిణీ చేసి కరోనా నివారణ కి పలు జాగ్రత్తలు తెలియజేస్తూ సూచనలు సలహాలు చెప్పి వారిలో మనో ధైర్యాన్ని నూరి పోసింది. ఇంకా ఈ కార్యక్రమంలో గుడిపెల్లి గ్రామ సర్పంచ్ కొప్పు రాజేషం, పొరండ్ల రాజిరెడ్డి, గ్రామ శాఖ అద్యక్షులు  ఊర వెంకటేష్, కొలిపాక శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై రివ్యూ మీటింగ్

 కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై రివ్యూ మీటింగ్

మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

మంథని, పెన్ పవర్

మంథని నియోజకవర్గంలోని 4 మండలాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ పైన ఆస్పత్రిలో సౌకర్యాల పైన పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి మరియు మండల వైద్యాధికారు లతో మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రివ్యూ  నిర్వహించిన  మాజీ మంత్రి ప్రస్తుత మంథని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం లోని మంథని మండలము రామగిరి మండలం ముత్తారం మండలం కమాన్ పూర్ మండలంలో అక్కడి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని వాటి వివరాలు తెలుసుకొని వచ్చే వారం రోజుల్లో అన్ని మండలాల్లో 100% 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని డాక్టర్లను కోరారు. వ్యాక్సిన్ ఇప్పటి వరకు 45 సంవత్సరాలు నిండిన వారిలో మంథని మండలంలో 80% మందికి మరియు రామగిరి మండలంలో 50% మందికి కమాన్ పూర్ మండలంలో 50% మందికి ముత్తారం మండలంలో 40% శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ జరిగిందని వచ్చే 6 రోజుల్లో పూర్తి చేస్తామని డాక్టర్లు ఎమ్మెల్యే కి తెలిపారు. ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం జరిగితే చాలా వరకు వ్యాక్సిన్ అవసరముంటుందని చాలా కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ వ్యాక్సిన్ అందరికీ వేసే విధంగా కృషి చేయాలని డాక్టర్లను కోరారు. మంథని నియోజకవర్గంలోని మంథని మండలంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని మరియు జె.ఎన్.టి.యు కళాశాలలో కూడా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ కేంద్రంలో ఆక్సిజన్ సప్లయి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ నీ కూడా కోరుతానని తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ మరియు కరోనా టెస్ట్ లు ఒకే ప్రదేశంలో జరపకుండా ఒకే ప్రదేశంలో జరిపితే కరోనా ప్రబలే అవకాశం ఉందా  భౌతిక దూరం పాటిస్తూ వేరువేరుగా జరపాలని  అవసరమైతే వ్యాక్సిన్ కేంద్రాలను పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డాక్టర్లను కోరారు. ఎమ్మెల్యే జిల్లా వైద్యాధికారి కి అన్ని మండలంలోని ఆసుపత్రికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారికి కావలసిన టెస్ట్ కిట్లు వ్యాక్సిన్లు, మందులు, మాస్కులు, గ్లౌజులు తదితర అన్ని ప్రభుత్వం నుండి అందుబాటులో ఉండే  విధంగా అందించాలని కోరారు. మంథని మాతా శిశు ఆసుపత్రిలోని ఖాలిలను భర్తీ చేయాలని ఇక్కడ పనిచేసే వారికి ఇచ్చిన డిప్యూటేషన్ లను రద్దుచేసి వారిని ఆస్పత్రిలో సేవలు అందించే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, మరియు మంథని మండల వైద్యాధికారి శంకర దేవి, వైద్యులు అగంతం నరేష్, కమాన్ పూర్ వైద్యులు అశోక్ కుమార్, ముత్తారం వైద్యులు వంశీ కృష్ణ, రామగిరి వైద్యులు నాగ శిరోమణి మరియు ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

విద్యాలయాలు బలోపేతం చేయడంలో ఎనలేని కృషి

 విద్యాలయాలు  బలోపేతం చేయడంలో ఎనలేని కృషి...

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రంలో విద్యాలయాలు బలోపేతం చేయడంలో ఎనలేని కృషి చేశారని తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో యెల్లారెడ్డిపేటలో మే 1న విద్యావేత్త మంకురాజయ్యగారికి పూలమాల వేసి ప్రగాఢ సంతాపం తెలిపింది. రాజయ్య "మనబడి మనందరి బాధ్యత"కార్యక్రమం  మరియు ఆంగ్లవిద్య ప్రవేశపెట్టి  ప్రభుత్వ విద్యాలయాలు బలోపేతం తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు వాసర వేణి పరుశురాం తెలిపారు. విద్యాభివృద్ధికి చేయడంలో క్రృషిచేశారనీ జ్ఞాపకాలను  నెమరువేసుకున్నారు తెలంగాణ విరసం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం  జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్, ఎం.డి దస్తగీర్, రాములు,రాజు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి సర్కిల్ ప్రజల అభిమానం మరువలేనిది; సి.ఐ. సూర్యనాయక్

 వనపర్తి సర్కిల్  ప్రజల అభిమానం  మరువలేనిది; సి.ఐ. సూర్యనాయక్   

వనపర్తి, పెన్ పవర్        

వనపర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్-సి.ఐ. హోదాలో మూడు సంవత్సరాల కాలం పాటు విధులు నిర్వహించడానికి అవకాశం కల్పించిన ప్రజల అభిమానం మరువలేనిదని వనపర్తి నుండి గద్వాలకు బదిలీ అయిన సి.ఐ. సూర్యనాయక్ చెప్పారు. విధులు నిర్వహించడంలో  తగు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించిన  పోలీసు ఉన్నతాధికారులకు, విధులు నిర్వర్తించడంలో పూర్తి సహకారం అందించిన పోలీస్ సిబ్బందికి, వనపర్తి సర్కిల్ లో ఉన్న ప్రజలకు  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు,అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు,పట్టణ యువతకు, ప్రభుత్వ ఉద్యోగులకు  శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదరణ, అభిమానం జీవితంలో  మరువలేనని, నా ప్రతి అడుగులో  సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు.


టెలీ కాన్ఫరెన్స్ లో ప్రజలతో ఎమ్మెల్యే వివేకానంద

 టెలీ కాన్ఫరెన్స్ లో ప్రజలతో ఎమ్మెల్యే వివేకానంద.. 

కరోనా విపత్కర సమయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద.. 

జీడిమెట్ల, పెన్ పవర్ 

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు, శనివారం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని న్యూ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో 200 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీలో నెలకొన్న సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ మరియు శానిటేషన్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే 80 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు త్వరలోనే మొదలు కావాల్సి ఉన్నాయని, కరోనా వ్యాప్తి వల్ల కొంత ఆలస్యం జరిగిందని, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేస్తామని తెలిపారు, తమ దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, అనంతరం వారు కాలనీ వాసులనుద్దేశించి మాట్లాడుతు అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు దరిస్తూ ఎప్పటికపుడు చేతులను శుభ్రం చేసుకుంటూ సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మనం జాగ్రత్తగా ఉంటేనే ఎదుటివారికి సహాయ పడగలమని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు..

పలు కంపెనీలలో మేడే జెండాను ఆవిష్కరించిన కెయం.ప్రతాప్ గౌడ్..

 పలు కంపెనీలలో మేడే జెండాను ఆవిష్కరించిన కెయం.ప్రతాప్ గౌడ్..

జీడిమెట్ల ,పెన్ పవర్ 

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు కంపెనీలలో మేడేను పురస్కరించుకొని శ్రమశక్తి అవార్డు గ్రహీత కే.యం. ప్రతాప్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు.. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కొపల్లి ఫార్మాలో మరియు రంగారెడ్డి నగర్ పారిశ్రామికవాడలోని ఆల్మెలో కెమికల్స్ కంపెనీ లో మరియు తదితర కంపెనీలలో యూనియన్ అధ్యక్షుని హోదాలో కార్మికులతో కలిసి జెండాను ఆవిష్కరించిన శ్రమ శక్తి అవార్డ్ గ్రహీత టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే.యం.ప్రతాప్ గౌడ్.. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ వెట్టి చాకిరి నుంచి కార్మికులు విముక్తులైన సందర్భంగా ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్మికులతో కలిసి కంపెనీ యాజమాన్యం వారు కార్మిక చట్టాలను అమలుపరుస్తూ, అవగాహనతో పనిచేస్తేనే కంపెనీ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాంత రావు, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, జయన్న, రామస్వామి, వెంకటేష్, జానీ కుమార్, రామ కృష్ణ, కృష్ణ యాదవ్, గణేష్, రామచందర్, సురేష్, వి.ఆర్.సి రెడ్డి, మనోహర్, నరేష్,  సుబ్బారావు, కృష్ణంరాజు, గోపాలకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఈటెల రాజేందర్ పై కుట్రపూరిత ఆరోపణలు చేయడం మానుకోవాలి

 మంత్రి ఈటెల రాజేందర్ పై కుట్రపూరిత ఆరోపణలు చేయడం మానుకోవాలి

ముదిరాజ్ మహాసభ తొర్రూరు మండల అధ్యక్షులు కొత్తూరు రమేష్ ముదిరాజ్

తొర్రూరు, పెన్ పవర్

తెలంగాణ ఆకాంక్షకు జీవం పోసిన వ్యక్తుల్లో ప్రథమ శ్రేణిలో నిలిచే రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని, ముదిరాజ్ మహాసభ తొర్రూరు మండల అధ్యక్షులు కొత్తూరు రమేష్ ముదిరాజ్ అన్నారు. శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బీరప్ప నగర్ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లో మహాసభ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు రమేష్ మాట్లాడుతూ... మంత్రి ఈటెలను బలిపశువును చేసేందుకు పలువురు నాయకులు పనిగట్టుకొని, బలమైన బీసీ నేతను టార్గెట్ చేశారని, అందుకే అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇరికించే కుట్ర చేస్తున్నారని,  విమర్శించారు. ఈటెల రాజేందర్ ను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నుంచి తప్పించడానికి పలువురు కుట్రలు పన్ని, మంత్రి భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు.మంత్రి పై వచ్చిన ఆరోపణలపై దేశంలోని ఏ విచారణ కమిటీతో నైనా విచారణ జరిపించాలని, బహిరంగ సవాల్ విసిరిన ఈటెల ధైర్యం మెచ్చుకోదగిందన్నారు. భూకబ్జాలు వ్యవహారాల్లో తలదూర్చి విమర్శల పాలవుతున్న మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,గొంగిడి సునీతపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఎందుకు జరపడం లేదన్నారు.ప్రభుత్వ పెద్దలకు మంత్రి ఈటెల నచ్చడం లేదని,ఈ కుట్ర,మంత్రుల ఉద్వాసన చేస్తారనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తున్నదేనని, ఆయన పేర్కొన్నారు.కరోనా నియంత్రణకై గడిచిన ఏడాది కాలంగా మంత్రి ఈటెల ఎంతో కస్టపడి పనిచేస్తున్నారని, అన్నారు. కొవిడ్ వ్యాప్తి వేళ  వైద్య పరీక్షలు,టీకా పంపిణీతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ఈటెల వైరస్ కట్టడికి విఫల యత్నం చేస్తున్నాడని, గుర్తు చేశారు.ఆయన శ్రమను బూడిద పాలు చేసేలా ఆరోపణలు అంట కట్టడం ఎంతవరకు సమంజసమన్నారు.నిప్పు లాంటి నికార్సైన వ్యక్తి ఈటెల పై దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబన్నారు.  ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లతోనే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని, అలాంటి బలమైన సామాజిక వర్గం నాయకున్ని అప్రతిష్ఠ పాలు చేస్తామని, చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈటెల పై చేస్తున్న కుట్రలపై ముదిరాజ్ సామాజికవర్గ ప్రతినిధులు, బీసీ నాయకులు సరైన సమయంలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.ముదిరాజ్ ముద్దుబిడ్డ, బడుగుల బాంధవుడు, ఉద్యమ నేత ఈటెలకు ఎలాంటి అపకారం జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గంధం చంద్ర మూర్తి,డివిజన్ నాయకుడు సాధు రాములు, అమ్మాపురం మత్స్య పారిశ్రామిక శాఖ అధ్యక్షులు కొత్తూరు రాజు, తొర్రూరు సొసైటీ అధ్యక్షుడు రెడ్డ బోయిన మహేష్, ఉపాధ్యక్షులు రెడ్డ బోయిన రవి, శంకర బోయిన యాకయ్య, భాషబోయిన ఉప్పలయ్య, చర్లపాలెం సొసైటీ అధ్యక్షులు పులుగుజ్జ రామచంద్రు,ఖానాపురం సొసైటీ అధ్యక్షులు నారా బోయిన సోమయ్య, రెడ్డ బోయిన దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

గ్రామ గ్రామాన ఎగిరిన ఎర్ర జెండా

 గ్రామ గ్రామాన ఎగిరిన ఎర్ర జెండా

కార్మిక కర్షకులు హక్కుల కోసం ఉద్యమించాలి 

ఘనంగా 135 వ కార్మిక దినోత్సవ వేడుకలు

సీపీఎం మండల కార్యదర్శి బొల్లం అశోక్


తొర్రూరు, పెన్ పవర్

కార్మిక కర్షకుల హక్కులకై సంఘటితంగా ఉద్యమించాలని, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బొల్లం అశోక్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య లు పిలుపునిచ్చారు. శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సీపీఎం పార్టీ కార్యాలయంతో పాటు మరో మూడు చోట్ల,కంటాయపాలెం గ్రామ పార్టీ ఆధ్వర్యంలో,అమ్మాపురం,  ఖానాపురం, హరిపిరాల గ్రామాలలో సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ... 135వ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభల నడుమ జరుపుకోవడం బాధాకరమని, అన్నారు. కరోన మహమ్మారి ప్రపంచ మానవాళిని కబళించడం జరుగుతుందన్నారు. భారత దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక అణగారిన వర్గాల రక్షణ చట్టాలను హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్నారన్నారు. 75 సంవత్సరాలు కార్మికుల రక్తమాంసలతో  కూడపెట్టిన ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా అంబానీ ఆధాని శతకోటీశ్వరులకు అప్పనంగా ఇస్తున్నారని విమర్శించారు. దేశంలో 6నెలల నుండి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పోరాటం కొనసాగుతోందన్నారు.కరోన వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేయటలో విఫలమైందని అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి, మాస్క్ జాగ్రతలు పాటించి, కరోన వైరస్ ని జయించాలని,పిలుపునిచ్చారు.గత సంవత్సరం ఢిల్లీ  సభలకు పోయి వచ్చిన ముస్లీమ్ నిందించినా బిజెపి ప్రభుత్వం కుంభమేళా నిర్వహించి, ఉత్తరాది రాష్ట్రాలలో వైరస్ ప్రాబల్యం పెంచిందన్నారు.  దోపిడి ప్రభుత్వానికి కార్మిక వర్గం ప్రతిఘటన ఉద్యమాలతో హక్కులు సాధించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎండి. యాకుబ్, మార్క సాంబయ్య, సిఐటియు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొమ్ము దేవేందర్, మార్బల్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కాశీం, సిపిఎం కంటాయ పాలెం గ్రామ కార్యదర్శి సోమిరెడ్డి, నాయకులు తాళ్ళ వెంకటేశ్వర్లు, బోర స్వామి, అమ్మాపురం గ్రామ కార్యదర్శి డోనుక దర్గయ్య, ఖానాపురం హమాలి యూనియన్ అధ్యక్షులు రమేష్, హరిపిరాల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి చంద్రయ్య, మురళి, రాపోలు ముత్తయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తొర్రూరు మండల అధ్యక్షులు రామ నరసయ్య, కౌన్సిలర్లు మాడుగుల నట్వర్, ఏన్నమనేని శ్రీనివాసరావు, జంపా, గజానంద్, నాయకులు దొంగరి శంకర్, జై సింగ్, రమేష్, రాజేందర్, అంజయ్య, శ్రీకాంత్, శంకర్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు సురేష్ బాబు, కార్మికులు, కర్షకులు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...