ప్రమాదాలు జరగకుండా మెష్ ఏర్పాటు
నాలాలో ఉన్న చెత్త తొలగింపు
పెన్ పవర్, మల్కాజిగిరిఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గౌతంనగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ నాలా క్లీనింగ్ పనులను, మెష్ ఏర్పాట్ల పనులను కార్పొరేటర్ సునీత రాముయదవ్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ సునీత రాము యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరేడ్మట్ దీన్ దయళ్ నగర్ లో ఎడాది క్రితం నాలాలో పడి చిన్నారి చనిపోయిన ఘటన జరిగిందని, ఇందుకు ఒపెన్ నాలా వద్ద సరియైన మెష్ రక్షణ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని గుర్తుచేశారు. రాబోయే వర్షకాలం ను దృష్టిలో ఉంచుకుని ప్రజలకోసం నాలాలా పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాముయదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment