Followers

మాస్క్ ధరించని వారిపై కొరడా

 మాస్క్ ధరించని వారిపై కొరడా

చట్ట ప్రకారం 46 కేసులు నమోదు

పెన్ పవర్, మల్కాజిగిరి

నేరేడ్మట్ పోలీస్ స్టేషన్ సిఐ నర్సింహ్మ స్వామి ఆద్వర్యంలో రచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశల మేరకు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్డు పై తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేసి రూ1000 జరిమానా విధించారు. నేరేడ్మట్, వినాయక్ నగర్ ప్రాంతల్లో 46 కేసులు నమోదు చేశామని సిఐ తెలిపారు. ఈ సందర్బంగా సిఐ నర్సింహ్మ స్వామి మాట్లాడుతూ కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ, మాస్కులు, బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి అన్నారు. కరోనా నిబంధనలు నిర్లక్ష్యం వ్యహిస్తే వారిపై నేరేడ్మెట్ పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశల మేరకు ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలో, వినాయక్ నగర్ లో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వ్యహిస్తు నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పిస్తూ పెట్టి కేసు నమోదు చేస్తున్నామని సిఐ నరసింహ స్వామి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న 46 కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...