Followers

రూ10 లక్షలవిరాళం ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్

 రూ10 లక్షలవిరాళం  ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్ 
పెన్ పవర్, కందుకూరు

 కందుకూరు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు నాక్ ఏ గ్రేడ్ సాధన కొరకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు కాకినాడ కు చెందిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిట్ వారి  కరేడు కు దగ్గర అలగాయపాలెం వద్ద ఉన్న హ్యాచరి మేనేజంగ్ డైరక్టర్   కార్తూరి సత్యన్నారాయణ మూర్తి ఆదేశాల మేరకు సేల్స్ మేనేజర్ సురేంద్ర కుమార్, హ్యాచరి మేనేజర్ ఎ. నాగేశ్వరావు లు శాసన సభ్యులు మహీధర్ రెడ్డి సమక్షంలో పదిలక్షల రూపాయలు కళాశాల అభివృద్ధి కోసం విరాళం ప్రకటించారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు మహీధర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు, నాక్ ఎ గ్రేడ్ సాధించేందుకు  దాతల సహాయ సహకారం తో కళాశాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 

మన ప్రాంతం కానివారప్పటికి మన కళాశాల అభివృద్ధి కి,  పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకరిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.నాక్  సాధన సమితి సభ్యులు శీలం సుధీర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకోని వారు, ఈ ప్రాంతం వారు కాని వారు స్పందిస్తున్న తీరు చాలా సంతోషమని, అదేవిధంగాఈ కళాశాలలో చదువుకున్న వారు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అయితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు.అనంతరం దాతల తరుపున వచ్చినవారికి శాసనసభ్యులు మహీధర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం రవి కుమార్, నాక్ సాధన కమిటీ సభ్యులు శీలం సుధీర్, మంచిరాజు మురళి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...