Followers

ఆక్వా చెరువులకు అందరు లైసెన్సులు కలిగి ఉండాలి

ఆక్వా చెరువులకు అందరు లైసెన్సులు కలిగి ఉండాలి 




పెన్ పవర్,కొవ్వూరు

దేవరపల్లి మండలం తాసిల్దారు వారి కార్యాలయంలో  మత్స్య శాఖ సహాయ సంచాలకులు బి.సైదా నాయక్ ఆధ్వర్యంలోజిల్లా స్థాయి కమిటీ వారి ఆదేశాల ప్రకారం మండల స్థాయి అధికారులకు ఆక్వా చట్టం 20 20 ఆంధ్రప్రదేశ్ చట్టం మరియు ఆంధ్రప్రదేశ్ చేపల మేతల చట్టం లపై మండల స్థాయి కమిటీ సభ్యులకు కొవ్వూరు మత్స్య శాఖ సహాయ సంచాలకులు సైదా నాయక్ అవగాహన కల్పించారు. కొత్తగా వచ్చిన ఆక్వా చట్టం ప్రకారం శాశ్వత ఆక్వా రైతులు లైసెన్సులు పొందాలి అని సూచించారు. కొత్త చట్టం ప్రకారం పాత లైసెన్స్ కలిగిన వారు మే 30 వ తారీఖు లోగా రెన్యువల్ చేయించుకోవలెను. లైసెన్స్ పొందని చెరువులు మరియు కొత్తగా చేరువులు త్రవ్వుకొనుటకు  సంబంధిత పత్రాలు అనగా ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్కు ,80% వాటర్ లైట్ ఏరియా సెర్టిఫికెట్, గూగుల్ క్యాడ్ మ్యాప్, ఎకరానికి 1000రూపాయల చొప్పున ఫీజుతో గ్రామ సచివాలయం, మత్స్య శాఖ సహాయకులు (వి.ఎఫ్.ఏ) లను సంప్రదించవలెను. జూన్ 30 లోగా ఆక్వా లైసెన్స్ పొందిన వారి చెరువులను ధ్వంసం చేయబడును అని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, ఎంపీడీవో, అటవీశాఖ అధికారి, మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారి వి. దేవానందం మత్స్యశాఖ సహాయకులు ఏ.శాంతి, టి. చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

సామాజిక పింఛన్లు అందజేస్తున్న కౌన్సిలర్‌

 సామాజిక పింఛన్లు అందజేస్తున్న కౌన్సిలర్‌

నర్సీపట్నం, పెన్‌ పవర్‌ : 

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు శనివారం ఉదయం కౌన్సిలర్‌ బోడపాటి సుబ్బలక్ష్మి సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల, మత రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన వారందరికీ సామాజిక పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఎవరైనా ఉంటే సచివాయం ద్వారా దరఖాస్తు చేసుకోవాని ఆమె విజ్ఞప్తి చేశారు.


ఘనంగా మేడే దినోత్సవ వేడుకులు

 ఘనంగా మేడే దినోత్సవ వేడుకులు

నర్సీపట్నం,  పెన్‌ పవర్‌ : 

మోదీ తీసుకువస్తున్న కార్మికల వ్యతిరేక చట్టాలను ఈ మేడే స్పూర్తితో వ్యతిరేకించాలంటూ కార్మికులు శనివారం జెండా ఆవిష్కరించారు. నర్సీపట్నంలో కార్మికులు ఘనంగా జెండా ను ఎగురవేశారు. ముఠా, మున్సిపల్‌, భవన నిర్మాణ రంగం, స్కీమ్‌ వర్కర్స్‌, కాపీ కార్మికులు , పలుచోట్ల జెండాలు  ఎగురవేశారు. కృష్ణాబజారులో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు  డి.సత్తిబాబు మాట్లాడుతూ మోదీ కార్మికుల కున్న చట్టాలను రద్దు చేస్తున్నారన్నారు.  4 లేబర్‌ కోడ్‌లు గా విభజించారన్నారు.  ఫలితంగా కార్మికులు  మరలా పోరాటాలకు సిద్దం కావాన్నారు. 12 గంటలు  పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగాన్ని అమ్మేసి, దేశాన్ని ఆర్ధికంగా దివాలా తీయీస్తున్నారన్నారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టారన్నారు. ఎన్నికల్లో కుంభమేళాలు  పేరిట కరోనాను తిరిగి తెచ్చారన్నారు. కరోణా కాలంలో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధానాలు  కారాణంగా రాష్ట్రంలో కార్మికులు  ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారన్నారు. భవన నిర్మాణరంగం, ముఠా, మున్సిపల్‌, స్కీమ్‌ వర్కర్స్‌, పలు  ఇబ్బందులు  ఎదుర్కోంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గౌరీ, సామ్రాజ్యం, శివ, నానాజీ, గోవింద, రమణ, యుకె.రావు, నూకరత్నం, పర్వీన్‌, ప్రసన్న, రామకృష్ణ పులువురు కార్మికులు  పాల్గొన్నారు.



ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పరిశ్రమలను ఆదరించిన నాడే నిజమైన మేడే

ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పరిశ్రమలను ఆదరించిన నాడే నిజమైన మేడే

--సీపీఐ నాయకులు వి శ్యామ్, కె రామకృష్ణ.
--ఘనంగా ఆలమూరులో 135వ మేడే వేడుకలు.




ఆలమూరు, పెన్ పవర్ :

      ప్రపంచ కార్మిక 135 వ దినోత్సవం "మేడే" సందర్భంగా  మండల కేంద్రమైన ఆలమూరు బస్టాండ్ సెంటర్ వద్ద గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద అరుణ పతాకం సీపీఐ, ఏఐటీయూసీ, ఎస్టీయూ, యూటిఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు శ్యామ్ రామకృష్ణ, సీపీఐ నాయకులు వి శ్యామ్, కె రామకృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా ప్రభాకర్రావు  మాట్లాడుతూ 1886 ముందు ప్రపంచంలో ఎక్కడా పనిగంటలు నియమ నిబంధనలు అమలులో లేవని కార్మిక హక్కులు, చట్టాలు లేవని అటువంటి పరిస్థితిలో కార్మికులకు 8 గంటలు పని ఉండాలని వారానికి ఒకరోజు శెలవు కావాలని, భోజన విరామం కావాలని సంఘం పెట్టుకొనే హక్కు, కార్మిక చట్టాలను అమలు చేయాలని 1886 మే1 నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేయగా.. పోలీసులకు కార్మికులకు మధ్య జరిగిన గొడవల్లో ఎందరో కార్మికులు అసువులుబాశారని ఆ కార్మికుల రక్తంతో తడిచిన చేతి రుమాలు నేడు కోట్లాదిమంది కార్మికులకు అండగా ఎర్ర జెండాగా మారిందని అంతటి చరిత్ర కలిగిన మేడే ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పండుగగా జరుపుకొంటున్నారని అన్నారు. కె రామకృష్ణ మాట్లాడుతూ మేడల మీద మేడలు పెరుగుతున్నాయి కానీ పేదవాడి కష్టాలు తీరటంలేదని ఎన్ని "మేడే"లు వచ్చినా రామరాజ్యం కలల రాజ్యంగానే మిగిలిపోతోందని నేను వ్వవసాయం చేస్తున్నాను హాయిగా ఉన్నాననే రైతులు కనపడటం లేదని, వ్వవసాయ కూలీల డొక్కలు చిక్కి పోతున్నాయని, ఇకా కార్మికులైతే చెప్పనఖ్ఖరలేదని చీకటిలో జీవితనావను లాగలేక లాగుతున్నారని, కరోనాలో దినసరి కూలీలు  పిల్లలనెత్తుకొని కాలినడకన ,కూటికోసం పరుగులు పెడుతుంటే కన్నీరు ఆగటం లేదని వ్వవసాయాన్నీ పరిశ్రమలను ప్రభుత్వం ఆదరించి స్యయం ఉపాధి పధకాలను ప్రోత్సాహించాలని,  అప్పుడే కర్షక,కార్మిక జనావళి జీవితాల్లో మే డే కన్పిస్తుందని నిఖిలలోకం హర్షిస్తుందని అన్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సేవాదళ్ కన్వీనర్ చల్లా ప్రభాకర్రావు సమకూర్చిన నూతన వస్త్రాలను కార్మిక కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు చక్రవర్తి, కె రాజగోపాల్, ఉడతా వెంకటేశ్వర్రావు, నాయకులు దడాల చంద్రరావు, గండి రవికుమార్, లంకె యాకోబు, పారిశుధ్య కార్మికులు, రిక్షా కార్మికులు, ఎలక్ట్రికల్, అటో వర్కర్లు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

ఖాకీల కష్టం చూడవయా...!!

 ఖాకీల కష్టం చూడవయా...!!

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడమే ద్యేయంగా ముందడుగు
ఎల్విన్ పేట సర్కిల్ లో ముమ్మరంగా కర్ఫ్యూ అమలు
 కర్ఫ్యూ సమయంలో వాహన రాకపోకలు బంద్
ప్రజలకోసం కరోనాతో పోలీసుల ప్రత్యక్ష యుద్ధం
ఖాకీల కష్టం వర్ణనాతీతం
ప్రజలు పోలీసులకు సహకరించాలి : ఎల్విన్ పేట సి.ఐ తిరుపతిరావు, ఎస్.ఐ కృష్ణ ప్రసాద్

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

కరోనా రెండవ దశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వాలు కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైరస్ ప్రభావం రోజురోజుకు వృద్ధి చెందుతూనే  ఉంది. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం భయం అంతంతమాత్రముగానే ఉంది.ఈ పరిస్థితిలో ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ కన్నా సంపూర్ణ లాక్డౌన్ తప్పనిసరని ఎందరో  మేధావుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.లాక్డౌన్ దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేసే సమయం కూడా ఆసన్నమైంది.ప్రభుత్వాలు లాక్డౌన్ అని ప్రకటన చేసినవెంటనే దాని అమలుకు కీలక పాత్ర పోషించవలసింది పోలీస్ యంత్రాంగం.  కానీ వారి కష్టాలను,సేవలను గుర్తించి వారికి సహకరించడానికి  ప్రజలు ముందుకు రావాలి లేదంటే వ్యాప్తిని అరికట్టడం ఎవరితరము కాదు ఈ విపత్కర కరోనా సమయంలో  ప్రజలకు అవగాహన కల్పించి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్విన్ పేట సి.ఐ తిరుపతిరావు,ఎస్.ఐ కృష్ణ ప్రసాద్ తెలిపారు. కానీ ప్రజలు మాత్రం కోవిడ్ వ్యాప్తి పట్ల అవగాహనతో జాగ్రత్తగా ఉండి పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

 కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో,రాష్ట్రంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించనున్నాయి. ఇక లాక్ డౌన్ అమలు చెయ్యాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రోడ్ల మీద ప్రయాణించే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అహర్నిశలు పని చేస్తున్నారు. అసలే ఎండా కాలం .. ఆపై కరోనా రెండవ దశ వ్యాప్తి అధికం .. కనీసం రోడ్ల మీద మనుషులు కూడా తిరగలేని  పరిస్థితి ఏర్పడబోతుంది. అందులోనూ ఏదైనా తాగటానికి, తినటానికి కూడా అవకాశం లేకుండా సర్వం బంద్ . ఇక ఇలాంటి సమయంలో ఖాకీలు లాక్ డౌన్ అమలు కోసం నానా తిప్పలు పడవలసిన సమయం ఆసన్న మవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కరోనాకు ఎదురుగా వెళ్లి వీరోచితంగా పోరాడుతూ తమ విధులకు న్యాయం చేసే ఖాకీలపై ఎన్నో చోట్ల విమర్శలు వెల్లువగా వస్తున్నా పోలీసులు ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు పడరాని పాట్లు పడుతున్నారు.కోవిడ్ వ్యాప్తి పై అవగాహన లేని ఎంతోమంది బాధ్యత లేని మనుషులు పొలుసులపై ఎన్ని మాటలు ఆడుతున్నప్పటికి ఎవరూ బయట తిరగకుండా 24 గంటలు పహారా కాస్తునే ఉంటూ కంటి మీద కునుకు లేకుండా సేవలందిస్తునే ఉంటారు. దేశం అంతా లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్లకే పరిమితం అయినా ప్రజలను రక్షించటానికి పోలీసులు రోడ్ల మీద విధులు నిర్వర్తిస్తునే ఉంటారు.

కుటుంబాలకు దూరంగా ఎండను సైతం లెక్క చెయ్యకుండా విధులలో నిమగ్నమై అత్యవసర సర్వీసులలో ముందుండే పోలీస్ సిబ్బంది  అత్యంత సాహసోపేతంగా దేశం కోసం, ప్రజల కోసం మీ భద్రత మా బాధ్యత అంటూ సేవలు అందిస్తున్నారు. పోలీసులు కరోనా వైరస్ వల్ల నెలకొన్న లాక్ డౌన్ సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ పహారా కాస్తున్నారు. ఎండకు ఎండుతున్నారు . 

కనీస మౌలిక సదుపాయాలు ఏమీ లేకున్నా విధి నిర్వహణలో వీరోచితంగా పని చేస్తున్నారు. తాగటానికి నీళ్ళు , తినటానికి ఆహారం కూడా దొరకని పరిస్థితులలో కూడా తమ కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారు అయినప్పటికీ ప్రజలలో మాత్రం మార్పు రావడం లేదనే చెప్పాలి. పోలీసులు ప్రజలకోసం కష్టపడి వారి జీవితాలను పణంగా పెడుతున్నా కోవిడ్ వ్యాప్తి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలగురించి అవగాహన కల్పిస్తున్నప్పటికి ప్రజలు మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారు ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల వలన కోవిడ్ వస్తే వైద్యం దొరికే అవకాశం లేదు కనుక ఈ రెండవ  కోవిడ్ దశలోనైన పోలీస్ సేవలను గుర్తించి ప్రజలు కోవిడ్ పట్ల జాగ్రత్తలు పాటిస్తారని ఆశిద్దాం.


ముమ్మరంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులు

 ముమ్మరంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులు

మెంటాడ, పెన్ పవర్: 

మెంటాడ మండలంలో అతిపెద్ద గ్రామమైన జక్కువ గ్రామములో సర్పంచ్ లచ్చి రెడ్డి సత్యవతి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శిరీష ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రస్తుతము చిన్న పాటి వర్షాలు కురవడంతో ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసినట్లు సర్పంచ్ సత్యవతి తెలిపారు. ఇటువంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.


నిర్మానుష్యంగా రహదారులు

 నిర్మానుష్యంగా  రహదారులు

 భయం గుప్పిట్లో ప్రజలు
 ఒకపక్క కరోనా, మరోపక్క తీవ్ర ఎండలు

మెంటాడ, పెన్ పవర్ : 

గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మండలంలోని పలు రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఒకపక్క కరోనా, మరోపక్క ఎండ తీవ్రత కు మండల ప్రజలు భయం గుప్పిట్లో తమ కుటుంబ సభ్యులతో కలసి ఇళ్లలోనే గడుపుతున్నారు.

అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదని ఒకపక్క జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించడంలో ప్రజల్లో కూడా కొంతమేర అవగాహన వచ్చింది. ఇటీవల వివిధ కారణాలతో మండలంలోని పలు గ్రామాల్లో పలువురు మృతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీనితో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు తామే   తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...