Followers

Showing posts with label OTHER. Show all posts
Showing posts with label OTHER. Show all posts

గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం

 గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం


లాక్డౌన్ కి మద్దతు ఇచ్చిన వర్తకులకు కృతజ్ఞతలు

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలి

సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్రావు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం పడింది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ విధించింది.మధ్యాన్నం 12 నుండి ఉదయం 6గంటల వరకు పోలీసులు సహకారంతో ప్రభుత్వం కర్ఫ్యూ నిర్వహిస్తుంది. అయినప్పటికీ పంచాయతీ పరిధిలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్న తరుణంలో గ్రామ సర్పంచ్ గౌరీశంకర్రావు పిలుపు మేరకు వ్యాపార వర్గాలు శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ చేయడానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చాయి. కరోనా వ్యాప్తిని అరికట్టాలనే మంచి ఉద్దేశంతో వ్యాపార సముదాయాలను మూసివేయడానికి ముందుకు వచ్చిన వర్తకులకు సర్పంచ్ గౌరీశంకర్రావు కృతజ్ఞతలు తెలియచేసారు.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

చింతపల్లి, ముంచింగ్ పుట్ లో కోవిడ్ సెంటర్ ప్రారంభించాలి

గిరిజన సంఘం డిమాండ్‌

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తో రోగులు పెరుగుతుంటే సమర్థవంతంగా వైద్యం అందించేందుకు సమన్వయం చేసే ఐ. టి.డి.ఏ పిఓ ను కె.జి.హెచ్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా ప్రభుత్వం జారీ చేసిన నియామక ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స శుక్రవారం  డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాడేరు ఐ.టి.డి.ఏ పరిధిలో సుమారు ఆరున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారని, గిరిజన ప్రాంతాల్లో  రోజు రోజుకు కోవిడ్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందిందని,భౌగోళికంగా విస్తారంగా ఎక్కువ గ్రామాలు, రహదారి నిర్మాణం కూడ సక్రమంగా లేని,అంబులెన్స్ వేళ్ళని గ్రామాలు ఉన్నాయన్నారు.సీజనల్ జ్వరాలకే మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు.పాడేరు జిల్లా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసిన నేటికి మెరుగైన వైద్యం కోసం రోగులను విశాఖపట్నం తరలిస్తున్నరన్నారు.కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోగులకు వైద్యం కోసం పాడేరు జిల్లా ఆసుపత్రి లో వెంటిలేటర్ ఆపరేటర్ లేక రోజులు తరబడి నిరుపయోగంగా ఉందన్నారు.అధికారుల అసమర్థత వల్ల10 వెంటిలేటర్ ను విశాఖపట్నం తరలించారన్నారు. పాడేరు,అరకులోయ కోవిడ్ క్వారెంట్ సెంటర్ల ఏర్పాటు చేసిన మౌలిక వసతులు సమకూర్చాలని వారు డిమాండ్ చేశారు. చింతపల్లి, ముంచంగిపుట్టు ఏరియాల్లో కోవిడ్ విస్తరించిన నేటికి కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు చేయలేదన్నారు.అరకొరగా ఉన్న వైద్య సేవలు, ఆసుపత్రిలో,క్వారంటైన్ సెంటర్ల కొరవాడిన మౌలిక వసతులు, విస్తరిస్తున్న కోవిడ్ నుండి గిరిజనుల ప్రాణాలు కాపడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మరణాల పెరుగుతుంన్నా కోవిడ్ టెస్టు రిపోర్ట్ రాక రోగులు అయోమయంలో  ఉన్నారన్నారు.పాడేరు కేంద్రగా ల్యాబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇన్ని సమస్యలు ఉంటే గిరిజన ప్రాంతాల  కోసం ప్రత్యేకంగా నియమించిన అధికారి పిఓను కె.జి.హెచ్  కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించి  గిరిజన ప్రాంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.గిరిజన ప్రాంతాల్లో ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత, నిర్లక్ష్యం తగదన్నారు.

అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం సి.ఐ.టి.యు

 అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం 

 సి.ఐ.టి.యు

మహారాణి పేట, పెన్ పవర్

వై.రాజు నగర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ అల్లూరి స్పూర్తితో ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునే వరకు పోరాడుతాం. ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని సందర్భంగా దీక్ష శిబిరం వద్ద ఆయన ఫోటో కి పూలమాలవేసి దీక్షను ప్రారంభించారు అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలందరినీ చైతన్యం చేసి మన దేశానికి స్వతంత్రం కోసం ఆనాటి అదే స్ఫూర్తితో దేశ భక్తి ముసుగులో దేశాన్ని విదేశీలకు తాకట్టు పెట్టె విదంగా మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నా విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం. భారతదేశం అభివృద్ధి రావడానికి కారణం లేదా విశాఖపట్నం అభివృద్ధి అవ్వడానికి కారణం ప్రభుత్వ సంస్థలే. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంటే మోడీకి ఎప్పటికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బుద్ధి చెప్పారు అయినా మోడీకి బీజేపీకి సిగ్గు రావట్లేదు. మనకు కరోన ఇబ్బంది పెడుతున్న సరే  సరే మన పోరాటం కొనసాగుతుంది ఇదే మన విజయానికి నిదర్శనం. దీక్ష శిబిరంలో అనేక తరగతులకు సంబంధించిన ప్రజలు పాల్గొంటు, ఉద్యమం రోజురోజుకు ఉద్భతం అవుతున్నదన్నారు. స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ రోజు సి. ఐ.టి.యు,నగర కార్యదర్శలు యమ్.సుబ్బారావు, బి.జగన్, డిఅప్పలరాజు చంద్రమౌళి, నర్సింగరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరావు  78 వ వార్డు కార్పొరేటర్  డాక్టర్ బి గంగారావు జగదాంబ జోన్  నాయకులు, ఎం.జగ్గునాయుడు కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో అన్నదానం

 ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో అన్నదానం


మహారాణి పేట, పెన్ పవర్

అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  గౌరవ చైర్మన్ ఆదేశాల మేరకు  శుక్రవారం 7 మే ఉదయం  కరోనా తో చనిపోయిన వ్యక్తుల ఆత్మ శాంతి చేకూరాలని మన విశాఖ జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు ఉన్న నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షురాలైన పిల్ల సత్యవతి  సహయ సహకారాలతో నిర్వహించడినది. ఈ కార్యక్రమానికి గౌరవ చైర్మన్ షేక్ సిరాజుద్దిన్,నేషనల్ జనరల్ సెక్రెటరీ బి కేశవ రావు,రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్, రాష్ట్ర మైనార్టీ సెల్ మహిళా విభాగం అధ్యక్షురాలు షేక్ మున్నీ, రాష్ట్ర మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు సిహెచ్ ఆదిలక్ష్మి,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కే.శ్రీలత,జిల్లా యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌస్, జిల్లా సెక్రెటరీ కే శ్రీకమల్, జిల్లా కమిటీ మెంబర్ దనేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

 ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న ప్ర‌క‌ట‌న‌


విజ‌య‌న‌గ‌రం,  పెన్ పవర్

కోవిడ్ నియంత్ర‌ణంలో భాగంగా విధించిన క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలో భూ క్ర‌య‌, విక్ర‌య రిజిస్ట్రేష‌న్ స‌మ‌యాల్లో మార్పు చేసిన‌ట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 7.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు పని చేస్తాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కు జిల్లాలోని రిజిస్ట్రార్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.


ఘనంగాప్రపంచ కార్మిక దినోత్సవం....

 ఘనంగాప్రపంచ కార్మిక దినోత్సవం.... 

పెన్ పవర్, ఉలవపాడు 

మే 1. మేడే సందర్భంగా ఉలవపాడు మండలం లో కరేడు ర్యాంపు లోని పి టి పి కంపెనీ వద్ద పి టి పి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఆ సంఘం అధ్యక్షులు సవరం శ్రీనివాసులు ఆవిష్కరణ చేశారు, మండల కేంద్రంలోని సింగరాయకొండ ఆటో స్టాండ్ లో ఉలవపాడు మండల ఆటో వర్కర్స్ యూనియన్  (సీఐటీయూ) ఆధ్వర్యంలో సీఐటీయూ జండా ను ఆ సంఘం మండల కార్యదర్శి జె. సురేష్ బాబు ఆవిష్కరించారు. సిపిఎం పార్టీ జండాను ఆ పార్టీ నాయకులు ఎస్.డి గౌస్ ఆవిష్కరించారు  అనంతరం ర్యాలీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద కు వెళ్లి విగ్రహానికి సంఘం అధ్యక్షులు sd. జహీర్  పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్ మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో పనిగంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని కార్మికవర్గం పోరాడుతుంటే, ఇది సహించలేని పెట్టుబడిదారీ వర్గం కార్మికుల పైన అమానుషంగా కాల్పులు జరిపిందని ఆ కాల్పుల్లో 32 మంది అమరుల అయ్యారని, వారి రక్తంలో తడిసిన గోడను ఎర్ర జెండా ఎగరేసి కార్మిక శక్తిని చాటారని, అప్పటి నుండి ఎనిమిది గంటల పనిదినం అమలవుతుందని తెలిపారు. అయితే నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూపనిని 8 గంటలనుండి 12 గంటలకు పెంచిందని, కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు కాల రాస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వ విధానాల తెచ్చుకోవటమే నేడు కార్మికవర్గం ముందున్న కర్తవ్యం అని పిలుపునిచ్చారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం నాయకులు  పొట్లూరు రవి కొమరగిరి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు గంజి శ్రీనివాసులు చిమటా శ్రీనివాసులు, మండవ కోదండరామ్, జేమ్స్, పీ మస్తాన్ రావు  తదితరులు పాల్గొన్నారు

ప్రపంచ కార్మికులారా ఏకంకండి

ప్రపంచ కార్మికులారా ఏకంకండి

ఏలేశ్వరం, పెన్ పవర్

పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ ఛౌక్ సెంటర్లో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే  సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, ఏ ఐ సి సి టి యు, ప్రజా సంఘాల నాయకత్వంలో జెండా ఆవిష్కరణకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లిబరేషన్ కార్యదర్శి  కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని పిలుపునిచ్చారు. దేశంలో సెకండ్  వేవ్  కరోనా మరణాలకు బిజెపి ప్రధాని మోడీ నిర్లక్ష్యమే కారణం అన్నారు.భారతదేశం కరోనా యాక్షన్ లు గొప్ప విజయం సాధించిందని  గొప్పలు చెప్పిన ప్రధాని మోడీ భారత ప్రజలను కరోనా  మహమ్మారి కి బలి చేశాడు అని ఆరోపించారు.దేశంలో మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండ గట్టారు. రైతు వ్యతిరేక 3  వ్యవసాయ నల్ల చట్టాలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ  చేయడం,ఏపీకి  ప్రత్యేక హోదా ఇవ్వడంలో  అన్యాయం, యువతకు ఉద్యోగ ఉపాధి లేకపోవడం, నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎన్నడూ ఎరుగని రేట్లు, మహిళలపై దళితులపై అత్యాచారాలు దాడులు,ప్రజా వ్యతిరేక విధానాలతో హిందూ మతోన్మాద పాసిజం నడిపిస్తున్న మోడీ  ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలు  గమనిస్తున్నారని అన్నారు. కార్మిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఈ తరుణంలో కార్మికులంతా ఏకమై ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం , యువజన సంఘం, విద్యార్థి సంఘం , కూలీలు, రైతులు, ప్రజా సంఘాలు సీపీఐఎంఎల్ లిబరేషన్ , ఏ ఐ సి సి టి యు ప్రజా సంఘాల కార్యకర్తలు , నాయకులు గండే టి నాగమణి, గుమ్మడి రమణ, కందుల ప్రసాద్, జీ సాయి, కందుల సతీష్ ,పిల్లా కాంతం, నాగులాపల్లి అర్జునుడు, బి రాఘవ,  గుర్రం గోవింద్, చందక లక్ష్మి,  కందుల వరలక్ష్మి ,గుమ్మడి పాదాలమ్మ , వరాలమ్మ ,వడ్డాది గంగాభవాని తదితరులు పాల్గొన్నారు .

ఘనంగా మేడే వేడుకలు

ఘనంగా మేడే వేడుకలు

ఎటపాక, పెన్ పవర్

ఘనంగా మేడే వేడుకలు గన్నవరం, క్రిష్ణవరం ,లక్ష్మీపురం ,తోటపల్లి, సీతాపురం ,రంగాపురం ,పట్టుచీర,కన్నాపురం ,భూపతిరావుపేట ,జిన్నగట్ట ,కాపుగొంపల్లి ,నందిగామ, మురుమూరు సీపీఐ అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. మండలంలోని గన్నవరం లోని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అమరజీవి కామ్రేడ్ కందుకూరి మంగ రాజు గారి స్మారక స్థూపానికి సీపీఐ నాయకులు   జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా మంగ రాజు గారి సతీమణి ఉప సర్పంచ్ కందుకూరి స్వర్ణ  మాట్లాడుతూ కరోనా విపత్తు కార‌ణంగా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి కార్మికునికి అందివ్వాలన్నారు. వలస కార్మికులకు కరోనా టెస్టులు జరిపి, వారి స్వస్థలాలకు వెంటనే పంపించాలన్నారు. యాజమాన్యాలు కార్మికులకు ఎలాంటి కోత విధించకుండా వేతనాలు ఇవ్వాలని.. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి అమలు చేయించాలన్నారు. కార్మికులు ఎన్నో పోరటాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలు 12 గంటలకు మార్చాలని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంద‌న్నారు.. ఈ కుట్రలను ఆపివేయాలని హెచ్చరించారు.. మోడీ ప్రభుత్వం కార్మికుల జీవితాలను గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, దేశంలోని కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు నిరసించాలన్నారు. పోలవరం ముంపు కి గురవుతున్నా గ్రామాలు ,భూములు నోటిపి కేషన్ ఇస్తున్నా రే తప్ప పరిహారం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం భద్రామ్మ, సీపీఐ మండల కార్యదర్శి ఎలిసాల నాగరాజు, కందుకూరి సుధీర్ చంద్ర, వాసం రాము, ఎంపిటిసి  ముత్తయ్య,  వరదా బ్రహ్మం, కంటె రాజు, ములిసెట్టి శ్రీను, సున్నం శ్రీను, పిడియాల దుర్గా ప్రసాద్, మైపా సాయి, కుమ్మర పల్లి శ్రీను, సాగర్, కంటె శివ, ఏడిద సుబ్బారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవు

సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవు         


 ఐరాల,  పెన్ పవర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి ప్రైవేటీకరణ విధానాలు అరికట్టాలంటే కార్మిక ఉద్యోగ సంఘాలు ఏకమై పోరాటాలు చేయాలని లేదంటే కార్మిక చట్టాలు హక్కులు ఉండవని ఆటో వర్కర్స్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం విజయ్ కుమార్ కార్మికులకు హెచ్చరించారు. నేడు మేడేను పురస్కరించుకొని  మండల కేంద్రమైన ఐరాల లో  నందు  ఇండియన్ ఆటో వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ చందర్ మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్  మాట్లాడుతూ  దేశంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని పార్లమెంటులో 300కు పైగా ఎంపీలు పెట్టుబడిదారులే ఉన్నారని కార్మిక వర్గానికి పార్లమెంటులో ఇలాంటి చట్టాలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. కార్మికులందరూ ఏకమై పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉందని ఐక్య పోరాటాలు అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు కార్మికులు మేడం జరుపుకుంటున్నారని,   ఎనిమిది గంటల పని కోసం పోరాటం చేసి పెట్టుబడిదారుల దాడులతో కార్మికులు చనిపోయారని అలాగే మే 1న ఎనిమిది గంటల పని సాధించుకున్న రోజు కనుక నేడు  మే డే ని  జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి ఎం సురేంద్ర నాథ్, ఆటో వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి శివకుమార్, ఐరాల మండల ఉపాధ్యక్షులు రాజా,  ప్రధాన కార్యదర్శి  మోహన్ రెడ్డి,  కోశాధికారి  హుమయున్ భాష,  వేణు, షబ్బీర్,  గ్రీన్ అంబాసిడర్ యూనియన్ నాయకులు రాజా,  సీఐటీయూ జనరల్ సెక్రెటరీ రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు.

కరప మండలంలో 87 శాతం పింఛన్ల పంపిణీ

 కరప మండలంలో 87 శాతం పింఛన్ల పంపిణీ

 పెన్ పవర్,కరప: 

మండల పరిధిలోని 23 గ్రామాల్లో 10,737 మందికి వివిధ రకాల పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా మొదటిరోజు శనివారం 9,437 మందికి (87.89 శాతం) పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీఓ కర్రె స్వప్న తెలిపారు. అన్నిరకాల పింఛన్లసొమ్ము రూ 2,52,41,500 లు లబ్దిదారులకు బట్వాడా చేయాల్సి ఉండగా రూ.2,19,25,750 లు ఇవ్వడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీలో ఉప్పలంక సచివాలయం 94.29 శాతం, పెనుగుదురు 93.42 శాతం, గొర్రిపూడి 92,67 శాతంతో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయన్నారు. కొంతమంది గ్రామంలో లేక, అనారోగ్య కారణాలు, ఇతరత్రా లబ్దిదారులు ఇంటివద్ద అందుబాటులో లేక, సిగ్నల్స్ లేకపోవడం వల్ల నూరుశాతం పంపిణీ జరగలేదని ఎంపీడీఓ తెలిపారు. ఈఓపీఆర్డీ సీహెచ్ బాలాజీవెంకటరమణ పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్, మరోపక్క వేసవి ఎండలు ఉదృతంగా ఉన్నా కూడా అధికారులు, గ్రామవలంటీర్లు లబ్దిదారులకు పింఛన్లు పంపిణీచేయడంపై లబ్దిదారులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. అనారోగ్య కారణాలతో కాకినాడ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చినకొత్తూరు గ్రామానికి చెందిన చింతా వీర్రాజుకు గ్రామవలంటీర్ ఎర్రంశెట్టి ఫణికేసరి ఆసుపత్రికెళ్లి ఫించనాసొమ్మును అందజేశారు. గతంలో పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాచేవారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఆసుపత్రికి వచ్చి పింఛన్ ఇచ్చారని లబ్దిదారుడు వీర్రాజు సంతోషం వ్యక్తంచేశాడు.

పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

 పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

పెన్ పవర్, రావులపాలెం

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే కరోన వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ సభ్యులు డిమాండ్ చేసారు. ఎస్ఎఫ్ఐ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గాప్రసాద్, కేతా ప్రేమ్ కుమార్ ల ఆధ్వర్యంలో శనివారం శనివారం పరీక్షల రద్దు కోరుతూ రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసిల్దార్  యూసఫ్ జిలానికి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ   రాష్ట్రంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తుందని, ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు గతం కన్నా ఎక్కువ మంది వ్యాపిస్తుందన్నారు.

 రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారని, ఈ నిర్ణయం సరియైనది కాదని అన్నారు. ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసిందని, దాదాపు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేసాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలు జరుగుతాయో లేదో అనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారని, రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందని అన్నారు.  వీరికి గనక పరీక్షలు నిర్వహిస్తే కరోన వ్యాధి వారికి, వారి కుటుంబాలకు గ్రామాల్లో సైతం వ్యాపించే ప్రమాదం పొంచి ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పరిస్థితుల్లో పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని  డిమాండ్ చేసారు.  అధికారులకు నాయకులకు కరోన వస్తే పక్క రాష్ట్రాలకు పరుగులు తీసి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో విద్యార్ధులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్షిజన్ లు లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కావున పరీక్షలు వాయిదా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్. సత్యనారాయణ, ఎస్. సందీప్ కుమార్, ప్రసన్న కుమార్, విశ్వతేజ, శ్రీనివాసు, విద్యార్ధులు పాల్గొన్నారు.

ఏఎస్ఐ వీరభద్రరావు సేవలు మరువలేనివి

 ఏఎస్ఐ వీరభద్రరావు సేవలు మరువలేనివి

 పెన్ పవర్,కరప:

విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి, అందించిన సేవలు మరువలేనివని కాకినాడరూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏఎస్ఐ పబ్బినీడి చినవీరభద్రరావు పదవీవిరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగస్తులకు పదవీవిరమణ తప్పదని, అయితే పదవీకాలంలో చేసిన సేవలే ప్రజల్లో గుర్తుండిపోతాయన్నారు. కరప ఎస్ఐ డి. రామారావు మాట్లాడుతూ కానిస్టేబుల్, హెచ్సీగా, ఏఎస్ఐగా అందించిన సేవలు అందరికీ ఆదర్శమన్నారు. ఈసందర్భంగా కరప పోలీసు స్టేషన్ సిబ్బంది తరపున ఏఎస్ఐ చినవీరభద్రరావు, శివకుమారి దంపతులను సీఐటీ మురళీకృష్ణ ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు గొల్లపల్లి ప్రసాదరావు, సవిలే రాజేష్, వజ్రపు కామేశ్వరరావు, ఏఎస్ఐ జి. ప్రసన్నకుమార్, హెచ్సీ పి. రాజారావు, కె. చిట్టిబాబు, శ్రీనివాస్, హరిబాబు, శివ తదితరులు పాల్గొన్నారు.

నిజమైన ప్రజాసేవకులు ఈ పారిశుధ్య కార్మికులే

 నిజమైన ప్రజాసేవకులు  ఈ పారిశుధ్య కార్మికులే              

పెన్ పవర్, ఆలమూరు 

ఆలమూరు మండలం  సంధిపూడి పంచాయితీలో  పారిశుధ్య కార్మికుల గా పనిచేస్తున్న ఇరువురికి  కార్మిక దినోత్సవం సందర్భంగా  సర్పంచ్  తోట భవాని   నూతన వస్త్రాలను ఇచ్చి గౌరవించడం జరిగింది.   ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ ఈ కరోనా ప్రారంభం నుండి  తమ ప్రాణాలను  సైతం లెక్కచేయకుండా  పారిశుధ్య పనులను చేస్తూ  ప్రజల ఆరోగ్యం కాపాడటంలో  ప్రముఖ పాత్ర పోషిస్తున్న  వీరి సేవలకు వెలకట్టలేమన్నారు.   అలాగే ప్రజలు కూడా  పరిసరాలను అపరిశుభ్రత గా  ఉంచుకోకుండా జాగ్రత్తగా  ఉండటం వలన మాత్రమే  ఎటువంటి  అనారోగ్యం బారినపడకుండా ఉండి  ఈ కరోనా ను  దైర్యంగ ఎదుర్కోవడానికి అవకాశం  ఉంటుందన్నారు. దయచేసి  ప్రతీ ఒక్కరూ  నిర్లక్ష్యంగా ఉండకుండా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  సూచనలు పాటిస్తూ  ప్రంట్ లైన్ వారియర్స్ కి  సహకరిస్తూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ  బాధ్యతగా  నడుచుకోవాలని  ఆమె కోరారు.  ఈ కార్యక్రమంలో  ఆమెతో పాటు వార్డు సభ్యులు,  సచివాలయ సిబ్బంది, తదితరులు   పాల్గొన్నారు.

చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా "మే""డే" వేడుకలు...

 చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా "మే""డే" వేడుకలు...

పెన్ పవర్, ఆలమూరు 

కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన ఆలమూరు వైసిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి, సీనియర్ నాయకులు చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో మేడే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలమూరు బస్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఎర్ర జెండాను ఎగరవేశారు. ముందుగా మహాత్మ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం రిక్షా, పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8గంటల పని దినాన్ని చేపట్టాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడుతుండగా చికాగో నగరంలో  ప్రభుత్వం కార్మికులపై కాల్పులు చేపట్టినట్టు తెలిపారు. దీంతో అనేక మంది కార్మికులు మృతి చెందారని వారి ప్రాణాల త్యాగ ఫలితమే మనం జరుపుకునే మేడే వేడుకలన్నారు. దానికి ప్రతీకగా మేడేను ప్రపంచ కార్మికుల దినంగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. ప్రపంచ కార్మికులంతా ఐక్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు సర్పంచ్ నాతి లావణ్య కుమార్ రాజా, ఉప సర్పంచ్ చల్లా సీతామాలక్ష్మి భూషణం, సిపిఐ నేత కొండేటి రామకృష్ణ, గొల్లపల్లి కిరణ్, నాతి కిరణ్, అశోక్, కోలా నాని, డి.పి.రావు, ఉమా తదితరులు పాల్గొన్నారు..

రాబోయే వర్షా కాలంలో ఇసుక నిల్వలు ఉంచాలి...

రాబోయే వర్షా కాలంలో ఇసుక నిల్వలు ఉంచాలి...

కొవ్వూరు, పెన్ పవర్

జిల్లాలో రాబోయే వర్షా కాలంలో జూన్ 15 వ తేదీ నాటికి సుమారు 5 లక్షల టన్నుల ఇసుకను నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్  రెవెన్యూ కె.వెంకట రమణా రెడ్డి అన్నారు. కొవ్వూరు  ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఏ.పి.యం.డి.సి. అధికారులతో, ఇసుక ర్యాంపుల్లో ఉన్న ఇసుక సొసైటీ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఇసుక ఉత్పత్తి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక పట్టా ర్యాంపులు, ఓపెన్ ర్యాంపులు, డీసిల్టేశన్ ర్యాంపులు, ఇసుక డిపోలు మొదలగునవి త్వరిత గతిన ప్రారంభించే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు. 28 డీసిల్టేశన్ ర్యాంపు ల్లో సుమారు 18 మాత్రమే పనిచేస్తున్నాయని, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు వెళ్లి పోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, వాళ్ళని వెనక్కి పిలిచి అన్ని ర్యాంపులు పనిచేసే విధంగా చర్యలు తీసు కోవడం జరుగుతుంది అని అన్నారు.  10 పట్టా ర్యాంపులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని అన్నారు.  22 ఓపెన్ ర్యాంపుల్లో 7 నుండి 8 మాత్రమే పని చేయడం జరుగుతోంది అని అన్నారు. ఇసుక ఉత్పత్తి ని పెంచేందుకు అన్ని ర్యాంపులు తెరిపించాలని  ఏ.పి.యం.డి.సి. అధికారులను ఆదేశించారు. 

కరోనా వైరస్ భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి అని, 4 రకాల పోస్టర్స్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ  కె. వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ టీకాలు తప్పనిసరిగా  వేయించుకోవాలి అని అన్నారు. కరోనా వైరస్ కి సంభందించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 104 కి కాల్ చెయ్యాలి అని అన్నారు. ప్రజ లందరూ అప్రమత్తంగా ఉండి, వైరస్ వ్యాప్తిని నియంత్రించి, మనమందరం ప్రాణాలను కాపా డుకుందామని అని అన్నారు. మాస్క్ లు ధరించి, సానిటైజర్ లు వాడుతూ, భౌతిక దూరం ప్రజలు తప్పనిసరిగా పాటించాలి అని అన్నారు. వాలంటీర్ ల ద్వారా జ్వరం ఎవ్వరికీ వచ్చింది అనే దాని గురించి సర్వే నివహిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ టెస్టులు చాలా వరకు పెంచడం జరిగింది అని, చేసిన 24 గంటల్లో రిపోర్ట్ లు వస్తున్నాయి అని అన్నారు.   ప్రస్తుతం 3 వేల 600 బెడ్ లు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సుమారు 5 వేల బెడ్ ల వరకు పెంచడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో  కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి, డి.ఎస్.పి. బి.శ్రీనాథ్, సి.ఐ సురేష్, ఏ పి.యం.డి.సి. అధికారి, తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన వారికి పింఛనులు మంజూరు

 అర్హులైన వారికి పింఛనులు మంజూరు

పెన్ పవర్, ఆలమూరు 

నూతనంగా మంజూరైన ఇరవై మంది లబ్ధిదారులకు పెన్షన్లు శనివారం గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనువాస్ అందజేశారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పించన్లు మంజూరు చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ సిపి ప్రభుత్వం పని చేస్తుందని సోంత ప్రయోజనాలు చూసుకోకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పేద,బడుగు బలహీన వర్గాల వారికి  మా వైఎస్సార్  పార్టీ  అండగా ఉంటుంది అని తెలియజేసారు అలాగే కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు  ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సత్యనారాయణ, వైసిపి సీనియర్ నాయకుడు అడబాల వీర్రాజు, తమ్మన గోపి,మాజీ సర్పంచ్ వీరవెంకట్రావు, సూరిబాబు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మైగాపుల ఆంజనేయులు ఆధ్వర్యంలో మేడే వేడుకలు

 మైగాపుల ఆంజనేయులు ఆధ్వర్యంలో మేడే వేడుకలు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడిలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద సిఐటియు తాళ్లపూడి మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మైగాపుల ఆంజనేయులు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా  జెండా ఎగురవేయడం జరిగింది. మైగాపుల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం  ఇంచుమించు 200 వందలమందితో జరిగే ఈ కార్మికుల దినోత్సవాన్ని, కోవిడ్ నియంత్రణ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, అతి తక్కువ మందితో జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా నాయకులు వల్లేపల్లి నరసింహమూర్తి, తాళ్లపూడి మండల రైస్ మిల్లర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుంకర వెంకటేశ్వరరావు, కార్మికులు పాల్గొన్నారు.

ఘనంగా పి.వి.జి.97వ జయంతి!!

ఘనంగా పి.వి.జి.97వ జయంతి!!

విజయనగరం, పెన్ పవర్

     ప్రపంచ రాజకీయ చరిత్రలో పట్టాభిషేకం జరిగిన మహారాజు సోషలిస్టు గా మారింది ఒక్క పి.వి.జి.రాజు ఒక్కరేనని డాక్టర్ పి.వి.జి.గొప్ప మానవతావాదాని డాక్టర్ పి.వి.జి.రాజు కళావేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు,శనివారం పివిజి 97 వ జయంతి కార్యక్రమాన్ని వేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పివిజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భీశెట్టి మాట్లాడుతూ విజయనగరం మహారాజుల వంశ చిట్టచివరి పట్టాభిషిక్తుడు పివిజి ఒక్కేరేనని మహారాజుల వైభవాలను అవలీలగా వదిలేసి సౌమ్యవాదిగా సామాన్య ప్రజల సంక్షేమం కోసం రాజకీయ ప్రస్థానం చేసారని,సింహాచలం దేవస్థానం తో పాటుగా రాష్ట్రంలో ని 104 దేవాలయాలకు ధర్మకర్త గా వ్యవహరించారని రాజకీయాల్లో పివిజి కి గొప్ప చరిత్ర ఉందని 4 దఫాలుగా పార్లమెంట్ సభ్యుడు గా 5 దఫాలు గా ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గా విద్యా శాఖ మంత్రి గా రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చారని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ గా విశ్వవిద్యాలయం కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా విస్తరింప చేసారు.\

 రాజకీయాల మలిదశలో భారత సనాతన ధర్మంని, అధ్యాత్మికతను, ఆచరణలో చూపించిన కర్మ యోగి,రాజర్షి,మహర్షి, మన పివిజి కావడం మనకి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గా క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారని,సౌత్ ఇండియా గోల్ఫ్ చాంపియన్ గా పివిజి నిలిచారని 1958 లో మాన్సస్ సంస్థ స్థాపించి పేద ప్రజలకు విద్యను అందిస్తూనే కోటను వేల ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతా వాది స్వర్గీయ పివిజి రాజు మాత్రమే అని అన్నారు,ప్రతిసారి పివిజి జయంతి సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకి పివిజి పేరుతో పురస్కారాలు అందచేసేవారమని కరోనా కారణంగా గత ఏడాది, ఈ ఏడాది అందించలేకపోయామని ఆవేదన వ్యక్తంచేశారు, సాధారణంగా సామాన్య స్థాయి నుండి అసామాన్య స్థాయికి వ్యక్తులు ఎదిగారని మనం చరిత్రలో చదువుతుంటాము కానీ డాక్టర్ పివిజి రాజు అసామాన్య స్థాయి నుండి సామాన్య స్థాయికి దిగివచ్చి తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే పారిశుద్ధ్య కార్యక్రమాలు(ఒడిఎఫ్)ను నిర్వహించి దేశంలో ఎమ్మెల్యేలకి ఆదర్శంగా నిలిచారని భీశెట్టి అన్నారు ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు డాక్టర్ బాల భార్గవి,ఆశా, ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు.


పరీక్షలు వాయిదా వేయండి...

 పరీక్షలు వాయిదా వేయండి... 


విజయనగరం, పెన్ పవర్

కోవిడ్ కారణంగా 30 మంది ఉండే కేబినెట్ మీటింగ్‌ నే వాయిదా వేసిన వారు 30 లక్షల మంది విద్యార్థులు జీవితాలకు రక్షణ ఎలా కల్పిస్తారు?

ఇంటి నుంచి సెక్ర‌టేరియ‌ట్‌కి అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, ఆరోగ్య‌ర‌క్ష‌ణ ఏర్పాట్ల మ‌ధ్య వెళ్లి 30 మంది మంత్రుల‌తో దూరంగా ఉండి పాల్గొనే కేబినెట్ మీటింగ్ వ‌ల్లే క‌రోనా సోకుతుంద‌ని జగన్ భ‌య‌ప‌డి వాయిదా వేయించారని , అలాంటిది 15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప‌రీక్ష‌ల నిర్వాహ‌కులు, ఇత‌ర‌త్రా అంతా క‌లిసి 50 ల‌క్ష‌ల‌మందికి పైగా ప‌రీక్ష‌ల కోసం రోజూ రోడ్ల‌మీద‌కు రావాల్సి వుంటుందని, వారికి క‌రోనా సోక‌దా అని మాజీ శాసనసభ్యులు డా.కొండపల్లి అప్పలనాయుడు గారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన పంతం నెగ్గించుకోవడానికి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులతో కలుపుకుని సుమారు 50 లక్షల మందికి పైగా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష‌లు వాయిదా వేయాలని డిమాండ్ చేసారు. స్వల్పకాలిక లక్షణాలు ఉన్న విద్యార్థులను ఐసోలేషన్  లో పెట్టి పరీక్షలు రాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం అనాలోచిత చర్యగా కనిపిస్తుందని, వైరస్ సోకిన వారు ఐసోలేషన్ వరకు ఎలా వస్తారని,  వ్యాధి సోకిన వారిని ఇంకెవరైనా పరీక్ష కేంద్రానికి తీసుకుని రావాలని , వారు కూడా కరోనా భారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కళ్ళముందే అయినవారిని పోగొట్టుకుంటున్నారని, సకాలంలో బెడ్లు దొరక్క రోడ్ల ప్రక్కన, ఆస్పత్రి ఆవరణలో ప్రాణాలు పోతున్న ఘటనలు చూస్తుంటే బాధాకరమని  అన్నారు.


కార్మిక హక్కుల రక్షణకై మరో చికాగో పోరాటానికి సిద్ధం కావాలి

 కార్మిక హక్కుల రక్షణకై మరో చికాగో పోరాటానికి సిద్ధం కావాలి

విజయనగరం, పెన్ పవర్

       సిపిఐ, ఏఐటీయూసీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మరియు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో స్థానిక మర్క్స్ నగర్ ( బుచ్చెన్న కోనేరు ) శాఖలో 3 చోట్ల, బలిజివీధి శాఖలో 2 చోట్ల, శాంతినగర్ శాఖలో 1 చోట, విజయనగరం పి.డబ్ల్యూ మార్కెట్ ఎంప్లాయిస్ అండ్ ముఠా వర్కర్స్ యూనియన్ శాఖలో 4 చోట్ల, సిపిఐ జిల్లా కార్యాలయం మీద సిపిఐ, ఏఐటీయూసీ 2 జెండాలు మొత్తం 11 చోట్ల జరిగిన 135 వ మేడే దినోత్సవ వేడుకలు రెండవ వేవ్ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎర్రజెండాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. 135 వ మేడే వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, కార్మికులను యజమానులు దగ్గర బానిసలుగా చేయడానికి మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కొడ్లను రద్దు చేయాలని, అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను, పరిశ్రమలను ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజలందరికీ కరోనా టీకాని ఉచితంగా అందించాలని నినాదాలు చేశారు. అనంతరం బుగత అశోక్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా మహమ్మారి 2 వ వేవ్ లో ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అతిప్రమాధకరంగా విజృంభించడంతో దేశంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడం వలన ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా అలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజా వ్యవస్థ పరిరక్షణ కోసం, దేశ సంపదను మరింతగా పెంచేందుకు, ప్రజలకి ఆహారాన్ని అందించడానికి చమటోడ్చి కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు, కర్షకులకి 135 వ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవంగా మేడే ను 135 ఏళ్ళుగా శ్రామికజన సంఘీభావ చిహ్నాంగా, కార్మిక పర్వదినంగా మేడేను జరుపుకుంటున్నామని అన్నారు. అమెరికా, యూరప్‌ దేశాలలో 19వ శ‌తాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా స్థాపించబడిన భారీపరిశ్రమల్లో పనిచేయుట‌కు కార్మికుల అవసరం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ఉత్పత్తిరంగంలోని పెట్టుబడిదారులు, కార్మికులు రెండు వర్గాలు పుట్టాయన్నారు. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం కార్మికుల శ్ర‌మ‌ను దోచుకోవ‌డం మొద‌లు పెట్టారన్నారు. 

శ్రామికులచే బానిసల్లా ప‌నిచేయించేవారు. పిల్లలు మ‌హిళ‌లు అనే విచక్షణ లేకుండా కర్మాగారాలలో, గనులలో గొడ్డు చాకిరీ చేయించేవారని అశోక్ తెలియచేశారు. కనీస వసతులైన తిండి, బట్ట, గూడు వంటి ఉండేవి కాదని తెలిపారు. రోజుకు 16 నుంచి 20 గంటలు కార్మికుల చేత గొడ్డు చాకిరీ చేయించేవారని తెలిపారు. ఈ దారుణ చర్యల నేపధ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటు మొదలైందన్నారు. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్న పెట్టుబ‌డిదారీ వర్గం పై ఉధ్య‌మాల‌కు కార్మికులు సంఘటితమయ్యారు. ఆనాటి నుండి కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభించారన్నారు. 1764-1800 మధ్య బ్రిటన్‌లోనూ, ఆ తరువాత యూరప్‌లోనూ, ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం జరిగిందన్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో కార్మికులు చైతన్యవంతులై 1806లో మెకానిక్స్‌ యూనియన్‌ పేరిట తొలి కార్మిక సంఘాన్ని స్థాపించుకొన్నారని తెలిపారు. పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని, కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, కోరుతూ కార్మిక వర్గం విప్లవ శంఖం పూరించిందన్నారు. ఆ పోరాట జ్వాలలు బ్రిటన్‌, ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు, అమెరికాలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయని అశోక్ తెలిపారు. ఫిలడెల్ఫియాలో మెకానిక్స్‌ యూనియన్ 1827లో త‌మ‌కు 8 గంటల పనిదినం కోసం పోరాటం ప్రారంభించిందన్నారు. ఆ కార్మికోద్యమం దావాలంగా వ్యాపించి ఉధృతం కావడంతో. ప్రభుత్వం దిగివచ్చి 1837లో 10 గంటల పనిదినంను చట్టబద్ధం చేసిందన్నారు. 1881లో చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు సంఘటితంగా అమెరికా ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ పేరిట ఒక సమాఖ్యను కొత్తగా ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఆ సమాఖ్య 1884 అక్టోబరు 7న ఎనిమిది గంటల పనిదినంను చారిత్రాత్మక తీర్మానం చేసిందన్నారు. 1886 మే మొదటి తేదీన కార్మిక వర్గం సమ్మె పోరాటం జరపాలని నిర్ణయించిందన్నారు. 1885-86లో మేడే సన్నద్ధతకు జరిగిన సమ్మెపోరాటాల్లో లక్షలాది కార్మికులు పాల్గొన్నారన్నారు. 1886లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్‌నేషనల్‌ మహాసభ కూడా రోజుకు 8 గంటలు పనిని చట్టబద్ధం చేయాలని కోరిందన్నారు. 1886 మే 1 వ తేదీన చికాగోలో 8 గంటల పనిదినం సమ్మె జరిగిందన్నారు. ఆ సమ్మెలో మూడున్నర లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని అన్నారు. దీంతో కార్మికులపై మే 3న ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఆ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అమరులయ్యారన్నారు. కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించిన కార్మిక నాయకులను ప‌ట్టుకొని ఉరి తీశారని తెలిపారు. మే1న ప్రారంభమైన మహోద్యమం బాల్టిమెన్‌, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌, పిట్సు, డెట్రాన్‌ వంటి పెద్ద నగరాలకు దావానలంలా వ్యాపించింది. కార్మికుల హక్కుల కోసం వీరోచితంగా పోరాటాలు, త్యాగాలు చేశారన్నారు. 1889 లో సోషలిస్టు అంతర్జాతీయ మహాసభ రెండవ ఇంటర్‌నేషనల్‌ లో మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఆ రోజున అన్ని దేశాలలోని కార్మికులు ఏకకాలంలో తమ కోర్కెలను ప్రకటించాలని ఆదేశించింది. 1890 మే 1వ తేదీన ఐరోపా దేశాలలో తొలిసారిగా మేడే జరపడం జరిగిందన్నారు. మనదేశంలో కార్మికుల జీవితాలకు సవాలుగా నిలిచిన మతతత్వం, నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బహుళజాతి సంస్థల శ్రమ దోపిడీ నుంచి కాపాడుకునేందుకు దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను, కార్మిక హాక్కులను రక్షించుకునేందుకు చికాగో నగర పోరాటాన్ని స్మరించుకుంటూ నేడు బీజేపీ అవలంభిస్తున్న ఆర్ధిక, సామాజిక దోపిడీ విధానాల పై పోరాటాలు కొన‌సాగించాలని బుగత అశోక్ పిలుపునిచ్చారు.   మేడే కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవన్, పార్టీ శాఖా కార్యదర్సులు, యూనియన్ నాయకులు కెల్ల సూర్యనారాయణ,  నడిపేన పాపునాయుడు, పతివాడ శ్రీను, చిన్న, అప్పరుబోతు జగన్నాధం, చిల్లా చిట్టిబాబు, పొందూరు అప్పలరాజు, పొందూరు రాంబాబు, ఎస్.సునీల్, బూర వాసు, పి.గౌరీశంకర్, ఎమ్.రాజేష్, కొండలరావు, తదితరులు పాల్గున్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...