Followers

సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవు

సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవు         


 ఐరాల,  పెన్ పవర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి ప్రైవేటీకరణ విధానాలు అరికట్టాలంటే కార్మిక ఉద్యోగ సంఘాలు ఏకమై పోరాటాలు చేయాలని లేదంటే కార్మిక చట్టాలు హక్కులు ఉండవని ఆటో వర్కర్స్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం విజయ్ కుమార్ కార్మికులకు హెచ్చరించారు. నేడు మేడేను పురస్కరించుకొని  మండల కేంద్రమైన ఐరాల లో  నందు  ఇండియన్ ఆటో వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ చందర్ మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్  మాట్లాడుతూ  దేశంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని పార్లమెంటులో 300కు పైగా ఎంపీలు పెట్టుబడిదారులే ఉన్నారని కార్మిక వర్గానికి పార్లమెంటులో ఇలాంటి చట్టాలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. కార్మికులందరూ ఏకమై పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉందని ఐక్య పోరాటాలు అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు కార్మికులు మేడం జరుపుకుంటున్నారని,   ఎనిమిది గంటల పని కోసం పోరాటం చేసి పెట్టుబడిదారుల దాడులతో కార్మికులు చనిపోయారని అలాగే మే 1న ఎనిమిది గంటల పని సాధించుకున్న రోజు కనుక నేడు  మే డే ని  జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి ఎం సురేంద్ర నాథ్, ఆటో వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి శివకుమార్, ఐరాల మండల ఉపాధ్యక్షులు రాజా,  ప్రధాన కార్యదర్శి  మోహన్ రెడ్డి,  కోశాధికారి  హుమయున్ భాష,  వేణు, షబ్బీర్,  గ్రీన్ అంబాసిడర్ యూనియన్ నాయకులు రాజా,  సీఐటీయూ జనరల్ సెక్రెటరీ రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...