Followers

అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం సి.ఐ.టి.యు

 అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం 

 సి.ఐ.టి.యు

మహారాణి పేట, పెన్ పవర్

వై.రాజు నగర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ అల్లూరి స్పూర్తితో ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునే వరకు పోరాడుతాం. ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని సందర్భంగా దీక్ష శిబిరం వద్ద ఆయన ఫోటో కి పూలమాలవేసి దీక్షను ప్రారంభించారు అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలందరినీ చైతన్యం చేసి మన దేశానికి స్వతంత్రం కోసం ఆనాటి అదే స్ఫూర్తితో దేశ భక్తి ముసుగులో దేశాన్ని విదేశీలకు తాకట్టు పెట్టె విదంగా మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నా విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం. భారతదేశం అభివృద్ధి రావడానికి కారణం లేదా విశాఖపట్నం అభివృద్ధి అవ్వడానికి కారణం ప్రభుత్వ సంస్థలే. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంటే మోడీకి ఎప్పటికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బుద్ధి చెప్పారు అయినా మోడీకి బీజేపీకి సిగ్గు రావట్లేదు. మనకు కరోన ఇబ్బంది పెడుతున్న సరే  సరే మన పోరాటం కొనసాగుతుంది ఇదే మన విజయానికి నిదర్శనం. దీక్ష శిబిరంలో అనేక తరగతులకు సంబంధించిన ప్రజలు పాల్గొంటు, ఉద్యమం రోజురోజుకు ఉద్భతం అవుతున్నదన్నారు. స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ రోజు సి. ఐ.టి.యు,నగర కార్యదర్శలు యమ్.సుబ్బారావు, బి.జగన్, డిఅప్పలరాజు చంద్రమౌళి, నర్సింగరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరావు  78 వ వార్డు కార్పొరేటర్  డాక్టర్ బి గంగారావు జగదాంబ జోన్  నాయకులు, ఎం.జగ్గునాయుడు కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...