Followers

మైగాపుల ఆంజనేయులు ఆధ్వర్యంలో మేడే వేడుకలు

 మైగాపుల ఆంజనేయులు ఆధ్వర్యంలో మేడే వేడుకలు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడిలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద సిఐటియు తాళ్లపూడి మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మైగాపుల ఆంజనేయులు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా  జెండా ఎగురవేయడం జరిగింది. మైగాపుల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం  ఇంచుమించు 200 వందలమందితో జరిగే ఈ కార్మికుల దినోత్సవాన్ని, కోవిడ్ నియంత్రణ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, అతి తక్కువ మందితో జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా నాయకులు వల్లేపల్లి నరసింహమూర్తి, తాళ్లపూడి మండల రైస్ మిల్లర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుంకర వెంకటేశ్వరరావు, కార్మికులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...