Followers

ఆడబిడ్డల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

 ఆడబిడ్డల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ప్రధాన ధ్యేయం 

దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా..

రాష్ట్రంలో సిఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు

రెండున్నర ఏళ్లలో 4000 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌


రామగుండం,  పెన్ పవర్ 

తెలంగాణ ఆడబిడ్డల వివాహాలు పేదింటి తల్లిదండ్రులకు భారం కావద్దని దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేసి నిరుపేద కుటుంబాల్లో అనందం నింపుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేధికలో 77 కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమాఖ్య పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు పుడితే అమ్ముకుని పరిస్థితులుండేవని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సిఎం కేసీఆర్ ఆడ పిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టడంతో ఈ రోజులల్లో ఆడపిల్ల పుడితే మహలక్ష్మీ పుట్టిందనే సంతోషించే పరిస్థితులున్నాయని అన్నారు. ఆడపిల్లల పెళ్లీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను అమలు చేసి 1లక్ష 116 రూపాయలు పెళ్లి కానుకగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సకల వర్గాల సంక్షేమం కోసం సీఎం నిత్యం శ్రమిస్తున్నారని రైతులను రాజులుగా మార్చలన్నా సంకల్పంతో ఉచిత కరెంట్, రైతు భీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్న సిఎం కేసీఆర్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తే ప్రజలు సహించవద్దని, తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రామగుండం నియోజవర్గంలోని ప్రజల సేవ కోసం పని చేస్తున్నామని తము ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు నియోజవర్గంలో 4000వేల కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులను లబ్దిదారులకు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం తహాసీల్ధార్ బండి ప్రకాష్ తో పాటు ఎంపిపి దుర్గం విజయ, జడ్పీటిసి ఆముల నారాయణ, వైస్ ఎంపిపి మట్ట లక్ష్మి-మహేందర్ రెడ్డి, సర్పంచ్ లు బండారి ప్రవీణ్ కుమార్, ఎదులపూరం నీరజ-వెంటటేష్, కొల్లురి సత్య-సతీష్, గంగాధరి దేవమ్మ-రామయ్య, కుర్ర వెంకటమ్మ-నూకరాజు, ఎంపిటిసి కొలిపాక శరణ్య-మధుకర్ రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు దివాకర్, మండల కో-ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, తెరాస పార్టీ మండల అధ్యక్షులు తిరుపతినాయక్, కోల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 6 సం॥లుగా 80 వేల మంది రజక లబ్దిదారుల ఎదురు చూపులు

రాష్ట్రంలో 6 సం॥లుగా 80 వేల మంది రజక లబ్దిదారుల ఎదురు చూపులు

రామగుండం కార్పొరేషన్ రజక సంఘం అధ్యక్షులు శంకర్ రజక

రామగుండం,  పెన్ పవర్ 

 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మన రాష్ట్రంలో చాలా మంది రజక సోదరులకు ప్రభుత్వం తప్పక అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తుందనే ఆశతో దీనిలో భాగంగానే 2015 నుండి 2021 7సం॥లలో కొన్ని అంతకు ముందు తెలంగాణలో గల 33 జిల్లాల నుండి రజక సోదరులు, కులవృత్తి దారులు రైతులు చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకున్న వారు నిరుద్యోగులు, మహిళలు మరియు రజక ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ద్వారా సోసైటీ గ్రూప్ లను ఏర్పాటు చేసుకున్న సంఘాల సభ్యులు రజక లబ్దిదారులు 50 వేల నుండి 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలకై ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గత ఏడాది కిందట కొన్ని జిల్లాల్లో 2 వేల మందికి పైగా రజకులకు మాత్రమే కేవలం 50 వేల రూపాయల చొప్పున సబ్సిడీ రుణాలు మంజూరు చేశారు. ఇంకా నేటికీ 68 వేల మందికి పైగా రజకులు ఎదురు చూస్తునే ఉన్నారని ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీలోనే చాలా మంది రజక సోదరులు పని చేస్తున్నారని మంత్రులను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లను తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ కలిసి విన్నవిస్తున్న లాభం లేకపోయిందని కానీ ఈ రుణాల కోసం ఏ ఒక్క పార్టీ నాయకులు మద్దతు రజకులకు అందించడం లేదని మరింత ముందుకు వెళ్ళేందుకు సంబంధిత బీసీ మంత్రి, ఆర్థికశాఖ మంత్రి దృష్టికి అధికార పార్టీ నాయకులు ఎవరు తీసుకెళ్లడం లేదని రజకులు బాధపడుతున్నారని ఇకనైనా ఈ అంశం పై ప్రయత్నాలు చేయాలని రామగుండం కార్పొరేషన్ రజక సంఘం అధ్యక్షులు శంకర్ రజక ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

మద్యం బాటిల్ ల పట్టివేత

 మద్యం బాటిల్ ల పట్టివేత... 

బేలా, పెన్ పవర్

 కరోనా మహమ్మారి నేపథ్యంలో  గ్రామ ప్రజలకు హాని కలిగే విషయాలు,  ఏ పనులైనా చేయకుండా ఉండాలని నేపథ్యంలో బేల మండలంలోని సిర్సన్న  గ్రామస్తుల, విడిసి ల మాట వినకుండా గ్రామానికి చెందిన ఫరీద్ అనే వ్యక్తి తన కిరాణా కొట్టు లో మద్యం సీసాలు అమ్ముకుంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు గ్రామ పెద్దలు విడిసి నాయకులు మద్యము అమ్మ వద్దని  సూచించినప్పటికీ వీడీసీ మాట లెక్క చేయకుండా మద్యం అమ్మేవాడు,  ఈ క్రమంలో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు గ్రామ విడిసి నాయకులు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్సై కళ్యాణ్ పోలీసులతో అక్కడికి చేరుకొని, అక్రమంగా మద్యం అమ్ముతున్న 30 ఆఫీసర్ ఛాయిస్,  చీప్ లిక్కర్ బాటిల్ అను స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు చేపట్టి అతనిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇండియన్ ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ కు ఘన స్వాగత సన్మానం

 ఇండియన్ ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ కు ఘన స్వాగత సన్మానం

వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం

వన్ టౌన్ సిఐ రమేష్ బాబు

రామగుండం , పెన్ పవర్

వ్యాయామం చేయడం ద్వారా ప్రశాంతతతో పాటు వ్యాధులను నిర్మూలించే శక్తి మెరుగుపడుతుందని ఇండియన్ ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పూర్తితో ప్రారంభమైన సైకిల్ యాత్ర శుక్రవారం గోదావరిఖనికి చేరుకోగ వన్ టౌన్ సీఐ రమేష్ బాబు మరియు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఐ భారత్ కు పులా మాల వేసి స్వాగతం పలికారు. సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఖచ్చితంగా వ్యాయమం చేయాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని అన్నారు. ఈ సందర్భంగా భారత్ యాదవ్ మాట్లాడుతూ రోజుకు 160 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా2400 కిలోమీటర్లు ప్రయాణం చేయడమే తన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉమాసాగర్ మరియు హోంగార్డు రామిల్ల రాజశేఖర్, ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాజీపేట జైపాల్ పాల్గొన్నారు.

ప్రజలే నా పంచ ప్రాణాలు

 ప్రజలే నా పంచ ప్రాణాలు

కరోనా పేషెంట్లు కోలుకునేంత వరకు అండగా ఉంటా.!

గుండె నిబ్బరం కోల్పోయిన వారికీ మనోధైర్యం అనే మందుతో బాగు చేస్తా..!

తెరాస మహిళ నేత కందుల సంధ్యారాణి



రామగుండం ,  పెన్ పవర్ 

రామగుండం నియోజకవర్గంలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అసలు ఎవరావిడా.? అనే ప్రశ్న ఎవరికి వేసిన చాలు అందరి నోట వచ్చే ఒకే ఒక్క మాట.! ఎవరైన సరే ఆకలితో ఉన్న అంటే చాలు వారికి అన్నం పెట్టే అమ్మ.! అని ఎవరైన సరే ఆపదలో ఉన్నామని తెలిస్తే చాలు మరు క్షణమే వాళ్ళ వద్దకు వెళ్ళి వారి కష్టం తీర్చే ఓ అక్క.! నియోజకవర్గ ప్రజల నోట్లో నాలికై ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించే ప్రజలే తన పంచ ప్రాణాలుగా భావించి అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆది పారా శక్తే మా మహా నాయకురాలు కందుల సంధ్యారాణి అని  చెప్పే వాళ్ళు కోకొళ్ళలు.. ఇక అసలు విషయానికి వస్తే పాలకుర్తి మండలంలో గత రెండు రోజుల క్రిందటే కరోనా వైరస్ భారిన పడ్డ పేషెంట్లకి వారి ఆరోగ్యం కుదుట పడి వారు త్వరగా కోలుకోవాలని వాళ్ళ ఇంటింటి తానే స్వయంగా తిరుగుతూ వాళ్ళ రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేయడమే కాకుండా గుండె నిబ్బరం కోల్పోయిన వాళ్ళలో మనో ధైర్యాన్ని నింపారు. అదే విధంగా శుక్రవారం రోజున మళ్ళీ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుక్కలగూడుర్ గ్రామంలో కూడ కరోనా సోకి హోం క్వారంటైన్ లో ఉన్న కరోనా వైరస్ బాధితుల ఇంటింటికీ తిరుగుతూ వారిని పరామర్శిస్తూ గుండె నిబ్బరాన్ని కోల్పోయిన వారిలో మనోధైర్యం అనే మందుగా వాళ్ళకి కొండంత ధైర్యాన్ని నింపుతూ వాళ్ళ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన పండ్లని డ్రై ఫ్రూట్స్ ని అందజేస్తూ మంచి పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని వారికి సలహాలు సూచనలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తన వెంట గోపు రామన్న, ఆశ్రఫ్, చెల్ల సురేష్, పత్తిపాక శంకరయ్య, ఆడెపు కిషణ్, రాజు, శ్రీనివాస్, బరుపటి నారాయణ మరియు  కర్ణ, పద్మ తదితరులు ఉన్నారు.

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ 9 రోజులు బంద్

 కేసముద్రం వ్యవసాయ మార్కెట్ 9 రోజులు బంద్,,

మార్కెట్ చైర్మన్ మరి నారాయణ రావు...

కేసముద్రం, పెన్ పవర్

 కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో పనిచేసే గుమస్తాలు, హమాలీలు, దడువాయిలు, వీరితో పాటు వ్యాపారస్తుల కోరికమేరకు కోవిడ్-19  వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున వాక్సిన్ వేయించుకొనుటకుతేది.01.05.2021నుండితేది.09.05.2021 వరకు మార్కెట్ బంద్ చేయాలని కోరినట్లు మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు తెలిపారు. అంతేగాక మిల్లుల వద్ద కొనుగోలు చేయమని, అట్టి పనులలో కార్మికులు పాల్గొనమని చెప్పడంతో రైతులు తమ సరుకులను మార్కెట్ గాని, వ్యాపారస్తులమిల్లుల వద్దకు గాని తీసుకురావద్దని తెలియజేశారు. ఈ పది రోజుల సెలవులలో మే 1న మే డే సెలవు గా, మే 2న ఆదివారం కాగా, మే 3నుండి మే 7 వరకు కూలీలు హమాలీల వ్యాపారస్తుల కోరికమేరకు కరోన బంద్ గా అలాగే మే 8 వారాంతపు సెలవు గా మే 9న ఆదివారం కాగా రైతుల ఇట్టి విషయాన్ని గమనించి రైతులు ఎవరు కూడా సరుకులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని తిరిగి తేదీ 09.05.2021 (సోమవారం)  రోజున మార్కెట్ యార్డ్ కు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకు రాగలరని తెలియజేయడం జరిగింది.

బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

 బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం


తొర్రూరు, పెన్ పవర్

టివిఎస్ ఎక్సెల్ బైక్ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సిహెచ్ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన మేడిగా లక్ష్మయ్య (57) బట్టల వ్యాపారం చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నారు. తొర్రూరు మండల కేంద్రానికి పని మీద వచ్చి పని ముగించుకొని, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తన ఎక్సెల్ బండి పై ఇంటికి వెళుతున్న దారిలో బొత్తల తండా శివారులోని కల్వర్ట్ దగ్గర కాలువలో ఉన్న బండా రాయిపై పడి, తలకు బలమైన గాయం కావడంతో, మరణించడం జరిగిందని,మృతుని భార్య మేడిగా మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.శవ పంచనామ కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మయ్య మృతితో అమ్మాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...