Followers

ప్రతి వార్డు పరిధిలో పక్కాగా ఫీవర్ క్లినికల్

ప్రతి వార్డు పరిధిలో పక్కాగా ఫీవర్ క్లినికల్ 

చిత్తూరు, పెన్ పవర్

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డు లో పూర్తిస్థాయిలో ఫీవర్ క్లినిక్ నిర్వహించాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. నగరంలో కోవిడ్-19 నియంత్రణ చర్యలు, ఫీవర్ క్లినిక్ల నిర్వహణ అంశాలపై శనివారం ఉదయం నగర కమిషనర్ వార్డు అడ్మిన్, ఆరోగ్య, శానిటేషన్ కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వార్డు పరిధిలో ఫీవర్ క్లినిక్లను పక్కాగా నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారిని, ఇతర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని, మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించాలని అవగాహన కల్పించాలన్నారు. నగరంలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిని గుర్తించి అపరాధ రుసుం వసూలు చేయాలని వార్డు కార్యదర్శులను ఆదేశించారు. కోవిడ్ ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలన్నారు.

హుకుంపేట మండలంలో ఘనంగా మేడే ఉత్సవాలు

 హుకుంపేట మండలంలో ఘనంగా మేడే ఉత్సవాలు

హుకుంపేట, పెన్ పవర్: 

 హుకుంపేట మండలం బాకూరు భీమవరం కేంద్రాల్లో శనివారం ప్రపంచ కార్మిక దినోత్సవం(మేడే) వేడుక లు ఘనంగా జరిగాయి. సీఐటీయూ హుకుంపేట మండల కమిటీ నాయకులు కామ్రేడ్ సుడిపల్లి కొండలరావు లక్ష్మణ రావు ల ఆధ్వర్యంలో  మేడే కార్యక్రమం నిర్వహించారు.మేడే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బాకూరు సర్పంచ్ బాకూరు వెంకట రమణ రాజు  హాజరయ్యారు.మేడే కార్మిక జెండా ను ఆవిష్కరించి కార్యక్రమంలో నాయకులు కామ్రేడ్ సుడిపల్లి కొండలరావు  మాట్లాడుతూ  దేశ సంపదకు మూలమైన కార్మికుల కు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,కరోనా కష్టకాలంలో ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ,కష్టాలు పాలుచేస్తున్నా రని అన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం తో లక్షలాదిమంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోతున్నారన్నారు. బి ఎస్ ఎన్ ఎల్. పోర్ట్ డాక్ యార్డ్, షిప్ యార్డ్, బీమాసంస్థలుతో పాటు రైల్వేలు,విమానయాన సంస్థ ఎయిరిండియా వంటి ప్రభుత్వ రంగ కంపెనీల ను కారుచౌకగా తనకు కావాల్సిన అంబానీ, ఆధాని వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఉన్నా ఉద్యోగలు పోగొట్టుకునే ల చేసి  మోడీ,బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు.రాష్ట్ర వైసీపీ జగన్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల రేట్లు 100 రేట్లు పెంచి నూనె లీటర్ 185 /-లు,పంచదార 55 రూపాయలు ఇలా అన్నింటిలో నచ్చినట్లు రేట్లు పెంచి ,ఇస్తున్న సంక్షేమ పథకాలు సొమ్ము నెలకు కూడా సరిపోని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉందని,భవిష్యత్ లో  తీవ్ర అవస్థలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని,కనీస వేతనo రూ 21 వేలు ఉద్యోగులు/కార్మికుల ఇవ్వాల్సి ఉన్న అరకొరగా జీతాలు ఇస్తున్నారని, రైతులు పండించే కాపీ, మిరియాలు,రాజ్ మా కందులు,అల్లం,పసుపు, పిప్పల మోడీ వంటి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ,కరోనా నేపథ్యంలో ప్రతీ కుటుంబానికి కేరళ  ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సీపీఎం ప్రభుత్వం ఇచ్చే విధంగా ప్రతీ కుటుంబానికి నెలకు 50 కేజీల బియ్యం,నూనె 5 కేజీల,కారం 5 కేజీల,మసాలా 5 కేజిలు, ఉల్లిపాయలు వంటి 14 రకాల సామాన్ల తో పాటు కుటుంబానికి నెలకు రూ.7 వేల 5 వందలు ఇవ్వాలని,కరోనా వ్యాక్సిన్ అందరికి ఉచితంగా ,సాధ్యమైనంత వరకు త్వరగానే ఇవ్వాలని,అంగన్ వాడి సెంటర్లు కు సెలవులు ప్రకటించి ఇంటింటికీ డ్రై పొడి సరుకులు అందేలా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు/ కార్మికులు. చంద్రకళ, సింహాద్రి, చిలకమ్మ, నాగమణి, కామేష్,, కొండలరావు, కమలమ్మ, కృష్ణవేణి , గోపాలమ్మ, అంగన్ వాడీ, ఆశావర్కర్లు,మిడ్ డే మిల్స్ వర్కర్స్ ,బాకూరు పంచాయితీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.   మేరకచింత పంచాయితీ లోని రంగసింగ పాడు, గన్నేరుపుట్టు పంచాయితి డొంకి నవలస లో కూడా మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమ్మలు చిట్టమ్మ, గణేష్, సింహాచలం, రాంబాబు, మత్స్యరాజు, కొండబాబు, అప్పలనాయుడు, గంగన్న,వై చిట్టిబాబు, చంటిబాబు, సింహాచలం, లచ్చన్న, ఎం పండన్న, వీ పండన్న సన్యాసమ్మ, అచ్చులమ్మ, చిలకమ్మ, కాసులమ్మ,ఎర్రమ్మ ,లలిత , పండన్న తమ్మయ్య, గోపాలకృష్ణ, ఎం రామన్న, జన్ని చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.



జూన్ రెండోవారంకు ఐదులక్షల టన్నుల ఇసుకను నిల్వ ఉంచే విధంగా చర్యలు

జూన్ రెండోవారంకు ఐదులక్షల టన్నుల ఇసుకను 

నిల్వ ఉంచే విధంగా చర్యలు : జే.సీ. రెవెన్యూ  కె. వెంకట రమణా రెడ్డి



 కొవ్వూరు, పెన్ పవర్ : 


     జిల్లాలో రాబోయే వర్షా కాలంలో జూన్ 15 వ తేదీ నాటికి సుమారు 5 లక్షల ట న్నుల ఇసుకను నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రెవె న్యూ  కె. వెంకట రమణా రెడ్డి అన్నారు. కొవ్వూ రు  ఆర్డీవో కార్యాలయం లో శనివారం ఏ పి.యం.డి.సి. అధికారులతో, ఇసుక ర్యాంపు ల్లో ఉన్న ఇసుక సొసైటీ నిర్వాహకుల తో సమీక్ష సమా వేశం నిర్వహించారు. 

ఈ సంద ర్భంగా  వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఇసుక ఉత్ప త్తి పెంచే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు.ఇసుక పట్టా ర్యాంపులు, ఓపెన్ ర్యాం పులు, డీ సిల్టేశన్ ర్యాం పులు, ఇసుక డిపోలు, త్వరిత గతిన ప్రారం భించే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు28డీసిల్టేశన్ ర్యాంపు ల్లో సుమారు 18 మాత్రమే పనిచేస్తున్నాయని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు వెళ్లి పోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, వాళ్ళని వెనక్కి పిలిచి అన్ని ర్యాంపు లు పనిచేసే విధంగా చర్యలు తీసు కోవడం జరుగుతుంది అని అన్నారు.  10 పట్టా ర్యాంపు లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని అన్నారు.  22 ఓపెన్ ర్యాంపు ల్లో 7 నుండి 8 మాత్రమే పని చేయడం జరుగు తోంది అని అన్నారు. ఇసుక ఉత్ప త్తీ నీ పెంచేందుకు అన్ని ర్యాంపు లు తెరిపించాలని  ఏ పి.యం.డి.సి. అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి అని 4 రకాల పోస్టర్స్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ రెవె న్యూ  కె. వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ టీకాలు తప్పని సరిగా  వేయించు  కోవాలి అని అన్నారు. కరోనా వైరస్ కి సంభందించి ఏటువంటి ఇబ్బందులు ఉంటే 104 కి కాల్ చెయ్యాలి అని అన్నారు. ప్రజ లందరూ అప్రమత్తం గా ఉం డి, వైరస్ వ్యాప్తి నీ నియంత్రించి, మనమందరం ప్రాణాలను కాపా డుకుందామని అని అన్నారు. మాస్క్ లు, సాని టైజర్ లు, భౌతిక దూరం ప్రజలు తప్పనిసరిగా పాటిం చాలి అని అన్నారు. వాలంటీర్ ల ద్వారా జ్వరం ఎవ్వరికీ వచ్చింది అనే దాని గురించి సర్వే నివహిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ టెస్టు లు చాలా వరకు పెంచడం జరి గింది అని, చేసిన 24 గంటల్లో రిపోర్ట్ లు వస్తున్నాయి అని అన్నారు.   ప్రస్తుతం 3 వేల 600 బెడ్ లు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సుమారు 5 వేల బెడ్ ల వరకు పెంచడం జరిగు తుం ది అని అన్నారు.  ఈ కార్యక్రమంలో  కొవ్వూరు ఆర్డీవో, డి.లక్ష్మారెడ్డి, డి.ఎస్.పి. బి.శ్రీనాథ్, సి. ఐ, సురేష్, ఏ పి.యం.డి.సి. అధికా రీ, తదితరులు పా ల్గొన్నారు.

ఘనంగా మే డే....

 ఘనంగా మే డే....



చిత్తూరు, పెన్ పవర్ 

నగరి పట్టణంలో సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో  మే డే ను ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టంలోని కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం  మున్సిపాలిటీ పరిధిలోని సత్రవాడ, ఏకాంబరకుప్పం అలాగే తిరుత్తని రోడ్డులోని ఆటో స్టాండ్ వద్ద కార్మికుల జెండాను ఎగరవేశారు, ఈ సందర్భంగా నగరి పట్టణ సి ఐ టి యు కార్యదర్శి పెరుమాళ్ మాట్లాడుతూ దేశంలో కార్మికులు లేనిదే ఏ పని జరగదని గుర్తుచేశారు. కార్మికులను ఆదుకుంటానని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ప్రధాన మంత్రి. మోడీ  కార్మికులను  విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కార్మికులను విస్మరించిన ఏ ప్రభుత్వం నిలవలేదని హెచ్చరించారు. కరోనా కాలంలో పనులు లేక కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు నిత్యవసర వస్తువులు ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్  జిఎస్టి లో కలపాలని తెలిపారు. కార్మికుల దినోత్సవాన్ని సంఘీభావంగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. గోవిందస్వామి, వాసు, షణ్ముగం, జగదీష్,సందీప్,ఉమాపతి,అయ్యప్ప,మాయా,తమిలరసన్,ఎయిల్,ప్రవీణ్,కంధన్,మునిరత్నం,శ్రీనివాసన్,శరవణన్,మయిలుస్వామి,సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ - కమిషనర్ అభిషేక్త్ కిషోర్

 కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ - కమిషనర్ అభిషేక్త్ కిషోర్

రాజమహేంద్రవరం,పెన్ పవర్

కరోనా కట్టడి చేయాలంటే సమిష్టి బాధ్యత గా వ్యవహరించాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మునిసిపల్ కమీషనర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో కరోనా వ్యాప్తి ని కట్టడి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నామని కమీషనర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు..శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కరోనా కట్టడి కమిటీతో సమావేశం అయ్యారు. కరోనా కట్టడి లో మరింత అప్రమత్తం గా ఉండేందుకు తీసుకోవలసిన చర్యల పై సమీక్షించారు..


సభ్యులు అందరిచే కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశం లో అడిషనల్ కమిషనర్ ఎన్.వి.వి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు, సిటీ ప్లానర్ వరప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కార్మిక దినోత్సవం...

ఘనంగా కార్మిక దినోత్సవం...

 పారిశుధ్య , స్మశాన వాటిక కార్మికులకు సన్మానం ..

వరదయ్య పాలెం, పెన్ పవర్ న్యూస్

వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక సచివాలయంలో అవరణలో, స్వచత్ రూరల్& అర్బన్ డెవలప్ మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ అధికారపార్టీ ప్రచార కార్యదర్శి ఓడూరు ఉజ్వల రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ,గ్రామ స్మశాన వాటిక కార్మికులు సచివాలయ సిబ్బంది నడుమ కరోనా నిబంధనలు పాటిస్తూ అ. ఆనందోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉజ్వలరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నా,ప్రజా శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకుని వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజాసేవలో నిమగ్నమైన పారిశుధ్య, మరియు స్మశానవాటి కార్మికుల పని తీరు ఎంతో ఉన్నతంగా ఉందని ఆయన కోనియాడారు.

 ఇలాంటి కార్మికులను గుర్థించి , వారికి సహకరించాలనీ కోరారు, మానవరూపంలో సేవలందిస్తున్న వారిని దైవస్వరూపులుగా బావిచాలన్నారు,ఈ సందర్భంగా ఆయన వారిచేత కేక్ కట్ చేసి,చిరు సత్కారం చేసి ఆనందిం జేశారు. ఈకార్యక్రమంలో  స్వచత్ రూరల్ సోసైటి, ప్రెసిడెంట్ మోహన్, సెక్రటరీ కిషోర్, సభ్యుడు షన్ముగం,గ్రామ సర్పంచ్ మణి, వార్డు సభ్యుడు వేనాటి అశోక్,మునిశేఖర్,ఎం పీ టి సి అభ్యర్థి,కస్తూరిధనపాల్,, సచివాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా మే డే వేడుకలు

 ఘనంగా మే డే వేడుకలు

వరదయ్య పాలెం, పెన్ పవర్ న్యూస్

 చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం బస్టాండ్ నందు ఘనంగా మే డే వేడుకలు సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా. సిపిఐ. జిల్లా కార్యవర్గ సభ్యులు. అంబాకం. చిన్ని రాజ్. మాట్లాడుతూ. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కరోనా తో  చనిపోయిన కారిషిక కార్మిక శ్రమజీవులకు నివాళులర్పిస్తూ ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అలాగే కార్మికుల తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేసి పాత చట్టాలను అమలు పరచి . దేశంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని మరియు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే మధ్యతరగతి కుటుంబాలకు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో. సిపిఐ.  సీనియర్ నాయకులు. సిద్ధయ్య.  కృష్ణమూర్తి. బాల గురునాథం. ఏ ఐ వై ఎఫ్.  నాయకులు. దయాకర్.చంద్ర. మురళి. తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...