Followers

నేల రాలిన మరో ప్రైవేటు టీచర్

 నేల రాలిన మరో ప్రైవేటు టీచర్                                            

సూర్యాపేట,పెన్ పవర్



విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని భావిభారత పౌరులుగా మార్చే శక్తిసామర్థ్యాలు గల టీచర్ల భవిష్యత్తు నేడు అగమ్యగోచరంగా మారింది అనడానికి మరొక ఉదాహరణ. అనాజిపురం మోడల్ స్కూల్ లో గత 4 సంవత్సరాలుగా PGT (తెలుగు పండిట్) గా  సేవలందిస్తూ  వస్తున్న సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన జానపాడు సైదులు (43) అనే ప్రైవేట్ టీచర్ ఆర్థిక ఇబ్బందులతో గుండెపోటుకు గురై మరణించడం జరిగింది. 

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించినప్పటినుండి గత 11 నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, రోజు కూలీ పనికి వెళ్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న జానపాటి సైదులు గారు, పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పటికీ హెచ్ బీ టీ లను ప్రభుత్వం ఇంకా విధుల లోనికి తీసుకోకపోవడం వలన మనస్థాపానికి గురై గుండెపోటుతో అకాల మరణం చెందారు. సైదులు గారి మరణ వార్త తెలుసుకున్న టి పి టి ఎఫ్ నాయకులు వారి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ  ఇప్పటికైనా ప్రభుత్వం  ఆదుకోవాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న      టి పి టి ఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ  ప్రైవేట్ టీచర్ల ను ఆదుకోవాలని గత కొన్ని నెలలుగా అనేక పోరాటాలు చేసినప్పటికీ  ప్రభుత్వం గానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, యాజమాన్యాలు కానీ ఎవరూ కూడా తమ బాధలను పట్టించుకోవడంలేదని తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుతం పట్టభద్ర ఎన్నికలు ఉన్నాయి కావున ప్రైవేట్ టీచర్లను కేవలం తమ ఓటు బ్యాంకు  రాజకీయాల కొరకు వాడుకోవడం కొరకు మాత్రమే 6,7, 8 తరగతులను ప్రారంభించారు తప్ప ప్రైవేట్ టీచర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.

ఘనంగా బ్రహ్మంగారి గోవిందమ్మ కళ్యాణ మహోత్సవం

 ఘనంగా బ్రహ్మంగారి గోవిందమ్మ కళ్యాణ మహోత్సవం





రాజన్న సిరిసిల్ల బ్యూరో,పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోరాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మంగారి 5వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా సోమవారం రోజున బ్రహ్మంగారి గోవిందంబల కళ్యాణ మహోత్సవం ఒడిబియ్యం సమర్పణ హోమం పూర్ణాహుతి మరియు ఉత్సవమూర్తులకు విశ్వ బ్రాహ్మణ పురోహితులు రాగి దేవేందర్ చారి కొత్తపెల్లి రాజు పంతులు పూజలు ఘనంగా నిర్వహించారు  కార్యక్రమంలో మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ కులాల పెద్దలు బ్రహ్మంగారి ఆలయ కమిటీ రాచర్ల బొప్పాపూర్ అధ్యక్షులు వంగాల వసంత్ కుమార్ చారి కమ్మరి లక్ష్మణ్ చందనం రాజు శ్రీనివాస్ చారి వంగాల నాగభూషణం చారి శ్రీరామోజు భాస్కర్ చారి దుంపటి కృష్ణమూర్తి చారి మండోజు రాజయ్య చారి మరియు ఐదు కులాలు సంబంధించిన కుల సభ్యులు పాల్గొన్నారు స్వర్ణకార సహకార సంఘం అధ్యక్షుడు వంగాల నాగభూషణం తన చేతులతో మొక్కలు నాటి  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని గుడి ముందు కానీ గృహం ముందు కానీ రోడ్డు పక్కన గాని మొక్కలు నాటిన చొ మొక్క వృక్షమై మానవాళికి నీడనిస్తుంది కాలుష్యాన్ని నివారిస్తుంది అన్నారు బ్రహ్మంగారి గుడి కూడా దినదినం అభివృద్ధి చెందాలని మరియు 5 కులాలు సమిష్టిగా కలిసి మన కులదైవమైన యావత్ ప్రపంచానికి మున్ముందు జరిగే విషయాలను కాల జ్ఞానం ద్వారా వివరించి ఆదర్శంగా నిలిచిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మంగారి  గుడిని అభివృద్ధి చేయాలని మనమందరము సమిష్టిగా పని చేయాలని అన్నారు

చేతివృత్తుల వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి జగదీష్ రెడ్డి

 చేతివృత్తుల వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి జగదీష్ రెడ్డి      

 సూర్యాపేట/పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కొరకు సీఎం కేసీఆర్ పాలనలో అనేక పధకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పద్మశాలి భవనం లో ఆదివారం జరిగిన ప్రపంచ టైలర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన అన్నిరకాల చేతి వృత్తుల వారికి తమ ప్రభుత్వం అండగా నిలించిందని, తెలంగాణ రాష్ట్రములో కుల వృత్తులు, చేతి వృత్తుల పునరుజ్జీవం జరిగిందని ఆయన అన్నారు. ప్రపంచానికి నాగరికత నేర్పింది భారతదేశం అయితే, కుట్లు అల్లికల ద్వారా బట్టలు కుట్డి అందించిన దర్జీలు గొప్పవారని ఆయన అన్నారు. మేరు సంఘం వారికి కుట్టు మిషన్ లు అందజేయడం జరిగిందని.. త్వరలోనే మిషన్ కుట్టే ఇతర కులాల వారికి కూడ కుట్టు మిషనులు అందజేస్తామని ఆయన అన్నారు. టైలర్స్ దుకాణాలకు విద్యుత్ సబ్సిడీ విషయంలో పేదవారికి మాత్రమే అదేవిధంగా చూడాలని మంత్రి అన్నారు. జిల్లా టైలర్స్ &ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. నీడ్స్ టైలర్స్ క్లాత్ షోరూం దూలం నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సంఘం అధ్యక్షులు మహేష్, సీపీఐ  నాయకులు, కేవీఎల్, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి, పట్టణ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్, పాండురంగా చారి, సంఘం ప్రధాన కార్యదర్శి కర్నే ఉపేందర్. కోశాధికారి దేవిరెడ్డి వీరారెడ్డి. జాన్ టెక్స్టైల్స్ విజయ కుమార్ శ్రీనివాస్, రమేష్, టైలర్స్, దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

పెద్దగట్టు జాతర సెక్యూరిటీ పరిశీలించిన ఎస్పీ

 పెద్దగట్టు జాతర సెక్యూరిటీ పరిశీలించిన ఎస్పీ 


              

  సూర్యాపేట,పెన్ పవర్

పెద్దగట్టు జాతర పోలీసు బందోబస్త ను సెక్యూరిటీ ఏర్పాటు లు జిల్లా ఎస్పీ  భాస్కరన్ పరిశీలించారు. సీసీ టీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ.. జాతర దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన పోలీసు రక్షణ బందోబస్తును ఏర్పాటు చేసామని అన్నారు. జాతర ప్రాంగణంలో, జాతీయ రహదారిపై, గట్టుపై మొత్తం 40 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినామని, జాతర మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షయణలో ఉంచాం అన్నారు. మహిళ భద్రత కోసం మహిళ పోలీసు సిబ్బందిని, షీ టీమ్స్ ను, మఫ్టీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు సంతోషంగా గడపాలని అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి అని కోరారు. అనుమానిత వస్తువులను తకావద్దు అన్నారు. పోలీసు వారు చూపిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి, చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అత్యవసర సమయాల్లో పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. క్యూ లైన్స్ పాటించాలి, బారికేడ్స్ దాటుకి రావద్దు అన్నారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తుంచవద్దు, గొడవలు, తగాదాలు పెట్టుకోవద్దు అని అన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉత్సవాన్ని ఆనందించాలి అన్నారు.

జాతరకు వచ్చే భక్తులు అధికార యంత్రాంగానికి సహకరించాలి

 జాతరకు వచ్చే భక్తులు అధికార యంత్రాంగానికి సహకరించాలి



అదికారులు సమన్వయంతో  కలసి పనిచేయాలి.

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

  సూర్యాపేట,పెన్ పవర్

ఆదివారం అర్థరాత్రి ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుండి వేలాదిమంది తరలి వస్తున్నారు.సోమవారం  జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పెద్దగట్టు దేవాలయం వద్ద అధికారులతో కలిసి స్వయంగా జాతర ను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటి కప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. జాతర లో  పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.    జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ తో  చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ కాలుష్యం లేకుండా ప్లాస్టిక్  రహిత జాతర గా నిర్వహించేందుకు  భక్తులు జిల్లా యంత్రాంగం తో సహకరించాలని కోరారు.

గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో లబోదిబోమంటున్న జిల్లా వాసులు

 గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో లబోదిబోమంటున్న జిల్లా వాసులు                   

  సూర్యాపేట, పెన్ పవర్

సూర్యాపేట జిల్లాలో వంట గ్యాసు వాణిజ్య సిలిండర్ ధర పెంచడంతో మధ్యతరగతి వారు లబోదిబోమంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో మళ్లీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచేశారు. వంటగ్యాస్‌ ధరలు మరోసారి షాక్‌ ఇచ్చాయి. వంటగ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్‌పై ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్‌పై రూ. 25, వాణిజ్య సిలిండర్‌పై రూ. 95 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి చమురు సంస్థలు. వంటగ్యాస్‌పై డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటి వరకు రూ. 225 పెంచారు. డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర రూ. 594 నుంచి రూ. 644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ. 644 నుంచి రూ. 694కు పెంచగా. ఫిబ్రవరి 4న మరోసారి రూ. 644 నుంచి రూ. 719 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15న రూ. 50 పెంచడంతో 769కి పెరిగింది. ఇక ఇటీవల ఐదు రోజుల వ్యవధిలో తాజా పెంపుతో కలిపి రెండు సార్లు వంటగ్యాస్‌పై రూ. 25 వడ్డించారు. దీంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ. 819కి చేరింది. వాణిజ్య సిలిండర్‌ పైనా రూ. 95 పెరగడంతో. ఒక సిలిండర్‌ ధర రూ. 1614 కు చేరింది.

భక్తులు మాస్కులు ధరించాలి: కలెక్టర్

 నేటి నుండి రెండో విడత కోవిడ్ వ్యాక్సి నేషన్ : కలెక్టర్                     

సూర్యాపేట, పెన్ పవర్

జిల్లాలో రెండో దశ కోవిడ్ -19 వ్యాక్సిన్ కార్యక్రమం నేటి నుండి (1. 3. 2021) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలకు అనుగుణంగా కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించామని సోమవారం విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా పేర్కొన్నారు. ఈ రెండో దశలో 60 సంవత్సరాలు పైన పడిన వారు, 45 నుండి 59 సంవత్సరాలు వయస్సు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అర్హులని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తమ వైద్యునితో తమ వ్యాధి గురించి ధ్రువీకరణ పత్రాన్ని పొంది ఉండి, వ్యాక్సిన్ వేయు ఆరోగ్య కేంద్రం వద్ద సమర్పించవలసి ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొరకై ప్రతి ఒక్కరూ ముందుగా COWIN పోర్టల్ నందు తమ పేరును, ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్ నందు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.పేరు రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాక్సిన్ వేయటానికి నిబంధనలు అనుమతించవు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫ్ట్ రన్ కార్యక్రమం జిల్లాలో సోమవారం అనగా 01. 03. 2021నుండి ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు రెండు వందల మందికి, విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (ప్రైవేటు) నందు వంద మందికి ఇచ్చేందుకు అనుమతి కలదు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవలిసిందిగా కోరనైనది. ప్రైవేటు ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకునేవారు వ్యాక్సిన్ కొరకు 150 రూపాయలు, 100 రూపాయలు సర్వీస్ ఛార్జీలు మొత్తంగా ఒక్క డోస్ కొరకు 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించి కరోనా మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. వ్యాక్సిన్ పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకొని వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు అని తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...