Followers

కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు







కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు


క్వారంటైన్ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు


ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి


తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు డిమాండ్


 


పెద్దాపురం,పెన్ పవర్


 

పెద్దాపురం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు ( కోటి) పాత్రికేయులతో మాట్లాడుతూ. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రోగులకు తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటుగా వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని. నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ ఆంటీ పట్టనట్టు వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని అందువల్లనే రోజుకు ఐదువేలనుండి ఎనిమిది వేల  పైచిలుకు కేసులు నమోదు అవుతున్నాయని  అలాగే పనులు లేక తీవ్రఇబ్బందులు పడుతున్న అన్ని రంగాల కార్మికులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కరోనా వైరస్ నియంత్రించడం లో రాష్ట్రం చాలా వెనక పడిందని. కరోనా వైరస్ సోకకుండా ప్రజలు  మాస్కులు తప్పనిసరి వాడాలని ఎవరి రక్షణార్థం వాళ్ళు తగు జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.  కరోనా క్వరంటైన్ సెంటర్ లో కనీస సౌకర్యాలు కూడా లేవని పది రోజులు ఉంచుకొని టెస్టులు చేయకుండానే బాధితుల్ని వెనక్కి పంపి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కరోనా కష్ట కాలంలో కూరగాయలు మరియు కిరాణా సరుకులు పంపిణీ చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని ప్రతి కార్యకర్త కరోనా టైంలో సైనికుల్లా పని చేశారని ప్రజలకు అండగా నిలవడమే తేదేపా లక్ష్యమని ఆయన తెలిపారు.


 

 




 

 



 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...