Followers

కోవిడ్ వైద్య సేవలు మెరుగు





కోవిడ్ వైద్య సేవలు మెరుగు పర్చాలంటూ సి పి ఎం ధర్నా


 


సామర్లకోట, ,పెన్ పవర్


 


 

కరోన పాజిటివ్ కేసులు విపరీతంగా రాష్ట్రంలోను,జిల్లాలోనూ పెరిగిపోతున్నoదున పాజిటివ్ వచ్చిన ప్రజలకు,కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి అందించే సౌకర్యాలు మెరుగు పరచాలని సి పి ఎం పట్టణ కార్య దర్శి బలం శ్రీనివాసు డిమాండ్ చేశారు.ఈ అంశం పై సోమవారం గాంధీనగర్ సచివాలయం వద్ద సి పి ఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు లక్ష దాటి దేశంలోనే నాల్గవ స్థానంలో ఉన్నట్టు చెప్పారు.అలాగే తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్థానంలో ఉందన్నారు. కరోనా కట్టడికి విధులు వైద్యులు,సిబ్బందికి సరిపడా సౌకర్యాలు కల్పించాలని,పాజిటివ్ తో చికిత్స పొందుతున్న ప్రజలకు మెరుగైన సదుపాయాలు నాణ్యమైన పోషకాహారం, వేడినిళ్లు, నిమ్మరసం వంటి సేవలను అందించాలి అన్నారు.కోవిడ్ విధుల్లో ఉన్న సిబ్బందికి 50 లక్షల బీమా సదుపాయాన్ని కొనసాగించాలి అన్నారు.అలాగే అన్ని ప్రాంతాల్లోనూ కేసులు అధికామవుతున్న నేపధ్యంలో ప్రతిరోజు కోవిడ్ పరీక్షలు చేపట్టాలన్నారు.చేపట్టిన పరీక్షలకు సంబంధించి రిపోర్టులను వెంటనే విడుదల చేసి ప్రజల్లో ఉన్న మానసిక వత్తిడిని పరిష్కరించాలి అన్నారు.అలాగే కరోనా వ్యాప్తికి కరణమవుతున్న మద్యం దుకాణాలను నిలిపి వేయాలన్నారు.ఏ సందర్భంగా సచివాలయ అధికారికి వినతి పత్రాన్ని వారు అందజేశారు.ఈ ధర్నాలో సి పి ఎం నాయకులు కోనా శివకుమార్, బలం సత్తిబాబు,బంటు రవేంద్ర,దొర రమణ,తదితరులు పాల్గొన్నారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...