Followers

గొప్పవ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు





గొప్పవ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు


 


.పిట్టా నాగమణి 


 


అన్నవరం , పెన్ పవర్ ప్రతినిధి


 

దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తులల్లో అబ్దుల్ కలాం ఒకరు అని ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ పిట్టా నాగమణి అన్నారు ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన ఆత్యున్నత పదవిలోనూ నిరాడంబర జీవితాన్ని గడిపారు.11 వ రాష్ట్రపతి అయిన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం పూర్తి పేరు డాక్టర్ ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. అక్టోబర్ 15,1931 న ఒక పేద ముస్లిం కుటుంబంలో  జన్మించారు.పేదవారు కావడంతో చిన్నప్పుడే చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించారు.కలాం శాఖాహరి,మద్యపాన వ్యతిరేకి,బ్రహ్మచారి,వ్యక్తిగత క్రమశిక్షణలకు ఎంతో ప్రాధాన్యతనిఇచ్చేవారు.1954 లో తమ తిరుచిరాపల్లిలో జోసెఫ్స్ కళాశాలలో భౌతికశాస్త్ర పట్టాను అందుకున్నారు.1955 లో మద్రాసులో ఏరోనా టిక్స్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. స్వయం కృషితో తరువాతి కాలంలో ఆత్యున్నత శిఖరాలు అధిరోహించారు1960 లో ఇంజనీరింగ్ డిగ్రీ పొందాక రక్షణ సంస్థ డి ఆర్ డి ఒ లో శాస్త్రవేత్తగా చేరారు.భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ తయారుచేయడం ద్వారా తన వృత్తికి శ్రీకారం చుట్టారు. ఇలా దేశనికీ ఉపయోగ పడే ఎన్నో సంస్థలలో పనిచేసారు జుాలై 18, 2002 న బ్రహ్మాండమైన అధిక్యతతో 90 శాతంపైగా ఒట్లతో11వ భారత రాష్ట్రపతిగా విజయకేతనం ఎగురవేశారు.భారత మాతముద్దుబిడ్డ, మహనీయుడు అబ్దుల్ కలాం తన 84 వ ఏట జూలై  27 ,2015 న షిల్లాంగ్ లో విద్యార్దుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయి ఆస్తమించడం ఒ విషాదం. హఠాన్మరణానికి గురయ్యారు.భారతీయుల గుండెల్లో ఆయన మిసైల్ తారే ఆయన తీపి గుర్తులను సేవలు మారువ్వలేనివని పిట్టా నాగమణి అన్నారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...