Followers

రెండవరోజున బంద్


రెండవరోజున బంద్ విజయవంతం


- కరోనా కారణంగా ముంపు మండలాల్లో ఐదు రోజులు బంద్


 


వి.ఆర్.పురం. పెన్ పవర్ 


 

తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం ముంపు మండలాల్లో 26.07.2020 తారీకు నుండి ఈ నెల 30.07.2020 వరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు చింతూరు ఐ.టి.డి.ఏ. పి.ఓ. ఆకుల వెంకటరమణ ఆదేశాల మేరకు లాక్ డౌన్ అమల్లో భాగంగా వి.ఆర్.పురం మండలంలో లాక్ డౌన్ ఆంక్షలు పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కూరగాయలు కిరాణా షాప్ లకు మాత్రమే అనుమతిచ్చారు. మెడికల్ షాప్ కు 24 గంటలు అనుమతి ఉన్నది మిగిలిన ఏ షాప్ లకు కూడా అనుమతి లేదని వి.ఆర్.పురం మండలం తహసీల్దార్ ఎన్. శ్రీధర్ ఆంక్షలు విధించారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యం గా కనిపిస్తున్నాయి. అవసరమైతే తప్ప రోడ్ మీదకి మండల ప్రజలు రావొద్దని పోలీసువారు సూచించారు. ఈ నెల 30 వరకు కఠిన ఆంక్షలు ఉంటాయని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...