Followers

విస్తృతంగా టెస్ట్ లు







కరోనా నివారణకు విస్తృతంగా టెస్ట్ లు నిర్వహించాలి


సీపీఎం మండల కన్వీనర్ పి.మాణిక్యం


         


  పరవాడ ,పెన్ పవర్


 

పరవాడ:మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రజలు భయ బ్రాoతులు చెందుతున్నారు అని కరోనా ని నివారించేందుకు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విస్తృతంగా టెస్ట్ లు నిర్వహించాలి అని మండల సిపిఎం కన్వీనర్ పి.మాణిక్యం తహశీల్దార్ గంగాధర్ కి వినతిపత్రం అందించారు.అనంతరం మాణిక్యం మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా లో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని తగిన్నన్ని కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రపంచంలో కరోనా కేసుల లెక్కల్లో భారత దేశం 2వ స్థానానికి రావడం భారత దేశంలో ఆంద్రప్రదేశ్ 4 వ స్థానంలోకి రావడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది అని ఆవిడ అన్నారు.దేశంలో ఈ విధంగా కరోనా కేసులు పెరగటం ప్రభుత్వాల వైఫల్యాలను సూచిస్తోంది అని అన్నారు.కేరళ తరహాలో కరోనా నివారణకు నిధులు కేటాయించి ప్రజలు రోడ్లపైకి రాకుండా వారి ఇళ్లకే నిత్యావసరాలు సరఫరా చేయాలని సూచించారు.కరోనా నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి కావలిసిన మాస్కలు, పి.పి కిట్లు లాంటి వి నిరంతరాయంగా సరఫరా చేయాలి అని.కరోనా నివారణకు పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకు 50 లక్షల వ్యక్తిగత భీమా కల్పించాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకుడు ఏ.రామస్వామి,సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ,సిపిఎం పి.చిన్నా పాల్గొన్నారు.


 

 




 

 



 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...