Followers

లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి


లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి



ఏలేశ్వరం,పెన్ పవర్ 


రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మేధావులు హితవు పలుకుతున్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండలాల వారిగా లాక్ డౌన్ విధించే అధికారం స్థానిక అధికారులకు ఇచ్చారు. ఈ మేరకు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక అధికారులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసరాలు, కూరగాయలు తదితర ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ఉదయం ఒక్కసారి గా ప్రజలు తమ వాహనాలను వేసుకుని మార్కెట్లకు , ఇతర అవసరాలకు రోడ్లపైకి రావాల్సిన అవసరం వస్తున్నది. దీంతో వ్యాపార సమూహాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడి సామాజిక దూరం పాటించే పరిస్థితు లకు భంగం కలుగుతుంది. గంటల తరబడి రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో కరోనా మహమ్మారి  విజృంభించే అవకాశాలను రెట్టింపు చేస్తున్నట్లు అవుతుంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్  నిబంధనలపై పునః సమీక్ష చేసి ఉదయం 10 గంటల నుంచి  సాయంకాలం 6:00 వరకు వ్యాపార సంస్థలు  నిర్వహించుకునే లా, ప్రజలు సామాజిక దూరం పాటించేలా వ్యాపార సంస్థల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేధావుల అభిప్రాయం.ఏలేశ్వరం మెయిన్ రోడ్ లో సోమవారం ఉదయం 10 గంటలకు ట్రాఫిక్ రద్దీ, షాపుల వద్ద నిరీక్షిస్తున్న జన సమూహాలు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...