Followers

ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు


ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు


సామర్లకోట, పెన్ పవర్


 

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే ఇళ్ళ స్థలాల కోసం సిద్ధం చేసేందుకు గాను స్థానిక గృహకల్ప వద్ద శిథిలావస్థలో ఉన్న పంచాయితీ రాజ్ కు చెందిన శిథిలాలను కూల్చి వాటి మెటీరియల్ తీసుకుపోయేందుకు గాను నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా మునిసిపాలిటీకి రూ.1,16,000 ఆదాయం లభించింది.ఈ మేరకు సోమవారం స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శిథిలా కట్టడాల తొలగింపునకు గాను వేలం పాటలను నిర్వహించారు. దానిలి పలువురు పాట దారులు పాల్గొనగా వారిలో కాకినాడ రూరల్ కరకుదురు గ్రామానికి చెందిన వి.శ్రీనివాసరావు అధిక పాటగా 1,16,000లకు పాడి కైవసం చేసుకున్నారు.ఈ మేరకు అతనికి పాటను ఖరారు చేస్తూ అధికారులు ఉత్తర్వులు అందించారు.కాగా ఈ స్థలం లో అందరికీ ఇల్లు పథకంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధం చేస్తున్నట్టు డిఇ సిహెచ్ రామారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ టి సి,మున్సిపల్ రెవిన్యూ అధికారులు పాల్గోన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...