Followers

కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి




భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి


 


 


అనకాపల్లి,పెన్ పవర్ 


 

భవన నిర్మాణ కార్మికులు ఏడాది కాలంగా ఉపాధి కరువై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొన్ని కుటుంబాలు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారని శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తరువాత ఇసుక పై నిషేధం విధించింది. దీంతో నాలుగు నెలలపాటు ఇసుక లేక పనులు లేకుండా పోయారని ఆ తర్వాత కొత్త ఇసుక విధానం అమల్లోకి రావడంతో కాస్తకూస్తో పనులు దొరికాయని కరోనా వైరస్ రావడంతో మార్చి నెల నుండి లాక్ డౌన్ ప్రకటించడంతో దాదాపు రెండు నెలల పాటు పనులు లేక ఇంటికే పరిమితం అయ్యారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉన్నదంటే కరోనా వైరస్ విజృంభించడం వల్ల ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు కంటోన్మెంట్ జోన్ లు అమల జరుగుతున్నందున కార్మికులకు పనులు దొరకడం లేదనారు. రాష్ట్రములో నిర్మాణ రంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు దాని అనుబంధ ఉన్నవారు కలిపి సుమారుగా 30 లక్షల మంది ఉన్నారని వీరందరికీ ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని ఇప్పటికీ వారికి సాయం అందలేదని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్  నుంచి ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున అందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించి చేతులు దులుపుకున్నరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి జమయ్యే సేస్ డబ్బులతో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది ప్రస్తుతం కార్మిక వెల్ఫేర్ బోర్డు దగ్గర వెయ్యి కోట్లు నిధి ఉందని దీని ద్వారా ఎంతమేరకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించలేదని తెలిపారు. ఈ ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్ర కార్మిక శాఖ తో సర్వే నిర్వహించి వివరాలు సేకరించి ఆర్థిక సహాయం అందిస్తానని ప్రభుత్వం ప్రకటించిన 

 నప్పటికీ కార్మికులకు నిరాశే మిగిలిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకు సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...