Followers

స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంచొద్దు










స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంచొద్దు


 


అనకాపల్లి , పెన్ పవర్


 
 

 ప్రభుత్వం స్థిరాస్తుల  మార్కెట్ విలువలు పెంచే  నిర్ణయం  ప్రస్తుత పరిస్థితి లో సరికాదని  బి ఎస్ పి  అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాల రావు కోరారు.  అసలే కరోనా ఆందోళన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు చాలా మందకొడిగా సాగుతున్నవి రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించినదనారు. ఇటువంటి పరిస్థితిలో మార్కెట్ విలువలు పెంచడం వలన రిజిస్ట్రేషన్లు మరింత తక్కువ జరుగుతాయని అంతే కాదు  మార్కెట్ విలువలు పెరుగుదలను ద్రుష్టి లో ఉంచుకోని క్రయ విక్రయ దారులు రిజిస్ట్రేషన్ లు చేయించుకునేటందుకు ఎక్కువ సంఖ్యలో రిజిస్టర్ కార్యాలయములకు రావడం జరుగుతుందన దాని వలన కరోనా వ్యాధి ప్రమాదం మరింత పెరిగే ప్రమాదం ఉందనారు.  మరియు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు తో ఉన్న ప్రజలు  ముఖ్యంగా క్రయ విక్రయ దారులు మీద భారం పెరిగే విధంగా ఉన్న మార్కెట్ విలువలు పెంపు నిర్ణయం మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.


 

 




 




 



 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...