Followers

చేసిన వారిపై చర్య







దళిత యువకునికి శిరోముండనం చేసిన వారిపై చర్య తీసుకోండి


 


గోకవరం పెన్ పవర్


 

సీతానగరం పోలీసు స్టేషను లో దళిత యువకునికి శిరోమండం చేసి దాడి చేసి అవమానించిన సంఘటనను ఆంద్రప్రదేశ్ రైతు- కూలి సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి బి.రమేష్ తీవ్రంగా ఖండించారు.సోమవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.దళిత,మైనారిటీ, వెనకబడిన వర్గాలపై దాడులను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విపలమవుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు మూల కారుకుడైనా ఇసుక మాఫియా స్ధానిక అధికార పార్టీ నేత కవల క్రిష్ణ మూర్తిని కేసు నుండి తప్పించే ప్రయత్నాలను ప్రజా ఉద్యమంతో ఎదుర్కొని కవల క్రిష్ణ మూర్తిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసేవరకు ప్రజా ఉద్యమం ఆగదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అలాగే చీరాలలో లాక్ డౌన్ పేరుతో దళిత యవకున్ని గాయపర్చి మృతికి కారణమైన స్ధానిక పోలీసు అధికారులపై హత్య కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి శిక్షించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు


 

 




 

 



 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...