Followers

కోవిడ్ వారియర్స్ కు, బాధిత కుటుంబ సభ్యులకు డాక్టర్ ఆకుల భోజనం ఏర్పాట్లు

కోవిడ్ వారియర్స్ కు, బాధిత కుటుంబ సభ్యులకు డాక్టర్ ఆకుల భోజనం ఏర్పాట్లు

రాజమండ్రి, పెన్ పవర్

రాజమండ్రి- నగర వైసీపీ కో ఆర్డినేటర్ ,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమండ్రి- ప్రభుత్వాస్పత్రి లో కోవిడ్ వారియర్స్ కు, కోవిడ్ బాధిత కుటుంబసభ్యులకు భోజనం పంపిణీ ప్రారంభించారు. ఐదొందలకు మందికి సరిపడా విజిటబుల్ బిర్యాని, ఒక కర్రితో పేకింగ్ బాక్స్ లలో అందజేశారు. గురువారం మధ్యాహ్నం రాజమండ్రి- ప్రభుత్వాస్పత్రి లో  జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రమేష్ కిషోర్ చేతులు మీదుగా విజిటబుల్ బిర్యానీ బాక్స్ లు పంపిణీ ప్రారంభించారు. 

కోవిడ్ సమయంలో అవసరమైనన్నీ రోజులు భోజన పంపిణీ చేయడానికి డాక్టర్ ఆకుల సత్యనారాయణ సంకల్పించారు. కోవిడ్ రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కొంతమంది వారి బంధువులు ఆస్పత్రి ఆరుబయట  నిరీక్షిస్తున్నారని, అలాగే నిరంతరం గా  వైద్యసేవలు అందిస్తున్న సిబ్బంది పడుతున్న ఇబ్బందుల నేపధ్యంలో భోజనం సరఫరా చేయాలని ఆకుల నిర్ణయించారు. ఇందుకోసం వంటలు చేయడానికి  ప్రత్యేకంగా వంటశాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఆకుల సత్యనారాయణ, వైసీపీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, వైసీపీ నాయకులు ఉమామహేశ్వరి,అడపా అనిల్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...