Followers

ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని తక్షణమే ప్రకటించాలి.పాచిపెంట శాంతకుమారి

 ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని తక్షణమే ప్రకటించాలి.పాచిపెంట శాంతకుమారి 

   

అరకు, పెన్ పవర్               

ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కరోనా బారినపడిన ప్రతి ఒక్కరిప్రాణాన్ని కాపాడాలని ఏపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ అరకు పార్లమెంట్ నియోజకవర్గం డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.ఈరోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 97 వ వర్ధంతి సందర్భంగా కరోనా కారణంగా బయటకు రాకుండా తమ ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించి ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి యుద్దప్రాతిపదికన అన్ని ప్రైవేట్ హాస్పటల్స్ ను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని కరోనా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు,మందులు మరియు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించే విధంగా  చర్యలు చేపట్టాలని అధికార పార్టీ నాయకులే కరోనాతో  చనిపోయిన  శవాల దహన సంస్కారాలకు కూడా ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైందని చర్చించుకోవడం వారి వైఫల్యాలకు నిదర్శనమని ప్రైవేట్ హాస్పటల్స్ లో కరోనా వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రభుత్వ హాస్పటల్స్ లో ఆక్సిజన్ తో కూడిన బెడ్లు దొరకక నిరుపేదలు చనిపోతున్నారని ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన కరోనా రోగుల వైద్యంపై దృష్ఠి సారించి వైద్యం అందేవిధంగా కృషిచేయాలని 104 నెంబర్ కు ఫోన్ చేసిన మూడుగంటలలో కరోనా రోగికి బెడ్ అందించాలని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి మాటలను కూడా లెక్కచేయకుండా మూడు రోజులకు కూడా బెడ్ అందించలేకపోతున్నారని,ప్రైవేట్ హాస్పటల్స్ లో అత్యధిక ఫీజుల వసూళ్ళను అధికారులు తనిఖీలు చేపట్టి నియంత్రించాలని, కరోనా రోగితో పాటుగా సహాయకులకు కూడా హాస్పటల్స్ లో భోజన సదుపాయం కల్పించాలని లేని పక్షంలో కరోనా రోగులకు సహాయకులుగా ఉండే వారంతా వివిధ హోటల్స్ కు రావడం వలన కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని కరోనా నివారణ వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి ఇవ్వాలని కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న క్రమంలో అందరూ వ్యాక్సిన్ల కోసం ఒకచోట గుమిగూడటం వలన కూడా కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమవుతుందని అన్ని కోవిడ్ హాస్పటల్స్ కు సరిపడా ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందేవిధంగా చర్యలు చేపట్టాలని వ్యాక్సిన్లు,ఇంజెక్షన్ల కొరత లేకుండా చూడాలని చనిపోయిన కరోనా బాధిత కుటుంబానికి రెండు లక్షల నష్టపరిహారాన్ని అందించి దహన సంస్కారాలు ఉచితంగా జరిపేవిధంగా చర్యలు చేపట్టాలని కోవిడ్ వారియర్ గా సేవలందిస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్య, పారిశుద్ధ్య మీడియా, పోలీస్, సిబ్బందిలో కోవిడ్ బాధితులకు ఉచిత వైద్యం, మరణించిన వారి కుటుంబానికి 5లక్షల ప్రమాద భీమాను అందించే విధంగా కృషిచేయాలని పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...