Followers

కైవల్య రధాలను ఏర్పాటు చేసిన రామోహన రావు ఫౌండేషన్

 కైవల్య రధాలను ఏర్పాటు చేసిన రామోహన రావు ఫౌండేషన్ 

రాజమహేంద్రవరం, పెన్ పవర్

కరోనా మహామ్మారి రోజు రోజు కు విస్తరించి వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నవారు , కరోనా తో మృతి చెందిన వారి మృతదేహాలను తరలించడం లో పేదలకు,మధ్యతరగతి వారికి భారంగా మారుతున్న తరుణంలో కరోనా వ్యాధితో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా స్మశానవాటికకు  తరలించేందుకు ఉపయోగించే " కైవల్య రధాలు" (వాహనాలు)ఏర్పాటు చేసేందుకు  పెద్ద మనస్సుతో రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ముందుకు వచ్చారు.కోవిడ్ వ్యాధితో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా సేవా భావంతో  తరలించేందుకు వినియోగించే రెండు వాహనాలను జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్ , రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ సంయుక్త ఆద్వర్యంలో వాహనాలు వినియోగిస్తారు.రాజమహేంద్రవరం  మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమక్షంలో బుధవారం జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్ సభ్యులు  ఎం.ఆర్.పట్నాయక్ ద్వారా మున్సిపల్ కార్పోరేషన్ ఎం.హెచ్.ఓ. డాక్టర్ మూర్తి, మేనేజర్ సి.హెచ్ శ్రీనివాస్ లు వాహనాలు ప్రారంభించారు.ఈ రెండు వాహనాలు  రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ తోపాటు రాజానగరం పరిధిలో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా స్మశాన వాటికకు తరలించేందుకు వినియోగిస్తారని తెలిపారు.  మృతి చెందిన వారి బాదిత కుటుంబాల వారు మృతదేహాలను తరలించేందుకు జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 9154622899ను సంప్రదించాలని కోరారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...