Followers

చీరాలలో ఇద్దరికి కారోనా పాజిటివ్

 



చీరాల, పెన్ పవర్


ప్రకాశంజిల్లా చీరాల లో కరోనా వైరస్ కలకలం రేపింది. స్దానిక నవాబుపేట చెందిన ఓ వ్యక్తి ఈనెల 17 తేదీన ఢిల్లీ నుండి విజయవాడ చేరుకొని విజయవాడ నుండి జనాశతాబ్ది రైల్లో చీరాల చేరుకున్నాడు.వచ్చిన దగ్గరనుండి దగ్గు,జలుబుతో బాధపడుతున్నాడు. ఆయన భార్యకు కూడా  దగ్గు జలుబు ఆయాసంతో బాధ పడుతుంది, వీరికి కారోనా అనే అనుమానం తో గత రెండు రోజుల క్రితం చీరాల ప్రభుత్వ వైద్య శాల డాక్టర్లు పరిశీలించిన అనంతరం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. వారి రక్తనమూనాలను కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం విజయవాడ పంపారు.అయితే శనివారం మధ్యాహ్నం విజయవాడ వైద్యులు వారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. చీరాలలో రెండు కేసులు నిర్ధారణ కావడంతో పోలీసులు ఈ రాత్రి నుండి ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయట తిరుగ కుండా పటిష్టమైన చర్యలు చేపడతామని డియస్పీ జయరామ సుబ్బారెడ్డి తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...