Followers

కంటోన్మెంట్ జోన్లలో ఎవరు ప్రవేశించిన కఠిన చర్యలు తప్పవు


కంటోన్మెంట్ జోన్లలో ఎవరు ప్రవేశించిన కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ  అట్టాడ  బాపూజీ


     స్టాఫ్ రిపోర్టర్   విశాఖపట్నం(పెన్ పవర్)


కంటోన్మెంట్ జోన్లలో కి  ఎవరు ప్రవేశించిన  కఠిన చర్యలు తీసుకోవాలని  విశాఖ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్   అట్టాడ బాపూజీ   అన్నారు. శనివారం సాయంత్రం  కరోనా పాజిటివ్  కేసులు నమోదైన  బైలపూడి  దిబ్బిడి  గ్రామాలను ఆయన సందర్శించారు. కంటోన్మెంట్ జోన్లుగా  ఆ గ్రామాలను  గుర్తించడంతో  రెండు గ్రామాల్లో  రహదారుల దిగ్బంధం చేశారు. క్షుణ్నంగా పరిశీలించిన ఆయన  రెండు గ్రామాల్లో ప్రజలు బయటకు రాకుండా చూడాలని  ఇతర గ్రామాల నుంచి ఎవరు కంటోన్మెంట్ జోన్ లో అడుగు పెట్టకూడదని ఆయన హెచ్చరించారు. నిషేధాజ్ఞలు ఎవరు ఉల్లంఘించిన   కఠినమైన చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.  బైల పూడి లో రెండు కేజీలు  దిబిరి లో ఒక కేసు నమోదు కావడంతో  ఆ గ్రామాలను   బారికేడ్లు  కంచెలు  వేసి దిగ్బంధం చేశామన్నారు. ఈ పరిధిలో మైకుల ద్వారా  కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలని  పోలీసులకు సూచించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన  బైల పూడి  దిబిడి  గ్రామాల్లో  వెంటనే చర్యలు చేపట్టిన  చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్  కారణం ఈశ్వరరావు సేవలను  ఎస్పీ కొనియాడారు. జిల్లాలో కరోనా లాక్ డౌన్   నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని  ఎస్పీ తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన 85 మంది పై కేసు నమోదు చేశామని. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 1193 మందిపై కేసులు పెట్టామని 17 వాహనాలు  సీజ్ చేసి తొంభై తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి  శనివారం సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 1247 కేసులు  రిజిస్టర్ అయ్యాయని  మూడు లక్షల 88 వేల 825 రూపాయలు  అపరాధ రుసుము విధించామని   తెలిపారు.లాక్ డౌన్  నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా   ఉపేక్షించేది లేదని  ఎస్పీ హెచ్చరించారు. అత్యవసర ప్రయాణాలు చేయాలనుకుంటే  పోలీసు శాఖ ద్వారా  ప్రత్యేక పాస్  పొందాలని కోరారు. వాసుల కోసం  చేసుకోవాలని  ఎస్పీ బాపూజీ సూచించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...