Followers

ప్రతి కుటుంబానికి పదివేల నష్టపరిహారం ఇవ్వాలి


ప్రతి కుటుంబానికి పదివేల నష్టపరిహారం ఇవ్వాలి.

 

ఏలేశ్వరం, 

 

రాష్ట్రంలో, దేశంలో కరోన మహమ్మారి విలయతాండవంతో లాక్‌డౌన్‌ వలన   తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ 10 వేల రూపాయలు ఇవ్వాలని ఏఐసీసీటియు కార్మికులు డిమాండ్ చేశారు. స్థానిక వినోద్ మిశ్రా నగర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకుడు కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర వైఫల్యాల వల్లే కరోనాలో భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంకు చేరుకుందన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విదేశాల నుండి వచ్చిన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించి పరీక్షలు నిర్వహించకుండా విచ్చలవిడిగా వదిలేయడం వలన నేడు దేశంలో ఈ పరిస్థితులు దాపురించాయి అన్నారు. రాష్ట్రంలో కార్మికులు, పేద రైతులు, రైతు కూలీలు ఆకలితో అలమటిస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం దనబాబు, గుమ్మడి పాదాలఅమ్మ, పిల్ల కాంతం, కందుల వరలక్ష్మి తదితరులు ఉన్నారు.
 

 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...