
విశాఖలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలో భారీపేలుడు కలకలం రేపుతోంది. పేలుడు కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటనను ఇంకా మర్చిపోకముందే.. తాజాగా మరో ఘటన స్థానికులను టెన్షన్ పెడుతోంది. పేలుళ్లు పలుమార్లు సంభవిస్తుండటంతో ఫైర్ సిబ్బంది మంటల దగ్గర్లోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో ఘటనాస్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పేలుడు శబ్దాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ ప్రమాదం లో దాదాపు పదిమంది వరకు గాయపడినట్లు సమాచారం వీరాందరిని గాజువాక లోని ఆర్కే హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం . ఫార్మసిటిలో ప్రస్తుతం నైట్ షిఫ్ట్ లో 65 మంది ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు, పార్మాసిటీ లో మొత్తం 85 కంపినీలు ఉన్నాయి మంటలు వ్యాప్తి చెందితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇంకా మంటలు అదుపులోకి రానేలేదు,లోపల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు.. పోలీస్ ఉన్నతాధికారులు సంఘటన స్థలికి చేరుకున్నారు, మొత్తం 12 ఫైర్ ఇంజన్ల్ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి అయినా ఎ మాత్రం అదుపులోకి రావడం లేదు
No comments:
Post a Comment