అంబేద్కర్ గృహంపై దాడి చేస్తే శిక్షేది
అనకాపల్లి
నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజా గృహంపై దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని దళిత నాయకులు మామిడి నూకరాజు పేర్కొన్నారు. పాకిస్తాన్ దేశం వాలు భారతదేశం పై యుద్ధాలు చేస్తూ ఉంటే వాళ్లను భారతదేశ ప్రభుత్వం భారత ప్రజలు కూడా ముక్తకంఠంతో ఎదుర్కోవడం జరుగుతుంది కానీ భారత దేశానికి దశ దిశ పాలనాపరమైన రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహ పై దాడి చేస్తే ఇంతవరకు ఎటువంటి ప్రతిస్పందన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గాని భారత ప్రధానికి గాని ఎటువంటి చలనం లేదు ఇటువంటి సంఘటనలకు పాల్గొన్న వారిపై భారత రాజ్యాంగం పొందుపర్చినటువంటి చట్టాలను ఉపయోగించి వాళ్లను నడిరోడ్డుపై ప్రత్యక్షంగా ఉరితీయాలని దళిత కులాల సంక్షేమ సేవా సంఘం తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక హక్కుల వేదిక నాయకులు లక్ష్మణ్ , ప్రముఖ న్యాయవాది శాఖ మంత్రి సాయి వెంకట లక్ష్మణరావు, దళిత బహుజన సేవా సంఘ కొల్లి సత్య రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment