వధూవరులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు
ఆదిలాబాద్, పెన్ పవర్
ఉట్నూర్ మండలం లోని తాంధ్ర గ్రామంలో గోవింద్- సరిత, బేల మండలంలోని ఖరా గ్రామంలో సిడం శ్యామ్రావ్- లక్ష్మీ నుతన వధూవరులను మంగళవారం ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా - పవన్ రావు దంపతులు పెళ్లి శుభకార్యంలో పాల్గొని స్థానిక జెడ్పిటిసి సభ్యురాలు చారులత రాథోడ్, టిఆర్ఎస్ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం విందు భోజనం చేశారు. సుఖ సంతోషాలతో వందేళ్లు కలిసిమెలిసి ఉండాలని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జంగు, స్థానిక సర్పంచ్ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment